మొగ్గలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{తెలుగు సాహిత్యం}}
{{తెలుగు సాహిత్యం}}


[[తెలుగు సాహిత్యం]]లో మూడు పాదాల కవిత్వంతో సాగే సూక్ష్మ కవితా పద్ధతిని '''మొగ్గలు''' అంటారు. ఈ కవితా ప్రక్రియను [[మహబూబ్ నగర్ జిల్లా]]కు చెందిన [[భీంపల్లి శ్రీకాంత్]] ప్రవేశపెట్టారు.
[[తెలుగు సాహిత్యం]]లో మూడు పాదాల కవిత్వంతో మినీ కవితా ప్రక్రియ '''మొగ్గలు''' . ఈ కవితా ప్రక్రియను [[మహబూబ్ నగర్ జిల్లా]]కు చెందిన [[భీంపల్లి శ్రీకాంత్]] ప్రవేశపెట్టారు.


:ఎన్ని అక్షరాలు విత్తనాలుగా నాటానో
:ఎన్ని అక్షరాలు విత్తనాలుగా నాటానో

12:27, 6 మే 2018 నాటి కూర్పు

తిక్కనసోమయాజి చిత్రపటం

తెలుగు సాహిత్యం

దేశభాషలందు తెలుగు లెస్స
తెలుగు సాహిత్యం యుగ విభజన
నన్నయకు ముందు సా.శ. 1000 వరకు
నన్నయ యుగం 1000 - 1100
శివకవి యుగం 1100 - 1225
తిక్కన యుగం 1225 - 1320
ఎఱ్ఱన యుగం 1320 – 1400
శ్రీనాధ యుగం 1400 - 1500
రాయల యుగం 1500 - 1600
దాక్షిణాత్య యుగం 1600 - 1775
క్షీణ యుగం 1775 - 1875
ఆధునిక యుగం 1875 – 2000
21వ శతాబ్ది 2000 తరువాత
తెలుగు భాష
తెలుగు లిపి
ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

తెలుగు సాహితీకారుల జాబితాలు
ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
తెలుగు వ్యాకరణం
తెలుగు పద్యంతెలుగు నవల
తెలుగు కథతెలుగు సినిమా పాటలు
జానపద సాహిత్యంశతక సాహిత్యం
తెలుగు నాటకంపురాణ సాహిత్యం
తెలుగు పత్రికలుపద కవితా సాహిత్యము
అవధానంతెలుగు వెలుగు
తెలుగు నిఘంటువుతెలుగు బాలసాహిత్యం
తెలుగు సామెతలుతెలుగు విజ్ఞాన సర్వస్వం
తెలుగులో విద్యాబోధనఅధికార భాషగా తెలుగు

తెలుగు సాహిత్యంలో మూడు పాదాల కవిత్వంతో మినీ కవితా ప్రక్రియ మొగ్గలు . ఈ కవితా ప్రక్రియను మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన భీంపల్లి శ్రీకాంత్ ప్రవేశపెట్టారు.

ఎన్ని అక్షరాలు విత్తనాలుగా నాటానో
మొగ్గలుగా కవితావనంలో విరబూయడానికి
మొగ్గలు సాహిత్య క్షేత్రంపండే నిత్య పంట

ప్రణాళిక బద్దమైన ఏ కవితా ప్రక్రియ అయిన ఎక్కువ కాలం సాహిత్యంలో మనుగడ ఉంటుంది. అంతేకాదు సేద్దాంతిక ధృక్పధం ; బలమైన శిల్పం ; వస్తు అనుకూల్యత ఇలాంటివి ఉండడమే ఏ కవితా ప్రక్రియ మనుగడకైనా అవసరం. అలాంటి మంచి కవిత ప్రక్రియనే భీంపల్లి శ్రీకాంత్ గారు సృష్టించిన " మొగ్గలు " కవిత ప్రక్రియ. మొగ్గలు మరీ కఠిన ప్రక్రియకాదు.అర్ధం చేసుకోని సులభసాధ్యంలా రాయవచ్చు. కొత్త గా వచ్చే యువకవులకు ఇదీ మంచి వేదిక లాంటి ప్రక్రియ.

