ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →కబ్జా కోరల్లో ఫిరంగి నాలా: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పటిష్ట → పటిష్ఠ using AWB |
Strike Eagle (చర్చ | రచనలు) |
||
పంక్తి 40: | పంక్తి 40: | ||
[[File:Anadaasramam inside. Ibrahimpatna.jpg|thumb|left|వృద్ధాశ్రమములోపలి ప్రాంగణము, ఇబ్రహీం పట్నం.]] |
[[File:Anadaasramam inside. Ibrahimpatna.jpg|thumb|left|వృద్ధాశ్రమములోపలి ప్రాంగణము, ఇబ్రహీం పట్నం.]] |
||
[[File:Mandal parishat office, ibrahimpatnam.jpg|thumb|right|ఇబ్రహీంపట్నం, మండలపరిషత్ కార్యాలయము]] |
[[File:Mandal parishat office, ibrahimpatnam.jpg|thumb|right|ఇబ్రహీంపట్నం, మండలపరిషత్ కార్యాలయము]] |
||
చెరువూ నీటితో నిండి అలుగు ద్వారా వృథాగా పారే నీటిని ఫిరింగి కాలువకు అనుసంధానం చేశారు. కాలువ ప్రయాణంలో ఉన్న సుమారు 50 చెరువుల్లో నీటిని నింపి వాటి ఆయకట్టులో పంటలను సంమృద్ధిగా పండించేందుకు పథకం రూపొందించారు. దీని వల్ల వేలాది ఎకరాల్లో పంటలు సాగుచేసే అవకాశం ఏర్పడడంతో రైతులకు ఉపాధి ఏర్పడింది. దీంతో పాటే కాలువ పొడవునా ఉన్న గ్రామాలకు తాగునీరు సమస్యను శాశ్వతంగా తీర్చేవీలు ఏర్పడింది. ఫిరంగి కాలువతో షాబాద్ మండలంలోని చందనవల్లి చెరువు, సోలిపేట్ పెద్ద చెరువు, శంషాబాద్ మండల పరిధలోని రామాంజపూర్ సమీపంలోని మద్దూరుకుంట, పాలమాకుల చెరువు, శంషాబాద్ చెరువు, హయత్నగర్ చెరువు, |
చెరువూ నీటితో నిండి అలుగు ద్వారా వృథాగా పారే నీటిని ఫిరింగి కాలువకు అనుసంధానం చేశారు. కాలువ ప్రయాణంలో ఉన్న సుమారు 50 చెరువుల్లో నీటిని నింపి వాటి ఆయకట్టులో పంటలను సంమృద్ధిగా పండించేందుకు పథకం రూపొందించారు. దీని వల్ల వేలాది ఎకరాల్లో పంటలు సాగుచేసే అవకాశం ఏర్పడడంతో రైతులకు ఉపాధి ఏర్పడింది. దీంతో పాటే కాలువ పొడవునా ఉన్న గ్రామాలకు తాగునీరు సమస్యను శాశ్వతంగా తీర్చేవీలు ఏర్పడింది. ఫిరంగి కాలువతో షాబాద్ మండలంలోని చందనవల్లి చెరువు, సోలిపేట్ పెద్ద చెరువు, శంషాబాద్ మండల పరిధలోని రామాంజపూర్ సమీపంలోని మద్దూరుకుంట, పాలమాకుల చెరువు, శంషాబాద్ చెరువు, హయత్నగర్ చెరువు, [[ఇంజాపూర్]] చెరువు, తుర్కెంజాల్ సమీపంలోని కొత్త చెరువు, తుక్కుగూడ చెరువులతో పాటు ఇబ్రహీంపట్నం చెరువులను నీటితో నింపారు. నీటిని ఇబ్రహీంపట్నం చెరువుకు కాలువ ద్వారా చేరవేసేలోపే చందనవల్లి వద్ద నిర్మించిన కరకట్ట తెగిపోవడంతో ఆశించిన ఫలితం దక్కలేదని పెద్దలు చెబుతున్నారు. వేలాది ఎకరాలక సాగు నీరు, గ్రామాలకు తాగు నీరు అందించాలనే ఉద్దేశంతో ఈ కాలువ నేడు కాలగర్భంలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉంది. దాదాపు 1967 వరకు ఫిరంగి కాలువ ద్వారా కొన్ని చెరువులకు నీరందినట్లు తెలుస్తోంది. కాలువ పూడుకుపోకముందు వేలాది ఎకరాలకు సాగునీరు అందించినా ప్రస్తుతం ఫిరంగి కాలువకు రియల్ ఎస్టేట్ దెబ్బ తగిలింది. భవిష్యత్తు నీటి అవసరాలు తీర్చేందుకు నాటి పాలకులు ముందుచూపుతో నిర్మించిన చెరువులు, కుంటలు కూడా నేడు కనుమరుగవుతున్నాయి. |
||
[[File:Branch library, ibrahim patnam.jpg|thumb|left|ఇబ్రహీంపట్నం గ్రామములో శాఖ గ్రంథాలయము]] |
