కె. వి. కృష్ణకుమారి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92: పంక్తి 92:
# డా. నీలం జయంతి ముగింపు సభలో నిరుపమాన త్యాగధనుడు నీలం గ్రంధావిష్కరణ సభలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా పురస్కారం
# డా. నీలం జయంతి ముగింపు సభలో నిరుపమాన త్యాగధనుడు నీలం గ్రంధావిష్కరణ సభలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా పురస్కారం
#2018 లో కళారత్న పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా అందుకుంది.<ref>{{Cite news|url=https://telugu.navyamedia.com/kalarathna-award-to-doctor-kv-krishna-kumari/|title="కళారత్న" అవార్డు మరచిపోలేని అనుభవం : డాక్టర్ కేవీ కృష్ణ కుమారి - Navya Media Telugu news Portal|date=2018-03-22|work=Navya Media Telugu news Portal|access-date=2018-06-10}}</ref>
#2018 లో కళారత్న పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా అందుకుంది.<ref>{{Cite news|url=https://telugu.navyamedia.com/kalarathna-award-to-doctor-kv-krishna-kumari/|title="కళారత్న" అవార్డు మరచిపోలేని అనుభవం : డాక్టర్ కేవీ కృష్ణ కుమారి - Navya Media Telugu news Portal|date=2018-03-22|work=Navya Media Telugu news Portal|access-date=2018-06-10}}</ref>

== పదవులు ==

కృష్ణక్క గారి పదవులు

#వై ధ్యుల లోని సృజనాత్మక శక్తినీ లలిత కళల తాలూకు ప్రతిభాపాటవాలనువెలికి తీసే నేపధ్యంలోఏర్పడిన “స్పందన” సాంస్కృతిక సంస్థలకి వ్యవస్థాపక అధ్యక్షులు (1985)
#ఆంధ్రప్రదేశ్ మహిలాభ్యుదయ సమితి అధ్యక్షురాలిగా ఎపిక (1991)
#ప్రతిష్టాత్మక సాహితీ సాంస్కృతిక మహిళా సంస్థ “అభినందన “ కు అధ్యక్షురాలిగా ఎఅగ్రీవముగా ఎన్నిక (1992)
#విశ్వభారతి అకాడమీ సర్ సి.వి. రామన్ ఎడ్యుకేషనల్ అవార్డు కమిటీకి చైర్ పర్సన్ గా ఎపిక (1995)
#శ్రీ సాయి సేవా సొసైటీ స్వచ్చoద ధార్మిక సంస్థలకి అధ్యక్షురాలిగా ఏకగ్రీవoగా నియామకం (1995)
#”డాక్టర్ కాజా వెంకట జగన్నాధరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆవిర్భావం చైర్ పర్సన్” గా ఏకగ్రీవముగా ఎన్నిక (1995)
#ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే “నంది అవార్డు కమిటీ సభ్యురాలి”గా ( 1994-1995 )నియామకం
#ఇంట్రాడ్ సునేత్ర అంధుల పాటశాలలకు చైర్మన్ గా ఏకగ్రీవముగా ఎన్నిక (1999 august)


== వనరులు==
== వనరులు==

11:21, 16 జూన్ 2018 నాటి కూర్పు

డాక్టర్ కె.వి. కృష్ణ కుమారి
సత్య సాయి బాబా తో కె.వి.కృష్ణకుమారి
జననంకృష్ణ కుమారి
India తెనాలి, గుంటూరు
నివాస ప్రాంతంహైదరాబాద్, తెలంగాణ
ఇతర పేర్లుకృష్ణక్క
వృత్తిడాక్టర్
రచయిత్రి
మతంహిందూ
తండ్రిడాక్టర్ కాజా వెంకట జగన్నాధరావు
తల్లిసత్యవతి

కె. వి. కృష్ణకుమారి తెలుగు రచయిత్రి, సాహితీవేత్త, గైనకాలజిస్టు.[1] ఆమె కృష్ణక్క గా సుప్రసిద్ధురాలు. ఆమె తన తండ్రి గారి పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎన్నో సేవలని ఎంతో మందికి అందిస్తున్నది.

