ఎం. ఎస్. నారాయణ: కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →బయటి లింకులు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి వర్గం:కోస్తాంధ్ర ప్రముఖులు తొలగించబడింది; వర్గం:కోస్తాంధ్ర వ్యక్తులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 201: | పంక్తి 201: | ||
[[వర్గం:నంది ఉత్తమ హాస్యనటులు]] |
[[వర్గం:నంది ఉత్తమ హాస్యనటులు]] |
||
[[వర్గం:తెలుగు సినిమా రచయితలు]] |
[[వర్గం:తెలుగు సినిమా రచయితలు]] |
||
[[వర్గం:కోస్తాంధ్ర |
[[వర్గం:కోస్తాంధ్ర వ్యక్తులు]] |
||
[[వర్గం:2015 మరణాలు]] |
[[వర్గం:2015 మరణాలు]] |
||
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా వ్యక్తులు]] |
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా వ్యక్తులు]] |
04:30, 21 ఏప్రిల్ 2019 నాటి కూర్పు
ఎమ్. ఎస్. నారాయణ | |
---|---|
జననం | మైలవరపు సూర్యనారాయణ 1951 ఏప్రిల్ 16 |
మరణం | 2015 జనవరి 23 | (వయసు 63)
జీవిత భాగస్వామి | కళాప్రపూర్ణ |
పిల్లలు | విక్రమ్, శశికిరణ్ |
తల్లిదండ్రులు | మైలవరపు బాపిరాజు (తండ్రి), వెంకటసుబ్బమ్మ (తల్లి) |
ఎమ్. ఎస్. నారాయణ (ఏప్రిల్ 16, 1951 - జనవరి 23, 2015) గా పిలువబడే మైలవరపు సూర్యనారాయణ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు మరియు దర్శకుడు. వీరు ఇంతవరకు దాదాపు 700 [1] చిత్రాలలో నటించారు. కొడుకు మరియు భజంత్రీలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తాగుబోతు పాత్రలను పోషించడంలో ప్రసిద్ధుడు.
నేపథ్యం
గతంలో ఈయన భీమవరంలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశాడు. శ్రీకాంత్, కృష్ణంరాజు నటించిన మా నాన్నకు పెళ్ళి చిత్రం ద్వారా తెలుగు చలన చిత్ర రంగానికి పరిచయమయ్యాడు. అంతకుముందు సినీ కథా రచయితగా పనిచేశాడు. కథా రచయితగా పేరుపడ్డ తొలిచిత్రం వేగుచుక్క పగటిచుక్క.[2]
వ్యక్తిగత జీవితము
బాల్యం, విద్యాభ్యాసం
వీరి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా లోని నిడమర్రు. వీరిది మధ్యతరగతి రైతు కుటుంబము. వీరి తండ్రి మైలవరపు బాపిరాజు రైతు, తల్లి వెంకట సుబ్బమ్మ గృహిణి. వీరి కుటుంబములో మొత్తం పది మంది పిల్లలు. ఏడుగురు అబ్బాయిలు మరియు ముగ్గురు అమ్మాయిలు. వీరి కుటుంబం ఆర్థికంగా చితికిపోవడంవల్ల పొలంపనులకు వెళ్ళవలసి వచ్చేది. ఎంతో పట్టుదలతో తండ్రికి ఇష్టం లేకున్నా ఇల్లందులో చదువు కొనసాగించారు. పదవ తరగతి పూర్తి అయిన తరువాత నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న పత్తేపురంలోని ప్రాచ్య కళాశాలలో ఐదు సంవత్సరాల భాషా ప్రవీణ కోర్సు చేశారు.
పత్తేపురంలోని మూర్తిరాజు కళాశాలలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ లెక్చరర్గా పని చేసేవారు. ఆయన వద్ద ఎంఎస్ శిష్యరికం చేశారు. అది ఆయన జీవితంలో రచయితగా స్థిరపడడానికి పునాది వేసిందంటారు.తన క్లాస్మెట్ అయిన కళాప్రపూర్ణను ప్రేమించగా పరుచూరి వారే దగ్గరుండి పెళ్లి చేయించడం విశేషం.
