శ్రీకాకుళం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
చి clean up, typos fixed: → (10) |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 107: | పంక్తి 107: | ||
;వన్య సంపద |
;వన్య సంపద |
||
జిల్లాలోని అడవుల సాంద్రత, వృక్ష జాతులు ప్రాంతాన్ని బట్టి వైవిధ్యం కలిగి ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడి అడవులను రెండు రకాలుగా చెప్పవచ్చును. |
జిల్లాలోని అడవుల సాంద్రత, వృక్ష జాతులు ప్రాంతాన్ని బట్టి వైవిధ్యం కలిగి ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడి అడవులను రెండు రకాలుగా చెప్పవచ్చును. |
||
# దక్షిణ భారత |
# దక్షిణ భారత తేమ ఆకురాల్చే అడవులు - మిశ్రమ [[అడవులు]], మద్ది అడవులు, పర్వత సవాన్నా భూములు. |
||
# దక్షిణ భారత సతత హరిత అడవులు (dry ever-green miscellaneous forests) |
# దక్షిణ భారత సతత హరిత అడవులు (dry ever-green miscellaneous forests) |
||
;జంతు సంపద |
;జంతు సంపద |
||
శ్రీకాకుళం జిల్లాలో అటవీ మృగాలు అల్పంగా ఉన్నాయి. జనావాసాల విస్తరణ, అడవుల నాశనం ఇందుకు కారణాలు కావచ్చును. మాంసాహార మృగాలలో [[పులి]] దాదాపు అంతరించింది. [[చిరుత పులి]], [[హైనా]] (దుమ్ములగొండి), [[తోడేలు]] వంటి జంతువులు అరుదుగా అడవుల్లో కనిపిస్తుంటాయి. గుంటనక్క, అడవిపిల్లులు, కుక్కలు జిల్లాలో కనిపించే ఇతర మాంసాహార జంతువులు. శాకాహార జంతువులలో |
శ్రీకాకుళం జిల్లాలో అటవీ మృగాలు అల్పంగా ఉన్నాయి. జనావాసాల విస్తరణ, అడవుల నాశనం ఇందుకు కారణాలు కావచ్చును. మాంసాహార మృగాలలో [[పులి]] దాదాపు అంతరించింది. [[చిరుత పులి]], [[హైనా]] (దుమ్ములగొండి), [[తోడేలు]] వంటి జంతువులు అరుదుగా అడవుల్లో కనిపిస్తుంటాయి. గుంటనక్క, అడవిపిల్లులు, కుక్కలు జిల్లాలో కనిపించే ఇతర మాంసాహార జంతువులు. శాకాహార జంతువులలో ఎక్కువుగా మచ్చల దుప్పి (చితాల్), అడవి గొర్రెలు, [[ఎలుగుబంట్లు]] సాధారణంగా కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో కృష్ణజింక, నీలగాయ్, బైసన్లు అసలు కనిపించకపోవడం గమనార్హం. పక్షి జాతులలో - నెమళ్ళు, కౌజులు, పావురాలు, చిలకలు, మైనా కౌజుపిట్టలు,బాతులు,పావురాలు వంటివి అధికంగా ఉన్నాయి.. |
||
== భౌగోళిక స్వరూపం == |
== భౌగోళిక స్వరూపం == |
03:34, 9 ఏప్రిల్ 2020 నాటి కూర్పు
శ్రీకాకుళం జిల్లా | |
---|---|
Country | భారత దేశం |
State | ఆంధ్ర ప్రదేశ్ |
Region | కోస్తా |
Headquarter | శ్రీకాకుళం |
Area | |
• Total | 5,837 km2 (2,254 sq mi) |
Population (2011) | |
• Total | 26,99,471 |
• Density | 462/km2 (1,200/sq mi) |
Languages | |
• Official | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
Telephone code | +91 0( ) |
Literacy | 55.9 (2001) |
Literacy Male | 67.9 |
Literacy Female | 44.19 |
Website | https://www.guntur.ap.gov.in/ |
శ్రీకాకుళం జిల్లా భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్య సరిహద్దులో ఉంది. జిల్లా ముఖ్యపట్టణమైన శ్రీకాకుళం (అక్షా: 18' ఉ, రేఖా: 54' తూ) నాగావళి నది ఒడ్డున ఉంది. విశాఖపట్నం జిల్లా నుంచి 1950 ఆగష్టు 15 న శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979 జూన్ 1 న విజయనగరం జిల్లా ఏర్పడింది. Map