జీవిత విశేషాలు

ఆమె తెనాలి లో కాజా వెంకట జగన్నాథరావు, సత్యవతి దంపతులకు జన్మించింది. ఆమె ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యవరకు తెనాలి లోనే అభ్యసించింది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో వైద్యవిద్యను (ఎం.బి.బి.ఎస్) అభ్యసించింది. ఆమె హైదరాబాదులో నివాసం ఉంటున్నది. ఆమె వృత్తి మెడికల్ ప్రాక్టీషనర్ అయినా ప్రవృత్తి మాత్రం రచనా వ్యాసంగమే. ఆమె 'రమ్యకథా కవయిత్రి' గా పేరు పొందినది. ఆమె తన పది సంవత్సరాల వయసులో 'భలే పెళ్ళి' నాటకంతో రచనా వ్యాసాంగం ప్రారంభించింది.

మానసిక స్థైర్యం కోల్పో యిన వారికి కృష్ణక్క సలహాలు, సూచనలు ఎందరికో మార్గదర్శనమయ్యాయి.[2]

రచనా వ్యాసాంగం

కృష్ణకుమారి తన పదేళ్ళ వయసులో తెనాలి బ్రాంచి హైస్కూల్లో చదువుతున్న సమయంలో విద్యార్థుల ప్రదర్శన కోసం 'భలే పెళ్ళి' నాటకం రాసింది. 1970 ప్రాంతంలో ప్రముఖ మాసపత్రిక ‘మహిళ’ తిరుపతి నుండి వెలువడేది. రాయలసీమ సేవా సమితి సెక్రెటరీ డా. మునిరత్నం నాయుడుగారు, పద్మారత్నంగారూ, ఆ పత్రికకు సారథ్యం వహించేవారు. ఆ పత్రికలో యద్దనపూడి సులోచనారాణి తో కలసి పోటాపోటీగా సీరియల్స్‌ వ్రాసేదామె. ‘కృష్ణక్క సలహాలు’ అనే శీర్షిక ద్వారా పాఠకులకు ఆమెను పరిచయం చేసింది ఆ పత్రికే.[3] దాదాపు నలభై సంవత్సరాల పాటుగా వివిధ ప్రముఖ పత్రికలలో, ‘కృష్ణక్క సలహాలు’ శీర్షికను నిర్వహిస్తూ కృష్ణక్కగా లక్షలాది మంది హృదయాలలో స్దిరస్థానం సొంతం చేసుకున్నదామె.

సమాజ హితమే తన హితంగా భావించే కృష్ణకుమారి ఐదు దశాబ్దాలకు పైగా రచయిత్రిగా చిరస్మరణీయమైన గ్రంధాలు వెలువరించింది. నవలా రచయిత్రిగానే కాకుండా జీవిత కథలను అందించడంలో కూడా ఆమె సిద్ధహస్తురాలు. డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావుకు ఆత్మీయురాలు, కుటుంబ సభ్యురాలు. ఆయన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ కృష్ణకుమారి రాసిన “మనిషిలో మనీషి” అన్న గ్రంథం ఇప్పటికీ బహుళ ప్రజాదరణ పొందింది. అలాగే పుట్టపర్తి సాయిబాబా మీద రాసినటువంటి “అద్వైతామృత వర్షిణి” అన్న గ్రంథం కూడా భక్తులు అమితంగా ఇష్టపడతారు.[4]

ఇప్పటిదాకా వైద్యరంగం, ఆధ్యాత్మిక పరంగా, ఆదేశాత్మకంగా 60కి పైగా నవలలు వ్రాసింది. “సహిత జావిత వజ్రోత్సవ” వేడుకలను అభిమానులు జరుపుకున్నారు. భగవాన్ సత్యసాయి బాబా కృష్ణక్క త్యాగ నిరతికి మెచ్చి “ఓంకార” పతకమున్నసువర్ణమాలను స్వయంగా మెడలో అలంకరించారు. అతని ఆదేశాలనుసారం అద్వైతామృత వర్షిణి, ‘భద్రాకళ్యాణం’ ప్రబంధ గ్రంధం వ్రాసింది.

రాజకీయ నేపథ్యం

ఆమెకు దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులుగారు, మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి రక్త సంభంధీకులైన దగ్గర బంధువులు. మెడిసిన్ లో, కుటుంబపరంగా, కొండా వెంకటప్పయ్య గారి మెరిట్, స్కాలర్షిప్ ను అందుకున్నది. మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు కృష్ణకుమారి కుటుంబానికి అత్యంత ఆత్మీయులు. భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారి అభిమాన పుత్రికగా మరియు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి ఇంటి ఆడపడుచుగా సుప్రసిద్దురాలు.

