Coordinates: 17°10′02″N 82°17′05″E / 17.1672222°N 82.2847222°E / 17.1672222; 82.2847222

గొల్లప్రోలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 135: పంక్తి 135:
[[శివాలయం]], విష్ణ్వాలయం, [[సాయిబాబా]] గుడి ఉన్నాయి.
[[శివాలయం]], విష్ణ్వాలయం, [[సాయిబాబా]] గుడి ఉన్నాయి.


అపర్ణ అమ్మవారి ఆలయం [[ఆంధ్ర ప్రదేశ్]] [[తూర్పు గోదావరి]] జిల్లా గొల్లప్రోలు మండలం [[తాటిపర్తి]] అను గ్రామములో కలదు. ఈ గ్రామం [[అన్నవరం]] పుణ్యక్షేత్రానికి 20 కి.మీ దూరంలో, సామర్లకోటకు 25 కి.మీ దూరంలో, కాకినాడకు 30 కి.మీ దూరంలో కలదు.
అపర్ణ అమ్మవారి ఆలయం [[ఆంధ్ర ప్రదేశ్]] [[తూర్పు గోదావరి]] [[జిల్లా]] [[గొల్లప్రోలు]] [[మండలం]] [[తాటిపర్తి]] అను గ్రామములో కలదు. ఈ గ్రామం [[అన్నవరం]] పుణ్యక్షేత్రానికి 20 కి.మీ దూరంలో, [[సామర్లకోటకు]] 25 కి.మీ దూరంలో, [[కాకినాడకు]] 30 కి.మీ దూరంలో కలదు.


శ్రీ అపర్ణ దేవిని శుక్రవారము పూజించినచో విద్యార్ధులకు విద్యాలాభము, వ్యాపారులకు ధనలాభము, స్త్రీలకు సౌభాగ్య సంపదలను, పురుషులకు సకల కార్యసిద్ధిని చేకూర్చును.
శ్రీ అపర్ణ దేవిని శుక్రవారము పూజించినచో విద్యార్ధులకు విద్యాలాభము, వ్యాపారులకు ధనలాభము, స్త్రీలకు సౌభాగ్య సంపదలను, పురుషులకు సకల కార్యసిద్ధిని చేకూర్చును.

07:47, 15 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

గొల్లప్రోలు
—  మండలం  —
తూర్పు గోదావరి పటంలో గొల్లప్రోలు మండలం స్థానం
తూర్పు గోదావరి పటంలో గొల్లప్రోలు మండలం స్థానం
తూర్పు గోదావరి పటంలో గొల్లప్రోలు మండలం స్థానం
గొల్లప్రోలు is located in Andhra Pradesh
గొల్లప్రోలు
గొల్లప్రోలు
ఆంధ్రప్రదేశ్ పటంలో గొల్లప్రోలు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రం గొల్లప్రోలు
గ్రామాలు 10
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 78,926
 - పురుషులు 39,773
 - స్త్రీలు 39,153
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.34%
 - పురుషులు 59.21%
 - స్త్రీలు 49.32%
పిన్‌కోడ్ 533445
గొల్లప్రోలు
—  రెవిన్యూ గ్రామం  —
గొల్లప్రోలు is located in Andhra Pradesh
గొల్లప్రోలు
గొల్లప్రోలు
అక్షాంశ రేఖాంశాలు: 17°10′02″N 82°17′05″E / 17.1672222°N 82.2847222°E / 17.1672222; 82.2847222{{#coordinates:}}: cannot have more than one primary tag per page
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం గొల్లప్రోలు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 23,882
 - పురుషుల సంఖ్య 11,941
 - స్త్రీల సంఖ్య 11,664
 - గృహాల సంఖ్య 5,937
పిన్ కోడ్ 533 445
ఎస్.టి.డి కోడ్

గొల్లప్రోలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము.[1]. మరియు అదేపేరు గల మండలమునకు కేంద్రము. పిన్ కోడ్: 533 445. గొల్లప్రోలు మిరపకాయలకి ప్రసిద్ధి. ఇది పిఠాపురానికి ఈశాన్య దిశలో ఉంది. విశాఖపట్నానికి 130 కి.మీ. దూరంలో, మద్రాసు - కొలకత్తా రైలు మార్గంలో ఉంది. 25 కి.మీ. దూరంలో ఉన్న కాకినాడ ఈ గ్రామానికి దగ్గరి పట్టణం. [2]

