వంగోలు వెంకటరంగయ్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి +{{Authority control}}
చి →‎ఇతర లింకులు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 62: పంక్తి 62:
[[వర్గం:తెలుగు పరిశోధకులు]]
[[వర్గం:తెలుగు పరిశోధకులు]]
[[వర్గం:నెల్లూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:నెల్లూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:నెల్లూరు జిల్లా వ్యక్తులు]]

14:32, 20 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

ఒంగోలు వెంకట రంగయ్య
వంగోలు వెంకటరంగయ్య
జననంవంగోలు వెంకటరంగయ్య
1867, అక్టోబరు 18
నెల్లూరు
మరణం1949, జూన్ 9
ప్రసిద్ధిపండితుడు, బహుశాస్త్రవేత్త
తండ్రివంగోలు శేషాచలపతి
తల్లిసీతమ్మ

వంగోలు వెంకటరంగయ్య ఆంధ్రవిద్యావయో వృద్ధులలో గణ్యులు. వీరు బహుభాషాకోవిదులు. ఆంధ్రాంగ్ల గీర్వాణములయందును, కన్నడము, తమిళము, హిందీ, ఉర్దూ, పారసీక భాషలయందు వీరు పాండిత్యము సంపాదించారు. వీరు "భారతి" వంటి సుప్రసిద్ధసారస్వత పత్రికాముఖముల ప్రకటించిన వ్యాసములు శతాధికములు. వీరు వ్రాసిన ప్రసిద్ధ వ్యాసములు - రామాయణము లోని వానరులు నరులు కారా? నిజముగా వానరులే అగుదురా? అను విషయములను గూర్చియు, ప్రాచీన కాలమున సంస్కృతము దేశభాషగా నుండెనా? ఆంధ్రులెవరు? అను సమస్యలనుద్ధేశించియు, ఆనందరంగరాట్చందమును గూర్చియు, శ్రీ పంతులు గారు వ్రాసిన వ్యాసములు అమూల్యములు.

విశేషాలు

వీరు పండిత వంశములో వంగోలు శేషాచలపతి, సీతమ్మల మువ్వురు సంతానంలో కనిష్ఠ పుత్రుడిగా 1867, అక్టోబరు 18వ తేదీన జన్మించారు[1]. వీరు నెల్లూరులోని హిందూ స్కూలు (వెంకటగిరి రాజా స్కూలు)లో మెట్రిక్యులేషన్ వరకు చదివి, తరువాత బి.ఎ. మద్రాసు క్రిస్టియన్ కళాశాలలోను, బి.ఎల్. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలోను చదివారు. ఇరువది రెండేండ్లలోపనే వీరు బి.ఏ, బి.యల్ కాగలిగి నెల్లూరులో న్యాయవాదిత్వములో ప్రవేశించారు. కేవలం చదువులో మాత్రమే కాక వీరు శారీరకవ్యాయామములలో ముఖ్యముగా కత్తిసాము, కర్రసాము, కుస్తీ విద్యలలో ప్రావీణ్యులు.

వీరు తమ స్నేహితులు కొందరితో అమెచ్యూర్ డ్రమెటిక్ సొసైటీ అనే నాటకరంగ సంస్థను స్థాపించి ఇంగ్లీషు, తెలుగు, సంస్కృత నాటకాలను ప్రదర్శించారు. వేదము వెంకటరాయశాస్త్రిగారి ప్రతాపరుద్రీయము నాటకాన్ని మొదటిసారి ప్రదర్శించినది ఈ సంస్థే. వీరు ప్రత్యేకంగా నాటకాలలో నటించకున్నా నటులను తీర్చిదిద్దడంలో, నాటకాల ఎంపికలో ప్రధాన పాత్రను పోషించేవారు. 1917లో నెల్లూరులో జరిగిన ఐదవ ఆంధ్రజనమహాసభకు ఆహ్వానసంఘ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సభలలో వీరి స్వాగతోపన్యాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతున్నది.

వీరు గొప్ప పరిశోధకులు. బ్రాహ్మణక్రాకశాసనము, వెలిచర్ల శాసనము, మున్నగు శాసనములను వీరు ప్రకటించిరి. ఆయుర్వేదసూత్రములు అనే చిన్న గ్రంథాన్ని సవరించి సటీకతో ప్రకటించారు. చారిత్రికదృష్టితో "కొందరు నెల్లూరు గొప్పవారు" అను శీర్షికతో 'రాజమంత్రప్రవీణ - పల్లె చెంచల్రావుగారు', 'వేదము వేంకటరాయశాస్త్రులు గారు' , 'వెన్నెలకంటి దరరామయ్య గారు', 'శనగవరపు పరదేశిశాస్త్రులు గారు'వంటి మహనీయుల పవిత్రజీవిత చరిత్రములను వ్రాసి ప్రచురించారు. మరియు భరతముని ప్రణీత నాట్యశాస్త్రములోని చతుర్ధాధ్యాంతర్గత తాండవ లక్షణమును విలక్షణముగా వివరములతో ఆంగ్లేయ భాషలోకి అనువదించారు. ఈ గ్రంథము1936సం. లో అన్నామలై ఆచార్యునిగా నుండిన మాన్యులు శ్రీ. బిజయేటి నారాయణస్వామి నాయుడు గారు ప్రకటించినారు. (This book was available in Ethnological Dance centre- New York- Is the school of Natya Founded by La Meri and Ruth St. Denis). సంస్కృత రామాయణంలోని లోకోక్తులు, శబ్దరత్నాకరములో లేని కొన్ని మాటలు వాటి అర్థములు వీరి అముద్రిత రచనలలో కొన్ని.

వీరు ఆజానుబాహువులు. మంచి దేహపుష్ఠి కలవారు. నిరంతరవిద్యావ్యాసంగపరాయణులు. వీరు తమ 82వ యేట 1949, జూన్ 9న మరణించారు.

మూలాలు

1.1950 భారతి మాస సంచిక.

  1. కారంశెట్టి, వెంకటరంగయ్యశెట్టి (30 June 1950). "విజ్ఞాననిధి, పండితుడు, బహుభాషాపారంగతుడు స్వర్గీయ వంగోలు వెంకట రంగయ్య పంతులుగారు" (PDF). జమీన్‌రైతు. 22 (26): 5. Retrieved 5 December 2017.

ఇతర లింకులు