మొగ్గలు ఆవిర్భావ నేపథ్యము

ఈ మొగ్గలు ప్రక్రియ భీంపల్లి శ్రీకాంత్ గారు యాదృచ్ఛికంగానే ఆవిర్భవించింది. ఒక ప్రక్రియను ప్రారంభించాలని చేసిన ప్రయత్నమేమి కాదు. మూడుపాదాలతో రెండు మూడు వచన కవితలను ఆవిష్కరించినపుడు, అందులో కవిత్వం వైవిధ్యంగా ఉండడం, కొత్త అభివ్యక్తితో ఆవిష్కరించడం వంటి లక్షణాలు ఉండడంతో ఒక కవితా ప్రక్రియగా మొగ్గలు తెలుగు సాహిత్యములో విరబూసింది. ఈ మొగ్గలు ఆవిర్భవించడానికి ప్రేరణ తన గురువులు ఆచార్య మసన చెన్నప్పగారే అంటారు. భీంపల్లి. నేను నిరంతర కవితా ప్రక్రియలైన నానీలు, నానోలు, గజళ్ళు రాస్తున్నప్పుడు, అనేక రకాలైన వచన కవితా ప్రక్రియల్లో కవిత్వం రాస్తున్న వాడివి. నీవే ఒక ప్రక్రియ ఎందుకు ప్రారింభించకూడదు అంటూ ఒక చాకును సూచన చేశారు. కానీ అప్పటికి తెలుగు సాహిత్యములో అనేక కవితా ప్రక్రియలు ఉండటం, మల్లి ఒక కొత్త ప్రక్రియను ప్రారంభిస్తే ఆదరించేవారు ఉంటారా అనే సందేహంతో వారి సూచనను సున్నితంగా తిరస్కరించాను. అయినా నీకా శక్తి ఉందంటూ నా కవిత్వాన్ని పరామర్శ చేశారు. వారు చెప్పిన ఆర్నెల్లకు గాని ఈ ప్రక్రియ విరబూయలేదు. ఇదికూడా యాదృచ్చికంగా జరిగిన సంఘటన. వారి ఆశీస్సులతోనే ఈ మొగ్గలు విరబూస్తున్నాయి. తెలుగు సాహిత్యాన్ని పరిమళింపజేస్తున్నాయి.

మొగ్గలు నామకరణం

పూలు వికసించడానికి ముందు గలరూపం మొగ్గలు.మొగ్గ దశలో ఉన్న పువ్వులాగనే ఆనందాన్నిస్తుంది. పూలు పూసే క్రమంలో మొగ్గలనేవి ఒక దశను సూచిస్తున్నాయి. భీంపల్లి శ్రీకాంత్ ఆధునిక కవితా రూపాలకు తానొక స్వీయ కవితా రూపాన్ని అందించి, దానికో పేరు పెట్టడం అతని నూతన కవితా తృష్ణను తెలియజేస్తుంది. మూడు చుక్కలు పెట్టి ముచ్చటగొలిపేవే మొగ్గలు. మొగ్గలు ప్రక్రియను భీంపల్లి శ్రీకాంత్ గారు యాదృచ్ఛికం గా మొదలు పెట్టారు. మొగ్గలను మొదటగా Nov- 20 / 2017 నాడు అంకురార్పణ చేసారు. భీంపల్లి వారి మొదటి మొగ్గలు కవిత

కొన్ని అక్షరాలు చాలు
కవిత్వాన్ని ఆవిష్కరించడానికి
వాక్యం రసాత్మక కావ్యం

మొగ్గలు కవితా లక్షణాలు

  • మొగ్గలు మూడు పాదాల కవిత్వం
  • ఎలాంటి అక్షర నియమం కానీ ఛందస్సు కానీ లేదు.
  • ఈ మొగ్గలు మూడుపాదాల కవిత్వం అయినప్పటికీ క్లుప్తత, సరళత, సంక్షిప్తత, గాఢత దీని ప్రధాన లక్షణాలు.
  • మూడు పాదాలలో మొదటి పాదంకు కొనసాగింపుగా రెండవ పాదం వుండాలి. అంటే మొదట పాదంలో వాక్యం అంతం కారాదు.
  • మొదటి రెండు పాదాలు భావయుక్తంగా అర్ధవంతంగా చెబితే, సమర్థిస్తూ, అన్వయిస్తూ, బలపరుస్తూ, మూడవపాదం ముక్తాయింపుగా ఉంటుంది.
  • మరో విధంగా చెప్పాలంటే కొన్ని సార్లు మొదటి రెండు పాదాలు ఒక "సంశ్లిష్ట వాక్యం" లా ఉండాలి. అంటే కవితా సౌలభ్యం బట్టీ ఉపయోగించుకోవచ్చ.
  • ఈ మూడవపాదం ఒక నినాదంగా, సూక్తిగా చెప్పబడుతుంది. ఈ మూడవ పాదాన్ని చెప్పడంవల్ల కవి ఒక కొత్త నినాదాన్ని సూక్తిని చెప్పినట్లవుతుంది.
  • వస్తు అనుకూలత, బలమైన శిల్పం, నూతన అభివ్యక్తి, ఈ నూతన ప్రక్రియకు ఆలంబన. ఈ మూడు అనుకూలతలే మొగ్గలు వికసించడానికి పాదుకలు.
  • మొగ్గలు కవితా ప్రక్రియలో మొదటి రెండు పాదాలు లోకం నుంచి గ్రహించి, మూడవ పాదాన్ని తన అనుభవంలోచి వ్యక్తం చేయడం ఎంతో రమణీయ పొందిక.

