గోన గన్నారెడ్డి (నవల): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:అడవి బాపిరాజు నవలలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:అడవి బాపిరాజు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 52: పంక్తి 52:
* [[:s:గోన గన్నారెడ్డి|వికీసోర్సులో గోన గన్నారెడ్డి నవల]]
* [[:s:గోన గన్నారెడ్డి|వికీసోర్సులో గోన గన్నారెడ్డి నవల]]


[[వర్గం:అడవి బాపిరాజు]]
[[వర్గం:తెలుగు నవలలు]]
[[వర్గం:తెలుగు నవలలు]]
[[వర్గం:అడవి బాపిరాజు నవలలు]]
[[వర్గం:అడవి బాపిరాజు నవలలు]]

16:57, 16 జూన్ 2019 నాటి కూర్పు

గోన గన్నారెడ్డి నవలను అడవి బాపిరాజు రచించారు. ఇది కాకతీయ చారిత్రాత్మక నవల.[1] గోనగన్నా రెడ్డి ఆంధ్ర సామ్రాట్టు కాకతీయ గణపతిదేవుని కుమార్తె అయిన రుద్రమదేవికి కుడిభుజంగా ఉంటూ పశ్చిమాంధ్ర భూమిని ఏలుతూ ఉండేవాడు. గన్నారెడ్డి కుమారుడు గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం అనే ద్విపద కావ్యం రచించాడు. ఈ నవలను మొదటి సారిగా 1946లో మచిలీపట్టణానికి చెందిన త్రివేణి పబ్లిషర్సు వారు ప్రచురించారు. ఈ పుస్తకం కొండగడప జాగీర్దారు రాజా అక్కినేపల్లి జానకిరామారావుకు అంకితం చేయబడింది.

కథా సారాంశము

కాకతీయ సామ్రాజ్య చక్రవర్తియైన గణపతి దేవునికి కుమార్తె కలుగుతుంది. రాజ్యక్షేమాన్ని కాంక్షించి తన ప్రధామ మంత్రియైన శివదేవయ్య సలహాను అనుసరించి ఆమెను రుద్రదేవుడనే పేరుతో లోకానికి పరిచయం చేస్తాడు గణపతి దేవుడు. కాకతీయ సామంతరాజ్యమైన వర్ధమానపురానికి రాజు గోన లకుమయా రెడ్డి. అతని కొడుకు గోన వరదారెడ్డి. వరదారెడ్డికి మరో కాకతీయ సామంత రాజ్యమైన ఆదవోని రాజు కోటా రెడ్డి కుమార్తె అన్నాంబికను ఇచ్చి వివాహం చేయాలనుకుంటూ ఉంటారు. ఇంతలో గజదొంగయైన గోన గన్నారెడ్డి వచ్చి వరదారెడ్డిని అపహరిస్తాడు. దాంతో ఆ వివాహం చెడిపోతుంది. ఒక వైపు గణపతి దేవుడు వృద్ధుడై పోతుండడంతో వివిధ సామంతులు కాకతీయ సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి తమ తమ ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా లకుమయా రెడ్డి తన మంత్రుల ద్వారా ఇతర సామంతుల అభిప్రాయాలు తెలుసుకుంటాడు. ఆదవోని రాజ్య ప్రభువైన కోటారెడ్డి అతనికి మద్ధతు తెలపడమే కాకుండా తన కుమార్తెను అతని కుమారుడికిచ్చి వివాహం చేయడానికి ఒప్పుకుంటాడు.

