ప్రహ్లాదుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{అయోమయం|భక్త ప్రహ్లాద}}
{{అయోమయం|భక్త ప్రహ్లాద}}
[[File:Viṣṇu as Narasimha tearing Hiranyakasipu to pieces..jpg|thumb|చనిపోతున్న హిరణ్యకశ్యపుని చూసి భాధ పడుతున్న ప్రహ్లాదుడు.]]
{{హిందూమతము}}
{{హిందూమతము}}
'''ప్రహ్లాదుడు''' గొప్ప విష్ణు భక్తుడు. ఈతడు అసుర రాక్షసుడు అయిన [[హిరణ్యకశిపుడు|హిరణ్యకశిపుని]] కుమారుడు.
'''ప్రహ్లాదుడు''' గొప్ప విష్ణు భక్తుడు. ఈతడు అసుర రాక్షసుడు అయిన [[హిరణ్యకశిపుడు|హిరణ్యకశిపుని]] కుమారుడు.
పంక్తి 15: పంక్తి 16:
రాక్షస గురువులు వీనికి మరల విద్యలు బోధించెదమని తిసికొనిపోగా, ప్రహ్లాదుడు గురువులు లేని సమయము చూచి రాక్షసబాలురను ప్రోగుచేసి వారిచేతగూడా హరినామస్మరణ చేయించేడివాడు. గురువులు అందోళనపడుచు వచ్చి హిరణ్యకశిపునితో “నీకొడుకును మేము చదివించలేము.వీడు మిగిలిన రాక్షసబాలకులను గూడా చెడగోట్టుచున్నాడు”అనిచెప్పిరి.హిరణ్యకశిపుడు క్రోధముతో ప్రహ్లాదుని బిలిపించి, “నీవు స్మరించుచున్న ఆ శ్రీహరి యెచ్చట నున్నడో చూపగలవా?” అని యడుగగా ఆ భక్తుడు, “ఇందు గల డ౦దు లే డను సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందే౦డు వెదకి చూచిన నందందే కలడు దానవాగ్రణి! వింటే” అని సమాధాన మిచ్చెను . దానికి దానవ రాజు మరి౦త మండిపడి యీ స్తంభమున వానిని జూపుమనుచు ఒక స్తంభమును గదతో పగుల గొట్టెను . దానినుండి నరసింహమూర్తి యావిర్భవి౦చెను.
రాక్షస గురువులు వీనికి మరల విద్యలు బోధించెదమని తిసికొనిపోగా, ప్రహ్లాదుడు గురువులు లేని సమయము చూచి రాక్షసబాలురను ప్రోగుచేసి వారిచేతగూడా హరినామస్మరణ చేయించేడివాడు. గురువులు అందోళనపడుచు వచ్చి హిరణ్యకశిపునితో “నీకొడుకును మేము చదివించలేము.వీడు మిగిలిన రాక్షసబాలకులను గూడా చెడగోట్టుచున్నాడు”అనిచెప్పిరి.హిరణ్యకశిపుడు క్రోధముతో ప్రహ్లాదుని బిలిపించి, “నీవు స్మరించుచున్న ఆ శ్రీహరి యెచ్చట నున్నడో చూపగలవా?” అని యడుగగా ఆ భక్తుడు, “ఇందు గల డ౦దు లే డను సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందే౦డు వెదకి చూచిన నందందే కలడు దానవాగ్రణి! వింటే” అని సమాధాన మిచ్చెను . దానికి దానవ రాజు మరి౦త మండిపడి యీ స్తంభమున వానిని జూపుమనుచు ఒక స్తంభమును గదతో పగుల గొట్టెను . దానినుండి నరసింహమూర్తి యావిర్భవి౦చెను.
==హిరణ్యకశిపుని మరణం==
==హిరణ్యకశిపుని మరణం==