జిల్లా పేరు వెనుక చరిత్ర
- బ్రిటిషు వారు శ్రీకాకుళం పేరును పలకలేక "చికాకోల్" అనేవారు. చికాకోల్ కు సంబంధించిన మరో కథనం ఇలాఉంది : ఈ ప్రాంతం నైజాము ఆధిపత్యంలో ఉండే సమయంలో ఈ ఊళ్లోనే ప్రతి సంవత్సరం జమాబందీ నిర్వహిస్తూ రైతుల వద్ద నుండి పన్నులు వసూలు చేసేవారు. రైతులు తాము కట్ట వలసిన పన్ను సొమ్మును విచ్చు రూపాయల రూపంలో చిన్నచిన్న గుడ్డసంచులలో పోసి, మూటకట్టి, ఆమూటను తీసికొనివచ్చి ఖుద్దున సమర్పించేవారు. ఆ మూట లోని సొమ్ము సరిగా ఉందో లేదో చూసుకోవడానికి మూటను విప్పాలి. ఆ మూటలు చాలా ఉంటున్నందువలన, ఆ మూటల మూతికట్టు విప్పమని రైతులతో చెప్పడానికి "శిఖా ఖోల్" అనేవారు. అంటే "మూతికట్టువిప్పు" అని అర్థం. ఈమాట క్రమంగా "చికా కోల్" అయి, శ్రీకాకుళంగా స్థిరపడిందిట.
- ఆంధ్రప్రదేశ్ పూర్వపు ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు జిల్లాలోని టెక్కలి నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు.
జిల్లా చరిత్ర
ఒకప్పుడు ఇది బౌద్ధమతానికి ముఖ్యస్థానంగా వర్ధిల్లింది. శాలిహుండం, దంతపురి, జగతిమెట్ వంటి బౌద్ధారామం|బౌద్ధారామాలు ఇక్కడ కనుగొనబడ్డాయి. తరువాత ఇది కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. గాంగేయులు ఈ ప్రాంతాన్ని 6 నుండి 14వ శతాబ్దం వరకు, 800 సంవత్సరాలు పాలించారు. వజ్రహస్తుడు|వజ్రహస్తుని కాలంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ముఖలింగం ఆలయాన్ని నిర్మించారు. మహమ్మదీయుల పాలన కాలంలో షేర్ మహమ్మద్ ఖాన్ శ్రీకాకుళంలో జామియా మసీదు నిర్మించాడు.
విశాఖపట్నం జిల్లాలో భాగంగా ఉండే ఈ జిల్లా 1950 ఆగష్టు 15న ప్రత్యేక జిల్లాగా అవతరించింది. 1969లో ఈ జిల్లానుండి సాలూరు తాలూకాలోని 63 గ్రామాలు, బొబ్బిలి తాలూకాలోని 44 గ్రామాలను విశాఖపట్నం జిల్లాలో కొత్తగా ఏర్పరచిన గజపతి నగరం తాలూకాకు బదలాయించారు. మళ్ళీ మే 1979లో కొత్తగా విజయనగరం జిల్లాను ఏర్పరచినపుడు సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, చీపురుపల్లి తాలూకాలను కొత్తజిల్లాలో విభాగాలుగా చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో నక్సలైటు (మావోయిస్టు పార్టీ) ఉద్యమం ప్రారంభమయింది శ్రీకాకుళం జిల్లాలోనే.
నైసర్గిక స్వరూపం
శ్రీకాకుళం జిల్లా మొత్తం జిల్లా వైశాల్యం 5837 చ.కి.మీ. జిల్లాకు 193 కి.మీ. సముద్ర తీరం ఉంది. తూర్పు కనుమలు ఈశాన్యం నుండి కొంతభాగం విస్తరించి ఉన్నాయి.
- నదులు
నాగావళి, వంశధార, మహేంద్ర తనయ, చంపావతి, బహుదా, కుంభికోటగెడ్ ఇవి జిల్లాలలో ముఖ్యమైన నదులు. ఇవి తూర్పు కనుమలలో పుట్టి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.
- వాతావరణం
సంవత్సరంలో ఎక్కువకాలం వాతావరణం తేమగా ఉంటుంది. నైఋతి ఋతుపవనాలు జూన్ నుండి సెప్టెంబరు వరకు, ఈశాన్య ఋతుపవనాలు అక్టోబరు - నవంబరు మాసాలలోను వర్షాలు కురిపిస్తాయి. డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు పొడిగాను, చల్లగాను ఉంటుంది. సంవత్సరం సగటు వర్షపాతం 1162 మి.మీ. (2004-2005 సం.లో వర్షపాతం 937.6 మి.మీ.)
