పాత మల్లాయపాలెం: కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , చినది. → చింది., జరిగినది. → జరిగింది. using AWB |
|||
పంక్తి 113: | పంక్తి 113: | ||
ఈ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా, 2016,ఫిబ్రవరి-17వ తేదీ గురువారంనాదు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. [6] |
ఈ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా, 2016,ఫిబ్రవరి-17వ తేదీ గురువారంనాదు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. [6] |
||
===శ్రీ |
===శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం=== |
||
===శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం=== |
===శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం=== |
||
పాతమల్లాయపాలెం గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2016,ఫిబ్రవరి-18 గురువారంనాడు విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు ప్రారంభించెదరు. గురువారం ఉదయం వేదస్వస్తి, యాగశాల ప్రవేశం, శ్రీ విఘ్నేశ్వరపూజ, అంకురార్పణ, ధ్వజారోహణ, బలిహరణ, 19వ తేదీ శుక్రవారం నాడు హోమాలు, వాస్తుపూజలు, స్వామివారికి గ్రామోత్సవం, 20వ తేదీ శనివారంనాడు నిత్యపూజ, హోమ విధులు, తులసి దళార్చన, అయ్యప్పస్వామి మూలమంత్రవాహన, 21వ తేదీ ఆదివారంనాడు చందనాభిషేకం, పరివార దేవతా నవగ్రహ హోమాలు, 22వ తేదీ సోమవారం ఉదయం 8-29 గంటలకు విగ్రహప్త్రిష్ఠా కార్యక్రమం అనంతరం అన్నసంతర్పణ మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు. [6] |
పాతమల్లాయపాలెం గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2016,ఫిబ్రవరి-18 గురువారంనాడు విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు ప్రారంభించెదరు. గురువారం ఉదయం వేదస్వస్తి, యాగశాల ప్రవేశం, శ్రీ విఘ్నేశ్వరపూజ, అంకురార్పణ, ధ్వజారోహణ, బలిహరణ, 19వ తేదీ శుక్రవారం నాడు హోమాలు, వాస్తుపూజలు, స్వామివారికి గ్రామోత్సవం, 20వ తేదీ శనివారంనాడు నిత్యపూజ, హోమ విధులు, తులసి దళార్చన, అయ్యప్పస్వామి మూలమంత్రవాహన, 21వ తేదీ ఆదివారంనాడు చందనాభిషేకం, పరివార దేవతా నవగ్రహ హోమాలు, 22వ తేదీ సోమవారం ఉదయం 8-29 గంటలకు విగ్రహప్త్రిష్ఠా కార్యక్రమం అనంతరం అన్నసంతర్పణ మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు. [6] |
12:16, 27 నవంబరు 2016 నాటి కూర్పు
పాత మల్లాయపాలెం | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | గుంటూరు |
మండలం | ప్రత్తిపాడు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | |
- పురుషుల సంఖ్య | 1,724 |
- స్త్రీల సంఖ్య | 1,787 |
- గృహాల సంఖ్య | 1,063 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
పాత మల్లాయపాలెం, గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు మండలానికి చెందిన గ్రామము.
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
సమీప గ్రామాలు
సమీప మండలాలు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
గ్రామంలో మౌలిక వసతులు
గ్రామానికి వ్యయసాయం మరియు సాగునీటి సౌకర్యం
మంచినీటి చెరువు:- ఈ చెరువులో చేపలను పెంచుకొను హక్కు కొరకు బహిరంగ వేలం నిర్వహించి, వచ్చిన ఆదాయాన్ని పంచాయతీ ఖాతాలో జమచేయుదురు. 2015,నవంబరు-7వ తేదీనాడు నిర్వహించిన వేలములో పంచాయతీకి, రు. 3,01,000-00 ఆదాయం లభించింది. []
గ్రామ పంచాయతీ
- ఈ గ్రామానికి 1981 మేలో జరిగిన ఎన్నికలలో శ్రీ విప్పాల వెంకటరెడ్డి పోటీ చేసి గెలుపొందారు. అప్పటినుండి గ్రామాభివృద్ధికి రేయింబవళ్ళూ కృషి చేశారు. గ్రామంలో కలుషిత నీటితో తుమ్మలతోపుగా ఉన్న ప్రాంతాన్ని, మంచినీటి నిల్వ చెరువుగా మార్చారు. చెరువుపై రక్షిత మంచినీటిపథకం ఏర్పాటు చేయించారు. గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నిర్మించారు. యస్.సీ.కాలనీకి విద్యుత్ సౌకర్యం, యస్.సీ.యస్టీలకు నివేశన స్తలాల పంపిణీ చేశారు. పశువైద్యశాల, పంచాయతీ కార్యాలయ భవనం నిర్మించారు. గింజుపల్లెవారిపాలెంలో రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు చేశారు. పాతమల్లాయపాలెం, గింజుపల్లెవారిపాలెం గ్రామాలకు ప్రధాన రహదారులు, అంతర్గత రహదారులకు నిధులూ మంజూరు చేయించారు. 180 మంది పేద వృద్ధులకు వృద్ధాప్య పింఛనులు ఇప్పించారు. పాతమల్లాయపాలెం ప్రగతికి సహాయసహకారాలు అందించిన అప్పటి ప్రత్తిపాడు ఎం.ఎల్.ఏ. డా. మాకినేని పెద రత్తయ్య, రాష్ట్ర మంత్రి జానారెడ్డిలను గ్రామానికి పిలిపించి సామూహిక ప్రారంభోత్సవాలు నిర్వహించారు. తాను చేపట్టిన అభివృద్ధిని నేతలకు వివరించారు. [1]
