Coordinates: 16°26′N 80°59′E / 16.43°N 80.99°E / 16.43; 80.99

గుడివాడ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 96: పంక్తి 96:
సింగరెపాలెం నాగమ్మ తల్లి దేవాలయము బాగా ప్రసిద్ధి చెందిన దేవాలయము. ఇక్కడకి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న నాగమ్మ తల్లి బాగా మహిమ కల దేవతగా ఇక్కడ ఉన్న ప్రజలు కొలుస్తారు.
సింగరెపాలెం నాగమ్మ తల్లి దేవాలయము బాగా ప్రసిద్ధి చెందిన దేవాలయము. ఇక్కడకి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న నాగమ్మ తల్లి బాగా మహిమ కల దేవతగా ఇక్కడ ఉన్న ప్రజలు కొలుస్తారు.
===శ్రీ ఉమానాగలింగేశ్వరస్వామివారి ఆలయం===
===శ్రీ ఉమానాగలింగేశ్వరస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో 2014,[[నవంబరు]]-6వ తేదీ రాత్రి, కార్తీకపౌర్ణమి సందర్భంగా, నాలుగున్నర కోట్ల దీపాలతో దీపోత్సవాన్ని నిర్వహించారు. పురవీధులలో ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. భక్తులు వేలాదిగా వెంటరాగా, ఆలయం ఎదుట జ్వాలాతోరణాన్ని వెలిగించారు. జ్వాలాతోరణం విభూతిని వ్యాపారం నిర్వహించే దుకాణాలలోగానీ, ఇళ్ళలోగానీ ఉంచితే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతవని ఆలయ పురోహితులు తెలిపినారు. [4]
ఈ ఆలయంలో 2014,[[నవంబరు]]-6వ తేదీ రాత్రి, కార్తీకపౌర్ణమి సందర్భంగా, నాలుగున్నర కోట్ల దీపాలతో దీపోత్సవాన్ని నిర్వహించారు. పురవీధులలో ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. భక్తులు వేలాదిగా వెంటరాగా, ఆలయం ఎదుట జ్వాలాతోరణాన్ని వెలిగించారు. జ్వాలాతోరణం విభూతిని వ్యాపారం నిర్వహించే దుకాణాలలోగానీ, ఇళ్ళలోగానీ ఉంచితే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతవని ఆలయ పురోహితులు తెలిపినారు. [4]
===శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామివారి ఆలయం===
ఈ ఆలయ అష్టమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 2017,మార్చ్-13వతేదీ సోమవారంనాడు, ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయాన్ని సుందరంగా అలంకరించినారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు , శాంతికళ్యాణం అనంతరం అన్నసమారాధన నిర్వహించెదరు. 14వతేదీ మంగళవారంనాడు నగరోత్సవం నిర్వహించెదరు. []

===శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం===
===శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో 2016,[[ఫిబ్రవరి]]-18వ తేదీ [[గురువారం]]నాడు, స్వామివారికి ఎదురుగా పంచలోహ నందీశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గుడివాడ పట్టణానికి చెందిన శ్రీ రెడ్డి లోకేశ్వరరావు, భాగ్యవతి దంపతులు, ఈ విగ్రహాన్ని ఆలయానికి బహూకరించారు. [13]
ఈ ఆలయంలో 2016,[[ఫిబ్రవరి]]-18వ తేదీ [[గురువారం]]నాడు, స్వామివారికి ఎదురుగా పంచలోహ నందీశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గుడివాడ పట్టణానికి చెందిన శ్రీ రెడ్డి లోకేశ్వరరావు, భాగ్యవతి దంపతులు, ఈ విగ్రహాన్ని ఆలయానికి బహూకరించారు. [13]

14:44, 12 మార్చి 2017 నాటి కూర్పు

గుడివాడ
—  మండలం  —
కృష్ణా జిల్లా పటంలో గుడివాడ మండలం స్థానం
కృష్ణా జిల్లా పటంలో గుడివాడ మండలం స్థానం
కృష్ణా జిల్లా పటంలో గుడివాడ మండలం స్థానం
గుడివాడ is located in Andhra Pradesh
గుడివాడ
గుడివాడ
ఆంధ్రప్రదేశ్ పటంలో గుడివాడ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°26′N 80°59′E / 16.43°N 80.99°E / 16.43; 80.99
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రం గుడివాడ
గ్రామాలు 29
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 1,52,285
 - పురుషులు 75,674
 - స్త్రీలు 76,611
అక్షరాస్యత (2001)
 - మొత్తం 76.04%
 - పురుషులు 80.99%
 - స్త్రీలు 71.19%
పిన్‌కోడ్ 521301



గుడివాడ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము మరియు పట్టణము.[1] పిన్ కోడ్ నం. 521 301., ఎస్.టి.డి.కోడ్ = 08674.