[[File:Branch library, ibrahim patnam.jpg|thumb|left|ఇబ్రహీంపట్నం గ్రామములో శాఖ గ్రంథాలయము]] |
||
[[File:Post office at ibrahimpatnam.jpg|thumb|right|ఇబ్రహీంపట్నం గ్రామములోని తపాలా కార్యాలయము]] |
[[File:Post office at ibrahimpatnam.jpg|thumb|right|ఇబ్రహీంపట్నం గ్రామములోని తపాలా కార్యాలయము]] |
11:36, 24 ఫిబ్రవరి 2017 నాటి కూర్పు
ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°11′33″N 78°39′11″E / 17.192619°N 78.653069°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
మండల కేంద్రం | ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి |
గ్రామాలు | 22 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 74,006 |
- పురుషులు | 37,878 |
- స్త్రీలు | 36,128 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 57.72% |
- పురుషులు | 69.97% |
- స్త్రీలు | 44.90% |
పిన్కోడ్ | {{{pincode}}} |
ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము.
గ్రామ జనాభా
- జనాభా (2011) - మొత్తం 74,006 - పురుషులు 37,878 - స్త్రీలు 36,128
మూలాలు
భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
ఇబ్రహింపట్నం చెరువు
కబ్జా కోరల్లో ఫిరంగి నాలా
నిజాం నవాబు శతాబ్దం క్రితం తెలంగాణ ప్రజల స్వేదంతో నిర్మించిన ఫిరంగి కాలువ నేడు కనుమరుగవుతోంది. వేలాది కోట్ల రూపాయాలు ఖర్చు చేసి ప్రాణహిత నుంచి చేవెళ్లకు నీటిని తరలిస్తామని చెబుతున్న పాలకులు గత ఆరు సంవత్సరాలుగా ఫిరంగి కాలువ విషయంలో ఇచ్చిన హామీలన్నీ నీటిపాలయ్యాయి. ఫిరంగి కాల్వకు మరమ్మతు చేసి పూర్వవైభవాన్ని తీసుకొస్తామని నమ్మబలికిన నాటి ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రాజశేఖర్రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్కుమార్ల పనితీరుపై ఈ ప్రాంత ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజధానికి పశ్చిమ దిశలో ఉన్న ఈసీ నది నుంచి నగరానికి దక్షిణ దిశలో ఉన్న ఇబ్రహీంపట్నం చెరువు వరకు సుమారు 85 కిలో మీటర్ల పొడవున నిర్మించిన ఫిరంగి కాలువ నేడు అక్రార్కుల చెరలో బందీ అయింది. తెలంగాణ అంచులో ఉన్న ప్రాణహిత నుంచి చేవెళ్లకు గోదావరి జలాలను తెచ్చే బదులు చేవెళ్ల రెవెన్యూ డివిజన్ నడిబొడ్డు నుంచి పారుతున్న ఈసీ నది జలాలను మళ్లించేందుకు నిర్మించిన ఫిరంగి కాలువను పునరుద్ధరించేందుకు పాలకులు ఎందుకు వెనుకంజ వేస్తున్నారో అక్కడి రైతాంగానికి
అంతుపట్టడంలేదు. రాజశేఖర్రెడ్డి ముఖ్య మంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత పల్లెబాట పేరుతో చేవెళ్ల వచ్చి ఫిరంగి కాలువను తక్షణం బాగు చేయిస్తానని హామీ ఇచ్చి ఆ తరువాత మరిచిపోయారు. ఆయన అనంతరం రోశయ్య, కిరణ్కుమార్రెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్నా ఫిరంగి కాలువ ఊసే ఎత్తలేదు. కాలువను బాగుచేస్తే వేలాది ఎకరాల విస్తీరణంలో పంటలు సాగవుతాయని రైతులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఫిరంగి కాలువ ప్రస్తుతం కబ్జాకోరల్లో చిక్కి కనుమరుగయ్యే ప్రమాదంలో ఉంది.