- వన్య సంపద
జిల్లాలోని అడవుల సాంద్రత, వృక్ష జాతులు ప్రాంతాన్ని బట్టి వైవిధ్యం కలిగి ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడి అడవులను రెండు రకాలుగా చెప్పవచ్చును.
- దక్షిణ భారత తేమ ఆకురాల్చే అడవులు - మిశ్రమ అడవులు, మద్ది అడవులు, పర్వత సవాన్నా భూములు.
- దక్షిణ భారత సతత హరిత అడవులు (dry ever-green miscellaneous forests)
- జంతు సంపద
శ్రీకాకుళం జిల్లాలో అటవీ మృగాలు అల్పంగా ఉన్నాయి. జనావాసాల విస్తరణ, అడవుల నాశనం ఇందుకు కారణాలు కావచ్చును. మాంసాహార మృగాలలో పులి దాదాపు అంతరించింది. చిరుత పులి, హైనా (దుమ్ములగొండి), తోడేలు వంటి జంతువులు అరుదుగా అడవుల్లో కనిపిస్తుంటాయి. గుంటనక్క, అడవిపిల్లులు, కుక్కలు జిల్లాలో కనిపించే ఇతర మాంసాహార జంతువులు. శాకాహార జంతువులలో ఎక్కువుగా మచ్చల దుప్పి (చితాల్), అడవి గొర్రెలు, ఎలుగుబంట్లు సాధారణంగా కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో కృష్ణజింక, నీలగాయ్, బైసన్లు అసలు కనిపించకపోవడం గమనార్హం. పక్షి జాతులలో - నెమళ్ళు, కౌజులు, పావురాలు, చిలకలు, మైనా కౌజుపిట్టలు,బాతులు,పావురాలు వంటివి అధికంగా ఉన్నాయి..
భౌగోళిక స్వరూపం
- సరిహద్దులు
ఉత్తరాన ఒడిషా రాష్ట్రం, దక్షిణ-పశ్చిమాల్లో విజయనగరం జిల్లా, ఒడిషా గజపతి జిల్లా, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. జిల్లాకు కొంత భాగం హద్దులుగా కందివలస గెడ్, వంశధార, బహుదా నదులు ప్రవహిస్తున్నాయి.
మొత్తం జిల్లా వైశాల్యం 5837 చ.కి.మీ.
ఆర్ధిక స్థితి గతులు
వ్యవసాయం
జిల్లాలో ముఖ్య పంటలు- వరి, రాగులు, పెసలు, మినుములు, ఉలవలు, చెరకు, జనుము, వేరుశనగ, నువ్వులు, మిరప, పసుపు, నీరుల్లి.
నీటివనరులు
శ్రీకాకుళం జిల్లాలో బాహుద, ఉత్తర మహేంద్ర, తనయ, బెంజిగడ్డ, వరహాలు గడ్డ, వంశధార, నాగావళి, పెద్దగడ్డ, కందివలస అనే 9 నదులు ఉన్నాయి. వీటిలో నాగావళి, వంశధార, మహేంద్ర తనయ ముఖ్యమైన నదులు.[1] జిల్లాలో ఈశాన్య ఋతుపవనాల ద్వారా 26.47%, నైఋతి ఋతుపవనాల ద్వారా 62.61% వర్షాలు లభిస్తాయి. మూడు ముఖ్య నదుల ద్వారా జరుగుతున్న నీటి వినియోగం: నాగావళి 371 మి.క్యూ.మీ. (మిలియన్ క్యూబిక్ మీటర్లు) (36%), వంశధార 121 మి.క్యూ.మీ. (12%), మహేంద్ర తనయ 81 మి.క్యూ.మీ. (8%), చిన్న చెరువులు 140 మి.క్యూ.మీ. (14%), భూగర్భ జలాలు 300 మి.క్యూ.మీ. (30%). మొత్తం 1,013 మి.క్యూ.మీ. రాష్ట్రంలో రెండు ప్రధాన జలాశయాలు సుమారు 140 మి.క్యూ.మీ. నీటిని వ్యవసాయ నిమిత్తం సమకూరుస్తున్నాయి. అవకాశం ఉన్న నీటిలో 91% (5,763 మి.క్యూ.మీ.) బంగాళాఖాతంలోకి వృధాగా పోతున్నదని అంచనా. 9% నీరు మాత్రమే భూగర్భంలోకి ఇంకుతున్నది.