గుడివాడ పట్టణ చరిత్ర

ఒకప్పుడు కళింగ రాజు పరిపాలనలో 'గుడివాడ' ఆంధ్రనగరం పేరుతో ప్రసిద్ధి చెందింది. రాజ్య విస్తరణలో భాగంగా అశోకుడు, కళింగ రాజు పై దండెత్తి ఓడించాడు. అప్పటి వరకు కళింగ రాజు పాలనలో వున్నా ఆంధ్ర ప్రజలు, యుద్ధంలో గెలిచిన అశోక చక్రవర్తిని రాజుగా అంగీకరించారు.[2] క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్బై మూడు నాటికి అశోకుడు పరిపాలించే కాలంలో ఆంధ్ర నగరాలు మూడు పదులు వున్నై. కృష్ణాతీరంలో అశోకుని కాలానికి ఎన్నో బౌద్ధ కేంద్రాలు ప్రసిద్ధి చెందాయి. ఆ కాలంలో కృష్ణా నదికి ఇరువైపులా వున్నా పరచిన గ్రామాలన్నీ బౌద్ధ క్షేత్రాలే.

అమరావతి, భట్టిప్రోలు, నాగార్జునకొండ, జగ్గయ్య పేట, బోడపాడు, చందోలుతో 'గుడివాడ ' కూడా బౌద్ధ కేంద్రాలుగా గుర్తింపబడ్డాయి. కృష్ణా నది తీరంలో బౌద్ధ స్థూపాలను నిర్మించటానికి, బౌద్ధ మతం ప్రచారం పొందటానికి అశోకుడే కారణం. బుద్ధుని అస్తికలను నిక్షిప్తం చేసి,మహా చైత్యాలుగా మార్చాడు. చైత్యం అంటే 'చితి' కి సంబంధించిన ఎముకలని నిక్షిప్తం చేసిన స్తూపం. 1984 లో 'రీ' అనే పరిశోధకుడు, దాక్షిణాత్య బౌద్ధ శిల్పాలు - భట్టిప్రోలు, ఘంటసాల, గుడివాడ పురాతన స్తూపాలు' అన్న నివేదిక సమర్పించాడని,ఆ నివేదికను పుణీలో నార్ల వారు చదివానని చెప్పగా తెలిసింది. అందులో గుడివాడ 'దీపాల దిబ్బ' లో దొరికిన విదేశీ నాణాలు, బౌద్ధ క్షేత్ర ప్రాచీనతని తెలియ చేస్తోంది.

గుడివాడ పేరు వెనుక చరిత్ర

కలువ పూలతో నిండి ఉన్న ఒక కొలను

గుడివాడని పూర్వం గుళ్ళవాడ అనేవారు. అది కాలక్రమేన గుడివాడగా మారింది. ఈ పట్టణములో చాలా గుడులు ఉన్నాయి.

గుడివాడ పట్టణ భౌగోళికం

[3] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తుTime zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు

గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన, ఏలూరు

సమీప మండలాలు

నందివాడ, పెదపారుపూడి, గుడ్లవల్లేరు, పామర్రు

రవాణా సౌకర్యాలు

  • గుడివాడ పట్టణము నుండి దగ్గర, దూర అన్నిప్రాంతముల వైపులకు బస్సు, రైలు తదితర రవాణా సౌకర్యములు ఉన్నాయి.
  • గుడివాడ ప్రాంతము నుండి భీమవరం, రాజొలు, నర్సాపురం, విశాఖపట్నం, బెజవాడ, తిరుపతి, బెంగులురు, హైదరాబాదు మరియు మచిలీపట్నం రైల్వే మరియు బస్ వసతులు ఉన్నాయి.
  • ఈ పట్టణము నుండి దాదాపుగా 30-35 కి.మీ. దగ్గరలో గన్నవరం విమానాశ్రయము ఉంది.

