కురుమద్దాలి: కూర్పుల మధ్య తేడాలు
Nrahamthulla (చర్చ | రచనలు) |
Nrahamthulla (చర్చ | రచనలు) |
||
పంక్తి 158: | పంక్తి 158: | ||
*[[ముత్తేవి మాధవాచార్య]] |
*[[ముత్తేవి మాధవాచార్య]] |
||
*[[కొసరాజు వీరయ్య చౌదరి]] |
|||
కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (Central Board of Direct Taxes) ఛైర్మనుగా, కేంద్ర ప్రభుత్వం నియమించిన, ఐ.ఆర్,ఎస్. సీనియర్ అధికారి శ్రీ కొసరాజు వీరయ్య చౌదరి, కురుమద్దాలి గ్రామస్థులే. వీరు ఈ గ్రామానికి చెందిన శ్రీ కొసరాజు వెంకటపూర్ణచంద్రరావు, శేషమ్మ దంతతుల రెండవ కుమారుడు. గతంలో వీరు పన్ను ఎగవేత, నల్లధనం, 2జి. స్పెక్ట్రం కేటాయింపులు తదితర కేసులను పర్యవేక్షించారు. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలకు ఎంపిక అయిన వీరిద్వారా, గ్రామానికి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. వీరు 2014, ఆగస్టు-1వ తేదీన, తన పదవీ బాధ్యతలు స్వీకరించారు. [3] & [5] |
కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (Central Board of Direct Taxes) ఛైర్మనుగా, కేంద్ర ప్రభుత్వం నియమించిన, ఐ.ఆర్,ఎస్. సీనియర్ అధికారి శ్రీ కొసరాజు వీరయ్య చౌదరి, కురుమద్దాలి గ్రామస్థులే. వీరు ఈ గ్రామానికి చెందిన శ్రీ కొసరాజు వెంకటపూర్ణచంద్రరావు, శేషమ్మ దంతతుల రెండవ కుమారుడు. గతంలో వీరు పన్ను ఎగవేత, నల్లధనం, 2జి. స్పెక్ట్రం కేటాయింపులు తదితర కేసులను పర్యవేక్షించారు. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలకు ఎంపిక అయిన వీరిద్వారా, గ్రామానికి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. వీరు 2014, ఆగస్టు-1వ తేదీన, తన పదవీ బాధ్యతలు స్వీకరించారు. [3] & [5]. |
||
వీరు కేంద్రప్రభుత్వ విజిలెన్స్ కమిషనరుగా నియమితులైనారు. వీరు 10,జూన్-2015న ఈ పదవీ బాధ్యతలు స్వీకరించారు. [8] |
వీరు కేంద్రప్రభుత్వ విజిలెన్స్ కమిషనరుగా నియమితులైనారు. వీరు 10,జూన్-2015న ఈ పదవీ బాధ్యతలు స్వీకరించారు. [8] |
||
===శ్రీ కొసరాజు వెంకట పూర్ణచంద్రరావు, ప్రముఖ న్యాయవాది=== |
===శ్రీ కొసరాజు వెంకట పూర్ణచంద్రరావు, ప్రముఖ న్యాయవాది=== |
||
వీరు 1922,జులై-3వ తేదీనాడు, ఈ గ్రామంలోని శ్రీ వెంకటగిరయ్య, సత్యవతి దంపతులకు, జన్మించారు. వీరు మదరాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.య్యే. పట్టాను, మదరాసు లా కళాశాలలో న్యాయశాస్త్ర పట్టాను పొందినారు. 1947లో [[మచిలీపట్నం]]లో న్యయవాదిగా ప్రాక్టీసు చేసారు. దీర్ఘకాలంపాటు ఎండోమెంట్సు స్టాండింగ్ కౌన్సిలుగా వ్యవహరించారు. చల్లపల్లి ఎస్టేటుకు రిసీవరుగా పనిచేసారు. ల్యాండ్ ఎక్విజిషను కేసులు చేయటంలో వీరికి మంచి గుర్తింపు ఉంది. వీరికి భార్య శేషమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీ సురేంద్రనాథ్, అమెరికాలో ఇంజనీరుగా స్థిరపడినారు. రెండవ కుమారుడు శ్రీ కె.వి.చౌదరి, సి.బి.డి.టి.కి ఛైర్మనుగా పనిచేసారు. ప్రస్తుతం నల్లధనం వెలికితీత ప్రత్యేక బృందం సభ్యులుగా ఉన్నారు. శ్రీ కె.వి.