త్రిపురనేని గోపీచంద్: కూర్పుల మధ్య తేడాలు
Nrgullapalli (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు (3), గా → గా , గ్రంధం → గ్రంథం (3), పెళ్లి → పెళ్ళి, using AWB |
||
పంక్తి 40: | పంక్తి 40: | ||
== జననం == |
== జననం == |
||
గోపీచంద్ [[1910]], [[సెప్టెంబర్ 8]] న [[కృష్ణా జిల్లా]] [[అంగలూరు (గుడ్లవల్లేరు మండలం)|అంగలూరు]] గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి ప్రముఖ [[సంఘ సంస్కర్త |
గోపీచంద్ [[1910]], [[సెప్టెంబర్ 8]] న [[కృష్ణా జిల్లా]] [[అంగలూరు (గుడ్లవల్లేరు మండలం)|అంగలూరు]] గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి ప్రముఖ [[సంఘ సంస్కర్త]] [[త్రిపురనేని రామస్వామి]]. గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించాడు. అనేక వాదాలతో వివాదపడుతూ, తత్త్వాలతో దాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించాడు. తన తండ్రినుంచి గోపీచంద్ పొందిన గొప్ప ఆయుధం, ఆస్తి, శక్తి '''ఎందుకు?''' అన్న ప్రశ్న. అది అతన్ని నిరంతరం పరిణామానికి గురిచేసిన శక్తి. అతనిలోని అరుదైన, అపురూపమైన, నిత్యనూతనమైన అన్వేషణాశీలతకి ఆధారం. '''ఎందుకు?''' అన్న ప్రశ్నే అతన్ని ఒక [[జిజ్ఞాసువు]] గా,[[తత్వవేత్త]]గా నిలబెట్టింది. ఈ క్రమంలో అతనిలో చెలరేగిన సంఘర్షణ అతని నవలలన్నింటిలోనూ ప్రతిఫలించింది. |
||
గోపీచంద్ రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యముగా చెప్పుకోతగినది. ఆయన వ్రాసిన ''[[అసమర్థుని జీవయాత్]]ర'' తెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. [[1963]] లో ''పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా'' |
గోపీచంద్ రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యముగా చెప్పుకోతగినది. ఆయన వ్రాసిన ''[[అసమర్థుని జీవయాత్]]ర'' తెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. [[1963]] లో ''పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా''కు [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] వచ్చింది.<ref>[http://www.sahitya-akademi.org/sahitya-akademi/awa10321.htm#telugu కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు]</ref> |
||
==జీవిత క్రమం== |
==జీవిత క్రమం== |
||
పంక్తి 48: | పంక్తి 48: | ||
* 8-సెప్టెంబర్-1910 నాడు గోపీచంద్ జన్మించాడు. సుప్రసిద్ధ రచయిత, హేతువాది, సంస్కరణవాది అయిన [[త్రిపురనేని రామస్వామి]] ఆయన తండ్రి, తల్లి పున్నమాంబ. |
* 8-సెప్టెంబర్-1910 నాడు గోపీచంద్ జన్మించాడు. సుప్రసిద్ధ రచయిత, హేతువాది, సంస్కరణవాది అయిన [[త్రిపురనేని రామస్వామి]] ఆయన తండ్రి, తల్లి పున్నమాంబ. |
||
* హేతువాద నాస్తికత్వపు భావజాలాల వాతావరణంలో పెరిగిన గోపీచంద్ పై వాటి ప్రభావం సహజంగానే పడింది. అయితే తరువాతి కాలంలో ఆయన ఆస్తికుడిగా మారాడు. |
* హేతువాద నాస్తికత్వపు భావజాలాల వాతావరణంలో పెరిగిన గోపీచంద్ పై వాటి ప్రభావం సహజంగానే పడింది. అయితే తరువాతి కాలంలో ఆయన ఆస్తికుడిగా మారాడు. |
||
