పరవస్తు చిన్నయ సూరి: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 13: | పంక్తి 13: | ||
*[[ఆంధ్ర ధాతుమూల]] |
*[[ఆంధ్ర ధాతుమూల]] |
||
*[[నీతి సంగ్రహము]] |
*[[నీతి సంగ్రహము]] |
||
==మూలాలు== |
|||
* పరవస్తు చిన్నయసూరి - బూదరాజు రాధాకృష్ణ (ఆంగ్లములో) (1995) సాహిత్య ఆకాడెమీ |
|||
==బయటి లింకులు== |
==బయటి లింకులు== |
||
*http://www.teluguworld.org/lit.html |
*http://www.teluguworld.org/lit.html |
||
*http://members.tripod.com/~tcahou/abtelindx.htm |
|||
*http://panchatantra.org/index.html |
*http://panchatantra.org/index.html |
||
[[వర్గం:తెలుగు రచయితలు]] |
[[వర్గం:తెలుగు రచయితలు]] |
19:24, 17 జనవరి 2008 నాటి కూర్పు
పరవస్తు చిన్నయ సూరి (1809-1861) ప్రసిద్ధ తెలుగు రచయిత. గొప్ప పండితుడు. ఇతడు తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని పెరంబూరులో జన్మించాడు. మద్రాసు ప్రభుత్వ కళాశాలలో తెలుగు బోధకుడు. తను జీవితాంతం తెలుగు భాషాభ్యుదయానికి, తెలుగు సాహిత్యానికి పాటుబడ్డాడు.
చిన్నయ చాలా తరాలకు పూర్వము ఉత్తర ఆంధ్రప్రదేశ్ నుండి మద్రాసు వలసవెళ్ళిన వైష్ణవ కుటుంబములో జన్మించాడు. వీరి పూర్వీకులు పరవస్తు మఠం శిష్యులు. వీరు సాతాని కులానికి చెందినా బ్రాహ్మణ ఆచారవ్యవహారాలు పాటించేవారు. తాము అసస్థంభ సూత్రము, గార్గేయ గోత్రానికి చెందిన యజుశ్శాఖాధ్యాయులని చెప్పుకున్నారు. చిన్నయ 1809 (ప్రభవ)లో జన్మించాడు. కానీ కొందరు పండితులు ఈయన 1806లో జన్మించాడని భావిస్తున్నారు.
చిన్నయ తండ్రి వెంకటరంగ రామానుజాచార్యులు తిరువళిక్కేని (మద్రాసు శివారు)లోని రామానుజమఠంలో మతాధికారి. చిన్నయ తండ్రి సంస్కృత, ప్రాకృత, తెలుగు మరియు తమిళాలలో మంచి పండితుడు. అక్కడే ఈయన్ను ప్రతివాదభయంకరం శ్రీనివాసాచార్యులనే వైష్ణవ పండితుడు చూసి రామానుజాచార్యుల జన్మస్థానమైన శ్రీపెరంబుదూరులోని ఆలయములో వైష్ణవ తత్వాన్ని ప్రచారము చేసేందుకు ఆహ్వానించాడు. పండు ముదుసలి వయసు వరకు ద్రవిడవేదాన్ని పారాయణం చేస్తూ, మతాధి కార్యాలు నిర్వహిస్తు ఇక్కడే నివసించాడు. ఈయన 1836లో నూటపదేళ్ళ వయసులో మరణించాడు.
వెంకటరంగ రామానుజాచార్యులుకు ఒక చిన్న వయసులోనే విధవరాలైన కూతురు, ఆమె కంటే చిన్నవాడైన చిన్నయ, ఇరువురు సంతానము. చిన్నయను గారాబముగా పెంచటం వలన 16యేళ్ళ వయసు వరకు చదువుసంధ్యలను పట్టించుకోలేదు.
రచనలు
మూలాలు
- పరవస్తు చిన్నయసూరి - బూదరాజు రాధాకృష్ణ (ఆంగ్లములో) (1995) సాహిత్య ఆకాడెమీ