సామర్లకోట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
rv
పంక్తి 81: పంక్తి 81:
* చందా్రభట్ల చింతామణి గణపతి శాస్త్రి - ఆధ్యాత్మిక గురువు
* చందా్రభట్ల చింతామణి గణపతి శాస్త్రి - ఆధ్యాత్మిక గురువు
* నేమాని భూషయ్య - పారిశ్రామికవేత్త
* నేమాని భూషయ్య - పారిశ్రామికవేత్త
* బొడ్డు భాస్కర్రామారావు - ఎమ్.ఎల్.సి. (టి.డి.పి.)
* డా.ఇ. సువార్తరాజు (క్రైస్తవ ప్రచారకులు)
*ఉండవిల్లి నారాయణమూర్తి
*[[మట్టపల్లి చలమయ్య]] -పారిశ్రామికవేత్త
* రామకృష్ణశ్రీవత్స వద్దిపర్తి -ప్రముఖకవి(ప్రాణం చప్పుడు,నడక కడలి వరకే నదికైనా నాకైనా,మట్టిమళ్ళీ పుట్టింది.వంటి కవితా సంపుటిలతో పాటు స్వీయముద్రతో అమ్మవారిపై కృతులు రాగప్రబంధం కావ్యాన్ని వెలువరించారు)


== గుండె వీరలక్ష్మి సోమరాజ ==
== గుండె వీరలక్ష్మి సోమరాజ ==

04:34, 28 డిసెంబరు 2018 నాటి కూర్పు

సామర్లకోట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పట్టణం. ప్రముఖ రైల్వే జంక్షన్ కూడా. ఈ వూరి అసలు పేరు శ్యామలదేవికోట. రాను రాను ఈ పేరు మారి శ్యామలకోట, సామర్లకోట అయ్యింది. పిన్ కోడ్: 533440. ఒకప్పుడు ఇక్కడ శ్యామలాంబ గుడి వుండేది. ఆ గుడి ఇప్పుడు వుందో లేదో తెలీదు. ఈ ఊరు ఇప్పుడు భీమేశ్వరాలయానికి ప్రసిద్ధి చెందింది. ఇది పంచారామాలలో ఒకటి. దీనిని కుమార భీముడనే చాళుక్య రాజు నిర్మించాడు. ఇక్కడి శివలింగం అలా పెరిగి పోతుంటే పైన మేకు కొట్టారని చరిత్ర. కందుకూరి వీరేశలింగం పంతులు వ్రాసిన రాజశేఖర చరిత్రం అనే పుస్తకంలో ఈ ఊరి చరిత్ర ఉంది.

భౌగోళికం

సామర్లకోట మూస:Coor d.[1] సముద్రమట్టం నుండి సగటు ఎత్తు 9 మీటర్లు (32 అడుగులు)

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 1,37,979 - పురుషులు 68,663 - స్త్రీలు 69,316

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14

జనవిస్తరణ

2001 జనగణన ప్రకారం సామర్లకోట పట్టణం జనాభా 53,402. ఇందులో మగవారు 50%, ఆడువారు 50%. ఇక్కడి సగటు అక్షరాస్యత 60%. అందులో మగవారి అక్షరాస్యత 65% మరియు ఆడువారి అక్షరాస్యత 56%. మొత్తం జనాభాలో 11% వరకు 6 సంవత్సరాల లోపు పిల్లలు.

రవాణా

దస్త్రం:APtown Samarlakota RailwayStn.JPG
సామర్లకోట రైల్వేస్టేషన్

హౌరా -చెన్నై రైలు మార్గంలో సామర్లకోట ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్. ఇక్కడినుండి కాకినాడ రైలు మార్గం చీలుతుంది. కాకినాడ నుండి జగ్గంపేట, ప్రత్తిపాడు, రాజానగరం మరియు రాజమండ్రి లకు ముఖ్య రహదారి కూడలి. రాష్ట్ర ముఖ్య రహదారి (సంఖ్య 54) సామర్లకోట మీదుగా పోవుచున్నది.

దర్శనీయ స్థలాలు

1. కుమరారామ మందిరం (శ్రీ భీమేశ్వరాలయం) 2. శ్రీ మాండవ నారాయణస్వామి ఆలయం 3. శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం శ్రీ మాండవ్య నారాయణస్వామి వారి దివ్యక్షేత్రము

పావన గోదావరి నది సప్త పాయలలో ఒకటైన తుల్యభాగనదీ తీరాన సామర్లకోటలో వెలసిన శ్రీ మాండవ్య నారాయణస్వామి దేవాలయం 'దక్షిణ బదరీ' గా అత్యంత ప్రాశస్త్యం పొందింది. కోరిక లీడేర్చే కొంగు బంగారంగా, భక్తుల పాలిట కల్పవల్లిగా ఈ దేవాలయం ప్రసిద్ధి గాంచింది. ప్రాచీన సంస్కృతీ వైభవానికి అద్దం పడుతున్న శ్రీ మాండవ్యనారాయణ స్వామి ఆలయం పవిత్రతకు, ప్రశాంతతకు నిలయంగా భాసిల్లుతోంది.