* 1932 లో వివాహం; 1933లో బి,ఏ పట్టా, ఆ తర్వాత లా డిగ్రీ. కొంతకాలం పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు పెట్టినా ఆ వృత్తిలో ఇమడలేక పోయాడు. ఈ దశలో ఆయన కమ్యూనిజం(మార్క్సిజం) పట్ల ఆకర్షితుడయ్యాడు. కానీ అందులోని అరాచకత్వం ఆయనకు నచ్చలేదు. |
* 1932 లో వివాహం; 1933లో బి,ఏ పట్టా, ఆ తర్వాత లా డిగ్రీ. కొంతకాలం పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు పెట్టినా ఆ వృత్తిలో ఇమడలేక పోయాడు. ఈ దశలో ఆయన కమ్యూనిజం (మార్క్సిజం) పట్ల ఆకర్షితుడయ్యాడు. కానీ అందులోని అరాచకత్వం ఆయనకు నచ్చలేదు. |
||
* ఆ తర్వాత [[ఎమ్.ఎన్.రాయ్]] [[మానవతావాదం]] ఆయన పై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఈ కాలంలో ఆయన ఆంధ్రా రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగా పనిచేసాడు. |
* ఆ తర్వాత [[ఎమ్.ఎన్.రాయ్]] [[మానవతావాదం]] ఆయన పై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఈ కాలంలో ఆయన ఆంధ్రా రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగా పనిచేసాడు. |
||
* 1928లోనే '''శంబుక వధ''' కథ ద్వారా సాహిత్యరంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ 1938లో '''పట్టాభి గారి సోషలిజం''' అన్న పుస్తకాన్ని వెలువరించాడు. |
* 1928లోనే '''శంబుక వధ''' కథ ద్వారా సాహిత్యరంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ 1938లో '''పట్టాభి గారి సోషలిజం''' అన్న పుస్తకాన్ని వెలువరించాడు. |
||
* తొలుత కథా సాహిత్యంలో స్థిరపడ్డ గోపీచంద్ ఆ తర్వాత నవలా సాహిత్యరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన తొలి నవల '''పరివర్తనం'''(1943). |
* తొలుత కథా సాహిత్యంలో స్థిరపడ్డ గోపీచంద్ ఆ తర్వాత నవలా సాహిత్యరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన తొలి నవల '''పరివర్తనం''' (1943). |
||
* 1939లో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ దర్శకనిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించాడు. అయితే వాటివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయారు. |
* 1939లో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ దర్శకనిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించాడు. అయితే వాటివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయారు. |
||
* 1953లో ఆంధ్రరాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గా, 1956లో [[ఆంధ్ర ప్రదేశ్]] సమాచార శాఖ సహాయ డైరెక్టర్ గా పనిచేసాడు. |
* 1953లో ఆంధ్రరాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గా, 1956లో [[ఆంధ్ర ప్రదేశ్]] సమాచార శాఖ సహాయ డైరెక్టర్ గా పనిచేసాడు. |
||
* 1957-62 వరకు [[ఆకాశవాణి]] లో పనిచేసాడు. ఈ దశలో [[అరవిందు]] |
* 1957-62 వరకు [[ఆకాశవాణి]] లో పనిచేసాడు. ఈ దశలో [[అరవిందు]]ని భావాల పట్ల విశ్వాసం ఏర్పడడంతో ఆధ్యాత్మికవాదం వైపుకి పయనించాడు. |
||
* [[1962]] [[నవంబర్ 2]] నాడు గోపీచంద్ మరణించాడు. |
* [[1962]] [[నవంబర్ 2]] నాడు గోపీచంద్ మరణించాడు. |
