రావెళ్ళ నాయకులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 4: పంక్తి 4:
[[File:Udayagiri Fort (40).jpg|thumb|right|ఉదయగిరి కోట]]
[[File:Udayagiri Fort (40).jpg|thumb|right|ఉదయగిరి కోట]]


[[కాకతీయ సామ్రాజ్యము|కాకతీయ సామ్రాజ్య]] పాలకులైన ముసునూరి నాయకుల పతనం తరువాత వీరందరు [[విజయనగరము]] తరలిపోయిరి. [[విజయనగరము]]<nowiki/>నకు వలస పోయిన పిమ్మట రావెళ్ళ వంశీకులు సాళువ, తుళువ మరియు అరవీటి రాజులకడ సేనానులుగా, సామంతరాజులుగా సేవచేసి యశః కీర్తులు పొందిరి. ముఖ్యముగా అరవీటి రాజులకాలములో [[శ్రీశైలము]]ను మరియు దూపాటిసీమను 1364 నుండి పరిపాలింఛిరి. రావెళ్ళ వారి ప్రస్తావన తొలుత 1257 లో మూడవ రాజరాజు పాలనలో కానవచ్చును. చలమర్తిగండ అను వీరి [[బిరుదు]]<nowiki/>ని బట్టి వీరు దుర్జయ వంశమునకు వల్లుట్ల గోత్రమునకు చెందినవారని విశదమగుచున్నది. రావెళ్ళ వారి వంశ ప్రశస్తి, యుద్ధకౌశలము రత్నాకరము గోపాలకవి విరచితమగు సౌగంధికాప్రసవాపహరణము అను పద్యకావ్యములో పలువిధముల పొగడబడినవి.
[[కాకతీయ సామ్రాజ్యము|కాకతీయ సామ్రాజ్య]] పాలకులైన ముసునూరి నాయకుల పతనం తరువాత వీరందరు [[విజయనగరము]] తరలిపోయిరి. [[విజయనగరము]]<nowiki/>నకు వలస పోయిన పిమ్మట రావిళ్ల వంశీకులు సాళువ, తుళువ మరియు అరవీటి రాజులకడ సేనానులుగా, సామంతరాజులుగా సేవచేసి యశః కీర్తులు పొందిరి. ముఖ్యముగా అరవీటి రాజులకాలములో [[శ్రీశైలము]]ను మరియు దూపాటిసీమను 1364 నుండి పరిపాలింఛిరి. రావిళ్ల వారి ప్రస్తావన తొలుత 1257 లో మూడవ రాజరాజు పాలనలో కానవచ్చును. చలమర్తిగండ అను వీరి [[బిరుదు]]<nowiki/>ని బట్టి వీరు దుర్జయ వంశమునకు వల్లుట్ల గోత్రమునకు చెందినవారని విశదమగుచున్నది. రావిళ్ల వారి వంశ ప్రశస్తి, యుద్ధకౌశలము రత్నాకరము గోపాలకవి విరచితమగు సౌగంధికాప్రసవాపహరణము అను పద్యకావ్యములో పలువిధముల పొగడబడినవి.


==మల్ల నాయుడు==
==మల్ల నాయుడు==

10:17, 24 జూన్ 2018 నాటి కూర్పు

రావిళ్ల నాయకులు రాయ వెల్లూరు, ఉదయగిరి రాజధానిగా పాలించిన విజయనగర సామంతరాజులు.[1][2].

ఉదయగిరి కోట

కాకతీయ సామ్రాజ్య పాలకులైన ముసునూరి నాయకుల పతనం తరువాత వీరందరు విజయనగరము తరలిపోయిరి. విజయనగరమునకు వలస పోయిన పిమ్మట రావిళ్ల వంశీకులు సాళువ, తుళువ మరియు అరవీటి రాజులకడ సేనానులుగా, సామంతరాజులుగా సేవచేసి యశః కీర్తులు పొందిరి. ముఖ్యముగా అరవీటి రాజులకాలములో శ్రీశైలమును మరియు దూపాటిసీమను 1364 నుండి పరిపాలింఛిరి. రావిళ్ల వారి ప్రస్తావన తొలుత 1257 లో మూడవ రాజరాజు పాలనలో కానవచ్చును. చలమర్తిగండ అను వీరి బిరుదుని బట్టి వీరు దుర్జయ వంశమునకు వల్లుట్ల గోత్రమునకు చెందినవారని విశదమగుచున్నది. రావిళ్ల వారి వంశ ప్రశస్తి, యుద్ధకౌశలము రత్నాకరము గోపాలకవి విరచితమగు సౌగంధికాప్రసవాపహరణము అను పద్యకావ్యములో పలువిధముల పొగడబడినవి.