[[File:Viṣṇu as Narasimha tearing Hiranyakasipu to pieces..jpg|thumb|చనిపోతున్న హిరణ్యకశ్యపుని చూసి భాధ పడుతున్న ప్రహ్లాదుడు.]]
[[ప్రహ్లాదుడు]] పెరుగుతూ హరిభక్తిని కూడా పెంచుకొంటుంటాడు. తండ్రికి అది ఇష్టముండదు. హరి మనకు శత్రువు, అతడిని ద్వేషించమని చెప్తాడు. అయినా హరినామ స్మరణ చేస్తూ తన తోటి వారిని కూడ హరి భక్తులుగా మార్చుతుంటాడు. అనేక విధాలుగా చెప్పి చెప్పి విసిగిన [[హిరణ్యకశిపుడు]] ప్రహ్లాదుని చంపివేయమని ఆదేశిస్తాడు. ప్రహ్లాదుని చంపుటకు తీసుకొని పోయిన వారు అతడిని అనేక విధాలుగా చంపుటకు ప్రయత్నించిననూ ప్రహ్లాదుడు హరి ప్రభావము వలన చనిపోడు. హిరణ్య కశిపుని వద్దకు వచ్చి వారు మహరాజా! పాములతో కరిపించితిమి, కొండలపై నుండి తోయించితిమి, ఏనుగులతో తొక్కించితిమి, మంటలలో వేయించితిమి, సముద్రములో పడవేసితిమి అయిననూ ప్రహ్లాదునికేమియు అవ్వలేదని చెపుతారు. హిరణ్యకశిపుడు తన చేతులతో విషము తాగించినా ప్రహ్లాదుడు చనిపోక తనను అనుక్షణం ఆ శ్రీహరి రక్షిస్తూ ఉంటాడని చెపుతాడు. నిన్ను రక్షించిన శ్రీహరి ఎక్కడున్నాడని అడిగిన తండ్రితో సర్వాంతర్యామి అయిన శ్రీహరి ఎక్కడైనా, అంతటా తానై ఉంటాడని అంటాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్థంభములో ఉంటాడా నీ శ్రీహరి చూపించు అని, స్థంభమును బ్రద్దలు కొడతాడు హిరణ్యకశిపుడు. స్థంభమునుండి [[నృసింహావతారము]]న వెలువడిన శ్రీ మహావిష్ణువు పగలు రాత్రి గాని సంధ్యా సమయమున, ఇంటి బయటా-లోపలా కాని గడపపై, మానవ శరీరము-జంతువు కాని నృసింహావతార రూపములో, ఆయుధము లేకుండా తన వాడి గోళ్ళతో హిరణ్యకశిపుని సంహరిస్తాడు.
[[ప్రహ్లాదుడు]] పెరుగుతూ హరిభక్తిని కూడా పెంచుకొంటుంటాడు. తండ్రికి అది ఇష్టముండదు. హరి మనకు శత్రువు, అతడిని ద్వేషించమని చెప్తాడు. అయినా హరినామ స్మరణ చేస్తూ తన తోటి వారిని కూడ హరి భక్తులుగా మార్చుతుంటాడు. అనేక విధాలుగా చెప్పి చెప్పి విసిగిన [[హిరణ్యకశిపుడు]] ప్రహ్లాదుని చంపివేయమని ఆదేశిస్తాడు. ప్రహ్లాదుని చంపుటకు తీసుకొని పోయిన వారు అతడిని అనేక విధాలుగా చంపుటకు ప్రయత్నించిననూ ప్రహ్లాదుడు హరి ప్రభావము వలన చనిపోడు. హిరణ్య కశిపుని వద్దకు వచ్చి వారు మహరాజా! పాములతో కరిపించితిమి, కొండలపై నుండి తోయించితిమి, ఏనుగులతో తొక్కించితిమి, మంటలలో వేయించితిమి, సముద్రములో పడవేసితిమి అయిననూ ప్రహ్లాదునికేమియు అవ్వలేదని చెపుతారు. హిరణ్యకశిపుడు తన చేతులతో విషము తాగించినా ప్రహ్లాదుడు చనిపోక తనను అనుక్షణం ఆ శ్రీహరి రక్షిస్తూ ఉంటాడని చెపుతాడు. నిన్ను రక్షించిన శ్రీహరి ఎక్కడున్నాడని అడిగిన తండ్రితో సర్వాంతర్యామి అయిన శ్రీహరి ఎక్కడైనా, అంతటా తానై ఉంటాడని అంటాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్థంభములో ఉంటాడా నీ శ్రీహరి చూపించు అని, స్థంభమును బ్రద్దలు కొడతాడు హిరణ్యకశిపుడు. స్థంభమునుండి [[నృసింహావతారము]]న వెలువడిన శ్రీ మహావిష్ణువు పగలు రాత్రి గాని సంధ్యా సమయమున, ఇంటి బయటా-లోపలా కాని గడపపై, మానవ శరీరము-జంతువు కాని నృసింహావతార రూపములో, ఆయుధము లేకుండా తన వాడి గోళ్ళతో హిరణ్యకశిపుని సంహరిస్తాడు.



07:10, 7 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

చనిపోతున్న హిరణ్యకశ్యపుని చూసి భాధ పడుతున్న ప్రహ్లాదుడు.

ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. ఈతడు అసుర రాక్షసుడు అయిన హిరణ్యకశిపుని కుమారుడు.