||
* భారత ప్రభుత్వము సెప్టెంబరు 8, 2011న గోపీచంద్ శతజయంతి సందర్భమున తపాలా బిళ్ళ విడుదల చేసింది. |
* భారత ప్రభుత్వము సెప్టెంబరు 8, 2011న గోపీచంద్ శతజయంతి సందర్భమున తపాలా బిళ్ళ విడుదల చేసింది. |
||
గోపీచంద్ చిన్నతనములోనే తల్లిని పోగొట్టుకున్నాడు. ఇంటి పనులతోపాటు, తండ్రి [[నాస్తికోద్యమము]] నకు సహాయము చేయటం లాంటి పనులతో అతని బాల్యం చాలా గడచి పోయింది. అటు తర్వాత, మద్రాస్ లో లా చదువుకున్నాడు. అతని మీద చాలా కాలము ఆయన నాన్న ప్రభావం ఉండేది. ఆయన మొదట వ్రాసిన చాలా నవలలో మార్క్సిస్టు భావాలు మనకు పూర్తిగా కనిపిస్తాయి. |
గోపీచంద్ చిన్నతనములోనే తల్లిని పోగొట్టుకున్నాడు. ఇంటి పనులతోపాటు, తండ్రి [[నాస్తికోద్యమము]] నకు సహాయము చేయటం లాంటి పనులతో అతని బాల్యం చాలా గడచి పోయింది. అటు తర్వాత, మద్రాస్ లో లా చదువుకున్నాడు. అతని మీద చాలా కాలము ఆయన నాన్న ప్రభావం ఉండేది. ఆయన మొదట వ్రాసిన చాలా నవలలో మార్క్సిస్టు భావాలు మనకు పూర్తిగా కనిపిస్తాయి. |
||
ఆయన వ్రాసిన "మెరుపుల మరకలు" అనే |
ఆయన వ్రాసిన "మెరుపుల మరకలు" అనే గ్రంథంలో గాంధీరామయ్య అనే ఒక పాత్ర ఉంది. . ఆ పాత్ర శ్రీ [[ఉన్నవ లక్ష్మీనారాయణ]] పంతులును పోలి ఉంటుందన్నది కొందరి భావన. రామస్వామి, పంతులు మంచి స్నేహితులు. రెండు భిన్న ధ్రువాలు. ఒకరు కరుడుగట్టిన నాస్తిక వాది, మరి ఒకరు పూర్తి ఆస్తికులు. ఇద్దరూ గాంధేయవాదులు. రామస్వామికి యవ్వనంలోనే భార్య గతించింది. పునర్వివాహం చేసుకోలేదు. ఒక రోజు పంతులు రామస్వామిని కలవటానికి తెనాలి వెళ్ళాడు. స్నేహితులిద్దరికి గోపీచంద్ భోజనం వడ్డిస్తున్నాడు. ఆ సందర్భములో, పంతులు "ఏమయ్యా! రామస్వామి నీవు ఉద్యమాలలో పూర్తిగా మునిగి, కుమారుడి వివాహము సంగతే మర్చిపోయావు" అని అన్నాడు. అప్పుడు, రామస్వామి, నిజమే పంతులు గారు, ఆ విషయము పూర్తిగా మరచిపోయాను. మీరే ఏదైనా మంచి అమ్మాయిని చూసి వాడికి పెళ్ళి చెయ్యండి అని అన్నాడట. అప్పుడు. పంతులు, [[గోపీచంద్]] తో, "నీవు మద్రాస్ వెళ్ళే లోపు ఒక పది రోజుల ముందు, గుంటూరు రా.." అని అన్నాడు. గోపీచంద్, సరే అనటం, అలాగే గుంటూరుకు వెళ్ళటం జరిగింది. |
||
ఆ రోజుల్లో [[గుంటూరు]]లో "శారదా నికేతన్" అనే వితంతు శరణాలయం ఉండేది. ఇప్పుడు కూడా ఉంది. దాని నిర్వహణ బాధ్యత అంతా ఆ రోజుల్లో పంతులు గారే చూసుకునే వారు. ఆ రోజుల్లో అన్నీ బాల్యవివాహాలు కావటం చేత, వధూవరులకు వయోభేదం ఉండటం చేత అక్కడ ఉన్నవారిలో కూడా చాలామంది బాలవితంతువులే! గోపీచంద్ వచ్చి పంతులుని కలసి, ఎందుకు రమ్మన్నారో చెప్పమని అడిగారు. పంతులు ఏ విషయము చెప్పకుండా, నీకు నచ్చిన ఒక క్లాసుకు వెళ్లి ఒక పది రోజులు పాఠాలు చెప్పమన్నారు. ఆ వితంతు శరణాలయాన్ని పంతులు నడుపుతున్న తీరు, బాలవితంతుల దీన పరిస్థితి గోపీచంద్ పై తీవ్ర ప్రభావం చూపాయి. ఆయన రచనలలో కొన్నింటిలో వాటి ప్రభావం కనపడుతుంది. కాలక్రమంలో గోపీచంద్ మీద ఆయన నాన్న ప్రభావం తగ్గ నారంభించింది. స్వతంత్ర భావాలను పెంచుకున్నాడు. జీవితములో పెంచి పెద్ద చేసిన నాన్న కంటే పంతులు ప్రభావం అతని మీద చాలావరకు ఉంది. అందుకే, గాంధీరామయ్య పాత్ర సజీవంగా నిలిచిపోయింది. |