ఫిరంగి కాలువ పునరుద్ధరణకు
తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ పాదయాత్ర
ఫిరంగి కాలువ పునరుద్ధరణ చేయాలంటూ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో మార్చి 30న చందన్వెళ్లి నుంచి ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు వరకు టఫ్ కో-కన్వీనర్ విమలక్క ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఫిరంగి కాలువ పునరుద్ధరించే వరకు పోరాటాలు చేస్తామన్నారు. ఈ పాదయాత్రకు స్థానిక రైతుల నుంచి విశేష స్పందన వచ్చింది.
కాలువ చరిత్ర
1872లో నిజాం ప్రభువు ఫ్రెంచ్, ఇంగ్లాండ్ ఇంజనీర్ల సహాయంతో కాలువ నిర్మాణాన్ని చేపట్టినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. కాలువ నిర్మాణంలో రాళ్ళు అడ్డుగా వస్తే మందుగుండుతో పేల్చి నిర్మాణాన్ని కొసాగించినందుకు ఈ కాలువకు ఫిరంగి కాలుగా పేరు స్థిరపడినట్లు పెద్దలు చెబుతున్నారు. షాబాద్ మండలం చందన్వెళ్లి గ్రామానికి తూర్పు- ఈశాన్య దిశలో ఈసీ నది ప్రవహిస్తోంది. చేవెళ్ల, షాబాద్ మండలాల సరిహాద్దుల్లో ఈ నదిపై సుమారు రెండు పర్లాంగుల పొడవున ఫిరంగి కాలువ ఆనకట్టను నిర్మించారు. ఈసీ నది నుంచి నీటిని ఫిరంగికాలువకు మళ్లించేందుకు పెద్ద పెద్ద రాళ్లు, సున్నం డంగు, ఇసుకను కలిపి 48 మీటర్ల వెడల్పుతో అత్యంత పటిష్ఠంగా సుమారు మీటరు ఎత్తున కరకట్టను నిర్మించారు. కరకట్ట ద్వారా ఫిరంగి కాలువకు నీటిని మళ్లించగా మిగిలిన నీరు హైదరాబాదు నగరానికి తాగు నీరందించే హిమాయత్సాగర్కు చేరుతుంది. చందనవల్లి శివారు నుంచి ఇబ్రహీంపట్నం చెరువు వరకు 85 కిలో మీటర్ల పొడవున కాలువ నిర్మాణాన్ని పూర్తిచేశారు. షాబాద్ మండలంలో ప్రాంరంభమైన కాలువ శంషాబాద్, రాజేంద్రనగర్ మున్సిపాల్టీ, సరూర్నగర్, హయత్నగర్, మండలాల ద్వారా ఇబ్రహీంపట్నం చెరువులో కలిసి ముగుస్తుంది. కాలవకు అందుబాటులో ఉన్న అన్ని చెరువులను కలుపుతూ నిర్మించారు. ప్రతి
చెరువూ నీటితో నిండి అలుగు ద్వారా వృథాగా పారే నీటిని ఫిరింగి కాలువకు అనుసంధానం చేశారు. కాలువ ప్రయాణంలో ఉన్న సుమారు 50 చెరువుల్లో నీటిని నింపి వాటి ఆయకట్టులో పంటలను సంమృద్ధిగా పండించేందుకు పథకం రూపొందించారు. దీని వల్ల వేలాది ఎకరాల్లో పంటలు సాగుచేసే అవకాశం ఏర్పడడంతో రైతులకు ఉపాధి ఏర్పడింది. దీంతో పాటే కాలువ పొడవునా ఉన్న గ్రామాలకు తాగునీరు సమస్యను శాశ్వతంగా తీర్చేవీలు ఏర్పడింది. ఫిరంగి కాలువతో షాబాద్ మండలంలోని చందనవల్లి చెరువు, సోలిపేట్ పెద్ద చెరువు, శంషాబాద్ మండల పరిధలోని రామాంజపూర్ సమీపంలోని మద్దూరుకుంట, పాలమాకుల