చౌదరి కుమారుడు వెంకటగిరీష్, తాతాగారైన వెంకటపూర్ణచంద్రరావుగారిని ఆదర్శంగా తీసుకొని, సుప్రీం కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. పూర్ణచంద్రరావుగారు భారతీయ సంప్రదాయాలంటే అమిత అభిమానం చూపేవారు. ప్రతి రోజూ భగవద్గీత, రామాయణం, మహాభారతం చదివేవారు. వీరికి వ్యవసాయమంటే మక్కువ ఎక్కువ. ప్రతిరోజూ మచిలీపట్టణం నుండి స్వగ్రామమైన కురుమద్దాలి వెళ్ళి వ్యవసాయ పనులను పర్యవేక్షణ చేసేవారు.వ్యవసాయం అంటే 365 రోజులూ చెయాలని అనేవారు. వీరి భార్య శ్రీమతి శేషమ్మ, దివంగత మాజీ కృష్ణా జిల్లా పరిషత్తు ఛైర్మనుగా పనిచేసిన శ్రీ పిన్నమనెని కోటేశ్వరరావుగారి స్వంత సహోదరి. వీరు, 2015,మార్చి-23వ తేదీనాడు, 92 సంవత్సరాల వయసులో, [[ఢిల్లీ]]లో అనారోగ్యంతో కాలంచెసినారు. [7] |
వీరు 1922,జులై-3వ తేదీనాడు, ఈ గ్రామంలోని శ్రీ వెంకటగిరయ్య, సత్యవతి దంపతులకు, జన్మించారు. వీరు మదరాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.య్యే. పట్టాను, మదరాసు లా కళాశాలలో న్యాయశాస్త్ర పట్టాను పొందినారు. 1947లో [[మచిలీపట్నం]]లో న్యయవాదిగా ప్రాక్టీసు చేసారు. దీర్ఘకాలంపాటు ఎండోమెంట్సు స్టాండింగ్ కౌన్సిలుగా వ్యవహరించారు. చల్లపల్లి ఎస్టేటుకు రిసీవరుగా పనిచేసారు. ల్యాండ్ ఎక్విజిషను కేసులు చేయటంలో వీరికి మంచి గుర్తింపు ఉంది. వీరికి భార్య శేషమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీ సురేంద్రనాథ్, అమెరికాలో ఇంజనీరుగా స్థిరపడినారు. రెండవ కుమారుడు శ్రీ కె.వి.చౌదరి, సి.బి.డి.టి.కి ఛైర్మనుగా పనిచేసారు. ప్రస్తుతం నల్లధనం వెలికితీత ప్రత్యేక బృందం సభ్యులుగా ఉన్నారు. శ్రీ కె.వి.చౌదరి కుమారుడు వెంకటగిరీష్, తాతాగారైన వెంకటపూర్ణచంద్రరావుగారిని ఆదర్శంగా తీసుకొని, సుప్రీం కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. పూర్ణచంద్రరావుగారు భారతీయ సంప్రదాయాలంటే అమిత అభిమానం చూపేవారు. ప్రతి రోజూ భగవద్గీత, రామాయణం, మహాభారతం చదివేవారు. వీరికి వ్యవసాయమంటే మక్కువ ఎక్కువ. ప్రతిరోజూ మచిలీపట్టణం నుండి స్వగ్రామమైన కురుమద్దాలి వెళ్ళి వ్యవసాయ పనులను పర్యవేక్షణ చేసేవారు.వ్యవసాయం అంటే 365 రోజులూ చెయాలని అనేవారు. వీరి భార్య శ్రీమతి శేషమ్మ, దివంగత మాజీ కృష్ణా జిల్లా పరిషత్తు ఛైర్మనుగా పనిచేసిన శ్రీ పిన్నమనెని కోటేశ్వరరావుగారి స్వంత సహోదరి. వీరు, 2015,మార్చి-23వ తేదీనాడు, 92 సంవత్సరాల వయసులో, [[ఢిల్లీ]]లో అనారోగ్యంతో కాలంచెసినారు. [7] |
02:58, 9 జూన్ 2017 నాటి కూర్పు
కురుమద్దాలి | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 16°20′10″N 80°55′45″E / 16.336231°N 80.929068°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | పామర్రు |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి కొసరాజు స్వప్న |
జనాభా (2011) | |
- మొత్తం | 3,197 |
- పురుషుల సంఖ్య | 1,581 |
- స్త్రీల సంఖ్య | 1,616 |
- గృహాల సంఖ్య | 920 |
పిన్ కోడ్ | 521 157 |
ఎస్.టి.డి కోడ్ | 08674 |
కురుమద్దాలి, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 157. యస్.టీ.డీ.కోడ్ నం. 08674.