రైలు వసతి

గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ లో నిలిచి మరియు బయలు దేరుటకు సిద్దముగా ఉన్న సికింద్రాబాద్ - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్
  • గుడివాడ రైల్వే జంక్షన్.
  • గుడివాడ - విజయవాడ - భీమవరం - నరసాపురం - మచిలీపట్నం రైల్వే ట్రాక్ డబుల్ మరియు విధుయుతీకరణ లేక పోవటం ప్రధాన సమస్య.
  • గుడివాడ ప్రాంతం నుండి తిరుపతి,విశాఖపట్నం,ముంబై,షిరిడి,పురి,భిలాసాపూర్,భువనేశ్వర్,విజయవాడ మరియు హైదరాబాదు రైళ్లు ఉన్నాయి.
  • గుడివాడ - విజయవాడ - భీమవరం - నరసాపురం - మచిలీపట్నం రైల్వే ట్రాక్ డబుల్ ట్రాక్ పనులు మొదలపెట్టేరు

సాధారణ బండ్లు

గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషనులో నిలిచి ఉన్న ఒక ప్యాసింజర్ రైలు.
  • విజయవాడ - గుడివాడ ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77213
  • విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77215
  • విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77206
  • గుంటూరు - నరసాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57381
  • విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77212
  • గుడివాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77219
  • విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77207
  • విజయవాడ - గుడివాడ ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77201
  • విశాఖపట్నం - మచిలీపట్నం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 57230
  • రైళ్లు వివరములు :
  • 17049 - మచిలీపట్నం నుండి సికందరాబాద్.
  • 17255 - నరసాపురం నుండి హైదరాబాదు.
  • 17213 | 17231 - నరసాపురం నుండి నాగర్సొల్.
  • 17210 - కాకినాడ నుండి బెంగళూరు.
  • 17644 - కాకినాడ నుండి చెన్నపట్నం.
  • 18519 - విశాఖపట్నం నుండి ముంబాయి.
  • 17015 - విశాఖపట్నం నుండి హైదరాబాదు.
  • 17404 - నరసాపురం నుండి తిరుపతి.
  • 17479 - పూరి నుండి తిరుపతి.
  • 17481 - భిళాస్పుర్ నుండి తిరుపతి.

గుడివాడ, వెంట్రప్రగడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. ఇదిరిఅల్వెజంక్షన్ విజయవాడ రైల్వేస్టేషన్: 44 కి.మీ

గుడివాడ పట్టణంలోని విద్యా సౌకర్యాలు

  • ఏ ఎన్ ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అక్కినేని నాగేశ్వరరావు గారిచే స్థాపితము),
  • వి.కె.ఆర్ మరియు వి.ఎన్.బి పాలిటెక్నిక్ కళాశాల. మరియు ఇంజనీరింగ్ కళాశాల కూడా ఉంది.
  • డాక్టర్ గురురాజు ప్రభుత్వ హొమియోపతీ వైద్య కళాశాల (1945లో స్థాపితము దక్షిణ భారతదేశంలో ప్రథమ హొమియోపతీ వైద్య కళాశాల).
  • గుడివాడ పట్టణంలో ఇంకా అనేక కాలేజీలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా విద్యాలయ, శ్రీ విద్య, కేవి కామర్సు, బాబు సిద్ధార్ధ మొదగునవి

గుడివాడ పట్టణంలోని మౌలిక సదుపాయాలు

వైద్య సౌకర్యం

ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం

ఈ కేంద్రాన్ని 14.46 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధిచేయనున్నారు. [9]

గిరిరాజా ప్రభుత్వ హోమియో వైద్యశాల

బ్యాంకులు

  1. అలహాబాదు బ్యాంక్, బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న కిన్నెర్ కాంప్లెక్స్, గుడివాడ.
  2. ఐసీఐసీఐ బ్యాంకు
  3. యాక్సిస్‌ బ్యాంకు
  4. కరూర్‌ వైశ్యా బ్యాంక్‌
  5. సిటీ యూనియన్‌ బ్యాంకు
  6. ఐ.డి.బి.ఐ.బ్యాంక్.