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి చాట్ల నాగేంద్రమ్మ, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ వణుకూరి నాగిరెడ్డి ఎన్నికైనారు. [2]
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
శ్రీ అభీష్టసిద్ధి గణపతిస్వామి వారి ఆలయం
ఈ గ్రామములో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2014,ఫిబ్రవరి-9 ఆదివారం నాడు, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం గణపతి పూజ, పుణ్యావాహం, అగ్నిధ్యానం, యంత్రస్థాపన వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగినవి. అనంతరం పీఠారోహణ, బింబప్రతిష్ఠ, కళాన్యాసము, ధేనుదర్శనం, నీరాజన మంత్రపుష్పం, పూర్ణాహుతి, ఆచార్యసన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. దంపతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేకపూజలు చేశారు. భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరినారు. అనంతరం తీర్ధప్రసాదాల స్వీకరణ, అన్నదాన కార్యక్రమాలు జరిగినవి. [3]
ఈ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా, 2016,ఫిబ్రవరి-17వ తేదీ గురువారంనాదు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. [6]
శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం
శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం
పాతమల్లాయపాలెం గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2016,ఫిబ్రవరి-18 గురువారంనాడు విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు ప్రారంభించెదరు. గురువారం ఉదయం వేదస్వస్తి, యాగశాల ప్రవేశం, శ్రీ విఘ్నేశ్వరపూజ, అంకురార్పణ, ధ్వజారోహణ, బలిహరణ, 19వ తేదీ శుక్రవారం నాడు హోమాలు, వాస్తుపూజలు, స్వామివారికి గ్రామోత్సవం, 20వ తేదీ శనివారంనాడు నిత్యపూజ, హోమ విధులు, తులసి దళార్చన, అయ్యప్పస్వామి మూలమంత్రవాహన, 21వ తేదీ ఆదివారంనాడు చందనాభిషేకం, పరివార దేవతా నవగ్రహ హోమాలు, 22వ తేదీ సోమవారం ఉదయం 8-29 గంటలకు విగ్రహప్త్రిష్ఠా కార్యక్రమం అనంతరం అన్నసంతర్పణ మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు. [6]
గ్రామంలో ప్రధాన పంటలు
వరి, ప్రత్తి, మిర్చి.
గ్రామంలో ప్రధాన వృత్తులు
గ్రామ ప్రముఖులు
గ్రామ విశేషాలు
ఈ గ్రామానికి 2014,ఏప్రిల్-3న, "అప్కాబ్" ఆధ్వర్యంలో నెదర్లాండుకు చెందిన రాబో బ్యాంకు వ్యవసాయ నిపుణుడు శ్రీ రూథ్ జిల్స్ట్ సందర్శించారు. మొదట వారు స్థానికంగా ఉన్న మిర్చి పంటను పరిశీలించారు. అనంతరం స్థానిక సొసైటీ సంఘం భవనం వద్ద రైతులతో కొద్దిసేపు ముచ్చటించారు. మిరప, పసుపు పంటలు పండించటానికి ఎంత ఖర్చవుతుంది, ఎరువులు ఎంత మోతాదులో వాడతారనే వివరాలు తెలుసుకున్నారు. ఇంకా మూడు రోజులు ఇక్కడే ఉండి, శీతల గిడ్డంగులవారినీ, వ్యాపారులనూ గూడా కలుసుకొని, వివరాలు తెలుసుకుంటామని చెప్పారు. అప్కాబ్ ప్రధాన కార్యలయం వారికి కొన్ని సూచనలిస్తామన్నారు. [4]
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 3,511 - పురుషుల సంఖ్య 1,724 - స్త్రీల సంఖ్య 1,787 - గృహాల సంఖ్య 1,063
మూలాలు
బయటి లింకులు
[1] ఈనాడు గుంటూరు సిటీ; 2013,జులై-25; 8వపేజీ. [2] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014,ఫిబ్రవరి-1; 1వపేజీ. [3] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014,ఫిబ్రవరి-10; 1వపేజీ. [4] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014,ఏప్రిల్-4; 2వపేజీ. [5] ఈనాడు గుంటూరు సిటీ; 2015,నవంబరు-8; 26వపేజీ. [6] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2016,ఫిబ్రవరి-18; 1వపేజీ.