గ్రామ చరిత్ర
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]
కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
పామర్రు మండలం
పామర్రు మండలంలోని అడ్డాడ, ఉరుటూరు, ఐనంపూడి, కనుమూరు, కొండిపర్రు, కురుమద్దాలి, కొమరవోలు, జమిగొల్వేపల్లి, జామిదగ్గుమల్లి, జుజ్జవరం, పసుమర్రు, పామర్రు, పెదమద్దాలి, బల్లిపర్రు, రాపర్ల మరియు రిమ్మనపూడి గ్రామాలు ఉన్నాయి.
గ్రామం పేరు వెనుక చరిత్ర
'కురు' అంటే చిన్న అని అర్థం. పుల్లేరు దాటితే పెదమద్దాలి ఉంటుంది అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.
గ్రామ భౌగోళికం
[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు
ఇది ఉయ్యూరు-పామర్రు ల మధ్యలో పామర్రుకు 3 కిలోమీటర్ల దూరాన ఉంది.
సమీప గ్రామాలు
గుడివాడ, పెడన, మచిలీపత్నం, విజయవాడ
సమీప మండలాలు
పమిడిముక్కల, పెదపారుపూడి, పామర్రు, తోట్లవల్లూరు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
- ఎస్.వి.ఎస్. ఆంగ్లమాధ్యమ పాఠశాల.
- మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల:- ఈ పాఠశాల వార్షికోత్సవం, 2016,ఫిబ్రవరి-19న మండల విద్యాశాఖాధికారి శ్రీ ఎం.రామమోహనరావు అధ్యక్షతన నిర్వహించెదరు. [12]
గ్రామానికి రవాణా సౌకర్యాలు
పామర్రు, వుయ్యూరు నుండి రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. విజయవాడ రైల్వేస్టేషన్ 40 కి.మీ దూరంలో ఉంది.
గ్రామములో మౌలిక వసతులు
త్రాగునీటి సౌకర్యం
ఈ గ్రామములో, ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకం అందుబాటులోనికి వచ్చింది. ఈ పథకం ద్వారా, గ్రామీణ ప్రాంతాలవారికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన, 20 లీటర్ల మంచినీటిని, రెండు రూపాయలకే అందించెదరు. [6]
ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం
ఈ కేంద్రానిక్ నూతన భవన నిర్మాణానికి కీ.శే.కొసరాజు శ్రీరాములు ఙాపకార్ధం, వారి భార్య శ్రీమతి కుసుమకుమారి, కుమారులు శ్రీ మల్లిఖార్జునరావు, శ్రీ విజయబసవారావు, కుమార్తెలు శ్రీమతి ఉమాదేవి, శ్రీమతి రమాదేవి, ఆరు లక్షల రూపాయలను వితరణగా అందజేసినారు. ఈ భవనాన్ని 2015,డిసెంబరు-27వ తేదీనాడు ప్రారంభించారు. [9]&[11]
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
గ్రామ పంచాయతీ
- మండలంలోని మేజరు పంచాయతీలలో ఇది ఒకటి.
- మొదటి సర్పంచ్ కొసరాజు శ్రీరంగనాయకులు (1938-52)
- శ్రీమతి ప్రత్తిపాటి రమాదేవి (2006-13).