ముఖ్య పాత్రలు

  1. రుద్రమ దేవి, కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి, తండ్రి గణపతి దేవుని తర్వాత చక్రవర్తిత్వాన్ని వారసత్వంగా పొందుతుంది.
  2. గణపతి దేవుడు, రుద్రమ దేవి తండ్రి, కాకతీయ వంశపు అష్టమ చక్రవర్తి
  3. గోన గన్నారెడ్డి, కాకతీయ సామంతరాజ్యమైన వర్ధమానపురం రాజైన గోన బుద్ధా రెడ్డి పెద్ద కొడుకు
  4. శివ దేవయ్య, కాకతీయ సామ్రాజ్య మంత్రి
  5. చాళుక్య వీరభద్రుడు, చిన్నప్పటి నుంచి రుద్రమదేవితో కలిసి విద్యనభ్యసించి ఉంటాడు, ఆమెను మనసులో ఆరాధిస్తుంటాడు
  6. రేచెర్ల ప్రసాదాదిత్య నాయుడు
  7. జన్నిగదేవుడు, కాకతీయ మహా సామంతుడు, కాకతీయ సర్వ సైన్యాధ్యక్షుడు
  8. జాయప సేనాని
  9. కోటారెడ్డి, కాకతీయ సామంతరాజ్యం, ఆదవోని రాజ్య ప్రభువు
  10. అన్నాంబిక, కోటారెడ్డి కుమార్తె
  11. కుప్పాంబిక, గన్నారెడ్డి అక్క
  12. అక్కిన ప్రగడ, కాకతీయ మంత్రి
  13. చిన అక్కిన ప్రగడ, పెద అక్కినప్రగడ మనుమడు, గోన గన్నారెడ్డి మంత్రి
  14. ముమ్ముడాంబిక, జాయప సేనాని కుమార్తె; రుద్రమదేవి వనిత అని లోకానికి పూర్తిగా తెలియక మునుపు ఈమెను ఇచ్చి వివాహం చేస్తారు.
  15. దేవగిరి యాదవ మహారాజు కృష్ణభూపతి
  16. మహాదేవరాజు, దేవగిరి యాదవరాజు, కాకతీయ సాంరాజ్యంపై పెద్ద ఎత్తున దండయాత్ర చేసి చివరికి ఓటమి పాలవుతాడు.
  17. గోన లకుమయా రెడ్డి, గోన గన్నారెడ్డి పినతండ్రి, గన్నారెడ్డి తండ్రి బుద్ధారెడ్డి తర్వాత ఆయన సింహాసనాన్ని అధిష్టించిన వాడు
  18. మురారి దేవులు, గణపతి దేవుడి సవతి సోదరుడు సారంగదేవుడి కొడుకు
  19. హరిహర దేవులు, గణపతి దేవుని సవతి సోదరుడు సారంగదేవుడి కొడుకు
  20. గోన వరదారెడ్డి, గోన లకుమయారెడ్డి కొడుకు
  21. విఠల ధరణీశుడు, గన్నారెడ్డి తమ్ముడు, అతనికి కుడిభుజం, భీమబలుడు.
  22. సోమనాథాచార్యుడు, శివదేవయ్య ఆంతరంగిక చారుడు
  23. విరియాల గొంక ప్రభువు, కాకతీయ అపసర్ప గణాలకు (వేగుల దండు) అధిపతి
  24. అంబయ దేవుడు, జన్నిగ దేవుడి కొడుకు
  25. త్రిపురాంతక దేవుడు, జన్నిగ దేవుడి కొడుకు
  26. కోట పేర్మాడిరాయడు, పూగినాటి విషయాధిపతి, గణపతి దేవుడి అల్లుడైన కోట భేతమహారాజులమీద దండెత్తి గన్నయ్య చేతిలో పరాభవం పొందుతాడు.
  27. వంది భూపాలుడు, కందవోలు రాజ్యాధిపతి
  28. సూరన రెడ్డి, గన్నారెడ్డికి ఎడమ భుజం లాంటివాడు
  29. పడికము బాప్పదేవుడు, కాకతీయ సేనాధిపతుల్లో ఒకడు
  30. బేడ చెలుకిరాయుడు, పొత్తపినాడు మహామండలేశ్వరుడు
  31. గుంటూరు నాగదేవరాజు, కాకతీయులకు సామంతుడుగా ఉండి సార్వభౌమత్వం కోసం తిరగబడి యుద్ధంలో మరణిస్తాడు.
  32. కోట బేతమహారాజు, గణపతి దేవ చక్రవర్తి అల్లుడు
  33. గణపాంబా దేవి, గణపతి దేవ చక్రవర్తి రెండో కూతురు
  34. కామేశ్వరి, చిన అక్కినప్రగడ భార్య, మేనమామ కూతురు
  35. కల్యాణి చోడోదయుడు, ఆశ్విక యుద్ధంలో వీరుడు. కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తాలని ఆలోచన చేసి గన్నారెడ్డి చేతిలో పరాజితుడవుతాడు.
  36. మారయ మంత్రి, లకుమయా రెడ్డి మంత్రి
  37. చిన్నయామాత్యుడు, లకుమయా రెడ్డి రెండో మంత్రి
  38. కామయరెడ్డి, లకుమయా రెడ్డి సేనాధిపతి
  39. మేడిపల్లి కాచయనాయుడు

మూలాలు

బయటి లింకులు