గుడివాడ పట్టణ పరిపాలన

గుడివాడ పురపాలక సంఘ కార్యాలయము

గుడివాడ పట్టణములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ విఘ్నేశ్వరస్వామివారి ఆలయం

శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం

  1. ఇక్కడ ఉన్న శ్రీ వెంకటేశ్వర వారి ఈ దేవాలయము ప్రసిద్ధి కల దేవాలయము. ఇక్కడ స్వామి వారి కల్యాణము ఒక పేద్ద మహొత్సవంలా జరుగుతాయి. ఈ ఆలయంలో, 2014,నవంబరు-3, సోమవారం నుండి, 6వ తేదీ గురువారం వరకు, స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, 6వ తేదీ గురువారం నాడు, స్వామివారికి స్నపనం, విశేష అలంకరణ, వేదవిన్నపం, చతుస్థానార్చన, సర్వ ప్రాయశ్చిత్త హోమాలు నిర్వహించారు. ద్వారతోరణబలి, మహా పూర్ణాహుతి, పవిత్ర అవరోహణం, అనంతరం 108 కలశాలతో క్షీరాభిషేకం నిర్వహించారు. మన గుడి కార్యక్రమం క్రింద తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం అన్నదానసత్రంలో కార్తీక వనసమారాధన నిర్వహించారు. [3]
  2. ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం, జ్యేష్ఠమాసంలో, శుద్ధ దశమి నుండి పౌర్ణమి వరకు వైభవంగా నిర్వహించెదరు. [5]

శ్రీ నాగమ్మ తల్లి దేవాలయము

సింగరెపాలెం నాగమ్మ తల్లి దేవాలయము బాగా ప్రసిద్ధి చెందిన దేవాలయము. ఇక్కడకి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న నాగమ్మ తల్లి బాగా మహిమ కల దేవతగా ఇక్కడ ఉన్న ప్రజలు కొలుస్తారు.

శ్రీ ఉమానాగలింగేశ్వరస్వామివారి ఆలయం

ఈ ఆలయంలో 2014,నవంబరు-6వ తేదీ రాత్రి, కార్తీకపౌర్ణమి సందర్భంగా, నాలుగున్నర కోట్ల దీపాలతో దీపోత్సవాన్ని నిర్వహించారు. పురవీధులలో ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. భక్తులు వేలాదిగా వెంటరాగా, ఆలయం ఎదుట జ్వాలాతోరణాన్ని వెలిగించారు. జ్వాలాతోరణం విభూతిని వ్యాపారం నిర్వహించే దుకాణాలలోగానీ, ఇళ్ళలోగానీ ఉంచితే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతవని ఆలయ పురోహితులు తెలిపినారు. [4]

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామివారి ఆలయం

ఈ ఆలయ అష్టమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 2017,మార్చ్-13వతేదీ సోమవారంనాడు, ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయాన్ని సుందరంగా అలంకరించినారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు , శాంతికళ్యాణం అనంతరం అన్నసమారాధన నిర్వహించెదరు. 14వతేదీ మంగళవారంనాడు నగరోత్సవం నిర్వహించెదరు. []

శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం

ఈ ఆలయంలో 2016,ఫిబ్రవరి-18వ తేదీ గురువారంనాడు, స్వామివారికి ఎదురుగా పంచలోహ నందీశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గుడివాడ పట్టణానికి చెందిన శ్రీ రెడ్డి లోకేశ్వరరావు, భాగ్యవతి దంపతులు, ఈ విగ్రహాన్ని ఆలయానికి బహూకరించారు. [13]

శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం

ఈ ఆలయములో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి సందర్భంగా మూడురోజులపాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించెదరు. రెండవరోజున స్వామివారు చతుర్భుజ ఆంజనేయస్వామిగా దర్శనమిచ్చెదరు. మూడవరోజున హనుమజ్జయంతినాడు, స్వామివారు పంచముఖాంజనేయస్వామిగా దర్శనమిచ్చెదరు. ఈ మూడురోజులూ ఆలయంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించెదరు. [5]

శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం

ఈ ఆలయ 16వ వార్షికోత్సవాలు, 2015,మే నెల-9,10 తేదీలలో వైభవంగా నిర్వహించారు. రెండవరోజైన ఆదివారంనాడు, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. [5]

శ్రీ గౌరీశంకరస్వామివారి దేవస్థానం

ఈ ఆలయం గుడివాడ పట్టణంలోని నాలుగవ వార్డులో ఉంది.

శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయం

ఈ ఆలయం స్థానిక నీలామహల్ రహదారిలో ఉంది.