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కొసరాజు స్వప్న, సర్పంచిగా ఎన్నికైనారు. తరువాత వీరు పామర్రు మండల సర్పంచుల సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికైనారు. [2]&[4]
- పంచాయతీ నిధులతో పాటు, గ్రామ ప్రముఖుల వితరణతో గ్రామంలో ఇంతవరకు ఒకటిన్నర కోట్ల రూపాయల వైలువైన పలు అభివృద్ధి పనులు చేపట్టినారు. [10]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
- శ్రీ శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ చెన్నమల్లీశ్వరస్వామి ఆలయం (శివాలయం).
- శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం (విష్ణు ఆలయం) రెండున్నర్ర శతాబ్దాల క్రితం నిర్మించారు.
- శ్రీ షిర్డీ సాయి బాబా ఆలయం 1937లో కట్టినారు. షిర్డీలో సాయిబాబా దేవాలయం తరువాత దేశంలో కట్టిన రెండవ దేవాలయం ఇది.[ఆధారం చూపాలి]
- శ్రీ ఆంజనేయస్వామి ఆలయం 2003 ఏప్రిల్లో కట్టినారు.
- శ్రీరామ అవధూత పిచ్చెమ్మ ఆశ్రమం:- గ్రామంలోని ఈ ఆశ్రమం ఎంతో ప్రసిద్థి చెందింది. రచయిత గుడిపాటి వెంకటాచలం పిచ్చెమ్మ ఆశ్రమంలో ఉండి ఇక్కడ నుండే నేరుగా రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు.
గ్రామంలో ప్రధాన పంటలు
- కురుమద్దాలి గ్రామం వ్యవసాయానికి ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం పరిశ్రమలు కూడా బాగా స్థాపిస్తున్నారు. ఈ ఊరిలో చదువుకున్నవారు చాలా ఎక్కువ. అనేక మంది పెద్ద పెద్ద పదవులలో ఉన్నారు.
- కురుమద్దాలి గ్రామానికి చెందిన శ్రీమతి నూతక్కి జయప్రద, మాజీ ఎం.పిటి.సి., మరియూ ఒక మహిళా రైతు. వీరు 2013-14 సంవత్సరంలో, తన 3.3 ఎకరాల పొలంలో, ఎకరానికి 72 టన్నుల చెరకు పండించారు. ఉయ్యూరులోని కె.సి.పి.పంచదార కర్మాగారం పరిధిలో ఇది అత్యధిక పంట. ఈ సందర్భంగా వీరికి 2014,జూన్-12, గురువారం నాడు, ఉయ్యూరు కె.సి.పి. కర్మాగారంవారు ఒక బంగారు పతకం అందజేసినారు. [1]
గ్రామంలో ప్రధాన వృత్తులు
గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)
స్వాతంత్రోద్యమ ప్రముఖులు
- గుళ్ళపల్లి రామబ్రహ్మం
- గుళ్ళపల్లి శ్రీరాములు
- గుళ్ళపల్లి తాతయ్య (బాపయ్య)
- వీరమాచనేని మల్లిఖార్జునరావు
- ముత్తేవి కేశవాచార్యులు
- పుట్టగుంట సుబ్బారావు
- ముత్తేవి మాధవాచార్య
కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (Central Board of Direct Taxes) ఛైర్మనుగా, కేంద్ర ప్రభుత్వం నియమించిన, ఐ.ఆర్,ఎస్. సీనియర్ అధికారి శ్రీ కొసరాజు వీరయ్య చౌదరి, కురుమద్దాలి గ్రామస్థులే. వీరు ఈ గ్రామానికి చెందిన శ్రీ కొసరాజు వెంకటపూర్ణచంద్రరావు, శేషమ్మ దంతతుల రెండవ కుమారుడు. గతంలో వీరు పన్ను ఎగవేత, నల్లధనం, 2జి. స్పెక్ట్రం కేటాయింపులు తదితర కేసులను పర్యవేక్షించారు. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలకు ఎంపిక అయిన వీరిద్వారా, గ్రామానికి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. వీరు 2014, ఆగస్టు-1వ తేదీన, తన పదవీ బాధ్యతలు స్వీకరించారు. [3] & [5]. వీరు కేంద్రప్రభుత్వ విజిలెన్స్ కమిషనరుగా నియమితులైనారు. వీరు 10,జూన్-2015న ఈ పదవీ బాధ్యతలు స్వీకరించారు. [8]
