రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
rv
Blanked the page
ట్యాగులు: తుడిచివేత blanking
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox person
| honorific_prefix =కళాప్రపూర్ణ, డాక్టర్
| name = {{PAGENAME}}
| honorific_suffix = బహద్దర్
| native_name = రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు
| native_name_lang = తెలుగు
| image = దస్త్రం:Rvkm suryarao.jpg
| image_size = 175 px
| alt =
| caption = రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు
| birth_name =
| birth_date = [[1885]], [[అక్టోబరు, 5]]
| birth_place = [[పిఠాపురం]]
| disappeared_date = <!-- {{Disappeared date and age|YYYY|MM|DD|YYYY|MM|DD}} (disappeared date then birth date) -->
| disappeared_place =
| disappeared_status =
| death_date = [[1964]], [[మార్చి]], [[6]]
| death_place =
| death_cause =
| body_discovered =
| resting_place =
| resting_place_coordinates = <!-- {{Coord|LAT|LONG|type:landmark|display=inline}} -->
| monuments =
| residence = పిఠాపురం
| nationality = భారతీయుడు
| other_names = సాహిత్య చక్రవర్తి
| ethnicity = <!-- Ethnicity should be supported with a citation from a reliable source -->
| citizenship =
| education =
| alma_mater =
| occupation = సంస్థానాధీశుడు
| years_active = 1907-1948
| employer =
| organization = పిఠాపురం సంస్థానం
| agent =
| known_for = సాహిత్య పోషకుడు, దాత
| notable_works =
| style =
| influences =
| influenced =
| home_town = [[పిఠాపురం]]
| salary =
| net_worth = <!-- Net worth should be supported with a citation from a reliable source -->
| height = <!-- [[ఎత్తు]]-->
| weight = <!-- [[బరువు]]-->
| television =
| title =
| term =
| predecessor =
| successor =
| party =
| movement =
| opponents =
| boards =
| religion = [[హిందూ]]
| denomination = <!-- Denomination should be supported with a citation from a reliable source -->
| criminal_charge = <!-- Criminality parameters should be supported with citations from reliable sources -->
| criminal_penalty =
| criminal_status =
| spouse = రాణీ చిన్నమాంబా దేవి,<br>సావిత్రీదేవి
| partner = <!-- unmarried life partner; use ''Name (1950–present)'' -->
| children = రావు వేంకట గంగాధర రామారావు,<br> రావు వేంకటసూర్యారావు,<br>మంగాయమ్మ, <br>భావయమ్మ, <br>[[సీతాదేవి(బరోడా మహారాణి)|సీతాదేవి]], <br>కమలాదేవి,<br>రామరత్నారావు
| parents = రావు వేంకట మహీపతి గంగాధర రామారావు, మంగాయమ్మ
| relatives =
| callsign =
| awards =
| signature =
| signature_alt =
| signature_size =
| module =
| module2 =
| module3 =
| module4 =
| module5 =
| module6 =
| website = <!-- {{URL|Example.com}} -->
| footnotes =
| box_width =
}}
'''రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు''' [[పిఠాపురం]] సంస్థానాన్ని పరిపాలించినవారిలో చివరివాడు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1885]], [[అక్టోబర్]], 5 న మంగాయమ్మ, రావు వేంకట మహీపతి గంగాధర రామారావు దంపతులకు జన్మించాడు. ఇతనికి ఐదు సంవత్సరాల వయసు వచ్చే సమయానికి ఇతని తండ్రి మరణించాడు. అప్పుడు గంగాధర రామారావు దత్తపుత్రుడు ఇతడు వారసుడు కాడని, రాజ్యాధికారం తనదే అని కోర్టుకు ఎక్కాడు. ఈ వ్యాజ్యం ఎక్కువ రోజులు నడిచి చివరకు విజయలక్ష్మి ఇతడినే వరించింది. ఈ వ్యాజ్యం [[న్యాయస్థానము|కోర్టు]]<nowiki/>లో ఉన్నంతకాలం, అనంతరం ఇతనికి మైనారిటీ తీరేవరకు ఈ సంస్థానం కోర్ట్ ఆఫ్ వార్డ్స్ అధీనంలో ఉంది. ఈ సమయంలో ఇతడు [[మద్రాసు]] లోని న్యూయింగ్టన్ కళాశాలలో ఉండి విద్యాభ్యాసం చేశాడు. ఈ సమయంలోనే [[సంస్కృతం]], [[తెలుగు]], [[కన్నడం]], [[తమిళం]], [[ఆంగ్ల]] భాషలను నేర్చుకుని ఈ ఐదు భాషలలో ఉత్తమ గ్రంథాలను పఠించాడు. తెలుగు, ఇంగ్లీషు భాషలలో [[కవిత్వం]] చెప్పగలిగే నేర్పును సంపాదించాడు. తర్వాత [[నూజివీడు]] సంస్థానాధిపతియైన రాజా వెంకటరంగయ్యప్పారావు ప్రథమ పుత్రిక అయిన ఆండాళమ్మను [[1906]], [[ఏప్రిల్ 2]] న వివాహం చేసుకున్నాడు. వంశాచారమును బట్టి ఆండాళమ్మ అత్తింటికి వచ్చిన వెంటనే చిన్నమాంబాదేవిగా తన పేరును మార్చుకున్నది. తర్వాత [[1907]], [[ఫిబ్రవరి 19]] న [[పిఠాపురం]] సంస్థానపు సింహాసనాన్ని అధిష్టించాడు. [[1948]]లో సంస్థానాలు, జమీందారీ వ్యవస్థ రద్దయ్యే వరకు ఇతడు పిఠాపురం మహారాజుగా వెలుగొందాడు. ఇతడికి చిన్నమాంబాదేవి ద్వారా మొదట [[1910]]లో గంగాధర రామారావు అనే పుత్రుడు జన్మించాడు. తర్వాత వారికి సూర్యారావు అనే కుమారుడు, మంగయమ్మ, భావయమ్మ, [[సీతాదేవి(బరోడా మహారాణి)|సీతాదేవి]], కమలాదేవి అనే కుమార్తెలు కలిగారు. ఇతని కుమార్తె [[సీతాదేవి(బరోడా మహారాణి)|సీతాదేవి]] బరోడా సంస్థానపు మహారాణి అయ్యింది. [[1933]], [[మార్చి 12]] న రాణీ చిన్నమాంబాదేవి అగ్నిప్రమాదంలో మరణించిన పిదప ఇతడు సావిత్రీదేవిని వివాహం చేసుకుని రామ రత్నారావు అనే పుత్రుడికి జన్మనిచ్చాడు. ఇతడు 79 సంవత్సరాలు జీవించి [[1964]], [[మార్చి 6]] వ తేదీన మరణించాడు.

