అంట్యాకుల పైడిరాజు: కూర్పుల మధ్య తేడాలు
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 17: | పంక్తి 17: | ||
[[వర్గం:ప్రపంచ చిత్రకారులు]] |
[[వర్గం:ప్రపంచ చిత్రకారులు]] |
||
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]] |
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]] |
||
[[వర్గం:విజయనగరం జిల్లా ప్రముఖులు]] |
10:42, 9 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
అంట్యాకుల పైడిరాజు విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు మరియు శిల్పి.
ఈయన నవంబర్ 1, 1919న బొబ్బిలిలో రాజయ్య, నరసమ్మ దంపతులకు జన్మించాడు. అన్నయ్య అప్పారావు చిత్రకారుడు కావడం వల్ల పైడిరాజు అతడిని అనుకరించి చిన్నప్పటి నుండే సుద్దముక్కతో చూసిన ప్రతి బొమ్మనీ నేలమీద చిత్రించడం అలవాటయింది. మద్ర్రాసు ప్రభుత్వ చిత్రకళాశాలలో డిప్లమా పొందాడు. ప్రముఖ బెంగాలీ చిత్రకారుడు, శిల్పి, దేవీప్రసాద్ రాయ్ చౌదరి పైడిరాజు గురువు.
ఈయన 1949లో విజయనగరము లో చిత్రకళాశాలను నెలకొల్పాడు. పైడిరాజు చిత్రాలు లండన్, పోలెండ్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, అమెరికా మరియు సింగపూర్ కు చెందిన ప్రభుత్వ మరియు ప్రయివేటు ఆర్ట్ గ్యాలరీలలో వెలుగులీనుతున్నాయి. వైజాగ్ బస్ స్టాండు దగ్గర వున్న గురజాడ అప్పారావు విగ్రహం పైడిరాజు చేసినదే.
అనాటమీ స్కెచెస్ వేయడంలో పైడిరాజు అందెవేసిన చేయి. తైలవర్ణ చిత్రరచనలో ఈయనది ఒక ప్రత్యేకశైలి. ఈయన చిత్రించిన 'పేరంటం', 'అలంకరణ', 'బొట్టు' మున్నగు అద్భుత కళాఖండాలు కేంద్ర లలితకళా అకాడమీ బహుమతులు గెల్చుకున్నాయి.
కవిత్వంలో కూడా చక్కని అభినివేశం గల పైడిరాజు 1986 సంవత్సరంలో డిసెంబరు 26న విశాఖపట్నంలో తనువు చాలించారు.