శ్రీ కొసరాజు వెంకట పూర్ణచంద్రరావు, ప్రముఖ న్యాయవాది
వీరు 1922,జులై-3వ తేదీనాడు, ఈ గ్రామంలోని శ్రీ వెంకటగిరయ్య, సత్యవతి దంపతులకు, జన్మించారు. వీరు మదరాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.య్యే. పట్టాను, మదరాసు లా కళాశాలలో న్యాయశాస్త్ర పట్టాను పొందినారు. 1947లో మచిలీపట్నంలో న్యయవాదిగా ప్రాక్టీసు చేసారు. దీర్ఘకాలంపాటు ఎండోమెంట్సు స్టాండింగ్ కౌన్సిలుగా వ్యవహరించారు. చల్లపల్లి ఎస్టేటుకు రిసీవరుగా పనిచేసారు. ల్యాండ్ ఎక్విజిషను కేసులు చేయటంలో వీరికి మంచి గుర్తింపు ఉంది. వీరికి భార్య శేషమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీ సురేంద్రనాథ్, అమెరికాలో ఇంజనీరుగా స్థిరపడినారు. రెండవ కుమారుడు శ్రీ కె.వి.చౌదరి, సి.బి.డి.టి.కి ఛైర్మనుగా పనిచేసారు. ప్రస్తుతం నల్లధనం వెలికితీత ప్రత్యేక బృందం సభ్యులుగా ఉన్నారు. శ్రీ కె.వి.చౌదరి కుమారుడు వెంకటగిరీష్, తాతాగారైన వెంకటపూర్ణచంద్రరావుగారిని ఆదర్శంగా తీసుకొని, సుప్రీం కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. పూర్ణచంద్రరావుగారు భారతీయ సంప్రదాయాలంటే అమిత అభిమానం చూపేవారు. ప్రతి రోజూ భగవద్గీత, రామాయణం, మహాభారతం చదివేవారు. వీరికి వ్యవసాయమంటే మక్కువ ఎక్కువ. ప్రతిరోజూ మచిలీపట్టణం నుండి స్వగ్రామమైన కురుమద్దాలి వెళ్ళి వ్యవసాయ పనులను పర్యవేక్షణ చేసేవారు.వ్యవసాయం అంటే 365 రోజులూ చెయాలని అనేవారు. వీరి భార్య శ్రీమతి శేషమ్మ, దివంగత మాజీ కృష్ణా జిల్లా పరిషత్తు ఛైర్మనుగా పనిచేసిన శ్రీ పిన్నమనెని కోటేశ్వరరావుగారి స్వంత సహోదరి. వీరు, 2015,మార్చి-23వ తేదీనాడు, 92 సంవత్సరాల వయసులో, ఢిల్లీలో అనారోగ్యంతో కాలంచెసినారు. [7]
గ్రామ విశేషాలు
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 3,197 - పురుషుల సంఖ్య 1,581 - స్త్రీల సంఖ్య 1,616 - గృహాల సంఖ్య 920
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3694.[3] ఇందులో పురుషుల సంఖ్య 1772, స్త్రీల సంఖ్య 1922, గ్రామంలో నివాసగృహాలు 956 ఉన్నాయి.
మూలాలు
- ↑ http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Kurumaddali". Retrieved 29 June 2016.
{{cite web}}
: External link in
(help)|title=
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
వెలుపలి లింకులు
[2] ఈనాడు కృష్ణా; 2014,జూన్-13; 11వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014,జులై-29; 16వపేజీ. [4] ఈనాడు కృష్ణా, 2014,జులై-31; 7వపేజీ. [5] ఈనాడు మెయిన్, 2014,ఆగస్టు-2; 11వపేజీ. [6] ఈనాడు విజయవాడ; 2014,అక్టోబరు-3; 7వపేజీ. [7] ఈనాడు కృష్ణా; 2015,మార్చి-25; 7వపేజీ. [8] ఈనాడు మెయిన్, 2015,జూన్-11; 11వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-30; 24వపేజీ. [10] ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-4; 24వపేజీ. [11] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-28; 23వపేజీ. [12] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఫిబ్రవరి-18; 1వపేజీ.