జిల్లాలో 3.3 లక్షల (0.33 మిలియన్) హెక్టేరులు భూమి సాగులో ఉంది. అందులో 1.9 లక్షల హెక్టేరులకు సాగునీటి వసతి ఉంది. కాలువల ద్వారా 91,946 హెక్టేరులు, చెరువుల ద్వారా 80,123 హెక్టేరులు, బోరు బావుల ద్వారా 6,923 హెక్టేరులు, ఇతర బావుల ద్వారా 8,866 హెక్టేరులు, ఇతర వనరుల ద్వారా 5,316 హెక్టేరులు భూమికి సాగునీరు లభిస్తుంది.
అనిశ్చితమైన వర్షపాతం జిల్లాలో ప్రధాన సమస్య. చాలా సంవత్సరాలు అనావృష్టి సంవత్సరాలుగా పరిగణింపబడుతున్నాయి. అలాగే త్రాగు నీటి సమస్య కూడా తీవ్రంగానే ఉంది. ఫ్లోరోసిస్ సమస్య కూడా కొన్నిచోట్ల ఉంది. నీటి వనరులను పరిరక్షించే విధానాలు లేకపోవడం, ఏజెన్సీ ప్రాంతంలోని "పోడు" వ్యవసాయం ఇందుకు ముఖ్యమైన కారణాలు. జిల్లాలో ఎక్కువ భాగం నేల ఉపరితలం గట్టిగా ఉన్నందున నీరు ఇంకే అవకాశం తక్కువ. అందుకు తోడు అధిక భూభాగం వాలుగా ఉన్నది గనుక నీరు నిలవదు. వరి, చెరకు పంటలకు ఎక్కువ నీటిని వాడుతారు.
జిల్లాలో ముఖ్యమైన ప్రాజెక్టులు: నారాయణపురం డామ్ (మద్దివలస రిజర్వాయిర్, నాగావళి), గొట్టా బారేజి (వంశధార), కళింగాంధ్ర ప్రాజెక్టు (మహేంద్ర తనయ)
మచిలేశం, కళింగపట్నం, నువ్వలరేవు, భావనపాడు, బారువలు ముఖ్యమైన మత్స్య పరిశ్రమ కేంద్రాలు.
పరిశ్రమలు
జిల్లాలో మాంగనీసు, గ్రాఫైటు, సున్నపు రాయి, మైకా, గ్రానైట్, జిల్లా తీరప్రాంతంలోని ఇసుకలో మోనజైట్, ఇతర ఖనిజాలు సమృద్ధిగా దొరుకుతాయి.
జిల్లాలో ముఖ్యపరిశ్రమలు: చక్కెర, నూనె, జీడిపప్పు, జనపనార, పేపర మిల్లు కర్మాగారములు కలవు
పైడిభీమవరం, రాజాం, మడపాం, ఆమదాలవలస, సంకిలి పట్టణాలలో పరిశ్రమలు విస్తరిస్తున్నాయి.
డివిజన్లు, మండలాలు, నియోజక వర్గాలు
రెవెన్యూ డివిజన్లు
జిల్లా మూడు రెవిన్యూ డివిజన్లుగా విభజింపబడింది: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ
మండలాలు
జిల్లా మొత్తం 38 మండలాలుగా విభజింపబడింది .[2]
- ఆమదాలవలస మండలం
- ఇచ్ఛాపురం మండలం
- ఎచ్చెర్ల మండలం
- కంచిలి మండలం
- కవిటి మండలం
- కొత్తూరు మండలం
- కోటబొమ్మాళి మండలం
- గంగువారి సింగడాం మండలం
- గార మండలం
- జలుమూరు మండలం
- టెక్కలి మండలం
- నందిగం మండలం
- నరసన్నపేట మండలం
- పలాస మండలం
- పాతపట్నం మండలం
- పాలకొండ మండలం
- పొందూరు మండలం
- పోలాకి మండలం
- బూర్జ మండలం
- భామిని మండలం
- మందస మండలం
- మెళియాపుట్టి మండలం
- రణస్థలం మండలం
- రాజాం మండలం
- రేగిడి ఆమదాలవలస మండలం
- లక్ష్మీనరసుపేట మండలం
- లావేరు మండలం
- వంగర మండలం
- వజ్రపుకొత్తూరు మండలం
- వీరఘట్టం మండలం
- శ్రీకాకుళం మండలం
- సంతకవిటి మండలం
- సంతబొమ్మాళి మండలం
- సరుబుజ్జిలి మండలం
- సారవకోట మండలం
- సీతంపేట మండలం
- సోంపేట మండలం
- హీరమండలం మండలం
రవాణా వ్వవస్థ
రోడ్డు మార్గాల ద్వారా వివిధ ప్రాంతాలకు చక్కగా కలపబడి ఉంది. విశాఖపట్నం, దగ్గరలోని విమానాశ్రయము.ఇది రెవెన్యూ డివిజన్ కేంద్రస్థానమైనా రైలుస్టేషను లేదు.10 కి.మీ.లోని శ్రీకాకుళం రోడ్ స్టేషనుకు వెళ్ళాలి.ఎ.పి.ఎస్.ఆర్.టి.సి ప్రభుత్వ సంస్ధ ద్వారా జిల్లా కేంద్రం నుండి ఇతర మండల.జిల్లా.రాష్ట్రాలకు వివిధ సర్వీస్ లు నడుస్తున్నాయి.
