టీనియా సోలియమ్: కూర్పుల మధ్య తేడాలు
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి వర్గం:పరాన్న జీవశాస్త్రము తొలగించబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
చి (GR) Duplicate: File:Cysticercosis by Taenia solium PHIL 3387 lores.jpg → File:Taenia solium Life cycle (02).tif Exact or scaled-down duplicate: c::File:Taenia solium Life cycle (02).tif |
||
పంక్తి 20: | పంక్తి 20: | ||
== జీవిత చక్రం == |
== జీవిత చక్రం == |
||
[[ఫైలు: |
[[ఫైలు:Taenia solium Life cycle (02).tif|thumb|left|టీనియా సోలియమ్ జీవిత చక్రం.]] |
||
టీనియా సోలియమ్ జీవిత చక్రం కొంత పందిలోనూ కొంత మనిషిలోనూ జరుగుతుంది. |
టీనియా సోలియమ్ జీవిత చక్రం కొంత పందిలోనూ కొంత మనిషిలోనూ జరుగుతుంది. |
||
=== పంది === |
=== పంది === |
12:28, 16 సెప్టెంబరు 2019 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
టీనియా సోలియమ్ | |
---|---|
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | టీ.సోలియమ్
|
Binomial name | |
టీనియా సోలియమ్ లిన్నేయస్, 1758
|
టీనియా సోలియమ్ (Taenia solium) మానవులలో ఉండే సాధారణ పరాన్న జీవి. పంది మాంసం (pork) తినే మానవుల పేగుల్లో ఈ బద్దెపురుగు జీవిస్తుంది. ఇది ద్వంద్వ అతిథేయి పరాన్న జీవి. మానవుడు ప్రధాన అతిథేయి. పంది మాధ్యమిక అతిథేయి.
జీవిత చక్రం
టీనియా సోలియమ్ జీవిత చక్రం కొంత పందిలోనూ కొంత మనిషిలోనూ జరుగుతుంది.
పంది
పంది ఆంత్రమూలంలోకి చేరిన కంటక గోళాలు ఎంజైమ్ ల ప్రభావం వలన కర్పరం, పిండస్తరాలు జీర్ణమై షట్కంటకి విడుదలవుతుంది. అది కొక్కేల సహాయంతో ఆంత్రకుడ్యానికి అతుక్కుంటుంది. ఒక జత ప్రవేశక గ్రంథుల స్రావాలతో పేగు గోడను తొలిచి, కాలేయ నిర్వహక వ్యవస్థ ద్వారా కాలేయాన్ని చేరుతుంది. అక్కడ నుంచి పరమహాసిర ద్వారా గుండెను చేరుతుంది. రక్తప్రవాహం ద్వారా పంది కండరాల్లో స్థిరపడుతుంది. కొక్కేలను కోల్పోయి సిస్టిసర్కస్ (Cysticercus) గా మారుతుంది. వెలుపలి వైపు అవభాసిని, లోపలి వైపు జననస్తరం ఏర్పడతాయి. సిస్టిసర్కస్ గోడ లోపలికి అంతర్వర్తనం చెందడం వల్ల ప్రోస్కోలెక్స్ ఏర్పడుతుంది. ఈ దశను పరిణితి చెందిన సిస్టిసర్కస్ లేదా తిత్తి పురుగు అంటారు. ఇలా పరిణితి చెందడానికి సుమారు పది వారాలు పడుతుంది.
మనిషి
పూర్తిగా ఉడకని పంది మాంసాన్ని తింటే బద్దెపురుగు మనిషిలోకి ప్రవేశిస్తుంది. మనిషి జీర్ణాశయంలో డింభకం చుట్టూ ఉన్న తంతుయుత పొర కరిగిపోయి, ప్రోస్కోలెక్స్ బహిర్గతమవుతుంది. ఇది చూషకాలు, కొక్కేల సాయంతో పేగు గోడలకు అతుక్కుంటుంది. క్రమేపీ మెడ నుండి ఖండితాలు ఏర్పడటంతో స్ట్రోబైలా రూపొంది తిత్తి అదృశ్యమవుతుంది. దాదాపు 3 నెలల కాలంలో ప్రౌఢజీవిగా మారుతుంది.
వ్యాధి లక్షణాలు
ప్రౌఢ పరాన్న జీవులు కలిగించే వ్యాధిని 'టినియాసిస్' (Taeniasis) అంటారు. కడుపునొప్పి, రక్తహీనత, ఆహార ప్రసరణకు అవరోధం వల్ల వాంతులు మరియు అజీర్ణం ఈ వ్యాధి లక్షణాలు.