సికిందర్ జా: కూర్పుల మధ్య తేడాలు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మరియు" ల తొలగింపు |
||
పంక్తి 8: | పంక్తి 8: | ||
| successor = [[:en:Mir Farqunda Ali Khan|మీర్ ఫర్క్వున్దా ఆలీ ఖాన్]] |
| successor = [[:en:Mir Farqunda Ali Khan|మీర్ ఫర్క్వున్దా ఆలీ ఖాన్]] |
||
| consort = |
| consort = |
||
| issue = 10 మంది కుమారులు |
| issue = 10 మంది కుమారులు, 9 మంది కుమార్తెలు |
||
| royal house = పురానా హవేలీ |
| royal house = పురానా హవేలీ |
||
| royal anthem = |
| royal anthem = |
06:53, 22 మార్చి 2020 నాటి కూర్పు
సికిందర్ జా, నిజాం III - سکندر جاہ ، نظام سوم | |
---|---|
హైదరాబాద్ స్టేట్ యొక్క III వ నిజాం | |
పరిపాలన | 1803–1829 |
జననం | 11 నవంబర్ , 1768 |
జన్మస్థలం | చౌ మహల్లా భవనం (ఖిల్వత్) |
మరణం | 21 మే, 1829 |
మరణస్థలం | హైదరాబాదు |
సమాధి | మక్కా మసీదు |
ఇంతకు ముందున్నవారు | ఆలీ ఖాన్ అసఫ్ జా II |
తరువాతి వారు | మీర్ ఫర్క్వున్దా ఆలీ ఖాన్ |
సంతానము | 10 మంది కుమారులు, 9 మంది కుమార్తెలు |
రాజకుటుంబము | పురానా హవేలీ |
తండ్రి | ఆలీ ఖాన్ అసఫ్ జా |
తల్లి | తహ్నియత్ ఉన్నీసా బేగమ్ |
సికిందర్ జా - (ఉర్దూ - سکندر جاہ نظام سوم ) (జ: 11 నవంబర్ 1768 - మ: 21 మే, 1829) మూడవ నిజాంగా హైదరాబాదును 1803 నుండి 1829 వరకు పరిపాలించెను.
ఇతడు రెండవ నిజాం రెండవ అసఫ్ జాకు రెండవ కుమారునిగా జన్మించాడు.
ఇతని కాలంలోనే బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాదులో కంటోన్ మెంట్ ను స్థాపించింది. ఈ ప్రాంతాన్ని నిజాం జ్ఞాపకార్థం సికింద్రాబాదు అని పేరుపెట్టారు. ఈ కాలంలోనే రెండవ మహారాష్ట్ర యుద్ధం కూడా జరిగింది.
క్రీ.శ.1804 లో అజీం ఉల్ ఉమర్ మరణించడంతో బ్రిటిష్ వారి అభీష్టానుసారంగా మీర్ ఆలంను దివానుగా నియమించాడు. హైదరాబాదులోని మీర్ ఆలం చెరువు ఈతని పేరుమీద నిర్మించబడింది. క్రీ.శ. 1808 మీర్ ఆలం మరణించడంతో అతని అల్లుడైన మునీర్ ఉల్ ముల్క్ ను దివానుగా నియమించాడు.
క్రీ.శ. 1811 లో హైదరాబాదులో బ్రిటిష్ ప్రతినిధిగా నియమించబడిన హెన్రీ రస్సెల్ శాంతి భద్రతలను కాపాడటానికి రస్సెల్ దళమును తయారుచేశాడు. ఈ దళమే తరువాతి కాలంలో హైదరాబాదు సైన్యంగా ప్రసిద్ధిచెందినది. ఈ సైన్యం క్రీ.శ. 1817లో జరిగిన పిండారీ యుద్ధం లోనూ, క్రీ.శ. 1818 లో జరిగిన మహారాష్ట్ర యుద్ధం లోనూ పాల్గొన్నది.