మల్ల నాయుడు

సాళువ నరసింహరాయలకడ రావెళ్ళ మల్ల 1495 లో సేనాధిపతిగాయుండెను. గుడిపాడు వద్ద జరిగిన యుద్ధములో బహమనీ రాజగు కుతుబ్ షా ను ముక్కలుముక్కలుగా నరికివైచెను. మహారాజు మల్లకు 'రాజహ్రిదయభల్ల ప్రతాపప్రభవ' అను బిరుదునొసంగెను. రావెళ్ళవారి సైన్యము విడిది చేయుటకు విజయనగరమందు 1260 కుంటల స్థలము గలదు. మల్లుని సైన్యములో ఆరువేల సైనికులు, నాలుగు వందల అశ్వములు గలవు. ఈతని సంవత్సరాదాయము పదమూడువేల బంగారు వరహాలు. ఇందు మూడవ వంతు రాయలవారికి చెల్లించుచుండెను. 1527లో హైదరుజంగు తో జరిగిన యుద్ధములో వాసిరెడ్డి మల్లికార్జునునకు తోడ్పడి మరణించెను.


మల్ల నాయుని కుమారుడగు తిప్పా నాయుడు శ్రీక్రిష్ణదేవరాయలవారి ఉత్కళదేశ దండయాత్రలో (1513-1515) పాల్గొని గజపతి రాజును ఓడించుటకు తోడ్పడెను. తిప్పని పరాక్రమమునకు మెచ్చిన రాయల వారు బహువిధముల సత్కరించిరి. తిప్పా నాయుని కొడుకు పాపా నాయుడు రామరాయల సేనాధిపతిగా కర్నూలు వద్ద జరిగిన పోరులో ముస్లిము సేనలను తరిమివేసి కోటను స్వాధీనము చేసుకొనెను (వసుచరిత్రము). పాపయ కుమారుడు రెండవ తిప్ప మరియు మనుమడు మొదటి లింగ కూడ మహాయోధులు. మొదటి లింగానాయుని కుమారుడగు కొండా నాయుడు సాళువ తిమ్మరాయల కొలువులోనుండి మానవపురికడ జరిగిన యుద్ధములో నౌదుల్ ఖాను ని ఓడించి ఆదోని కోటను సాధించెను.

అయ్యప్ప నాయుడు

క్రిష్ణరాయలవారి అల్లుడు రామరాయలవారికి సామంతునిగా నున్న అయ్యప్ప నాయుడు (రెండవ తిప్పానాయుని కుమారుడు) తిరుమాణికోట ను పాలించెను. గొల్లకొండ సుల్తాను అబ్దుల్లా కుతుబ్షా (1611) సైన్యమునోడించి ఆదోని మరియు పెనుగొండ కోటలను తిరిగి సాధించెను. ఈతనికి అశ్వరేవంత, పరబలభీమ, చలమర్తివరగండ, ఆదవానిదుర్గగర్వవిభాళ, హత్తుమువ్వరగండ అను గొప్ప బిరుదులు గలవు. అయ్యప్ప మనుమడు రెండవ లింగ విజయనగర సేనలకు నాయకునిగా ఆదవాని, గండికోట, కర్నూలు కోటలను స్వాధీనపరచుకొనెను. రత్నాకరము గోపాలకవి ఈతని ఆస్థానములోనుండెను.


నెల్లూరు మండలములో దొరకిన శాసనములబట్టి అరవీటి రాజులకాలమందు ఉదయగిరిని కోనేటినాయుడు, కొచ్చెర్లకోటను తిమ్మా నాయుడు మరియు పొదిలిని తిప్పానాయుడు పాలించుచుండిరి.

రావెళ్ళ వేంకటరంగ అప్పస్వామి నాయుడు

తమిళదేశమున తిరునెల్వేలి మండలములో ఇలైయరసనందాల్ జమీందారీ రావెళ్ళ వారిది. బ్రిటిష్ వారి పాలనలో వేంకటరంగ అప్పస్వామి నాయుడు బహుప్రశంసలు పొందిన జమీందారు.

వనరులు

  • సౌగంధికా ప్రసవాపహరణము, రత్నాకరము గోపాలకవి, 17వ శతాబ్దము.
  • వసుచరిత్ర, రామరాజ.
  • భారతి, శుక్ల సంపుటము, పేజి 623.
  • క్రిష్ణరాజ విజయము, కుమార ధూర్జటి.
  • కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య, 1939, కొత్త ఎడిషను, పావులూరి పబ్లిషర్లు, గుంటూరు, 2006.* Forgotten Chapter of Andhra History, M. Somasekhara Sarma
  • Nilakanta Sastry, http://ia300234.us.archive.org/0/items/FurtherSourcesOfVijayanagaraHistory/TXT/00000337.txt
  • Vijayanagar Empire: A Forgotten Chapter of Indian History by Robert Sewel.
  • K. Iswara Dutt, Journal of Andhra Historical Research Society. Vol. 10, pp. 222-224
  • Sources of Vijayanagar History, S. K. Aiyangar, The University of Madras, 1919, Madras, p. 385.
  • Copper Plate and Stone Inscriptions of South India, Alan Butterworth and V. V. Chetty, Government of Madras, 1905, Madras, p. 437, 892, 1175, 1514.
  1. కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య, 1939, కొత్త ఎడిషను, పావులూరి పబ్లిషర్లు, గుంటూరు, 2006
  2. Nellore Inscriptions, No. 6