భృగు మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎భృగు సంహిత: clean up, replaced: గ్రంధం → గ్రంథం (2) using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1: పంక్తి 1:
==భృగు మహర్షి==
==భృగు మహర్షి==

'''భృగు మహర్షి''' [[బ్రహ్మ]] మానస పుత్రుడైన [[ప్రజాపతి]] మరియు [[సప్తర్షులు|సప్తర్షులలో]] ఒకరు.<ref>[http://www.sacred-texts.com/hin/m02/m02011.htm Narada said..] [[Mahabharata|The Mahabharata]] translated by [[Kisari Mohan Ganguli]] (1883 -1896), Book 2: Sabha Parva: Lokapala Sabhakhayana Parva, section:XI. '''p. 25''' And Daksha, Prachetas, Pulaha, Marichi, the master Kasyapa, Bhrigu, Atri, and Vasistha and Gautama, and also Angiras, and Pulastya, Kraut, Prahlada, and Kardama, '''these Prajapatis''', and Angirasa of the Atharvan Veda, the Valikhilyas, the Marichipas; Intelligence, Space, Knowledge, Air, Heat, Water, Earth, Sound, Touch, Form, Taste, Scent; Nature, and the Modes (of Nature), and the elemental and prime causes of the world,--all stay in that mansion beside the lord Brahma. And Agastya of great energy, and Markandeya, of great ascetic power, and Jamadagni and Bharadwaja, and Samvarta, and Chyavana, and exalted Durvasa, and the virtuous Rishyasringa, the illustrious 'Sanatkumara' of great ascetic merit and the preceptor in all matters affecting Yoga..."</ref> మొట్టమొదటి జ్యోతిష రచయిత<ref>[http://www.experiencefestival.com/a/Bhrigu_Samhita/id/1931640 Bhrigu Samhita|భృగు సంహిత]</ref> మరియు వేదాల కాలంలో రచించిన [[భృగు సంహిత]] కర్త.<ref>[http://astrospeak.indiatimes.com/articleshow/2026323.cms What is Bhrighu Samhita ?]</ref> భృగు మహర్షి [[బ్రహ్మ]]హృదయము నుండి ఉద్భవించిన నవబ్రహ్మలలో ఒకడు. వాయు పురాణం ప్రకారం భృగువు మామగారైన దక్షుని యజ్ఞంలో పాల్గొన్నాడు.<ref>[http://www.sacred-texts.com/hin/vp/vp043.htm Vishnu Purana] SACRIFICE OF DAKSHA (From the [[Vayu Purana]].) The Vishnu Purana, translated by [[Horace Hayman Wilson]], [[1840]]. 67:6.</ref>
వైశాఖ మాస శుద్ధ ఏకాదశి రోజున "ఉత్తర" నక్షత్రంలో
జన్మించెను

బ్రహ్మ మానస పుత్రులైనటువంటి
ప్రజాపతులలో మరియు నవ బ్రహ్మలలో ప్రథముడు
మరియు సప్త ఋషులలో ఒకరు
"భృగు మహర్షి"

భృగువు బ్రహ్మ హృథయ స్థానం నుండి జన్మించెను
భృగు మహర్షి ప్రజాపతులలో నవ బ్రహ్మలలో అగ్రజుడు కనుక ఆయన అత్యంత శక్తివంతుడే కాకుండ సకల దేవతలకు సకల ఋషులకు మానవులకు పూజ్యుడు
వారుణ యాగమున అగ్ని తేజమున జన్మించెను కనుక "వారుణీ విద్య" కు అధిపతి

శ్రీ మహా భారతం., శ్రీ మద్భాగవతం., శ్రీ విష్ణు., మత్స్య., పద్మ., బ్రహ్మా.,బ్రహ్మాండ పురాణాల్లో
భృగు మహర్షి విశిష్టతలను కీర్తింపబడెను

భగవద్గీతలో శ్రీ కృష్ణ పరబ్రహ్మ భృగువు గురించి ఇలా పలికెను

శ్లో: మహర్షీణాం భృగురహం గిరామస్మ్యక మక్షరం!
యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయం!!

మహర్షులలో భృగుమహర్షిని నేనే
అక్షరములలో ఓంకారమును నేనే
యజ్ఞములలో జపయజ్ఞము నేనే
స్థావరములలో హిమాలయమును నేనే యని పరమాత్మ పలికెను
అనగా శ్రీ మహా విష్ణువే "భృగు మహర్షి" యని అవగతమవుతున్నది

భృగు మహర్షి మహా తపశ్శక్తివంతుడు
బ్రహ్మ సమానుడు తన తపఃశక్తిచే తన పాదమున
ఒక నేత్రం మొలిచెను
మహా విశిష్టత కలిగిన మహర్షిగా ప్రఖ్యాతిపొందెను


భృగు వంశావలి :
భృగు వంశావలి :
పంక్తి 54: పంక్తి 84:
2)తార్ష్య, వరుచ
2)తార్ష్య, వరుచ
3) దేవయాని
3) దేవయాని

