కశ్యపుడు: కూర్పుల మధ్య తేడాలు
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
పంక్తి 18: | పంక్తి 18: | ||
దక్షప్రజాపతి కొమార్తెలు. సంతతి. |
దక్షప్రజాపతి కొమార్తెలు. సంతతి. |
||
దితి దైత్యులు. |
దితి [[దైత్యులు]]. |
||
అదితి ఆదిత్యులు. |
అదితి [[ఆదిత్యులు]]. |
||
దనువు దానవులు. |
దనువు దానవులు. |
||
అనాయువు-లేక-అనుగ సిద్ధులు. |
అనాయువు-లేక-అనుగ సిద్ధులు. |
||
ప్రాధ గంధర్వులు. |
ప్రాధ [[గంధర్వులు]]. |
||
ముని అప్సరసలు, మౌనేయులు అనఁబడు గంధర్వులు అనియు అందురు. |
ముని అప్సరసలు, మౌనేయులు అనఁబడు గంధర్వులు అనియు అందురు. |
||
సురస యక్షులు, రాక్షసులు. |
సురస యక్షులు, [[రాక్షసులు]]. |
||
ఇల వృక్షలతాతృణజాతులు. |
ఇల వృక్షలతాతృణజాతులు. |
||
క్రోధవశ పిశితాశనములైన సింహవ్యాఘ్రాది సర్వమృగములు. |
క్రోధవశ పిశితాశనములైన సింహవ్యాఘ్రాది సర్వమృగములు. |
||
పంక్తి 33: | పంక్తి 33: | ||
వైశ్వానరుని కొమార్తెలు ఇరువురిలోను కాలయందు కాలకేయులును, పులోమయందు పౌలోములును పుట్టిరి. వీరు కాక కశ్యపుని [[కొడుకులు]] ఇంకను కొందఱు కలరు. వారు పర్వతుఁడు అను దేవ [[ఋషి]], విభండకుఁడు అను బ్రహ్మ ఋషి. (http://www.andhrabharati.com/dictionary/# ) |
వైశ్వానరుని కొమార్తెలు ఇరువురిలోను కాలయందు కాలకేయులును, పులోమయందు పౌలోములును పుట్టిరి. వీరు కాక కశ్యపుని [[కొడుకులు]] ఇంకను కొందఱు కలరు. వారు పర్వతుఁడు అను దేవ [[ఋషి]], విభండకుఁడు అను బ్రహ్మ ఋషి. (http://www.andhrabharati.com/dictionary/# ) |
||
== మూలాలు == |
== మూలాలు == |
||
<references/> |
<references/> |
06:47, 30 మార్చి 2018 నాటి కూర్పు
కశ్యపుడు ప్రజాపతులలో ముఖ్యుడు.
వాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మ కొడుకు.
ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. వీరిలో దితి, అదితి, వినత, కద్రువ, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, చేల, తామ్ర, వశ, ముని మొదలైనవారు దక్షుని కుమార్తెలు.
ఇతనికి బ్రహ్మ విషానికి విరుగుడు చెప్తాడు. పరశురాముడు ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి అరిష్టనేమి అనే పేరుంది.
కశ్యపుని వంశవృక్షం
- కశ్యపునికి అదితి వలన ఆదిత్యులు జన్మించారు. వీరు సూర్య వంశానికి మూలపురుషులు. ఇదే ఇక్ష్వాకు వంశంగా పరిణమించింది, వీరి వంశీయుడైన ఇక్ష్వాకు మహారాజు పేరుమీద. వీరి వంశీయులైన రఘువు పేరు మీద రఘువంశముగా పేరుపొందినది. తరువాత దశరధుని కుమారుడు శ్రీరాముని చేరింది. [1].
- కశ్యపునికి దితి వలన హిరణ్యకశిపుడు మరియు హిరణ్యాక్షుడు జన్మించారు. హిరణ్యకశిపునికి నలుగురు కొడుకులు, అనుహ్లాద, హ్లాద, ప్రహ్లాదుడు మరియు సంహ్లాద. వీరి మూలంగా దైత్యులు అనగా రాక్షసుల వంశం విస్తరించినది.
- కశ్యపునికి వినత వలన గరుత్మంతుడు మరియు అనూరుడు జన్మించారు.[2]
- కశ్యపునికి కద్రువ వలన నాగులు (పాములు) జన్మించారు.
- భాగవత పురాణం ప్రకారం కశ్యపునికి ముని వలన అప్సరసలు జన్మించారు.
ప్రస్థానము
1. ఒక ప్రజాపతి. ఇతఁడు మరీచికి కళవలన పుట్టినవాఁడు. ఈయన దక్షప్రజాపతి కొమార్తెలలో పదుమువ్వురను, వైశ్వానరుని కొమార్తెలలో ఇరువురను వివాహము అయ్యెను. అందు-
దక్షప్రజాపతి కొమార్తెలు. సంతతి. దితి దైత్యులు. అదితి ఆదిత్యులు. దనువు దానవులు. అనాయువు-లేక-అనుగ సిద్ధులు. ప్రాధ గంధర్వులు. ముని అప్సరసలు, మౌనేయులు అనఁబడు గంధర్వులు అనియు అందురు. సురస యక్షులు, రాక్షసులు. ఇల వృక్షలతాతృణజాతులు. క్రోధవశ పిశితాశనములైన సింహవ్యాఘ్రాది సర్వమృగములు. తామ్ర శ్యేనగృధ్రాది పక్షిగణములు, అశ్వములు, ఉష్ట్రములు, గార్దభములు. కపిల-లేక-సురభి గోగణము. వినత అనూరుఁడు-గరుడుఁడు కద్రువ నాగులు.
వైశ్వానరుని కొమార్తెలు ఇరువురిలోను కాలయందు కాలకేయులును, పులోమయందు పౌలోములును పుట్టిరి. వీరు కాక కశ్యపుని కొడుకులు ఇంకను కొందఱు కలరు. వారు పర్వతుఁడు అను దేవ ఋషి, విభండకుఁడు అను బ్రహ్మ ఋషి. (http://www.andhrabharati.com/dictionary/# )
మూలాలు
- ↑ Lineage of Kashyapa Valmiki Ramayana - Ayodhya Kanda in Prose Sarga 110.
- ↑ Birth of Garuda The Mahabharata translated by Kisari Mohan Ganguli (1883 -1896), Book 1: Adi Parva: Astika Parva: Section XXXI. p. 110.
- డా.బూదరాజు రాధాకృష్ణ సంకలనం చేసిన పురాతన నామకోశం. (విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారి ప్రచురణ.