జనాభా లెక్కలు
2011 జన గణన ప్రకారం ప్రధాన వివరాలిలా ఉన్నాయి
- 2001-2011 దశకంలో జనాభా వృద్ధి రేటు: 6.52% (మొత్తం రాష్ట్రం వృద్ధి రేటు 14.44%)
- జనసాంద్రత: చ.కి.మీ.కు 463 మంది (రాష్ట్రం జనసాంద్రత 308)
- అక్షరాస్యులు మగవారిలో 8,57,824 (71.61%), ఆడువారిలో 6,37,557 (52.08%)
- పట్టణ ప్రాంతాల జనాభా 4,36,703 లేదా 16.16% (రాష్ట్రం మొత్తంలో పట్టణ జనాభా 27.35%)
- శ్రామికులు: 48.6% (ఇందులో 78% వ్యవసాయం, 15% సేవల రంగం).
(2011 జనాభా లెక్కల సాయంతో)
- శ్రీకాకుళం జిల్లా జనాభా [3]
కేటగిరీ | మగ | ఆడ | మొత్తము | %మగ | %ఆడ |
అందరు | 13,41,738 | 13,61,376 | 27,03,114 | 49.64% | 50.36% |
ఎస్సీ | 113730 | 115879 | 229609 | 9.02% | 9.07% |
ఎస్టీ | 75284 | 75965 | 151249 | 5.97% | 5.94% |
మైనారిటీస్ | 21706 | 23641 | 44223 | 1.73% | 1.88% |
సంస్కృతి
ప్రధాన భాష తెలుగు. అయితే, ఒడిషా రాష్ట్రానికి సరిహద్దు కావడంచేత ఒరియా భాషను కొంతమంది అర్థం చేసుకోగలరు, మాట్లాడగలరు కూడా. శ్రీకాకుళం జిల్లా ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతం. ఇటీవలి కాలంలో జరుగుతున్న పారిశ్రామిక, విద్యా రంగాల్లో అభివృద్ధి కారణంగా శ్రీకాకుళం పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. కానీ మౌలిక సదుపాయాల విషయంలో ఆటంకాలను ఎదుర్కొంటోంది. ఈ ఊరిని పేదవాని స్వర్గం (poor man's paradise) అని చమత్కరిస్తారు (వేసవికాలంలో చల్లగాఉండే ప్రదేశం కావడం వలన).
విద్యాసంస్థలు
- అంబేద్కర్ విశ్వవిద్యాలయం - ఎచ్చెర్ల
- రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శ్రీకాకుళం (RIMS)
- ఐఐటి ఎచ్చెర్ల వద్ద ఉంది. జి.యు.ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ (రాజాం)
- RGUKT - Srikakulam
- GEMS Medical college - Ragolu village
పర్యాటకం
శ్రీకాకుళం పట్నం, జిల్లాలోని పలు ప్రాంతాలు పచ్చికబయల్లు, అడవులు,సశ్యస్యామలమైన పంట పొలాలతో ఎప్పుడూ చల్లగా ఉంటుంది.వేసవి కాలములో ఊటీని పోలి ఉంటుంది. ఈ జిల్లాలో వర్షపాతము ఎక్కువగా ఉంటుంది. కాస్టాఫ్ లివింగ్ చాలా తక్కువ. అందుకే దీనిని పేదవాని స్వర్గమని పిలుస్తారు. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ కలిపి 2017లో రెండు కోట్లమంది పైచిలుకు, 2016లో కోటీ అరవైలక్షల పైచిలుకు పర్యాటకులు సందర్శించారని ప్రభుత్వ అంచనా.[4] పర్యాటకుల సంఖ్య విషయంలో 2017లో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో చిత్తూరు జిల్లా తర్వాత రెండవ స్థానం పొందింది.