==దాతృత్వం==
ఇతడు తన తండ్రిచేత స్థాపించబడిన [[పిఠాపురం]] హైస్కూలు, కాకినాడ కాలేజీలను అమితమైన ధనం వెచ్చించి అభివృద్ధి చేసి దక్షిణ ఆంధ్ర రాష్ట్రంలో అటువంటి విద్యాసంస్థలు మరొకటి లేదనిపించాడు. కాకినాడ కాలేజీని ఫస్ట్ గ్రేడ్‌గా ఉద్ధరించి ఎన్నో భవనాలను కట్టించాడు. ఆ కాలేజీలో చదివే స్త్రీలకు, పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పాడు. అంతే కాకుండా పట్టభద్రులై విదేశాలకు వెళ్లి, ఉన్నతవిద్య పొందగోరేవారికి సంపూర్ణ ధనసహాయం చేశాడు. [[పిఠాపురం]] హైస్కూలులో హరిజన విద్యార్థినీ విద్యార్థుల కోసం వసతి గృహాన్ని నెలకొల్పి దానికయ్యే వ్యయాన్ని అంతా తానే భరించాడు. వారికి ప్రైవేటు టీచర్లను కూడా ఏర్పరిచి అనేకమందిని వృద్ధిలోనికి తీసుకువచ్చాడు. [[రాజమండ్రి]] లోని వీరేశలింగోన్నత పాఠశాల ఇతని పోషణతోనే నడిచింది. [[రఘుపతి వేంకటరత్నం నాయుడు]] ప్రేరణతో [[కాకినాడ]]లో బ్రహ్మసమాజ ప్రార్థనామందిరాన్ని, అనాథశరణాలయాన్ని ఏర్పాటు చేశాడు. రాణీ చిన్నమాంబాదేవి కోరికపై కాకినాడ లేడీస్ క్లబ్‌కు 40 ఎకరాల స్థలాన్ని ఇచ్చాడు. రాణీ ఆధ్వర్యంలో [[పిఠాపురం]]లో ఘోషా స్కూలును నడిపాడు. [[1920]] ప్రాంతములో విశ్వకవి [[రవీంద్రనాథ టాగూరు]] [[పిఠాపురం]] సందర్శించినప్పుడు ఇతడు సుమారు లక్షరూపాయలు పారితోషికంగా ఇచ్చాడు. ప్రాచ్య, పాశ్చాత్య విద్యలను సమదృష్టితో గౌరవించి వాటి అభివృద్ధికై ఎంతో ధనాన్ని వెచ్చించాడు. ఇతని ఔదార్యముతోనే తెలుగుదేశములోని ఆనాటి ప్రతి సాహిత్యసంస్థ అభివృద్ధిని చెందింది. ఆంధ్ర భాషాభివర్ధినీ సమాజము, విజ్ఞానచంద్రికా మండలి, ఆంధ్రప్రచారిణీ గ్రంథమాలలకు విశేషమైన ధనసహాయం చేశాడు. [[జయంతి రామయ్య]] స్థాపించిన ఆంధ్రసాహిత్య పరిషత్తును ప్రోత్సహించి సూర్యరాయాంధ్ర నిఘంటువు నిర్మాణానికి కారకుడైనాడు. అంతే కాకుండా ఎన్నో ప్రాచీన గ్రంథాలను పరిషత్తు ద్వారా లక్షల రూపాయలు వెచ్చించి ముద్రింపజేశాడు.