ఆ రోజుల్లో [[గుంటూరు]]లో "శారదా నికేతన్" అనే వితంతు శరణాలయం ఉండేది. ఇప్పుడు కూడా ఉంది. దాని నిర్వహణ బాధ్యత అంతా ఆ రోజుల్లో పంతులు గారే చూసుకునే వారు. ఆ రోజుల్లో అన్నీ బాల్యవివాహాలు కావటం చేత, వధూవరులకు వయోభేదం ఉండటం చేత అక్కడ ఉన్నవారిలో కూడా చాలామంది బాలవితంతువులే! గోపీచంద్ వచ్చి పంతులుని కలసి, ఎందుకు రమ్మన్నారో చెప్పమని అడిగారు. పంతులు ఏ విషయము చెప్పకుండా, నీకు నచ్చిన ఒక క్లాసుకు వెళ్లి ఒక పది రోజులు పాఠాలు చెప్పమన్నారు. ఆ వితంతు శరణాలయాన్ని పంతులు నడుపుతున్న తీరు, బాలవితంతుల దీన పరిస్థితి గోపీచంద్ పై తీవ్ర ప్రభావం చూపాయి. ఆయన రచనలలో కొన్నింటిలో వాటి ప్రభావం కనపడుతుంది. కాలక్రమంలో గోపీచంద్ మీద ఆయన నాన్న ప్రభావం తగ్గ నారంభించింది. స్వతంత్ర భావాలను పెంచుకున్నాడు. జీవితములో పెంచి పెద్ద చేసిన నాన్న కంటే పంతులు ప్రభావం అతని మీద చాలావరకు ఉంది. అందుకే, గాంధీరామయ్య పాత్ర సజీవంగా నిలిచిపోయింది. |
||
గోపీచంద్ నెమ్మదిగా మార్క్సిస్టు సిద్ధాంతం నుండి బయటపడి, చివరి రోజులలో తత్వవేత్తలు అనే తాత్విక |
గోపీచంద్ నెమ్మదిగా మార్క్సిస్టు సిద్ధాంతం నుండి బయటపడి, చివరి రోజులలో తత్వవేత్తలు అనే తాత్విక గ్రంథాన్ని వ్రాయటం జరిగింది. పోస్ట్ చెయ్యని ఉత్తరాలు, అసమర్ధుని జీవయాత్ర, మెరుపుల మరకలు - ఈ గ్రంథాలలో కూడా చాలావరకు తాత్విక చింతన కనపడుతుంది. ఆయనే, ఒక చోట ఇలా అంటాడు, "మానవులు జీవనదుల లాగా ఉండాలి కానీ, చైతన్యంలేని చెట్లు, పర్వతాల లాగా ఉండకూడదు". మానవ జీవితం ఒక చైతన్య స్రవంతి. ఎన్నో మలుపులు తిరుగుంది. అలాగే మనం కూడా నిరంతర అన్వేషణలో ఉండాలి. అప్పుడే మనకు సత్యమంటే ఏమిటో తెలుస్తుంది. నిన్న మనం నమ్మింది ఈ రోజు సత్యం కాదని తెలిసిన వెంటనే దాన్నివదలి మళ్ళీ అన్వేషణ సాగించాలి. ఇదే విషయాన్ని [[జిడ్డు కృష్ణమూర్తి]], [[చలం]] కూడా చెప్పారు. జీవితం అంటే నిరంతర అన్వేషణ. ఒక పుస్తకాన్ని ఆయన తండ్రిగారికి అంకితం ఇస్తూ- 'ఎందుకు' అని అడగటం నేర్పిన నాన్నకి అని వ్రాసాడు. అలా నేర్చుకోబట్టే స్వతంత్ర భావాలు గల ఒక గొప్ప రచయిత స్థాయికి ఎదిగాడు. |
||
==రచనలు== |
==రచనలు== |
||
పంక్తి 90: | పంక్తి 89: | ||
*[[లక్ష్మమ్మ]] (1950) (దర్శకుడు) |
*[[లక్ష్మమ్మ]] (1950) (దర్శకుడు) |
||
*[[గృహప్రవేశం]] (1946) (కథా రచయిత) |
*[[గృహప్రవేశం]] (1946) (కథా రచయిత) |
||
*[[రైతుబిడ్డ]] (1939) (మాటల రచయిత) |
*[[రైతుబిడ్డ]] (1939) (మాటల రచయిత) |
||
==బయటి లింకులు== |
==బయటి లింకులు== |
||
పంక్తి 96: | పంక్తి 95: | ||
*{{imdb_name|0329731}} |
*{{imdb_name|0329731}} |
||
*[http://tripuranenis.org/default.aspx త్రిపురనేని వెబ్సైటు] |
*[http://tripuranenis.org/default.aspx త్రిపురనేని వెబ్సైటు] |
||
* http://www.saarangabooks.com/magazine/2013/05/15/%E0%B0%92%E0%B0%95-%E0%B0%85%E0%B0%A1%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%AE%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%95%E0%B1%80-%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B0%A1%E0%B1%81%E0%B0%97/ |