మండల గణాంకాలు

మండల కేంద్రము గొల్లప్రోలు..గ్రామాలు 10 ....ప్రభుత్వము.. - మండలాధ్యక్షుడు
జనాభా (2011) - మొత్తం 78,926 - పురుషులు 39,773 - స్త్రీలు 39,153
అక్షరాస్యత (2011) - మొత్తం 54.34% - పురుషులు 59.21% - స్త్రీలు 49.32%

మండలం గురించి

1987లో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మండల వ్యవస్థను ఏర్పరచినపుడు గొల్లప్రోలు మండలంగా ఏర్పరచబడింది. డా. కొప్పుల హేమనాధరావు మొదటి మండల ప్రెసిడెంట్ 1987 - 1992 కాలంలో పదవిలో ఉన్నాడు. 2005 వరకు ఇక్కడ మండలం కేంద్ర కార్యాలయం నిర్మించబడలేదు. మొగలి సుబ్రహ్మణ్యం (చిట్టిబాబు) ప్రెసిడెంట్‌గా ఉన్నపుడు మండల కార్యాలయం ప్రారంభమైంది.

2005లో మొత్తం మండల జనాభా 81,752 [3] మరియు 2007లో 102,170 in 2007. గొల్లప్రోలు గ్రామంలో సుమారు 31,000 వోటర్లున్నారు.

ఈ ప్రాంతం తుఫాను తాకిళ్ళకు తరచు గురవుతుంటుంది. ఎక్కువ మంది జనాభా వ్యవసాయ కార్మికులు.[4] ఈ గ్రామప్రాంతంలో పండే మిరపకాయలకు మంచి గిరాకీ ఉంది.[2]. ఇంకా ఉల్లి, వేరుశనగ, ప్రత్తి, వరి పంటలు కూడా ఇక్కడ బాగా పండిస్తారు.

పేరు వెనుక చరిత్ర

శ్రీకృష్ణుడు చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడనీ.. దాంతో వాళ్ళమ్మ యశోధ శ్రీకృషుణణ్ణి రుబ్బురోలుకి తాడుతో కట్టేసిందని మనం భగవతంలో చదువుకున్నాం కదా! యాదవుల్ని గొల్లలు అని కూడా పిలుస్తారు. ఆనాటి కాలానికి చెందిన రోళ్ళు కొన్ని తదనంతర కాలంలో ఈ ప్రాంతంలో దొరికాయట..! దాంతో ఈ ప్రాంతాన్ని గొల్లలరోలు’గా పిలిచేవారు. కాలక్రమంలో ఆరోళ్ళు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. కానీ` ఈ ప్రాంతం పేరు మాత్రం ‘గొల్లప్రోలు’గా స్థిరపడిరది.

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 78,926 - పురుషులు 39,773 - స్త్రీలు 39,153

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 23,605.[5] ఇందులో పురుషుల సంఖ్య 11,941, మహిళల సంఖ్య 11,664, గ్రామంలో నివాస గృహాలు 5,937 ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు

గ్రామం పాఠశాల 1954లో మొదలయ్యింది. శ్రీమతి గవరసాన సుభద్ర (డా. గవరసాన సత్యనారాయణ భార్య) ఇందుకు భూమి విరాళంగా ఇచ్చింది. ఆమె తండ్రి జ్ఞాపకంగా ఈ పాఠశాలకు "డా. మలిరెడ్డి వెంకటరాజు మెమోరియల్ ప్రాథమిక పాఠశాల" అని పేరు పెట్టారు.[2] ఇందులో సుమారు 400 మంది విద్యార్ధులు తెలుగు మీడియంలో చదువుకొంటున్నారు.[4]. శ్రీమతి మలిరెడ్డి ఉమాంబ ప్రాథమిక పాఠశాల అనేది 2007 లో మొదలు పెట్టేరు. ఇది కూడా గవరసాన దంపతుల పూనికతో జరిగినదే. ఇటీవల కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఇంగ్లీషు మీడియంలో విద్యాసదుపాయం కలిగించారు.

గొల్లప్రోలులో రెండు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి: Z.P.B. ఉన్నత పాఠశాల 1950 దశకంలో సేఠ్ పెరాజీ లుంబాజీచే నిర్మించబడింది. మరొకటి బాలికల ఉన్నత పాఠశాల. ఇంకా మాధురి విద్యాలయం అనే ప్రైవేటు స్కూలు ఇంగ్లీషు మీడియం చదువును అందిస్తుంది. ఇది సమీప గ్రామాలలో మంచి పేరు కలిగి ఉంది.

వ్యవసాయం, పంటలు, నీటి వనరులు

ముఖ్యమైన పంటలు: మిర్చి, ప్రత్తి, వరి,ఉల్లి

పరిశ్రమలు

ధాన్యం మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, వేరుశనగ నూనె మిల్లులు ఉన్నాయి.