==సూర్యరాయాంధ్ర నిఘంటువు==
[[దస్త్రం:Rao Venkata Kumara Mahipati Surya Rao.jpg|thumbnail|150px| సూర్యారావు తైలవర్ణపటం]]
ఇతడు సాహిత్యప్రపంచానికి చేసిన సేవ అంతా ఒక ఎత్తు, నిఘంటు నిర్మాణానికి, ప్రచురణకు పాటుపడటం ఒక ఎత్తు. [[1911]], [[మే 12]] న జరిగిన ఆంధ్రసాహిత్యపరిషత్తు సభలో [[జయంతి రామయ్య]] పంతులు నిఘంటు నిర్మాణానికి చేసిన ప్రతిపాదన విని ఇతడు ఆ నిఘంటు నిర్మాణానికయ్యే మొత్తం వ్యయం భరించడానికి సంసిద్ధుడైనాడు. ఆ ప్రకటనకు సభలోని వారంతా ఆనందపడ్డారు. [[జయంతి రామయ్య]] ఆధ్వర్యంలో ప్రారంభమైన నిఘంటువుకు [[శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు]] అని నామకరణం చేశారు. ఈ నిఘంటు నిర్మాణానికి [[కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి]], [[తంజనగరము తేవప్పెరుమాళ్ళయ్య]], [[పురాణపండ మల్లయ్యశాస్త్రి]], [[పేరి పాపయ్యశాస్త్రి]], [[శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రి]], [[కూచి నరసింహం]], [[చర్ల నారాయణశాస్త్రి]], [[పిశుపాటి చిదంబర శాస్త్రి]], [[వెంపరాల సూర్యనారాయణశాస్త్రి]], [[దర్భా సర్వేశ్వరశాస్త్రి]], [[పిశుపాటి విశ్వేశ్వరశాస్త్రి]], [[ప్రయాగ వేంకటరామశాస్త్రి]], [[అమలాపురపు విశ్వేశ్వరశాస్త్రి]], [[బులుసు వేంకటేశ్వర్లు]], [[చిలుకూరి వీరభద్రశాస్త్రి]], [[దువ్వూరి సూర్యనారాయణశాస్త్రి]], [[మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి]], [[చెఱుకుపల్లి అప్పారాయశాస్త్రి]], [[ఇంద్రగంటి సూర్యనారాయణశాస్త్రి]], [[చిలుకూరి విశ్వనాథశాస్త్రి]], [[ఆకుండి వేంకటశాస్త్రి]], [[ఓలేటి సూర్యనారాయణశాస్త్రి]], [[పాలెపు వెంకటరత్నం]], [[సామవేదం శ్రీరామమూర్తిశాస్త్రి]], [[పన్నాల వేంకటాద్రిభట్టశర్మ]], [[దివాకర్ల వేంకటావధాని]] మొదలైన పండితులు పాటుపడ్డారు.