* http://www.saarangabooks.com/magazine/2013/05/15/%E0%B0%92%E0%B0%95-%E0%B0%85%E0%B0%A1%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%AE%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%95%E0%B1%80-%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B0%A1%E0%B1%81%E0%B0%97/ |
||
==మూలములు== |
==మూలములు== |
12:49, 18 సెప్టెంబరు 2016 నాటి కూర్పు
త్రిపురనేని గోపీచంద్ | |
---|---|
దస్త్రం:Tripuraneni Gopichand.jpg | |
జననం | త్రిపురనేని గోపీచంద్ సెప్టెంబర్ 8, 1910 కృష్ణా జిల్లా అంగలూరు |
మరణం | నవంబర్ 2, 1962 |
ఇతర పేర్లు | త్రిపురనేని గోపీచంద్ |
ప్రసిద్ధి | తెలుగు రచయిత, హేతువాది సంపూర్ణ మానవతావాది, సాహితీవేత్త తెలుగు సినిమా దర్శకుడు |
సంతకం |
త్రిపురనేని గోపీచంద్ (సెప్టెంబర్ 8, 1910 - నవంబర్ 2, 1962) సంపూర్ణ మానవతావాది, తెలుగు రచయిత, హేతువాది, సాహితీవేత్త మరియు తెలుగు సినిమా దర్శకుడు.
జననం
గోపీచంద్ 1910, సెప్టెంబర్ 8 న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి ప్రముఖ సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి. గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించాడు. అనేక వాదాలతో వివాదపడుతూ, తత్త్వాలతో దాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించాడు. తన తండ్రినుంచి గోపీచంద్ పొందిన గొప్ప ఆయుధం, ఆస్తి, శక్తి ఎందుకు? అన్న ప్రశ్న. అది అతన్ని నిరంతరం పరిణామానికి గురిచేసిన శక్తి. అతనిలోని అరుదైన, అపురూపమైన, నిత్యనూతనమైన అన్వేషణాశీలతకి ఆధారం. ఎందుకు? అన్న ప్రశ్నే అతన్ని ఒక జిజ్ఞాసువు గా,తత్వవేత్తగా నిలబెట్టింది. ఈ క్రమంలో అతనిలో చెలరేగిన సంఘర్షణ అతని నవలలన్నింటిలోనూ ప్రతిఫలించింది.
గోపీచంద్ రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యముగా చెప్పుకోతగినది. ఆయన వ్రాసిన అసమర్థుని జీవయాత్ర తెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. 1963 లో పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.[1]
జీవిత క్రమం
- 8-సెప్టెంబర్-1910 నాడు గోపీచంద్ జన్మించాడు. సుప్రసిద్ధ రచయిత, హేతువాది, సంస్కరణవాది అయిన త్రిపురనేని రామస్వామి ఆయన తండ్రి, తల్లి పున్నమాంబ.
- హేతువాద నాస్తికత్వపు భావజాలాల వాతావరణంలో పెరిగిన గోపీచంద్ పై వాటి ప్రభావం సహజంగానే పడింది. అయితే తరువాతి కాలంలో ఆయన ఆస్తికుడిగా మారాడు.
- 1932 లో వివాహం; 1933లో బి,ఏ పట్టా, ఆ తర్వాత లా డిగ్రీ. కొంతకాలం పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు పెట్టినా ఆ వృత్తిలో ఇమడలేక పోయాడు. ఈ దశలో ఆయన కమ్యూనిజం (మార్క్సిజం) పట్ల ఆకర్షితుడయ్యాడు. కానీ అందులోని అరాచకత్వం ఆయనకు నచ్చలేదు.
- ఆ తర్వాత ఎమ్.ఎన్.రాయ్ మానవతావాదం ఆయన పై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఈ కాలంలో ఆయన ఆంధ్రా రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగా పనిచేసాడు.
