రైతుబంధు పథకం: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 39: | పంక్తి 39: | ||
| 6488 |
| 6488 |
||
|} |
|} |
||
== ఇవి కూడా చూడండి == |
|||
* [[తెలంగాణ ప్రభుత్వ పథకాలు]] |
|||
==మూలాలు== |
==మూలాలు== |
13:14, 3 సెప్టెంబరు 2018 నాటి కూర్పు
తేదీ | మే 10, 2018 |
---|---|
ప్రదేశం | ధర్మరాజుపల్లి, తెలంగాణ, భారతదేశం |
నిర్వాహకులు | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ ప్రభుత్వం |
పాలుపంచుకున్నవారు | తెలంగాణ ప్రజలు |
వెబ్సైటు | http://rythubandhu.telangana.gov.in/ |
వ్యవసాయం కోసం పెట్టుబడిని ఋణంగా నగదు రూపంలో రైతులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు పథకం.[1] ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మే 10, 2018 న కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి - ఇందిరానగర్ వద్ద ప్రారంభించారు. మొట్టమొదటి సారిగా ధర్మరాజుపల్లి వాసులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా చెక్కులు, పట్టాదార్ పాసు పుస్తకాలు అందుకున్నారు.
వివరాలు
రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది. ఖరీఫ్, రబీ సీజన్ లకు ఎకరానికి రూ. 4000 చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 8000 పెట్టుబడిగా ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని రైతుకు చెక్కుల రూపంలో ఇవ్వనున్నారు. అదే విధంగా ఈ పథకం కింద నిల్వ ఉంచిన సరుకుపై రుణం తీసుకున్న రైతులకు ఆరు నెలల పాటు వడ్డీ రాయితీ ఇస్తారు. రైతులు తాము తీసుకున్న రుణాలపై ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరు నెలల తర్వాత అనగా 181 వ రోజు నుంచి 270 వ రోజు వరకు వారు తీసుకున్న రుణంపై 12 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 58.34 లక్షల మంది రైతులకు పెట్టుబడిసాయం అందిస్తుంది. ( గిరిజనభూములు కలిపి మొత్తం కోట్ల ఎకరాలకు )[2] ఈ పథకం అమలుకోసం బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించారు.
భూ కమతాలు | రైతుల సంఖ్య |
---|---|
2 ఎకరాల లోపు | 42 లక్షలు (90%) |
5 ఎకరాల లోపు | 11 లక్షలు |
5-10 ఎకరాల లోపు | 4.4 లక్షలు |
> 10 ఎకరాల కంటే ఎక్కువ | 94,000 |
> 25 ఎకరాల కంటే ఎక్కువ | 6488 |
ఇవి కూడా చూడండి
మూలాలు
- ↑ "రైతు బంధు పథకానికి నిధులు విడుదల". నమస్తే తెలంగాణ. www.ntnews.com. Retrieved 12 April 2018.
- ↑ "పంట నిల్వకు రైతు బంధు పథకం." నమస్తే తెలంగాణ. www.ntnews.com. Retrieved 12 April 2018.