చెరువు, శంషాబాద్ చెరువు, హయత్నగర్ చెరువు, ఇంజాపూర్ చెరువు, తుర్కెంజాల్ సమీపంలోని కొత్త చెరువు, తుక్కుగూడ చెరువులతో పాటు ఇబ్రహీంపట్నం చెరువులను నీటితో నింపారు. నీటిని ఇబ్రహీంపట్నం చెరువుకు కాలువ ద్వారా చేరవేసేలోపే చందనవల్లి వద్ద నిర్మించిన కరకట్ట తెగిపోవడంతో ఆశించిన ఫలితం దక్కలేదని పెద్దలు చెబుతున్నారు. వేలాది ఎకరాలక సాగు నీరు, గ్రామాలకు తాగు నీరు అందించాలనే ఉద్దేశంతో ఈ కాలువ నేడు కాలగర్భంలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉంది. దాదాపు 1967 వరకు ఫిరంగి కాలువ ద్వారా కొన్ని చెరువులకు నీరందినట్లు తెలుస్తోంది. కాలువ పూడుకుపోకముందు వేలాది ఎకరాలకు సాగునీరు అందించినా ప్రస్తుతం ఫిరంగి కాలువకు రియల్ ఎస్టేట్ దెబ్బ తగిలింది. భవిష్యత్తు నీటి అవసరాలు తీర్చేందుకు నాటి పాలకులు ముందుచూపుతో నిర్మించిన చెరువులు, కుంటలు కూడా నేడు కనుమరుగవుతున్నాయి.
కబ్జా కోరల్లో కాలువ
పాలకుల పనితీరు కారణంగా ఫిరంగి కాలువ యథేచ్ఛగా కబ్జాకు గురైంది. హిమాయత్నగర్ నుంచి మొదలు పెడితే ఎర్రకుంట, పహడిషరీఫ్, కొత్తపేట, వెంకటాపూర్, నాదర్గుల్ ప్రాంతాల్లో ప్రస్తుతం కాలువ ఆనవాళ్ళను వెతుక్కొవాల్సిన స్థితి ఉంది. తుర్కయంజాల్ కొత్తచెరువు, ఇబ్రహీంపట్నం చెరువు, నాదర్గుల్ మన్సూర్ఖాన్ చెరువు, ఇంజాపూర్ చెరువు, హయత్నగర్ చెరువుల ఆయకట్టల్లో సైతం ఆక్రమ లేఔట్లతో బహుళ అంతస్తులు భవనాలు వెలిశాయి. ఈ మధ్యనే నర్కూడ శంషాబాద్ సమీపంలోని ఫిరంగికాలువలో వెంచర్ ఏర్పాటు చేసి రోడ్లు వేస్తున్నారు. సాగు చేసేందుకు నీరులేక సాగు భూముల్లో భవంతులు వెలిసి వ్యవసాయం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోంటోంది. రైతులు ఆందోళనలో ఉన్నారు. ప్రజలను తాగు నీటి సమస్య కూడా వేధిస్తోంది. ఇంత జరుగుతున్నా పాలకులు చీమకుట్టినట్టు కూడా లేదు.
కరువు పరిస్థితుల నుంచి రైతులను ఆదుకోవడానికి ఇబ్రహీంపట్నం పెద్దచెరువులోకి నీటిని చేర్చే ఫిరంగినాలా అభివృద్ధికి కృషి చేస్తామని కలెక్టర్ ఎ.వాణీప్రసాద్ తెలిపారు.
సకలజనుల సమ్మె
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
మండలంలోని గ్రామాలు
- కొంగరకలాన్
- ఆదిబట్ల
- బొంగ్లూర్
- చింతపల్లిగూడ
- రాందాస్పల్లి
- ఇబ్రహీంపట్నం (ఖల్స)
- నగంపల్లి
- పొల్కంపల్లిthis near to ramoji films city
- నర్రేపల్లి
- దండుమైలారం
- ముక్నూర్
- యెంగలగూడ
- రైపొల్
- ఇబ్ర్రహీంపట్నం (బగత్)
- మంగల్పల్లి
- రాంరెడ్డిగూడ
- పోచారం
- ఎలిమినేదు
- ఎర్రకుంట
- తురుకగూడ
- కప్పపహాడ్
- తూలెకలన్