రచనలు

  • కర్మయోగి [5]
  • భద్రాకళ్యాణం [6]
  • మనిషి లో మనీషి డాక్టర్ అక్కినేని[7]
  • మంచుపూలు
  • శ్రీ కృష్ణామృతం
  • సశేషం[8]

పురస్కారాలు

  1. 1974 తెనాలి శారదా కళా పీఠంలో అంతర్జాతీయ మహిళా సంవర్గములో వివిధ సాహితీ సంస్థల చే “రమ్య కధా కవయిత్రి” “అభ్యుదయ నవలా రచయిత్రి “బిరుదులు ప్రధానం
  2. 1975 లో మహా కవి శ్రీ శ్రీ తో అంతర్జాతీయ రచయితల సదస్సుకు ఆహ్వానం అందుకున్నారు
  3. 1983 లో తానా వారిచే అమెరికాకు ఆహ్వానం.వాషింగ్టన్ లో మస్కులర్ డిస్త్రోఫీ అన్న అంశము పై వైద్యపరముగా పేపర్ సమర్పించటం
  4. 1983 లో సాహితీ జీవిత రజోతోత్సవ సందర్బముగా హైదరాబాద్ త్యాగరాయ గానసభ లో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుచే ఘనసత్కారం
  5. 1983 లో కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆచార్యుల చేతుల మీదుగా పూర్వ విద్యార్దినిగా ప్రతిభా పురస్కార ప్రధానం
  6. 1983 లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ద్వారా కాలేజ్ ఆఫ్ జనెరల్ ప్రాక్టిషనర్ గా ఎంపిక
  7. 1983 లో రాయల్ సొసైటీ ఆఫ్ హెల్త్ (లండన్) వీరి ద్వారా ఫెలోషిప్ స్వీకారం
  8. 1989 లో శ్రీనాధ పీఠం గుంటూరు వారి ఆహ్వానం పండితోత్తములతో సత్కారం
  9. 1992 లో ముఖ్యమంత్రి శ్రీ నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారిచే అంతర్జాతీయ తెలుగు రచయితల సంస్థల తరపున రవీంద్రభారతి హైదరాబాద్ లో సన్మానం
  10. 1992 లో వైద్యరంగ పరముగా ఉమన్ ఆఫ్ దిఇయర్ ప్రతిష్టాత్మక అవార్డు హరిహర కళాభవన్ లో ప్రదానం
  11. 1992 లో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ అవార్డు డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు చేతుల మీద అందుకున్నారు
  12. 1993 లో ఇందిరాగాంధీ జాతీయ పురస్కారం
  13. 1993 లో సాహితీ వైద్య శిరోమణి పురస్కారం పిసిసి అధ్యక్షులు శ్రీ మజ్జి తులసీదాస్ గారి చేతుల మీదుగా ఇందిరా ప్రియదర్శిని హాల్ లో అందుకున్నారు
  14. 1993 లో శ్రీ మతి మాదిరెడ్డి సులోచన పేరిట ఉత్తమ రచయిత్రి అవార్డు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి చే భారతీయ విద్యాభవన్( హైదరాబాద్ లో) అందుకున్నారు
  15. 1994 లో "మహాత్మాగాంధీ జాతీయ పురస్కారం రవీంద్ర భారతి హైదరాబాద్ లో
  16. 1995 లో "గ్లోరి ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ విజయశ్రీ అవార్డు" ను ఇంటర్ నేషనల్ ఫ్రెండ్ షిప్ సొసైటీ ఆఫ్ ఇండియా(న్యూ ఢిల్లీ)వారి ఆధ్వర్యములో శ్రీమతి షీలాకౌల్ శ్రీ వసంతసాధే ద్వారా స్వీకారం
  17. 1995 లో గ్లోరి ఆఫ్ ఇండియా అంతర్జాతీయ పురస్కారం"సందర్బముగా రవీంద్రభారతిలో డాక్టర్ అక్కినేనినాగేశ్వరరావు,ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ ఎ.మాధవరెడ్డిచే ఘనసత్కారం
  18. 1997 లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బముగా గాంధీభవన్ లో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శ్రీ రోశయ్య, శ్రీ శ్రీపాదరావులచే సన్మానం
  19. 1997 లో విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీటం ( భీమవరం ) వారి ఆధ్వర్యములో డాక్టర్ ఉమర్ ఆలేశా సాహితీ సమితి వారి చే ఘన సత్కారం
  20. 1997 లొ భరతముని పురస్కారం భరత ముని ఆర్ట్స్ అకాడమి (మదనపల్లి) వారి చే
  21. 1998 లో నెహ్రు నికేతన్ ఎడ్యుకేషనల్ సొసైటీ (తెనాలి) వారి చే తెనాలి నూరేళ్ళ రంగస్థలి గ్రంధావిష్కరణ సందర్బముగా సత్కారం
  22. 1999 లో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి నుండి అఖండ దివ్యాశీస్సులతో బాటు పసిడి దండ బహుకరణ స్వామి తో ప్రత్యక్షముగా 45 నిమిషాలు సంభాషించే అరుదైన అదృష్టం
  23. 2005లో శ్రీ దివాకర్ల వెంకటావధాని అవార్డు పురస్కారం
  24. 2005లో అక్కినేని అవార్డు పురస్కారం
  25. 2007 శ్రీ విజయ దుర్గా విశిష్ట మహిళా పురస్కారం శ్రీ విజయ దుర్గా పీటము వారి నుండి
  26. విశిష్ట రచయిత్రిగా సర్వధారి పురస్కారం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారి చేతులమీదుగా
  27. 2013లో సి .నారాయణరెడ్డి గారి నుండి సాహితీ సేవలకు సుశీల నారాయణరెడ్డి పురస్కారం
  28. డా. నీలం జయంతి ముగింపు సభలో నిరుపమాన త్యాగధనుడు నీలం గ్రంధావిష్కరణ సభలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా పురస్కారం
  29. 2018 లో కళారత్న పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా అందుకుంది.[9]