==కవిపండితపోషణ==
పిఠాపుర సంస్థాన చరిత్రలో రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు కాలం స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. ఇతని సంస్థానంలో ఆస్థాన పండితులుగా [[శ్రీపాద లక్ష్మీనరసింహశాస్త్రి]] (తర్కశాస్త్రం), [[తాతా సుబ్బరాయశాస్త్రి]] (వ్యాకరణం), [[చిలుకూరి నారాయణశాస్త్రి]], [[వేదుల సూర్యనారాయణశాస్త్రి]], [[గుదిమెళ్ల వేంకటరంగాచార్యులు]] (విశిష్టాద్వైతము), [[వడలి లక్ష్మీనారాయణశాస్త్రి]] (వేదం), [[దెందుకూరి నరసింహశాస్త్రి]] (వేదాంతం), [[తుమురాడ సంగమేశ్వరశాస్త్రి]] (సంగీతం) మొదలైన దిగ్దంతులు ఉండేవారు. ఈ పండితుల సహకారంతో ఇతడు ప్రతియేటా పీఠికాపుర సంస్థాన విద్వత్పరీక్షల పేరుతో విజయదశమి నవరాత్రి ఉత్సవాల సందర్భంలో శాస్త్ర పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారిని కానుకలతో సత్కరించేవాడు. ప్రబంధ రచనలో కూడా పోటీలు నిర్వహించేవాడు. ఆనాటి సుప్రసిద్ధ పండితులు ఎందరో ఈ పరీక్షలలో బహూకృతులైనవారే. [[పానుగంటి లక్ష్మీనరసింహారావు]], [[వేంకట రామకృష్ణ కవులు]] ఇతని ఆస్థానకవులుగా ఉన్నారు. వీరు కాక [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]], [[కందుకూరి వీరేశలింగం]], [[టేకుమళ్ళ అచ్యుతరావు]], [[దేవగుప్తాపు భరద్వాజము]], [[పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి|పెండ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి]], [[వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి]], [[శొంఠి భద్రాద్రి రామశాస్త్రి]], [[వేంకట పార్వతీశ కవులు]], [[దాసరి లక్ష్మణకవి]], [[వేదుల రామచంద్రకీర్తి]], [[శ్రీరాం వీరబ్రహ్మకవి]], [[మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి]], [[కూచి నరసింహము]], [[నడకుదుటి వీరరాజు]] మొదలైన ఎందరో కవులు ఇతనిచేత సన్మాన సత్కారాలను అందుకున్నారు.