- 1928లోనే శంబుక వధ కథ ద్వారా సాహిత్యరంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ 1938లో పట్టాభి గారి సోషలిజం అన్న పుస్తకాన్ని వెలువరించాడు.
- తొలుత కథా సాహిత్యంలో స్థిరపడ్డ గోపీచంద్ ఆ తర్వాత నవలా సాహిత్యరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన తొలి నవల పరివర్తనం (1943).
- 1939లో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ దర్శకనిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించాడు. అయితే వాటివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయారు.
- 1953లో ఆంధ్రరాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గా, 1956లో ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ సహాయ డైరెక్టర్ గా పనిచేసాడు.
- 1957-62 వరకు ఆకాశవాణి లో పనిచేసాడు. ఈ దశలో అరవిందుని భావాల పట్ల విశ్వాసం ఏర్పడడంతో ఆధ్యాత్మికవాదం వైపుకి పయనించాడు.
- 1962 నవంబర్ 2 నాడు గోపీచంద్ మరణించాడు.
- భారత ప్రభుత్వము సెప్టెంబరు 8, 2011న గోపీచంద్ శతజయంతి సందర్భమున తపాలా బిళ్ళ విడుదల చేసింది.
గోపీచంద్ చిన్నతనములోనే తల్లిని పోగొట్టుకున్నాడు. ఇంటి పనులతోపాటు, తండ్రి నాస్తికోద్యమము నకు సహాయము చేయటం లాంటి పనులతో అతని బాల్యం చాలా గడచి పోయింది. అటు తర్వాత, మద్రాస్ లో లా చదువుకున్నాడు. అతని మీద చాలా కాలము ఆయన నాన్న ప్రభావం ఉండేది. ఆయన మొదట వ్రాసిన చాలా నవలలో మార్క్సిస్టు భావాలు మనకు పూర్తిగా కనిపిస్తాయి.
ఆయన వ్రాసిన "మెరుపుల మరకలు" అనే గ్రంథంలో గాంధీరామయ్య అనే ఒక పాత్ర ఉంది. . ఆ పాత్ర శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులును పోలి ఉంటుందన్నది కొందరి భావన. రామస్వామి, పంతులు మంచి స్నేహితులు. రెండు భిన్న ధ్రువాలు. ఒకరు కరుడుగట్టిన నాస్తిక వాది, మరి ఒకరు పూర్తి ఆస్తికులు. ఇద్దరూ గాంధేయవాదులు. రామస్వామికి యవ్వనంలోనే భార్య గతించింది. పునర్వివాహం చేసుకోలేదు. ఒక రోజు పంతులు రామస్వామిని కలవటానికి తెనాలి వెళ్ళాడు. స్నేహితులిద్దరికి గోపీచంద్ భోజనం వడ్డిస్తున్నాడు. ఆ సందర్భములో, పంతులు "ఏమయ్యా! రామస్వామి నీవు ఉద్యమాలలో పూర్తిగా మునిగి, కుమారుడి వివాహము సంగతే మర్చిపోయావు" అని అన్నాడు. అప్పుడు, రామస్వామి, నిజమే పంతులు గారు, ఆ విషయము పూర్తిగా మరచిపోయాను. మీరే ఏదైనా మంచి అమ్మాయిని చూసి వాడికి పెళ్ళి చెయ్యండి అని అన్నాడట. అప్పుడు. పంతులు, గోపీచంద్ తో, "నీవు మద్రాస్ వెళ్ళే లోపు ఒక పది రోజుల ముందు, గుంటూరు రా.." అని అన్నాడు. గోపీచంద్, సరే అనటం, అలాగే గుంటూరుకు వెళ్ళటం జరిగింది.
