ఎం.టి.వాసుదేవన్ నాయర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎మూలాలు: +{{Authority control}}
చి వర్గం:కేరళ ప్రముఖులు తొలగించబడింది; వర్గం:కేరళ వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 37: పంక్తి 37:


[[వర్గం:జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు]]
[[వర్గం:జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు]]
[[వర్గం:కేరళ ప్రముఖులు]]
[[వర్గం:కేరళ వ్యక్తులు]]
[[వర్గం:1933 జననాలు]]
[[వర్గం:1933 జననాలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]

15:30, 9 జూన్ 2019 నాటి కూర్పు

M. T. Vasudevan Nair
పుట్టిన తేదీ, స్థలం (1933-07-15) 1933 జూలై 15 (వయసు 90)
Kudallur, Ponnani taluk, Palghat, British India
వృత్తిNovelist, short story writer, screenplay writer, film director
భాషMalayalam
జాతీయతIndian
పూర్వవిద్యార్థిVictoria College, Palakkad
రచనా రంగంNovel, short story, children's literature, travelogue, essays
విషయంSocial aspects, Oriented on the basic Malayalam family and cultures
సాహిత్య ఉద్యమంRealism
గుర్తింపునిచ్చిన రచనలుNaalukettu, Randamoozham, Manju, Kaalam, Asuravithu, "Iruttinte Athmavu"
ప్రభావంFyodor Dostoevsky, Anton Chekhov, Guy de Maupassant, Vaikom Muhammed Basheer
పురస్కారాలుPadma Bhushan, Jnanpith, Sahitya Akademi Award, Kerala Sahitya Akademi Award
జీవిత భాగస్వామిKalamandalam Saraswathi
Website
http://www.mtvasudevannair.com/

ఎం.టి.వాసుదేవన్ నాయర్ ప్రముఖ మలయాళ రచయిత[1]. ఆయన ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందడం ద్వారా భారతీయ సాహిత్యరంగంలో ప్రాచుర్యం పొందారు.

వ్యక్తిగత జీవితం

వాసుదేవన్ నాయర్ నేటి కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన కొడల్లూర్ గ్రామంలో 1933 జూలై 15న జన్మించారు. ఆయన జన్మించిన నాటికి ఆ ప్రాంతం బ్రిటీష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీ మలబారు ప్రాంతంలోనిది. ఆయన చిన్నతనం పున్నయర్కుళం గ్రామంలో గడిపారు. కుమరనెల్లూరు గ్రామంలో పాఠశాల విద్యను, పాలక్కాడ్ (పాల్ఘాట్) పట్టణంలోని విక్టోరియా కళాశాలలో కళాశాల విద్యనూ పూర్తిచేసుకున్నారు.

సాహిత్య రంగం

1950దశకం తొలినాళ్ళ నుంచీ చిన్నకథలను వ్రాయడం ప్రారంభించిన వాసుదేవన్ నాయర్ 1958లోని నాలుకెట్టు (కేరళ సంప్రదాయ గృహం), 1962లో అసురవిత్తు (రాక్షస బీజం), 1964లో మంజు (మంచు), 1969లో కాలం, 1984లో రాండమూఝం (రెండవ సారి), విలపయత్ర, పతిరవుం పకల్వెలిచెవుం (అర్థరాత్రీ, పగటివెల్తురు), వారణాసి తదితర నవలలను రచించారు. ఇవేకాక నాటికలు, పరిశోధనాత్మక, సాహిత్యాంశాల వ్యాసాలు, యాత్రాచరిత్రలు, ఆత్మకథాత్మక రచనలు రాశారు. సర్పబిందు, నాలుకెట్టు నవలల్లో ఉమ్మడి కుటుంబాలు కలిగిన కేరళ సామాజిక వ్యవస్థలో ఆధునికత తీసుకువస్తున్న మార్పుల గురించి వాసుదేవన్ నాయర్ ప్రస్తావించారు. మంచు నవలలోని కథాంశం ఇద్దరు వ్యక్తుల అర్థరహితమైన నిరీక్షణ గురించి ఉంటుంది. నైనిటాలుకు యాత్రికునిగా వచ్చిన యువకునితో ప్రేమానుబంధం కలిగుండి అతను తిరిగి ఎప్పుడు వస్తాడోనని యువతి ఆకాంక్ష, కొండజాతి స్త్రీ, ఆంగ్లేయ యాత్రికులకు జన్మించి తన తండ్రిని కలవాలని ఆశించే కుర్రాడి నిరీక్షణలను ఇతివృత్తంగా రాశారు.

సినిమాలు

ఇతడు దర్శకత్వం వహించిన నిర్మాల్యం సినిమాకు ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది.

మూలాలు

  1. "M. T. Vasudevan Nair, Indian writer". Mtvasudevannair.com. 15 July 1933. Retrieved 2012-07-12.