వీరే కాకుండ శిష్య ప్రశిష్య గణములు మరెన్నో
భృగు భార్గవ వంశముగా వెలుగొందుతున్నారు


== భృగు సంహిత ==
== భృగు సంహిత ==

10:01, 11 మే 2016 నాటి కూర్పు

భృగు మహర్షి

వైశాఖ మాస శుద్ధ ఏకాదశి రోజున "ఉత్తర" నక్షత్రంలో జన్మించెను

బ్రహ్మ మానస పుత్రులైనటువంటి ప్రజాపతులలో మరియు నవ బ్రహ్మలలో ప్రథముడు మరియు సప్త ఋషులలో ఒకరు "భృగు మహర్షి"

భృగువు బ్రహ్మ హృథయ స్థానం నుండి జన్మించెను భృగు మహర్షి ప్రజాపతులలో నవ బ్రహ్మలలో అగ్రజుడు కనుక ఆయన అత్యంత శక్తివంతుడే కాకుండ సకల దేవతలకు సకల ఋషులకు మానవులకు పూజ్యుడు వారుణ యాగమున అగ్ని తేజమున జన్మించెను కనుక "వారుణీ విద్య" కు అధిపతి

శ్రీ మహా భారతం., శ్రీ మద్భాగవతం., శ్రీ విష్ణు., మత్స్య., పద్మ., బ్రహ్మా.,బ్రహ్మాండ పురాణాల్లో భృగు మహర్షి విశిష్టతలను కీర్తింపబడెను

భగవద్గీతలో శ్రీ కృష్ణ పరబ్రహ్మ భృగువు గురించి ఇలా పలికెను

శ్లో: మహర్షీణాం భృగురహం గిరామస్మ్యక మక్షరం! యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయం!!

మహర్షులలో భృగుమహర్షిని నేనే అక్షరములలో ఓంకారమును నేనే యజ్ఞములలో జపయజ్ఞము నేనే స్థావరములలో హిమాలయమును నేనే యని పరమాత్మ పలికెను అనగా శ్రీ మహా విష్ణువే "భృగు మహర్షి" యని అవగతమవుతున్నది

భృగు మహర్షి మహా తపశ్శక్తివంతుడు బ్రహ్మ సమానుడు తన తపఃశక్తిచే తన పాదమున ఒక నేత్రం మొలిచెను మహా విశిష్టత కలిగిన మహర్షిగా ప్రఖ్యాతిపొందెను

భృగు వంశావలి : బ్రహ్మ - మానస పుత్రుడు "భృగు మహర్షి"

భృగువు -ఖ్యాతిదేవి (దక్ష ప్రజాపతి పుత్రిక) వారలకు ముగ్గురు సంతానం కలిగిరి 1)దాత 2)విధాత 3)శ్రీ మహాలక్ష్మి

1) దాత - అయతి(మేరు పర్వతరాజు) వారల సంతానం - ప్రాణుండు ప్రాణుండు: బ్రహ్మ చర్య వ్రత దీక్ష తీస్కొనెను

3)శ్రీ మహాలక్ష్మీ - శ్రీ మహా విష్ణువు కి ఇచ్చి వివాహం చేసిరి

2)విధాత - నియతి(మేరు పర్వతరాజు) వారల సంతానం -

మృఖండ మహర్షి - మనస్విని (ముద్గల మహర్షి) వారల సంతానం

మార్కండేయుడు -దూమ్రావతి దేవి(అగ్ని) వారల సంతానం

శ్రీ మహా విష్ణువు అంశ భావణారాయణుడు(వేద శీర్షుడు) - భద్రావతి దేవి (సూర్య పుత్రిక) వారల సంతానం

101 మంది ఋషి శ్రేష్టులు (పద్మశాలీ అను బిరాదాంకితులు)

భృగు మహర్షి -పులోమ(కర్థమ ప్రజాపతి) వారల సంతానం

చ్యవణుడు -1)అర్శిని 2)సుకన్య వారల సంతానం

1)ఔర్వుడు -ప్రమద్వర వారల సంతానం

ఋచిక మహర్షి - సత్యవతి వారల సంతానం

జమదగ్ని మహర్షి - రేణుక దేవి వారల సంతానం

1)కమణ్వత 2)సుశేన 3)వసు 4)విశ్వావసు 5)పరశు రామ(విష్ణువు దశావతారములలో ఒకటి)

భృగు మహర్షి - ఉషనల (ఊర్జ మహా ఋషి) వారల సంతానం 1) జావంతి 2) సుజన్మద్ 3)శుచి 4)కామ 5)మూర్థ్న 6)తాజ్య 7)వసు 8)ప్రభవ 9)అత్యాయు 10)దక్ష్య 11)ఇతివర 12)శుక్రాచార్యుడు(దైత్య గురువు, నవ గ్రహములలో ఒకరు)

శుక్రాచార్యుడు -1)గోమతి 2)ఊర్జ సతి 3) జయంతి అను ముగ్గరు భార్యలు వారల సంతానం 1) చండ , అర్క 2)తార్ష్య, వరుచ 3) దేవయాని