వీరిది కులాంతర ప్రేమ వివాహము. భార్య కళాప్రపూర్ణ, కుమార్తె శశికిరణ్, కుమారుడు విక్రమ్ ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కె.జి.ఆర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. కళారంగంపై ఉన్న ఆస్తకితో అధ్యాపకుడి పదవికి రాజీనామా చేసి నటనారంగంలోకి అడుగులు వేశారు. మొదటగా రచయితగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఎనిమిది చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఎమ్మెస్ నటించిన తొలి సినిమా యమ్.ధర్మరాజు ఎం.ఎ. వీరి కుమారుడు విక్రం కొడుకు చిత్రం ద్వారా తన చిత్ర ప్రస్థానాన్ని ప్రారంభించాడు.
సినిమా షూటింగ్స్లో ఎంత బిజీగా ఉన్నా రెండు మూడు రోజులు ఖాళీ సమయం దొరికితే వెంటనే నిడమర్రులో వాలిపోయేవారు.తన స్నేహితులు, సోదరులతో కలిసి గ్రామంలో సామాన్యుడిగా తిరిగేవారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటూ గ్రామ నాయకులతో ఎపుడూ చెపుతుండేవారు. నిడమర్రు అభివృద్ధిలో తన వంతు సహకారం అందిస్తానని అంటుండేవారు.అంతలోనే 2015 లో జిల్లాలో సంక్రాంతి పండుగకు హాజరై ఇక అస్వస్థతకు గురై తిరిగిరాని లోకాలకు తరలిపోయారు.
నాటకాలు
తల్లి సుబ్బమ్మ ప్రోత్సాహంతో ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఎంఎస్ ఖాళీ రోజుల్లో మాత్రం నాటకాలు వేస్తు గడిపేవారు. తన స్నేహితులతో కలిసి బాలనాగమ్మ, భట్టి విక్రమార్క వంటి పౌరణిక నాటకాలు వేశారు. సాంఘిక నాటకాలకు తానే పాత్రలను ఎంపిక చేసుకుని దర్శకుడిగా నాటకాలు వేసి అందర్ని మెప్పించేవారు. భీమవరం కేజీఆర్ఎల్ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పని చేస్తున్న సమయంలో దివిసీమ ఉప్పెన సంభవించగా తోటి కళాకారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో నాటకాలు వేసి విరాళాలు సేకరించి దివి సీమ ప్రజలకు అందించారు.[3]
సినీ ప్రస్థానము
1996లో పెదరాయుడు చిత్రంలో తొలిసారిగా వెండి తెరపై కనిపించారు. అయితే అంతుకు ముందే వెగుచుక్క-పగటి చుక్క, ప్రయత్నం, ముగ్గురు మొనగాళ్లు, పేకాట పాపారావు చిత్రాలకు అద్భుతమైన కథలు అందించి సినీ రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. దర్శకుడు రవి రాజ పినిశెట్టితో రుక్మిణీ సినిమా కథ చర్చల్లో ఆయన హావ భావ ప్రదర్శనకు ముగ్దుడై హాస్యనటుడిగా ఎమ్ ధర్మరాజు ఎం. ఏ. అవకాశం కల్పించారు. పుణ్యభూమి నాదేశం, రుక్మిణి (సినిమా) చిత్రాల్లో చిన్న పాత్రలు వేసినప్పటికి 1997లో ఈవీవీ దర్శకత్వంలో మా నాన్నకు పెళ్ళి సినిమాలో తాగుబోతు తండ్రి పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. దర్శకులు తనకు ఇచ్చిన పాత్రకు తానే సంభాషణ రాసుకుని సినిమాల్లో పలికేవారు.[4]
పేరు పడ్డ సంభాషణలు
- ఏం చేస్తున్నావ్ ... ఏం చేస్తున్నావ్ ... అని మాటిమాటికీ అడగొద్దు. ఏదో ఒకటి చేసేయగలను (నువ్వు నాకు నచ్చావ్)