మూడు ఉపాలయాల సముదాయం

శ్రీ గౌరీశంకరస్వామివారి దేవస్థానానికి చెందిన స్థలంలో, కేవలం దాతల ఆర్థిక సహకారంతో, ఒక కోటిన్నర రూపాయల అంచనా వ్యయంతో, ఒకే ప్రాంగణంలో, నూతనంగా ఈ ఆలయాలు రూపుదిద్దుకున్నవి. ఈ ఆలయాలలో విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,జూన్-4వ తేదీ గురువారంనాడు ప్రారంభించారు. 5వ తేదీ శుక్రవారంనాడు, భక్తులు సమస్త దేవతార్చన పూజలను వైభవంగా నిర్వహించారు. 7వ తెదీ ఆదివారంనాడు, మేళతాళాలు, వేదపండితుల మంరోచ్ఛారణల మధ్య, విగ్రహ, శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న శివాలయంలో స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేదపండితులు ఉదయం నుండి, ప్రత్యేకపూజలు నిర్వహించి, ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చి, స్వామివారిని దర్శించుకొని, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పెద్ద యెత్తున అన్నసమారాధన నిర్వహించారు. [7]&[8]

శ్రీ బాలకనకదుర్గాదేవి ఆలయం

శ్రీరాంపురంలోని ఈ ఆలయంలో శ్రీ మహాగణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, శ్రీ బాలకనకదుర్గాదేవి వారల విగ్రహప్రతిష్ఠా మహోత్సవం, 2016,ఫిబ్రవరి-25వ తేదీ గురువారంనాడు ప్రారంభమైనవి. 26వ తేదీ శుక్రవారం ఉదయం 108 కలశాలతో అమ్మవారికి అభిషేకాలు, అమ్మవారి ప్రతిష్ఠా మహోత్సవం, పూర్ణాహుతి, శాంతికళ్యాణం మొదలగు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసారు. [14]

శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ అనంత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం

శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం

శ్రీ బాలబావి గణపతి స్వామివారి ఆలయం

ఈ ఆలయం స్థానిక 9వ వార్డులోని కఠారి రంగనాయకమ్మ వీధిలో ఉంది.

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం

స్థానిక పామర్రు రహదారిలోని ఈ ఆలయ 19వ వార్షికోత్సవంగా 2015,డిసెంబరు-24వ తేదీ గురువారంనాడు, ఆలయంలోని బాబాకు 108 కలశాలతో క్షీరాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణం, సాయి నక్షత్రమాలిక పఠనం నిర్వహించారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. [11]

భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమం

ఈ ఆశ్రమం కార్మికనగర్ లో, రామాలయం వెనుకనున్నది. ఈ ఆశ్రమంలో స్వామివారి 33వ ఆరాధనోత్సవాలు, 2015,ఆగష్టు-23,24తేదీలలో వైభవంగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. [9]

ఈ అశ్రమ మందిర నిర్మాణంలో భాగంగా, దాతల ఆర్థిక సహకారంతో నిర్మించనున్న గోపుర నిర్మాణానికి, 2015,నవంబరు-21వ తేదీ శనివారంనాడు, శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 2016,ఫిబ్రవరిలో నిర్మాణాన్ని పూర్తిచేయనున్నారు. శ్రీ జల్లా సుబ్బారావు, ఈ గోపుర నిర్మాణ శిల్పి. [10]

శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం

స్వామివారి 45వ ఆరాధనామహోత్సవాన్ని పురస్కరించుకొని, ఈ ఆలయంలో 2016,మే-7వ తేదీ శనివారంనాడు, ఆలయంలో ఉత్సవాలను ప్రారంభించారు. [15]

ప్రణవాశ్రమం

[1]

శాసనసభ నియోజకవర్గం

పూర్తి వ్యాసం గుడివాడ శాసనసభ నియోజకవర్గంలో చూడండి.