జననము

హిరణ్యాక్షుడు శ్రీహరి చేతిలో వరాహరూపం ద్వారా మరణించినట్లు తెలుసుకొన్న హిరణ్యకశిపుడు శ్రీహరిని మట్టుపెట్టాలంటే కొన్ని శక్తులు కావాలని బ్రహ్మ కోసమై ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చిన భ్రహ్మ అతడిని ఏం వరం కాలాలో కోరుకొమ్మని అంటాడు. దాంతో రాక్షస రాజు తనకు ఇంటగాని బయట గాని, భూమి మీద గాని, ఆకాశంలో గాని, రాత్రి గాని పగలు గాని, దేవ దానవ మనుషుల చేత గాని చంప బడకుండుటకు వరము కావాలని కోరుతాడు. బ్రహ్మ ఆ వరానిస్తాడు. అప్పటి నుండి హిరణ్య కశిపుడు తనకు తిరుగు లేదని, తనకు మరణము లేదని విర్ర వీగుతు దేవతలను, ఋషులను అనేక విధముల బాదింప సాగెను. హిరణ్య కశిపుని బాధలను భరింప లేక దేవతలందరు శ్రీ హరికి మొర పెట్టుకోగా విషయమును గ్రహించిన శ్రీ హరి వారికి అభయమిస్తాడు.

జననము

హిరణ్య కశిపుడు రాక్ష రాజు. అతని భార్య లీలావతి. రాక్షసులకు దేవతలకు ఎల్లప్పుడు యుద్దాలు జరుగు తుండేవి. రాక్షసుల శత్రువైన ఇంద్రుడు గర్భవతియైన హిరణ్య కశిపుని భార్యను ఎత్తుకొని వెళతాడు. ఆమె గర్బములోనున్న వాడిని చంపడానికి. ఇది చూచిన నారదుడు ఇంద్రున్ని వారించి ఆమె గర్భములో పుట్ట బోయే వాడు దేవతలకు మిత్రుడౌతాడని నచ్చజెప్పి ఆమెను తన ఆశ్రమములో సేద దీర్చుతాడు. నారదుడు ఆమెకు విష్ణు భక్తి మాటలు నేర్పి, ఆమె గర్భములో వున్న ప్రహ్లదునికి విష్ణు గీతములు బోధించి అతడిని విష్ణు భక్తునిగ తీర్చి దిద్ది అమెను, భర్థ హిరణ్య కశిపుని ఇంట విడిచి పెట్టెను. కొంతకాలానికి లీలావతి ప్రసవిస్తుంది.ఆ శిశువుకు ప్రహ్లదుడని నామ కరణము చేస్తారు. తపస్సు ముగించి వచ్చిన హిరణ్యకశిపుడు తన భార్యను నారద ముని ఆశ్రమమునుండి తీసుకెళ్ళి, సమస్త లోకాలనూ జయించి దేవతలను బానిసలుగా చేసుకొంటాడు.

విద్య

ఆ బాలుడెప్పుడు విష్ణు నామమును జపించు చుండెను. గురువుల విద్య నేర్చుకుంటూనే విష్ణు నామ జపాన్ని విడువలేదు. ప్రహ్లాదుడు గురువులు చెప్పినవి వినుచు గూడా తన హరినామస్మరణము మానలేదు. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుని చదువు పరిక్షి౦చ దలచి పిలచి యడుగగా, “చక్రహస్తుని ప్రకటించు చదువే చదువు”అనుచు విష్ణుమహిమను గుర్చి యుపన్యసించేను. రాక్షసరాజు గురువులపై కోపి౦చగా వారాతనిని మరల గురుకులమునకు దిసుకుపోయి రాక్షసోచితవిద్యలు నేర్పసాగిరి. తిరిగి కొన్నాళ్ళకు తండ్రి పరీక్షించగా ప్రహ్లాదుడు “చదువులో మర్మమెల్ల చదివినా”ననుచు “విష్ణుభక్తియే తరణోపాయ”మనెను. అదివిని హిరణ్యకశిపుడు మహా కోపముతో భటులను పిలిచి వీనిని చంపుడని యజ్ఞాపించేను.