మొగ్గల కవితా వికాసము

మొగ్గలు చాలా సులభమైన, అందరు రాయదగిన కవితా ప్రక్రియ, మొదట్లో ఈ ప్రక్రియ సామాజిక మాద్యమాలైన వాట్సాప్, పేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్, మొదలైన వాటిలో విరివిగా మొగ్గలు విరబూశాయి, అంతే కాకుండా మొగ్గలు పేరిట వాట్సాప్ గ్రూప్ అలాగే పేస్ బుక్ లో కూడా మొగ్గలు పేరిట గ్రూప్, ఉంది. వీటి నిర్వాహకులు భీంపల్లి శ్రీకాంత్ , మొదట ఈ గ్రూప్లో పోస్ట్ చేసి సరి చూసుకొని ఒకరికొకరు విశ్లేషణ చేసుకొని మొగ్గలు అనే అక్షరాల అభినందనలు తెలుపుకొని ఆ మొగ్గలు పువ్వుల్లా వికసించడానికి గ్రూపుల ద్వారా ఈ ప్రక్రియను పరిపుష్టం చేస్తున్నారు. ఇప్పటి వర్తమాన కవులనుంచి ప్రముఖ కవులదాకా వందకు మందికిపైగా మొగ్గలు నేటికీ ఆవిష్కరిస్తున్నారు.ఇది చినుకులా ప్రారంభమై వరదలా పారుతున్నది. ప్రారంభించిన అనతికాలంలోనే అత్యున్నత వేగంగా ఈ మొగ్గలు ఈ మొగ్గలు విరభూస్తున్నాయి. కవుల ఆదరణతోనే ఈ మొగ్గలు పరిమళిస్తున్నాయి. ఈ మొగ్గలు సులభమైన ప్రక్రియ కావడంతో విరివిగా కవులు వైవిధ్యమైన శైలితో భిన్నమైన వస్తువుతో మగ్గురు రాస్తున్నారు. ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్న ఈ మొగ్గలు కవితా ప్రక్రియను శతాధిక కవులు రాయడం విశేషం.

తెలుగు దిన, వార, పక్ష, మాస, పత్రికల్లో మొగ్గలు

నమస్తే తెలంగాణ, నవ తెలంగాణ, మన తెలంగాణ, మనం పత్రిక, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర భూమి, ఆంధ్ర ప్రభ, సూర్య, వార్త, గణేష్, మొదలైన దినపత్రికల్లో స్వర్ణపుష్పం, సాహితి ప్రస్థానం, విశాలాక్షి, అష్టాక్షరి, మొదలైన మాసపత్రికలో మగ్గాలు ప్రచురితమయ్యాయి. అలాగే అంతర్జాల పత్రికలైన విహంగ, నవ్య మీడియా, భాగ్యనగర్ పోస్ట్, ప్రతిలిపి వంటి వాటిలో కూడా మొగ్గలు పరిమళించాయి. ఏ కవితా ప్రక్రియ అయినా వికసించాలంటే పత్రికా సంపాదకుల సహకారం ఉండాల్సిందే, వారి సహకారం ఉంటేనే, ఏ ప్రక్రియ అయినా రాణించగలదు. ఆయా పత్రికల సంపాదకుల ప్రోత్సాహంతో నేటికీ మొగ్గలు పత్రికల్లో వెలుగు చూస్తున్నాయి.

అంతర్జాతీయ మాసపత్రికలో మొగ్గలు

అమెరికా సిలికానాoద్ర వారి సుజనరంజిని అంతర్జాల మే నెల మాసపత్రిక కవితా స్రవంతి శీర్షికలో వారి భీంపల్లి శ్రీకాంత్ వారి చదువు మొగ్గలు, ప్రచురితమయ్యాయి. రెండు నెలలకు ఓసారి వచ్చే పశ్చిమబెంగాల్ వారి ఒరవడి ఏడవ సంచిక గ్రీష్మ సంచికలో కవి హృదయం అనే భీంపల్లి శ్రీకాంత్ వారి మొగ్గలు ప్రచురితమయ్యాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారి అక్షర దీపిక మే నెల మాసపత్రికలో భీంపల్లి శ్రీకాంత్ వారి నాన్న మొగ్గలు ప్రచురితమయ్యాయి. అమెరికా వారి తెలుగు మాస పత్రికలో భీంపల్లి శ్రీకాంత్ వారి *అమ్మ మొగ్గలు* ప్రచురితమయ్యాయి.

మొగ్గలు కవితా సంపుటి

మొగ్గలు కవితా పక్రియ ఇప్పటి వరకు ఒక్క కవితా సంపుటం కూడా విడుదల కాలేదు. కవితా సంపుటికీ కావాలిసిన కవితాసంపద వున్నా " మొగ్గలు నాన్న " శ్రీకాంత్ గారు దాదాపుగా 300 కు పైగా మొగ్గలను పూయించిన తర్వాతే సంపుటి గా ప్రచురించాలనీ సంకల్పించారు. ఈ దశలోనే వారు 200 ల మొగ్గలను ఆవిష్కరణ చేసారు.

"https://te.wikipedia.org/w/index.php?title=మొగ్గలు&oldid=2352648" నుండి వెలికితీశారు