అడివి బాపిరాజు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వున్నాయి. → ఉన్నాయి., లో → లో (2) using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పని చేశాడు → పనిచేశాడు (2) using AWB
పంక్తి 14: పంక్తి 14:


[[File:Adavi Baapiraju Statue at RK Beach 01.jpg|thumb|విశాఖలో అడివి బాపిరాజు విగ్రహం]]
[[File:Adavi Baapiraju Statue at RK Beach 01.jpg|thumb|విశాఖలో అడివి బాపిరాజు విగ్రహం]]
బాపిరాజు [[పశ్చిమ గోదావరి]] జిల్లా లోని [[భీమవరం]]లో [[అక్టోబర్ 8]], [[1895]] న ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబములో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. భీమవరం హైస్కూలులో చదివి, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి, మద్రాస్ లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించాడు. 1934 నుండి 1939 వరకు [[బందరు]] నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా (ప్రిన్సిపాల్ గా) పని చేశాడు. 1944లో [[హైదరాబాదు]] నుండి వెలువడే తెలుగు దినపత్రిక [[మీజాన్]] సంపాదకునిగా పని చేశాడు. తరువాత [[విజయవాడ]] [[ఆకాశవాణి]] రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నాడు. 'నవ్య సాహిత్య పరిషత్' స్థాపించినవారిలో బాపిరాజు ఒకడు. చిత్రకళను నేర్పడానికి [[గుంటూరు]]లో ఒక ఫౌండేషన్ ప్రారంభించాడు.
బాపిరాజు [[పశ్చిమ గోదావరి]] జిల్లా లోని [[భీమవరం]]లో [[అక్టోబర్ 8]], [[1895]] న ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబములో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. భీమవరం హైస్కూలులో చదివి, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి, మద్రాస్ లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించాడు. 1934 నుండి 1939 వరకు [[బందరు]] నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా (ప్రిన్సిపాల్ గా) పనిచేశాడు. 1944లో [[హైదరాబాదు]] నుండి వెలువడే తెలుగు దినపత్రిక [[మీజాన్]] సంపాదకునిగా పనిచేశాడు. తరువాత [[విజయవాడ]] [[ఆకాశవాణి]] రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నాడు. 'నవ్య సాహిత్య పరిషత్' స్థాపించినవారిలో బాపిరాజు ఒకడు. చిత్రకళను నేర్పడానికి [[గుంటూరు]]లో ఒక ఫౌండేషన్ ప్రారంభించాడు.


బాపిరాజుకు చిన్ననాటినుండి కవితలు రాసే అలవాటు ఉండేది. బాపిరాజు నవల '''[[నారాయణరావు]]'''కు [[ఆంధ్ర విశ్వకళా పరిషత్]] అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో 'సముద్ర గుప్తుడు', 'తిక్కన' ప్రసిద్ధమయ్యాయి. [[విశ్వనాథ సత్యనారాయణ]] గేయ సంపుటి [[కిన్నెరసాని పాటలు]] బాపిరాజు చిత్రాలతో వెలువడింది.
బాపిరాజుకు చిన్ననాటినుండి కవితలు రాసే అలవాటు ఉండేది. బాపిరాజు నవల '''[[నారాయణరావు]]'''కు [[ఆంధ్ర విశ్వకళా పరిషత్]] అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో 'సముద్ర గుప్తుడు', 'తిక్కన' ప్రసిద్ధమయ్యాయి. [[విశ్వనాథ సత్యనారాయణ]] గేయ సంపుటి [[కిన్నెరసాని పాటలు]] బాపిరాజు చిత్రాలతో వెలువడింది.

01:10, 22 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

అడివి బాపిరాజు
జననంఅక్టోబరు 8, 1895
భీమవరం
మరణంసెప్టెంబరు 22, 1952
ఇతర పేర్లుబాపిబావ
వృత్తికవి, చిత్రకారుడు, పాత్రికేయుడు, దర్శకుడు
తండ్రికృష్ణయ్య
తల్లిసుబ్బమ్మ

అడివి బాపిరాజు (Adivi Bapiraju) (అక్టోబరు 8, 1895 - సెప్టెంబరు 22, 1952) బహుముఖ ప్రజ్ఞాశీలి. స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు మరియు నాటక కర్త. తెలుగు దేశమంతటా విస్తృతంగా ప్రచారంలోనున్న "బావా బావా పన్నీరు" పాట ఈయన వ్రాసిందే. సన్నిహితులు, సమకాలీన సాహితీవేత్తలు ఈయన్ని ముద్దుగా "బాపి బావ" అని పిలిచేవారు.