త్రేతాయుగంలో దండకారణ్య ప్రాంతంగా పిలువబడే ఈ ప్రాంతంలో తపమాచరించిన మాండవ్య మహర్షిచే ప్రతిష్ఠించబడినందున స్వామికి మాండవ్య నారాయణ స్వామి అనే పేరు ప్రసిద్ధమైంది. విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో విగ్రహం పాదాల చెంత మాండవ్య మహర్షి 'పరుసవేదిని' ఉంచారని పురాణ గాథ (పరుసవేదిని స్పృశించిన ఏ వస్తువైనా బంగారంగా మారుతుంది). పరుసవేదిని గమనించిన ఒక వ్యాపారి తన 15 మంది అనుచరులతో విగ్రహాన్ని తవ్వి పరుసవేదిని కాజేయబోగా ఒక మహాసర్పం ఆ స్థానంలో ప్రత్యక్షమై విశజ్వాలలతో వారిని నిర్జించినట్లు స్థానికులు కథలుగా చెబుతారు.

మాండవ్య మహర్షి ప్రతిష్ఠించిన ఈ ఆలయాన్ని చోళరాజైన 2వ పులకేశి మునిమనుమడైన విజయాదిత్యుడు క్రీ||శ||655 నం||లో నిర్మించాడని ఈ ఆలయ చారిత్రకగాధ. తదనంతరం శ్రీ స్వామివారి విగ్రహానికి పది అడుగుల దూరంలో ఎడమవైపున భోగమండపంలో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని శ్రీ విజయాదిత్యుడు ప్రతిష్ఠించారు. మహారాజు కలలో కనిపించిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం సముద్రంలో జాలర్లకు లభ్యమైంది. మత్స్యకారులు ఆ విగ్రహాన్ని రాజావారికి సమర్పించగా ఆయన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఇక్కడే ప్రతిష్ఠించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.

ఆలయ స్తంభాలపై ప్రాకృత భాషలో అనేక శిలాశాసనాలు కనిపిస్తాయి. అలనాటి శిల్పులు కళావైభవానికి, యాంత్రిక ప్రతిభకు, వాస్తు విజ్ఞానానికి, సాంకేతిక పరిజ్ఞానానికి ఈ ఆలయం ఒక ప్రతీకగా నిలుస్తుంది. ఉత్తరాయణం - దక్షిణాయనం మధ్య కాలంలో శ్రీ నారాయణస్వామి వారి పాదాలపై సూర్యకిరణాలు నేరుగా పడటం అలనాటి ఆలయ నిర్మాణ కౌశలంగా చెప్పవచ్చు.

దేవాలయం స్తంభాలపై ఉన్న శిల్పాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. హయగ్రీవస్వామి, శేషసాయి, యోగమండపంలో వటపత్రసాయి, ప్రహారీ చుట్టుగోడలపైన గరుత్మంతుని అధిరోహించిన అష్టబాహువులు గల నారాయణస్వామి,క్షేత్రపాలకునిగా రుద్రరూపంలో మహాశివుడు, యోగనారసింహుడు, అనంత పద్మనాభుడు, ఇలా పలు శిల్పాలతో ఈ క్షేత్రం భక్తులకి కనువిందు చేస్తుంది. ప్రాచీన కళా సాంస్కృతీ వైభవాలకు దర్పణం పట్టే ఈ ఆలయంలో పలు చారిత్రక ఆధారాలు కాలగర్భంలో కలిసిపోవటం ఆందోళన కలిగించే విషయం.

అలనాటి రెడ్డిరాజులు 80 పుట్లు భూములను ఇచ్చినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నా అవన్నీ కాలక్రమంలో అంతరించి పోగా పిఠాపురం మహారాజు శ్రీరాజా రావు గంగాధర రామారావు బహద్దూర్ గారు సమర్పించిన 18 ఎకరాల భూమి స్వామివారి ఆస్తిగా దేవాదాయశాఖ ఆధీనంలో ఉంది.

ఈ ఆలయం ప్రశాంతతకు ప్రతీక. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు పలురంగాల్లో ఉన్నతోద్యోగులుగా స్థిరపడతారనేది స్థానికుల్లో ప్రగాఢ విశ్వాసం.