ఆ రోజుల్లో గుంటూరులో "శారదా నికేతన్" అనే వితంతు శరణాలయం ఉండేది. ఇప్పుడు కూడా ఉంది. దాని నిర్వహణ బాధ్యత అంతా ఆ రోజుల్లో పంతులు గారే చూసుకునే వారు. ఆ రోజుల్లో అన్నీ బాల్యవివాహాలు కావటం చేత, వధూవరులకు వయోభేదం ఉండటం చేత అక్కడ ఉన్నవారిలో కూడా చాలామంది బాలవితంతువులే! గోపీచంద్ వచ్చి పంతులుని కలసి, ఎందుకు రమ్మన్నారో చెప్పమని అడిగారు. పంతులు ఏ విషయము చెప్పకుండా, నీకు నచ్చిన ఒక క్లాసుకు వెళ్లి ఒక పది రోజులు పాఠాలు చెప్పమన్నారు. ఆ వితంతు శరణాలయాన్ని పంతులు నడుపుతున్న తీరు, బాలవితంతుల దీన పరిస్థితి గోపీచంద్ పై తీవ్ర ప్రభావం చూపాయి. ఆయన రచనలలో కొన్నింటిలో వాటి ప్రభావం కనపడుతుంది. కాలక్రమంలో గోపీచంద్ మీద ఆయన నాన్న ప్రభావం తగ్గ నారంభించింది. స్వతంత్ర భావాలను పెంచుకున్నాడు. జీవితములో పెంచి పెద్ద చేసిన నాన్న కంటే పంతులు ప్రభావం అతని మీద చాలావరకు ఉంది. అందుకే, గాంధీరామయ్య పాత్ర సజీవంగా నిలిచిపోయింది.
గోపీచంద్ నెమ్మదిగా మార్క్సిస్టు సిద్ధాంతం నుండి బయటపడి, చివరి రోజులలో తత్వవేత్తలు అనే తాత్విక గ్రంథాన్ని వ్రాయటం జరిగింది. పోస్ట్ చెయ్యని ఉత్తరాలు, అసమర్ధుని జీవయాత్ర, మెరుపుల మరకలు - ఈ గ్రంథాలలో కూడా చాలావరకు తాత్విక చింతన కనపడుతుంది. ఆయనే, ఒక చోట ఇలా అంటాడు, "మానవులు జీవనదుల లాగా ఉండాలి కానీ, చైతన్యంలేని చెట్లు, పర్వతాల లాగా ఉండకూడదు". మానవ జీవితం ఒక చైతన్య స్రవంతి. ఎన్నో మలుపులు తిరుగుంది. అలాగే మనం కూడా నిరంతర అన్వేషణలో ఉండాలి. అప్పుడే మనకు సత్యమంటే ఏమిటో తెలుస్తుంది. నిన్న మనం నమ్మింది ఈ రోజు సత్యం కాదని తెలిసిన వెంటనే దాన్నివదలి మళ్ళీ అన్వేషణ సాగించాలి. ఇదే విషయాన్ని జిడ్డు కృష్ణమూర్తి, చలం కూడా చెప్పారు. జీవితం అంటే నిరంతర అన్వేషణ. ఒక పుస్తకాన్ని ఆయన తండ్రిగారికి అంకితం ఇస్తూ- 'ఎందుకు' అని అడగటం నేర్పిన నాన్నకి అని వ్రాసాడు. అలా నేర్చుకోబట్టే స్వతంత్ర భావాలు గల ఒక గొప్ప రచయిత స్థాయికి ఎదిగాడు.
రచనలు
నవలలు
- అసమర్థుని జీవయాత్ర
- గడియపడని తలుపులు
- చీకటి గదులు
- పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా
- ప్రేమోపహతులు
- పరివర్తన
- యమపాశం
- శిధిలాలయం
వాస్తవిక రచనలు
తెలుగు సినిమాలు
- చదువుకున్న అమ్మాయిలు (1963) (మాటల రచయిత)
- ధర్మదేవత (1952) (మాటల రచయిత)
- ప్రియురాలు (1952) (కథ, మాటల రచయిత మరియు దర్శకుడు)
- పేరంటాలు (1951) (దర్శకుడు)
- లక్ష్మమ్మ (1950) (దర్శకుడు)
- గృహప్రవేశం (1946) (కథా రచయిత)
- రైతుబిడ్డ (1939) (మాటల రచయిత)
బయటి లింకులు
- గోపీచంద్ రచించిన కథలు - ధర్మవడ్డీ, ఆమె వ్యక్తిత్వం (ఆంగ్లానువాదం), పనిపిల్ల (ఆంగ్లానువాదం)
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో త్రిపురనేని గోపీచంద్ పేజీ
- త్రిపురనేని వెబ్సైటు
- http://www.saarangabooks.com/magazine/2013/05/15/%E0%B0%92%E0%B0%95-%E0%B0%85%E0%B0%A1%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%AE%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B1%81%E0%B0%95%E0%B1%80-%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B0%A1%E0%B1%81%E0%B0%97/