పదవులు

కృష్ణక్క గారి పదవులు

  1. వై ధ్యుల లోని సృజనాత్మక శక్తినీ లలిత కళల తాలూకు ప్రతిభాపాటవాలనువెలికి తీసే నేపధ్యంలోఏర్పడిన “స్పందన” సాంస్కృతిక సంస్థలకి వ్యవస్థాపక అధ్యక్షులు (1985)
  2. ఆంధ్రప్రదేశ్ మహిలాభ్యుదయ సమితి అధ్యక్షురాలిగా ఎపిక (1991)
  3. ప్రతిష్టాత్మక సాహితీ సాంస్కృతిక మహిళా సంస్థ “అభినందన “ కు అధ్యక్షురాలిగా ఎఅగ్రీవముగా ఎన్నిక (1992)
  4. విశ్వభారతి అకాడమీ సర్ సి.వి. రామన్ ఎడ్యుకేషనల్ అవార్డు కమిటీకి చైర్ పర్సన్ గా ఎపిక (1995)
  5. శ్రీ సాయి సేవా సొసైటీ స్వచ్చoద ధార్మిక సంస్థలకి అధ్యక్షురాలిగా ఏకగ్రీవoగా నియామకం (1995)
  6. ”డాక్టర్ కాజా వెంకట జగన్నాధరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆవిర్భావం చైర్ పర్సన్” గా ఏకగ్రీవముగా ఎన్నిక (1995)
  7. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే “నంది అవార్డు కమిటీ సభ్యురాలి”గా ( 1994-1995 )నియామకం
  8. ఇంట్రాడ్ సునేత్ర అంధుల పాటశాలలకు చైర్మన్ గా ఏకగ్రీవముగా ఎన్నిక (1999 august)

వనరులు

మూలాలు

  1. "Dr. K.V. Krishna Kumari in Nallakunta, Hyderabad : General Physicians, clinic : Health Search - Healcon.com". healcon.com. Retrieved 2018-06-10.
  2. "సేవే లక్ష్యంగా కృష్ణక్క సాహితీ సేద్యం, వైద్యం".
  3. "ఆమె వాక్యాల్లో చంద్రుని చల్లదనం".
  4. "సమాజసేవలో డాక్టర్ కే.వి.కృష్ణకుమారి - Navya Media Telugu news Portal". Navya Media Telugu news Portal. 2018-03-06. Retrieved 2018-06-10.
  5. "Karmayogi,K V Krishna Kumari - online Telugu Books". www.logili.com. Retrieved 2018-06-10.
  6. Prof. V. Viswanadham, Bhadra Kalyanam by Dr. K. V. Krishna Kumari - reading by Prof. V. Viswanadham Part-1, retrieved 2018-06-10
  7. "Manishilo Maneeshi Doctor Akkineni - మనిషిలో మనీషి డాక్టర్‌ అక్కినేని".
  8. "Sasesham - సశేషం".
  9. ""కళారత్న" అవార్డు మరచిపోలేని అనుభవం : డాక్టర్ కేవీ కృష్ణ కుమారి - Navya Media Telugu news Portal". Navya Media Telugu news Portal. 2018-03-22. Retrieved 2018-06-10.

బయటి లింకులు