ప్రముఖులు

  1. కె.ప్రత్యగాత్మగా ప్రసిద్ధిచెందిన కొల్లి ప్రత్యగాత్మ (అక్టోబర్ 31, 1925 - జూన్ 6, 2001) (ఆంగ్లం: Kotayya Pratyagatma) తెలుగు సినిమా దర్శకుడు. ఈయన 1925 అక్టోబర్ 31 న గుడివాడలో జన్మించారు.
  2. అట్లూరి సత్యనాథం:- ఇర్విన్ లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో యూసీఐ డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ గాను, ఏరోస్పేస్ మరియు మెకానికల్ రంగాలలో పరిశోధనలు చేస్తున్నారు. భారతదేశంలో మూలాలు కలిగిన ఆయన ప్రస్తుతం సంయుక్త అమెరికా రాష్ట్రాల పౌరుడు. ఈయన యూనివర్సిటీలో చదివించే, పరిశోధనలు చేసే రంగాలు : కాంప్యుటేషనల్ మాథ్మేటిక్స్, థీరిటికల్, అప్లైడ్ అండ్ కాంప్యుటేషనల్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఫ్లుయిడ్స్ అట్ వేరియస్ లెన్త్ అండ్ టైం స్కేల్స్; కంప్యూటర్ మోడలింగ్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్;మెష్లెస్ అండ్ అదర్ నోవల్ కంప్యుటేషనల్ మెథడ్స్; స్ట్రక్చరల్ లాంగెవిటీ, ఫైల్యూర్ ప్రివెన్షన్, అండ్ హెల్త్ మేనేజ్మెంట్. బహుముఖ ప్రజ్ఞాశాలి.
  3. ఎం.కుటుంబరావు: హోమియోపతి వైద్య శాస్త్ర నిపుణులు. గిరిరాజా ప్రభుత్వ హోమియో వైద్యశాలకు ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు.

గుడివాడ పట్టణ విశేషాలు

గుడివాడ పట్టణంలోని గౌతం కాన్సెప్ట్ పాఠశాల సమీపంలో, సర్వే నం.175,176 లలో శ్రీ కాళహస్తి దేవస్థానానికి చెందిన 12 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూములను, 2012 నుండి రెవెన్యూశాఖ పర్యవేక్షించుచున్నది. [12]

గ్రామాలు

జనాభా

  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[4]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషులు స్త్రీలు
1. బేతవోలు 303 1,252 633 619
2. బిల్లపాడు 773 2,985 1,497 1,488
3. బొమ్ములూరు 549 2,117 1,102 1,015
4. చిలకమూడి 94 342 172 170
5. చినయెరుకపాడు 325 1,260 646 614
6. చిరిచింతాల 254 1,016 502 514
7. చౌటపల్లి 584 2,181 1,059 1,122
8. దొండపాడు (గుడివాడ మండలం) 851 3,020 1,528 1,492
9. గంగాధరపురం 258 1,028 528 500
10. గుడివాడ (గ్రామీణ) 1,121 4,542 2,249 2,293
11. గుంటకోడూరు 269 1,028 523 505
12. కల్వపూడిఅగ్రహారం 255 968 499 469
13. కాశీపూడి 114 378 202 176
14. లింగవరం 664 2,438 1,231 1,207
15. మందపాడు (గ్రామీణ) 19 74 35 39
16. మెరకగూడెం 46 226 112 114
17. మోటూరు 1,078 4,030 2,033 1,997
18. పెదఎరుకపాడు (గ్రామీణ) 56 199 104 95
19. రామచంద్రాపురం 53 202 91 111
20. రామనపూడి 396 1,530 784 746
21. సైదేపూడి 93 344 179 165
22. సీపూడి 253 954 490 464
23. సేరిదింటకూరు 260 900 463 437
24. శేరిగొల్వేపల్లి 334 1,100 543 557
25. సేరి వేల్పూర్ 337 1,242 658 584
26. సిద్ధాంతపురం 106 344 173 171
27. తటివర్రు 315 1,256 635 621
28. వలివర్తిపాడు (గ్రామీణ) 585 2,275 1,136 1,139

చిత్రమాలిక

మూలాలు

  1. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 28 August 2016.
  2. బ్లాగ్ స్పాట్ లో గుడివాడ చరిత్ర
  3. "http://www.onefivenine.com/india/villages/Krishna/Gudivada/Gudivada". Retrieved 1 July 2016. {{cite web}}: External link in |title= (help)
  4. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు

వనరులు

[3] ఈనాడు కృష్ణా; 2014,నవంబరు-7; 15వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2014,నవంబరు-8; 16వపేజీ [5] ఈనాడు అమరావతి; 2015,మే-11; 29వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015,మే-24; 35వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015,జూన్-4; 29వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015,జూన్-8; 29వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015,ఆగష్టు-235; 25వపేజీ. [10] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-22; 29వపేజీ. [11] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-25; 25వపేజీ. [12] ఈనాడు అమరావతి; 2016,జనవరి-24; 32వపేజీ. [13] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016,ఫిబ్రవరి-19; 1వపేజీ. [14] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016,ఫిబ్రవరి-27; 1వపేజీ. [15] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016,మే-8; 2వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=గుడివాడ&oldid=2079861" నుండి వెలికితీశారు