దేవాలయాలు, మసీదులు, చర్చిలు

శివాలయం, విష్ణ్వాలయం, సాయిబాబా గుడి ఉన్నాయి.

అపర్ణ అమ్మవారి ఆలయం ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి అను గ్రామములో కలదు. ఈ గ్రామం అన్నవరం పుణ్యక్షేత్రానికి 20 కి.మీ దూరంలో, సామర్లకోటకు 25 కి.మీ దూరంలో, కాకినాడకు 30 కి.మీ దూరంలో కలదు.

శ్రీ అపర్ణ దేవిని శుక్రవారము పూజించినచో విద్యార్ధులకు విద్యాలాభము, వ్యాపారులకు ధనలాభము, స్త్రీలకు సౌభాగ్య సంపదలను, పురుషులకు సకల కార్యసిద్ధిని చేకూర్చును.

ప్రముఖులు

పి. బి. శ్రీనివాస్

డా. గవరసాన సత్యనారాయణ

వీధులు

  • పెద్ద వీధిలో అధికంగా సంపన్నుల ఇళ్ళున్నాయి.
  • కరణంగారి తోటలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ వీధి అన్నింటికంటే పెద్దది.[6]
  • పల్లపు వీధి
  • కొత్తపేట వీధి
  • నందిరాయి వీధి
  • మంత్రాలవారి వీధి
  • గుడివీధి
  • పర్లా వారి వీధి.
  • మామిడాల వారి వీధి

వైద్య శాలలు

  • భాస్కరరావు హాస్పిటల్ చుట్టుప్రక్కల బాగా పేరు కలిగింది.
  • కోకిలవాణి హాస్పిటల్
  • ఉమాదేవి హాస్పిటల్
  • ప్రభుత్వ హాస్పిటల్
  • రెడ్ల పద్మరాజు హాస్పిటల్
  • మోహనరావు హాస్పిటల్

రవాణా

గొల్లప్రోలు రైల్వేస్టేషను (స్టేషను కోడ్ GLP) చెన్నై - హౌరా రైలు మార్గంలో, సామర్లకోట, తుని స్టేషనుల మధ్య ఉంది. [7] ఇక్కడ సింహాద్రి ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-రాజమండ్రి పాసెంజర్, విజయవాడ-విశాఖపట్నం పాసెంజర్, రాయగడ పాసెంజర్, తిరుమల ఎక్స్‌ప్గరెస్, బొకారో-అలెప్పీ ఎక్స్‌ప్రెస్, కాకినాడ-వైజాగ్ పాసెంజర్, మచిలీపట్నం-వైజాగ్ పాసెంజర్, గోదావరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఆగుతాయి. ఈ స్టేషను నుండి పిఠాపురం స్టేషనుకు 4 కి.మీ., అన్నవరం స్టేషనుకు 19 కి.మీ. దూరం. గొల్లప్రోలు రైల్వేస్టేషను చుట్టుప్రక్కల 27 గ్రామాలలో సుమారు 1,50,000 జనాభాకు ప్రయాణ వసతి కలిపిస్తుంది.[8]

మండలంలోని గ్రామాలు

గణాంకాలు

జనాభా (2001) - మొత్తం 23,605 - పురుషుల సంఖ్య 11,941 - స్త్రీల సంఖ్య 11,664 - గృహాల సంఖ్య 5,937

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14

మూలాలు, వనరులు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. 2.0 2.1 2.2 Radhika Malpani. "School In Gollaprolu". ILP Projects. Retrieved 2007-01-24.
  3. National Informatics Centre (2005). "Item NO. XI. Sampoorna Grameena Rozgar Yojana". East Godavari District. Retrieved 2007-01-26.
  4. 4.0 4.1 "Dr. MVR Prathamika Patasala, Gollaprolu". Asha for Education. 2004. Retrieved 2007-01-24.
  5. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14
  6. "MPPS - KARANAM GARI THOTA - GOLLAPROLU M". Sarva Shiksha Abhiyan. 2004–2005. Retrieved 2007-06-21.{{cite web}}: CS1 maint: date format (link)
  7. Online Highways LLC (2004). "Gollaprolu Railway Station". www.india9.com. Retrieved 2007-02-06.
  8. G. Satyanarayana (2004). "Andhra Pradesh - Readers' Mail - Train halt". The Hindu. Retrieved 2007-02-05.

https://archive.org/details/mohanpublications_gmail_20160729

బయటి లింకులు

https://archive.org/details/mohanpublications_gmail_20160729