- వాతావరణం
సంవత్సరంలో ఎక్కువకాలం వాతావరణం తేమగా ఉంటుంది. నైఋతి ఋతుపవనాలు జూన్ నుండి సెప్టెంబరు వరకు, ఈశాన్య ఋతుపవనాలు అక్టోబరు - నవంబరు మాసాలలోను వర్షాలు కురిపిస్తాయి. డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు పొడిగాను, చల్లగాను ఉంటుంది. సంవత్సరం సగటు వర్షపాతం 1162 మి.మీ. (2004-2005 సంవత్సరంలో వర్షపాతం 937.6 మి.మీ.) జిల్లాలోని అడవుల సాంద్రత, వృక్ష జాతులు ప్రాంతాన్ని బట్టి వైవిధ్యం కలిగి ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడి అడవులను రెండు రకాలుగా చెప్పవచ్చును.
- సస్య సంపద
దక్షిణ భారత Moist deciduous అడవులు - మిశ్రమ అడవులు, మద్ది అడవులు, పర్వత సవాన్నా భూములు. దక్షిణ భారత సతత హరిత అడవులు (dry ever-green miscellaneous forests) అందుకే దీనిని పేదవాని స్వర్గం అని పిలుస్తారు.[5]
శ్రీకాకుళం పట్టణానికి చేరువలో అనేక ధార్మిక, విహార యాత్రా స్థలాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయు.
- శ్రీకాకుళం
జిల్లా కేంద్రమైన ఈ పట్టణం నాగావళి నది ఒడ్డున ఉంది. 13 కిలోమీటర్ల దూరంలో ఆమదాలవలస రైల్వేస్టేషను ఉంది. కోటేశ్వరస్వామి ఆలయము (గుడివీధి), సంతోషిమాత ఆలయం (పాతశ్రీకాకుళం), వెంకటేశ్వరఆలయం (గుజరాతీపేట), కోదండ రామస్వామి ఆలయం, జమియా మసీదు ముఖ్యమైన ప్రార్థనా స్థలాలు.
- అరసవిల్లి
సూర్య దేవాలయానికి ప్రసిద్ధి చెందిన అరసవిల్లి శ్రీకాకుళం పట్టణానికి 2 కి.మీ.లోనే ఉంది. దేశంలో ఉన్న కొద్ది సూర్య మందిరాలలో ఇది ఒకటి. ఇక్కడ ఆదిత్య, అంబిక, విష్ణు, గణేష, మహేశ్వర మూర్తులు ఉన్నాయి.
- శ్రీకూర్మం
శ్రీకాకుళం పట్టణానికి 15 కి.మీ. దూరంలో ఉన్న శ్రీకూర్మం దేశంలో బహుశా ఒకే ఒక కూర్మావతార మందిరం. విశిష్టమైన శిల్పకళ కలిగిన ఈ మందిరంలో లభించిన శాసనాలు చారిత్రికంగా కూడా ఎంతో ముఖ్యమైనవి. ఇక్కడ డోలోత్సవం ప్రధాన ఉత్సవం.
- శాలిహుండం
ఇది శ్రీకాకుళం పట్టణానికి 18 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ పురావస్తుశాఖ త్రవ్వకాలలో పురాతన బౌద్ధారామాల శిథిలాలు బయటపడ్డాయి.
- శ్రీముఖలింగం
- కళింగపట్నం
జిల్లా కేంద్రానికి 25 కి.మీ. దూరంలో ఉన్న ఓడరేవు. చారిత్రకంగా సముద్ర వాణిజ్య కేంద్రం. వంశధార నది ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ దర్గా షరీఫ్, షేక్ మదీనా అక్విలిన్ ఉన్నాయి. 23 కిలోమీటర్లవరకు కనుపించే ఒక దీప స్తంభం ఉఉంది.
- కవిటి
సోంపేట, ఇచ్ఛాపురాల మధ్య ఉన్న కవిటిని 'ఉద్దానం' (ఉద్యానవనం) అని కూడా అంటారు. కొబ్బరి, జీడిమామిడి, పనస వంటి తోటలతో ఇది రమణీయంగా ఉండే ప్రదేశం. శ్రీకాకుళానికి 130 కి.మీ. దూరం. ఇక్కడ చింతామణి అమ్మవారి, శ్రీ సీతారామ స్వామి ఆలయం ఉన్నాయి.