విశాఖలో అడివి బాపిరాజు విగ్రహం

బాపిరాజు పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరంలో అక్టోబర్ 8, 1895 న ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబములో కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. భీమవరం హైస్కూలులో చదివి, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ లో బి.ఏ చదివి, మద్రాస్ లా కాలేజ్ లో బి.ఎల్ పట్టం పొంది, కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించిన తరువాత తన ఇతర వ్యాసంగాలలో కృషిని సాగించడానికి ఆ పనిని విరమించాడు. 1934 నుండి 1939 వరకు బందరు నేషనల్ కాలేజిలో అధ్యాపకునిగా (ప్రిన్సిపాల్ గా) పనిచేశాడు. 1944లో హైదరాబాదు నుండి వెలువడే తెలుగు దినపత్రిక మీజాన్ సంపాదకునిగా పనిచేశాడు. తరువాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారునిగా ఉన్నాడు. 'నవ్య సాహిత్య పరిషత్' స్థాపించినవారిలో బాపిరాజు ఒకడు. చిత్రకళను నేర్పడానికి గుంటూరులో ఒక ఫౌండేషన్ ప్రారంభించాడు.

బాపిరాజుకు చిన్ననాటినుండి కవితలు రాసే అలవాటు ఉండేది. బాపిరాజు నవల నారాయణరావుకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ అవార్డు లభించింది. ఆయన చిత్రించిన చిత్రాలలో 'సముద్ర గుప్తుడు', 'తిక్కన' ప్రసిద్ధమయ్యాయి. విశ్వనాథ సత్యనారాయణ గేయ సంపుటి కిన్నెరసాని పాటలు బాపిరాజు చిత్రాలతో వెలువడింది.

1922లో సహాయ నిరాకరణోద్యమంలో ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. తన జైలు జీవితానుభవాలను 'తొలకరి' నవలలో పొందుపరచాడు.

సెప్టెంబరు 22, 1952 న బాపిరాజు మరణించాడు.

చిత్రకళ

నవరంగ సంప్రదాయ రీతిలో అడివి బాపిరాజు ఎన్నో చిత్రాలను చిత్రించారు. బాపిరాజు చిత్రించిన శబ్ద బ్రహ్మ అనే చిత్రం డెన్మార్కు ప్రదర్శనశాలలో ఉంది. భాగవత పురుషుడు, ఆనంద తాండవం మొదలగు చిత్రాలు తిరువాన్‍కూరు మ్యూజియంలో ఉన్నాయి. 1951లో అప్పటి మద్రాసుప్రభుత్వం కోరికపై సింహళంలోని సిగిరియా కుడ్య చిత్రాల ప్రతికృతులను చిత్రించారు.

రచనలు

నవలలు

రేడియో నాటికలు

  • దుక్కిటెద్దులు
  • ఉషాసుందరి
  • భోగీరలోయ
  • నారాయణరావు
  • శైలబాల
  • పారిజాతం
  • నవోదయం
  • ఏరువాక

కథాసంపుటాలు

  • తరంగిణి[1] - 7 కథల సంపుటి
  • రాగమాలిక[2] - 9 కథల సంపుటి
  • అంజలి - 6 కథల సంపుటి
  • తూలికా నృత్యం - 3 కథల సంపుటి
  • భోగీర లోయ - 6 కథల సంపుటి
  • వింధ్యాచలం - 4 కథల సంపుటి

ప్రసిద్ధి చెందిన కథలు

  • తూలికా నృత్యం
  • హంపి శిథిలాలు
  • శైలబాల
  • వీణ
  • నాగలి
  • నేలతల్లి
  • బొమ్మలరాణి
  • సోమసుత
  • సూర్యసుత

దర్శకత్వం వహించిన సినిమాలు

మరెన్నో కథలు, గేయాలు రచించాడు. కొన్ని కథలు కన్నడ భాషలోకి అనువదింపబడ్డాయి.

వనరులు, బయటి లింకులు

మూలాలు

Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
  1. బాపిరాజు, అడివి (1945). తరంగిణి.
  2. బాపిరాజు, అడివి (1945). రాగమాలిక.