==అంకితం పొందిన గ్రంథాలు==
ఇక్కడ ఇచ్చినవి ఆయన ప్రచురించిన పుస్తకాలలో ఒక పాక్షిక సూచీ మాత్రమే. ఇవి ఆయనకే అంకితమివ్వబడినవి:
{{col-begin| width=auto}}
{{col-break| gap=2em}}
{{ordered list| start=1|
| [[ఆదిపూడి సోమనాథరావు|ఆదిపూడి సోమనాథకవి]] - ''విజయేంద్ర విజయము''
| [[అల్లంరాజు సుబ్రహ్మణ్యం]] - ''సుభద్రాపరిణయము''
| [[చావలి రామ సుధి]] - ''సాహిత్య చింతామణి''
| [[చింతలపూడి ఎల్లన్న]] - ''విష్ణుమాయ - నాటకం''
| [[దాసరి లక్ష్మణస్వామి]] - ''అమృత కలశము'', ''భక్తజన మనోరంజనము'', ''వర్ణన రత్నాకరము''
| [[దేవగుప్తాపు భరద్వాజము]] - ''శ్రీ సూర్యారాయ శతకము''
| [[దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి]] - ''మహేంద్రవిజయము''
| [[దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి]] - ''కృష్ణ పక్షం'', ''నయనోల్లాసము'', ''యతిరాజ విజయము''
| [[కార్యమపూడి రాజమన్నారు]] - ''శ్రీ సూర్యారాయ ప్రభుదర్శనము''
| [[కందాళై శఠగోపాచార్యులు]] - ''పీఠపురి విజయము''
| [[కాశీభట్ల సుబ్బరాయ శాస్త్రి]] - ''శ్రీరామోత్తరేతి వృత్తము''
| [[కిళాంబి గోపాల కృష్ణమాచార్యులు]] - ''పిఠాపురమహారాజ చరితం''
}}
{{col-break|gap=2em}}
{{ordered list|start=13|
| [[కొటికలపూడి సీతమ్మ]] - ''గీతాసారం'', ''వీరేశలింగ చరిత్ర''
| [[కురుమెళ్ల వెంకటరావు]] - ''మా మహారాజుతో దూరతీరాలు''
| [[మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి]] - ''పార్థివాభ్యుదయ కావ్యం'', ''రత్న పాంచాలిక'', ''షడ్దర్శన సంగ్రహము'', ''సూర్య సప్తతి''
| [[మల్లాది సూర్యనారాయణ శాస్త్రి]] - ''కళాపూర్ణోదయం'', ''ఉత్తర హరివంశం''
| [[నడకుదుటి వీర్రాజు]] - ''విభ్రమ తరంగిణి''
| [[పడాల రామారెడ్డి]] - ''అంధ్ర ప్రదేశ్ విద్యా విషయక శాసనములు''
| [[పసుపులేటి వెంకన్న]] - ''సీతా విజయము''
| [[పురాణపండ మల్లయ్య శాస్త్రి]] - ''ఆంధ్ర సూత్ర భాష్యం'', ''శుక్రనీతి సారము''
| [[వేంకట రామకృష్ణ కవులు]] - ''ఆంధ్ర కథా సరిత్సాగరము'', ''దమయంతీ కల్యాణము'', ''మదాలస'', ''సువృత్తి తిలకము'', ''విశ్వగుణాదర్శము'', ''వ్యాసాభ్యుదయము''
| [[సర్వజ్ఞ సింగ భూపాలుడు]] - ''రత్నపాంచాలిక''
| [[శ్రీ తారకం]], [[ఎం.ఆర్. అప్పారావు]], [[వేంకట పార్వతీశ కవులు|వేంకట పార్వతీశ్వర కవులు]] - ''బ్రహ్మర్షి వెంకట రత్నం జీవిత సంగ్రహము - ఉపదేశాలు - కథలు''
| [[శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి]] - ''బ్రహ్మానందము''
}}
{{col-break|gap=2em}}
{{ordered list|start=25|
| [[టేకుమళ్ళ అచ్యుతరావు]] - ''విజయనగర సామ్రాజ్యము - అంధ్ర వాఙమయ చరితం'', ''Life of Pingali Surana''
| [[తాళ్లపాక తిరువెంగళనాథ]] - ''పరమయోగి విలాసము''
| [[ఉప్పలపు సుబ్బరాజ కవి]] - ''శ్రీసూర్యారాయ విజయము''
| [[వారణాసి వేంకటేశ్వర కవి]] - ''రామచంద్రోపాఖ్యానం''
| [[వావిలికొలను సుబ్బారావు|వావికొలను సుబ్బరాయ కవి]] - ''వాల్మీకి రామాయణం''
| [[వేదం వేంకటరాయశాస్త్రి]] - ''ఆంధ్ర నైషధ వ్యాఖ్య''
| [[ఓలేటి భాస్కర రామమూర్తి]] - ''శ్రీరామజననము''
| [[ఓలేటి పార్వతీశం]] - ''సువర్ణ మాల''
}}
{{col-end}}

==సన్మానాలు, సత్కారాలు==
* [[1929]], [[జనవరి 29]] న [[మద్రాసు]] గవర్నరు వెల్లింగ్‌టన్ ప్రభువు ఇతడికి మహారాజా అనే బిరుదును ఇచ్చి గౌరవించాడు.
* [[1938]], [[అక్టోబరు 1]] వ తేదీన [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] వారు గౌరవ డి.లిట్. పట్టాను ప్రదానం చేశారు.
* [[1953]]లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] వారు కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించారు.
==ఇవికూడా చదవండి==
* [[పిఠాపురం సంస్థానం జమీందారుల వంశవృక్షము]]

==మూలాలు==
* పిఠాపురం సంస్థానము కవిపండితపోషణ - సి.కమలా అనార్కలి - ప్రచురణ:1973 - పేజీలు 40-60 మరియు 315-402
* Sri R.V.K.M. Surya Rau Bahadur, Maharajah of Pithapuram by I. V. Chalapati Rao, Published by [[Telugu University]], Hyderabad, 1967.
* Velcheru Narayana Rao, Print and Prose in India's Literary History: Essays on the Nineteenth Century, http://books.google.co.in/books?id=2N046vzK824C&pg=PA157&dq=telugu+typewriter&hl=en&ei=WxumTP7vM5HqvQOUpKH9DA&sa=X&oi=book_result&ct=result&resnum=9&ved=0CE0Q6AEwCA#v=onepage&q=telugu%20typewriter&f=false

{{Authority control}}

[[వర్గం:తెలుగు ప్రముఖులు]]
[[వర్గం:1885 జననాలు]]
[[వర్గం:1964 మరణాలు]]
[[వర్గం:కళాప్రపూర్ణ గ్రహీతలు]]

04:24, 28 డిసెంబరు 2018 నాటి కూర్పు