- బారువ
ఇది శ్రీకాకుళం పట్టణానికి 109 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ మహేంద్ర తనయ నది సముద్రంలో కలుస్తుంది, ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి ఆలయం, జనార్దన స్వామి ఆలయం ఉన్నాయి. ఒకప్పుడు ఇది ముఖ్యమైన ఓడరేవు. ఇది కొబ్బరి తోటలకు, కొబ్బరి పీచు పరిశ్రమకు కేంద్రం.
- తేలినీలాపురం
ఇది శ్రీకాకుళం పట్టణానికి 60 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ ఒక సంరక్షిత పక్షి ఆవాస కేంద్రం. సైబీరియా నుండి శీతకాలంలో పెలికన్ పక్షులు ఇక్కడికి వలస వస్తాయి.
- దంతపురి
ఇది శ్రీకాకుళం పట్టణానికి 22 కి.మీ. దూరంలో ఉంది. దీనిని బౌద్ధ జ్ఞానదంతపురి అని కూడా అంటారు. క్రీ.పూ.261లో అశోకుని కళింగ యుద్ధం తరువాత ఇది కళింగరాజులకు ప్రాంతీయ రాజధానిగా ఉంది. ఇక్కడ పురావస్తు శాఖవారి త్రవ్వకాలలో అనేక పురాతన వస్తువులు లభించాయి.
- సంగం
శ్రీకాకుళానికి 56 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ నాగావళి, వంశధార, సువర్ణముఖి నదులు కలుస్తున్నాయి. ఇక్కడ సంగమేశ్వర మందిరం ఐదు లింగక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధం. మహాశివరాత్రికి ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది.
- పొందూరు
ప్రఖ్యాతి గాంచిన పొందూరు ఖద్దరు తయారయ్యేది జిల్లాలోని పొందూరు లోనే. ఇది జిల్లా కేంద్రానికి 21 కి.మీ. దూరంలో ఉంది.
- కొరసవాడ
ప్రఖ్యాతి గాంచిన మంచు తాతాయ్య చెనెత వస్త్రములు తయారయ్యేది జిల్లాలోని కొరసవాడ లోనే. ఇది శ్రీకాకుళానికి 55 కి.మీ. దూరంలో ఉంది.
- రాజాం
శ్రీకాకుళానికి 40 కి.మీ. దూరంలో ఉన్న రాజాం బొబ్బిలి సర్దార్ తాండ్ర పాపారాయుడు కథ ద్వారా చారిత్రికమైనది.
- మందస
సోంపేటకు 26 కి.మీ. దూరంలో ఉంది. మహేంద్రగిరి కొండ దుగువున ఉన్న ఈ వూరిలో 700 సంవత్సరాల పురాతన వాసుదేవ ఆలయం ఉంది. ఇక్కడి కోట దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనదిగా చెప్పబడుతున్నది.
- మరి కొన్ని ముఖ్యమైన ఆలయాలు
- రావివలస - ఎండలమల్లన్న,
- పాతపట్నం - నీలమణి అమ్మవారు,
- పాలకొండ - కోటదుర్గ,
- కవిటి, తేలినీలాపురం,తేలుకుంచి, పొందూరు, దంతవరపుకోట, రాజాం, మందస,
- నందిగాం, పొలాకి మండలం దుర్గమ్మగుడి
క్రీడలు
ఈ జిల్లాకు చెందిన ఎందరో మహానుభావులు ఆంధ్ర దేశం, తెలుగు భాష వికాసానికి అసమానమైన సేవ చేశారు. జిల్లాకు చెందిన కొందరు ప్రముఖులు
- సాహితీవేత్తలు
- కళాప్రపూర్ణ గిడుగు రామమూర్తి పంతులు - వ్యావహారిక భాష వాడకాన్ని ఉద్యమ స్ఫూర్తితో అమలుపరచిన వైతాళికుడు
- గరిమెళ్ళ సత్యనారాయణ - కవి, స్వాతంత్ర్య సమర యోధుడు
- కాళీపట్నం రామారావు - కథా రచయిత
- రాచకొండ విశ్వనాథశాస్త్రి (రావిశాస్త్రి)-రవయిత,సాహితీ వేత్త
- గెడ్డాపు సత్యం - ప్రముఖ పద్యకవి, సాహితీ వేత్త, ఆధ్యాత్మిక వేత్త.