- అమ్మా ... నీ కళ్ళేవీ? (నువ్వు నాకు నచ్చావ్)
- షేక్ ఇమామ్ (శివమణి)
- సోడా కొట్టడం అంటే పీజీ పాసైనంత వీజీ కాదు (బన్ని)
- ఇక్కడేం జరుగుతుందో నాకు తెలియాలి (అతడు)
తాగుబోతు పాత్రలతో ప్రసిద్ధులు
ఎమ్మెస్ నారాయణ తన నట జీవితంలో 5 నంది అవార్డులు ( రామసక్కనోడు, మానాన్నకు పెళ్ళి, సర్దుకుపోదాం రండీ, శివమణి, దూకుడు), 2 సినీ గోయెర్స్ అవార్డులు పొందారు. దూకుడు చిత్రానికిగాను ఉత్తమ సహాయనటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. 200 చిత్రాల్లో తాగుబోతు పాత్రల్లో ఒదిగిపోయారు. గ్లాస్ చేతిలో పట్టుకున్న ప్రతిపాత్రను ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారు. అదేవిధంగా పేరడీ పాత్రలకు ఎమ్మెస్ పెట్టింది పేరు. దూకుడు, డిస్కో, దూబాయ్ శీను తదితర చిత్రాల్లో పేరడీ, నటనా వైవిధ్యం ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు.
చలన చిత్ర ప్రస్థానము
నటించిన చిత్రాల పాక్షిక జాబితా
సంవత్సరం | పేరు | పాత్ర | ఇతరత్రా విశేషాలు |
---|---|---|---|
2015 | పటాస్ | సునామీ సుభాష్ | |
2014 | పాండవులు పాండవులు తుమ్మెద | nayak 2014 | |
2013 | చండీ | ||
మిస్టర్ పెళ్ళికొడుకు | |||
షాడో (2013 సినిమా) | |||
దూకుడు (సినిమా) | |||
2012 | దేవరాయ | ||
తూనీగ తూనీగ | |||
2011 | తెలుగమ్మాయి | ||
2010 | తిమ్మరాజు | ||
నాగవల్లి (2010 సినిమా) | పాములు పట్టే వ్యక్తి | ||
మనసారా | |||
ఏమైంది ఈవేళ | |||
సరదాగా కాసేపు | |||
తకిట తకిట | |||
2008 | భజంత్రీలు | దర్శకుడు | |
యమదొంగ | అతిథి పాత్ర | ||
2006 | భాగ్యలక్ష్మి బంపర్ డ్రా | ఈ చిత్రం హిందీ చిత్రమైన మాలామాల్ వీక్లీ కి అనువాదము. | |
2005 | ఎవడి గోల వాడిది | పూర్తి హాస్య చిత్రం | |
అదిరిందయ్యా చంద్రం | |||
2004 | నేనున్నాను | ||
2003 | అమ్మా..నాన్న..ఓ తమిళ అమ్మాయి | ||
నేను పెళ్ళికి రెడీ | |||
శ్రీరామచంద్రులు | |||
శివమణి | అతిథి పాత్ర | ||
మిస్సమ్మ (2003 సినిమా) | |||
2002 | ఇడియట్ | అధ్యాపకుడు | |
2001 | నువ్వు నాకు నచ్చావ్ |
పురస్కారాలు
నంది పురస్కారం
మరణం
అనారోగ్య కారణాలతో మొదట ఏపీలోని భీమవరం లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నగరం కొండాపూర్లో గల కిమ్స్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ 2015, జనవరి 23 న మృతిచెందారు.
మూలాలు
- ↑ ""ఎంఎస్ నారాయణ ఇకలేరు.."". www.sakshi.com. సాక్షి. 23 జనవరి 2015. Retrieved 23 జనవరి 2015.
- ↑ ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్. "...హాస్యంలో ఉత్తముడు - తోటపల్లి మధు". తోటపల్లి మధు. Retrieved 27 February 2018.
- ↑ http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=699731
- ↑ http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=699731