వీరే కాకుండ శిష్య ప్రశిష్య గణములు మరెన్నో భృగు భార్గవ వంశముగా వెలుగొందుతున్నారు

భృగు సంహిత

భృగుమహర్షి ఒక గొప్ప హైందవ జ్యోతిష్య శాస్త్ర పితామహుడు మరియు ఇతని మొదటి జ్యోతిష్య శాస్త్ర గ్రంథం భృగుసంహిత దానికొక తర్కాణం. ఈ గ్రంథంలో సృష్టిలోని దాదాపు అన్ని రకాల జీవుల గురించి వ్రాయబడ్డాయి. అనగా దాదాపు 50 లక్షల ప్రాణుల జాతకాలు పొందుపర్చబడ్డాయి. ఒక పరిసశీలన ప్రకారం ఇప్పుడు కేవలం 01 శాతం జీవులు మత్రమే మిగిలి ఉన్నాయని అంటున్నారు. భృగుమహర్షి ఒక గొప్ప ధర్మశాస్త్రప్రవక్తగా కాత్యాయనుడు పేర్కొన్నాడు.

త్రిమూర్తులు:ఎవరు గొప్ప?

ఒకనాడు సరస్వతి నదీ తీరమున మహర్షులకు సత్క్రతువులు ఆచరించిన పిమ్మట మాటల సందర్భములో త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే సంశయము వచ్చినది. త్రిమూర్తుల గుణగణములు, ,ప్రాశస్త్యములు పరిశీలించిన పిదప, మహర్షులందరు భృగువు మహర్షి కంటే గొప్ప మహాత్ముడు లేడు అని నిర్ణయించుకొని, ఈ సంశయ విషయము నిర్ధారణ చేసుకునేందుకు భృగువుకు తెలియ జేస్తారు. మహర్షుల నిజ దైవము ఎవరో తెలుసుకునేందుకు బ్రహ్మ, శంకరుడు మరియు విష్ణువు దగ్గరకు వెళ్లడము, అక్కడ విష్ణువు ద్వారా తన అహంకారము పరాభవముతో నశించడము, ముకుందుడు నుండి ఆనందం పొందడము, భక్తి పారవశ్యముతో తిరిగి భూలోకమున సరస్వతి నదీ తీరమునకు చేరుకుంటాడు.[1]. మహర్షులకు పుండరీకాక్షుడు/విష్ణువు ఒక్కడే దైవమని తెలియజేస్తాడు.

భగవద్గీత భృగు ప్రస్తావన

భగవంతుడు శ్రీకృష్ణుడు ఉపదేశించిన భగవద్గీతలో మహర్షుల గురించి తెలియజేస్తూ ఈ భృగు మహర్షి [2] ప్రస్తావన కూడా రావడము జరుగుతుంది.

1. భృగువు బ్రహ్మమానసపుత్రులలో ఒకఁడు. కొందఱు వరుణుని యజ్ఞమందలి అగ్నినుండి ఇతఁడు పుట్టినట్లు చెప్పుదురు. ఇతని పుత్రుఁడు కవి. పౌత్రుడు అసురులకు గురువు అయిన శుక్రాచార్యులు. ఇదికాక ఇతనికి ఖ్యాతివలన ధాత, విధాత అని ఇరువురు కొడుకులు కలిగిరి. అందు ధాతకు మృకండుఁడు, విధాతకు ప్రాణుఁడును జన్మించిరి. ప్రాణుని కొడుకు వేదశిరుఁడు. వేదశిరుని కొడుకు ఉశేనస్సు. మృకండుని కొడుకు మార్కండేయుఁడు. ఇతని మీసములను దక్షయాగమున వీరభద్రుఁడు పెఱికివేసినట్లు పురాణముల వలన తెలియవచ్చుచున్నది. 2. భృగువు ఒక మహర్షి. ఇతఁడు భాగీరథీ దక్షిణతీరమున మహాపద్మము అనియెడు పురమునందు ఉండెను. ఇతఁడు ఒకప్పుడు అగ్నిహోత్రము చేయుటకు తన భార్య పులోమను అగ్నులను ఏర్పఱపుము అని ఆజ్ఞాపించి తాను స్నానము చేయుటకై నదికిపోయెను. అప్పుడు పులోముఁడు అను దానవుఁడు ఒకఁడు అచ్చటికి వచ్చి అగ్నిదేవునివలన ఆమె ఇతని భార్య అని ఎఱిఁగి ఆమెను ఎత్తుకొనిపోవ యత్నింపఁగా వెఱపుచేత పూర్ణ గర్భిణి అయిన అమె తత్తఱపడునపుడు గర్భము భేదిల్లి గర్భస్రావము అయ్యెను. ఆస్రావమైన పిండము చ్యవనుఁడు అనఁబరఁగిన ఋషి అయి తన కోపపు చూపు చేతనే ఆరక్కసుని భస్మము చేసెను. ఇది అంతయు భృగుమహర్షి ఎఱిఁగి అగ్నిమీఁద అలిగి అతనిని సర్వభక్షకుఁడవు కమ్ము అని శపియించెను. అట్లైనను బ్రహ్మ అగ్ని యొక్క శుచిత్వమునకు లోపము కాకుండునట్లు అనుగ్రహించెను.[3]

మూలాలు