సామర్లకోటలో ఉన్న పంచారామ క్షేత్రమైన కుమారారామం సమీపంలో విరాజిల్లుతున్న దక్షిణ బదరీగా పేరొందిన శ్రీ మాండవ్య నారాయణస్వామి ఆలయాన్ని దర్శించేందుకు రాష్ట్రేతర ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో వచ్చి భక్తులు స్వామిని దర్శించుకుని శ్రీ స్వామివారి ఆశీస్సులు పొందుతున్నరు.

శ్రీ మాండవ్య నారాయణస్వామి ఆలయంలో మహాయోగులు శ్రీమాన్ ఎక్కిరాల రామస్వామి ఆచార్యులు వారు తపస్సు చేసి అద్భుతమైన దైవశక్తులు సాధించారని స్థానికులు చెబుతారు.

వైఖానసులు, గౌతమస గోత్రజులు చక్రవర్తుల ఇంటిపేరుగలవారు రెడ్డిరాజుల కాలంనుండి ఆలయ అర్చకులుగా వంశపారంపర్యంగా స్వామివారి సేవలో తరిస్తున్నారు.

చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన స్వామివారి పంచాహ్నిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. దనుర్మాసం, శ్రావణమాసం, కార్తీక మాసాల్లోను, ఇతర అన్ని పర్వదినాలలో స్వామివారికి విశేషార్చనలు వైఖానస ఆగమోక్తంగా జరుగుతాయి.

కుమారారామ మందిరం

పంచారామాలలో ఒకటయిన ఈ కుమారభీమారామము క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 60 అడుగుల ఎత్తున రెండంతస్తుల మండపంగా ఉంటుంది. పై అంతస్తులోకి వెళ్ళి పూజలు జరపాలి. మహాశివరాత్రి ఉత్సవం ఇక్కడ ముఖ్యమైన పర్వదినం.

దేవాలయ ప్రదానద్వారము
దేవాలయ ఆవరణ లోపలిభాగం

సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ద్రాక్షరామ దేవాలయాన్నీ ఆయనే నిర్మించాడు. కనుక ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటేరకంగా మరియు నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది.

ఈ మందిరం నిర్మాణం 892లో ప్రారంభమై సుమారు 922 వరకు సాగింది.ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. ఇక్కడి శివలింగం సున్నపురాయితో చేయబడి తెల్లని రంగులో ఉంది. 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్నిర్మించారు. ఇక్కడ కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చును. ఇంకా ఇక్కడి అమ్మవారు బాలా త్రిపుర సుందరి. శివుడు కాలభైరవుని రూపంలో కూడా ఉన్నాడు. 1147 - 1494 మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాల గురించిన శాసనాలున్నాయి.

పరిశ్రమలు

  • రిలయన్స్ ఎనర్జీ లిమిటెడ్ వారి 2220 మెగావాట్ల విద్యుత్ కేంద్రము
  • రాక్ సిరామిక్స్
  • నవభారత్ వెంచర్స్ వారి దక్కన్ షుగర్స్
  • శ్రీ వెంకటా్రమా ఆయిల్ ఇండసీ్ట్రస్ - రైస్ బ్రాన్ నూనె తయారీ
  • అంబటి సుబ్బన్న అండ్ కో - నూనె తయారీ
  • పి.ఎస్. తార్పాలిన్స్ - పి.ఎస్. బ్రాండ్ తార్పాలిన్స్
  • విమల్ డిృ౦క్స్

1949 నుండి అభిసారిక అనే తెలుగు లైంగిక సమాచార పత్రిక ఇక్కడినుండి ప్రచురింపబడుతున్నది.

  • బిందు జాబితా అంశం

ప్రముఖులు

  • ప్రతివాది భయంకరాచారి - స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నాడు.
  • చాగంటి సన్యాసిరాజు - నాటకరంగం
  • దర్భా వేంకటరామశాస్త్రి (రాంషా)- రచయత, అభిసారిక పత్రిక ఎడిటర్
  • సమయం వీర్రాజు - ఉపన్యాసకుడు
  • డా.బేతిన వెంకటరాజు
  • డా. చాగంటి శ్రీరామరత్నరాజు
  • డా. అప్పల వెంకటశేషగిరిరావు
  • డా. చందలాడ అనంతపద్మనాభం
  • డా. దర్భా
  • వి.ఆర్. పూషా - అభిసారిక ఎడిటర్
  • చందా్రభట్ల చింతామణి గణపతి శాస్త్రి - ఆధ్యాత్మిక గురువు
  • నేమాని భూషయ్య - పారిశ్రామికవేత్త