బాలుని శిక్షించుట

వారు శూలముతో బోడిచిరి. పాములచే గరిపించిరి. ఏనుగులతో త్రోక్కించిరి. కొండకొమ్ముల మీది నుండి పడదోసిరి. విషము బెట్టిరి. అగ్నిలో త్రోసిరి.సముద్రములోముంచివేసిరి. అన్నము నీరు పెట్టక మాడ్చిరి. ఎన్నిచేసినను ప్రహ్లాదుడు చావలేదు. హరినామస్మరణ మానలేదు.కొంచెము గూడా భయపడలేదు. ఎన్నిచేసినను చావని కొడుకును చూచి రాక్షసరాజు ఆశ్చర్యపడి, చిన్న పిల్లవాడైనందున ఇట్లు చేయు చున్నాడని తలచి పెద్దైనచో మార గలడని తలచి రాక్షస గురువులను పిలిపించి వీనికి మరలా విద్య బోదించమని ఆజ్ఞాపించెను.

రాక్షస గురువులు వీనికి మరల విద్యలు బోధించెదమని తిసికొనిపోగా, ప్రహ్లాదుడు గురువులు లేని సమయము చూచి రాక్షసబాలురను ప్రోగుచేసి వారిచేతగూడా హరినామస్మరణ చేయించేడివాడు. గురువులు అందోళనపడుచు వచ్చి హిరణ్యకశిపునితో “నీకొడుకును మేము చదివించలేము.వీడు మిగిలిన రాక్షసబాలకులను గూడా చెడగోట్టుచున్నాడు”అనిచెప్పిరి.హిరణ్యకశిపుడు క్రోధముతో ప్రహ్లాదుని బిలిపించి, “నీవు స్మరించుచున్న ఆ శ్రీహరి యెచ్చట నున్నడో చూపగలవా?” అని యడుగగా ఆ భక్తుడు, “ఇందు గల డ౦దు లే డను సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందే౦డు వెదకి చూచిన నందందే కలడు దానవాగ్రణి! వింటే” అని సమాధాన మిచ్చెను . దానికి దానవ రాజు మరి౦త మండిపడి యీ స్తంభమున వానిని జూపుమనుచు ఒక స్తంభమును గదతో పగుల గొట్టెను . దానినుండి నరసింహమూర్తి యావిర్భవి౦చెను.

హిరణ్యకశిపుని మరణం

ప్రహ్లాదుడు పెరుగుతూ హరిభక్తిని కూడా పెంచుకొంటుంటాడు. తండ్రికి అది ఇష్టముండదు. హరి మనకు శత్రువు, అతడిని ద్వేషించమని చెప్తాడు. అయినా హరినామ స్మరణ చేస్తూ తన తోటి వారిని కూడ హరి భక్తులుగా మార్చుతుంటాడు. అనేక విధాలుగా చెప్పి చెప్పి విసిగిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపివేయమని ఆదేశిస్తాడు. ప్రహ్లాదుని చంపుటకు తీసుకొని పోయిన వారు అతడిని అనేక విధాలుగా చంపుటకు ప్రయత్నించిననూ ప్రహ్లాదుడు హరి ప్రభావము వలన చనిపోడు. హిరణ్య కశిపుని వద్దకు వచ్చి వారు మహరాజా! పాములతో కరిపించితిమి, కొండలపై నుండి తోయించితిమి, ఏనుగులతో తొక్కించితిమి, మంటలలో వేయించితిమి, సముద్రములో పడవేసితిమి అయిననూ ప్రహ్లాదునికేమియు అవ్వలేదని చెపుతారు. హిరణ్యకశిపుడు తన చేతులతో విషము తాగించినా ప్రహ్లాదుడు చనిపోక తనను అనుక్షణం ఆ శ్రీహరి రక్షిస్తూ ఉంటాడని చెపుతాడు. నిన్ను రక్షించిన శ్రీహరి ఎక్కడున్నాడని అడిగిన తండ్రితో సర్వాంతర్యామి అయిన శ్రీహరి ఎక్కడైనా, అంతటా తానై ఉంటాడని అంటాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్థంభములో ఉంటాడా నీ శ్రీహరి చూపించు అని, స్థంభమును బ్రద్దలు కొడతాడు హిరణ్యకశిపుడు. స్థంభమునుండి నృసింహావతారమున వెలువడిన శ్రీ మహావిష్ణువు పగలు రాత్రి గాని సంధ్యా సమయమున, ఇంటి బయటా-లోపలా కాని గడపపై, మానవ శరీరము-జంతువు కాని నృసింహావతార రూపములో, ఆయుధము లేకుండా తన వాడి గోళ్ళతో హిరణ్యకశిపుని సంహరిస్తాడు.

భార్య - కుమారులు

ప్రహ్లాదునకు దమని అనే కన్యతో వివాహము జరిగినది. వీరికి వాతాపి, ఇల్వలుడు అనే కుమారులు కలరు.

ఇవి కూడా చూడండి