గుండె వీరలక్ష్మి సోమరాజ

శ్రీ గుండె వీర లక్ష్మీ సోమరాజు గారు సామర్లకోటలో పిఠాపురం రోడ్డులో గల బ్రౌన్ పేటలో జన్మించారు .వీరి మాతా పితలు గుండె సోమ వీర్రాజు, వరలక్ష్మి గార్లు,తండ్రి స్థానిక పంచదార మిల్లులో కార్మికునిగా పనిచేసి విధినిర్వహణలోప్రమాదం వల్ల ప్రాణాపాయం నుండి బయట పడ్డారు, కాని నడవలేక భార్య సహకారంతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు.సోమరాజు గారి తండ్రి సోమ వీర్రాజు గారు పనిచేసే పంచదార మిల్లులో కార్మిక నాయకునిగా మంచి పేరు ఉంది ఈయన గురువు స్వర్గీయ ఉండవిల్లి నారాయణ మూర్తి గారు .. ఆ తర్వాత కాలంలో మార్క్సిస్టు పార్టీలో చురుకైన కార్యకర్తగా, నాయకునిగా ఎదిగి పట్టణ సహాయ కార్యదర్శిగా కూడా ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసారు దీనివల్ల సోమరజుగారు చిన్నతనం నుండి ఆంధ్ర ప్రజా నాట్యమండలి సభ్యునిగా కళలను తనలో ఇముడ్చుకున్నారు.సోమరాజు గారు స్థానిక సీబియం స్కూల్లో ఉన్నత విద్య, జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారు, అక్కడే తెలుగు భాష మీద మక్కువ కలిగి డిగ్రీ కూడా తెలుగు ప్రత్యేక సబ్జక్తుగా తీసుకున్నారు ఆపై ఎమ్మే కూడా తెలుగు చేసారు . ఇక కాకినాడలో ఇన్ కేబుల్ ద్వారా టెలివిజన్ లో వార్తలు చదవడం అక్కడే ప్రారభించారు .2001 నుండి ఈ నాటి వరకు అందరిని మెప్పిస్తూ తెలుగు భాషకు గౌరవాన్ని తెస్తున్నారు అయన జర్నలిసంలో కూడా డిగ్రీలు పుచ్చుకున్నారు . సామర్లకోట లోనే జనస్పందన పత్రిక ద్వారా అతిపిన్న వయసులో పాత్రికేయునిగా అందరి మన్ననలను పొందారు . సోమరాజు గారిని జర్నలిసం వైపు తిప్పిన వారు శ్రీ బీ బీ రామకృష్ణ గారు . ఇక జర్నలిసంలో తెగువ ఉండాలని ధైర్యం చెప్పిన వారు శ్రీ టీ ఎస్ ఎన్ రాజు గారు .ఈయన శిరోముండనం కేసును వెలుగులోనికి తెచ్చినవారు .సోమరాజు గారు హైదరాబాద్ కు వెళ్లి అక్కడ విస్సా టీవిలో తొలిసారి వార్తలు చదివారు, ఆ తర్వాత అర్ టీవి లోను, దూరదర్శన్ లో వ్యవసాయ సమాచారాన్ని చదివే వ్యాఖ్యాతగా పనిచేసారు, ఇప్పుడు జెమినీ న్యూస్ లో న్యూస్ రీడర్ గా పనిచేస్తున్నారు .సోమరాజు గారిని అవార్డులు వెతుక్కుంటూ వచ్చి వరించాయి . 2012 లో ఉత్తమ న్యూస్ రీడర్ గా ఆరాధన సంస్థ నుండి, ఉత్తమ కవిగా శ్రీ కిరణ్ సాంస్కృతిక సమాక్య నుండి, ఉత్తమ జర్నలిస్టుగా కార్మిక రత్న పురస్కారాన్ని ఐ ఎన్ టి యు సి నుండి, ది స్టేట్ బెస్ట్ సిటిజన్ గా విశాఖపట్నంలో గల ఏ పీ కల్చరల్ సొసైటీ నుండి అవార్డులు పోడుకున్నారు, అలాగే ఆయనకు ఆంధ్ర రత్నం అవార్డును ప్రకటించినపుడు అంత భారం ఈ చిన్నవయసుకు మంచిది కాదని సున్నితంగా తిరస్కరించారు ..సోమరాజు గారు ఎప్పుడు అమ్మ నాన్నల తర్వాతే ఎవరైనా అని చెబుతారు .చిన్నతనమ్ నుండి ఏసుక్రీస్తును విశ్వసించడం వల్ల సేవ అన్నా సేవా కార్యక్రమాలన్న ఆయనకు చాలా ఇష్టం . అందుకే ఆయన కాకినాడలో ఇన్ కేబుల్ లో పనిచేసిన రోజుల్లో శ్రీ జ్యోతుల వెంకటేశ్వర రావు గారి ఆద్వర్యంలో చిరంజీవి వాలంటరీ బ్లడ్ దోనర్స్ క్లబ్ ద్వారా ఎంతో మందికి రక్తాన్ని అందించారు . ఎన్నో కాలేజీల్లో కెంపులు పెట్టించి ఎందరినో రక్త దాతలుగా మార్చారు .


మూలాలు