- పింగళి నాగేంద్రరావు (రచయిత)
- వడ్రంగి రామారావు (భావశ్రీ)- రచయిత, సాహితీవేత్త
- బి.వి.ఎ.రామారావు నాయుడు - రచయిత, సాహితీ పరిశోధకుడు
- అట్టాడ అప్పలనాయుడు - రచయిత
- బలివాడ కాంతారావు నవలా రచయిత
- ఛాయరాజ్ - రచయిత, సాహితీ పరిశోధకుడు
- తెప్పల కృష్ణమూర్తి-రచయిత,సాహితీవేత్త
- మావుడూరు వెంకట సత్య శ్రీరామమూర్తి రచనలు రచయిత,సాహితీవేత్త
- దూసి ధర్మారావు - రచయిత, సాహితీకారుడు.
- కళాకారులు
- చట్టి పూర్ణయ్య పంతులు - నాటక రంగానికి ఎనలేని సేవ చేశాడు
- అమరపు సత్యనారాయణ - రంగస్థల కళాకారుడు
- యడ్ల గోపాలరావు - రంగస్థల కళాకారుడు
- దూసి బెనర్జీ భాగవతార్ - హరికథకుడు
- లోకనాథం నందికేశ్వరరావు - మిమిక్రీ కళాకారుడు
- పి.ధనుంజయరావు - బుర్రకథకుడు
- బండారు చిట్టిబాబు - సంగీతకారుడు
- దివిలి అప్పారావు - శిల్పి
- శ్రీపాద పినాకపాణి - సంగీతకారుడు
- వడ్డాది పాపయ్య - చిత్రకారుడు
- జి.ఆనంద్- (గాయకుడు)
- జె.వి.సోమయాజులు (తెలుగు చలనచిత్ర నటుడు)
- కాళీపట్నం రామారావు (సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు)
- గజల్ శ్రీనివాస్
- మిమిక్రీ శ్రీనివాస్
- శరత్ బాబు (చలనచిత్ర నటులు)
- సీపాన శ్రీధర్ (సినీ రచయిత, దర్శకుడు )
- వట్టి కుమార్ ( దర్శకుడు )
- షకలక శంకర్ (జబర్దస్త్ ఫేమ్)
- రావి కొండలరావు,
- జి.ఆనంద్,
- జె.వి.సోమయాజులు
- క్రీడాకారులు
- కోడి రామమూర్తి - పహిల్వాన్
- కరణం మల్లీశ్వరి - ఒలింపిక్ విజేత
- పూజారి శైలజ - క్రీడాకారిణి
- నీలంశెట్టి లక్ష్మి - క్రీడాకారిణి
- పూర్ణ చందన.కె - కరాటే క్రీడాకారిణి
- నాయకులు
- సర్దార్ గౌతు లచ్చన్న - స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు
సంస్థానాలు
- ఉర్లం సంస్థానం సంస్కృత భాష ఆధ్యయనానికి ఎంతో సేవ చేసింది.
పాలనా విభాగాలు
పట్టణ ప్రాంతాలు
జిల్లాలో ఆరు పట్టణ ప్రాంతాలు -నాలుగు మునిసిపాలిటీలు, రెండు నోటిఫైడ్ పంచాయితీ టౌనులు - ఉన్నాయి.
- శ్రీకాకుళం మున్సిపాలిటీ (టౌను) - 1,17,320
- ఆముదాలవలస - 37,931
- ఇచ్చాపురం - 32,662
- పలాస (పలాస-కాశిబుగ్గ) - 49,899
- సోంపేట - 17,423 (నోటిఫైడ్ పంచాయితీ టౌను)
- రాజం -23,424 (నోటిఫైడ్ పంచాయితీ టౌను) #పాలకోండ-75,000 నగరపంచాయతీ
లోక్సభ స్థానాలు
శ్రీకాకుళం జిల్లాపరిధిలో 3 లోక్సభ స్థానాలున్నవి.
- లోక్సభ స్థానం (1): శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం 2.పార్వతీపురం, 3.విజయనగరంలలో (పాక్షికంగా) కలిసి ఉంది.
శాసనసభస్థానాలు
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనసభస్థానాలు
2009 మే 29 నాటికి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 శాసనసభ స్థానాలు ఉన్నాయి.పునర్విభజన ప్రకారం 2007 మే 31 న వెలువడిన నోటిఫికేషన్ ప్రకారం వాటిని 10 స్థానాలకు కుదించడం జరిగింది. వాటి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.[6]
- ఇచ్ఛాపురం శాసనసభ నియోజకవర్గం
- టెక్కలి శాసనసభ నియోజకవర్గం
- నరసన్నపేట శాసనసభ నియోజకవర్గం
- శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం
- ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గం
- ఆముదాలవలస శాసనసభ నియోజకవర్గం
- పాలకొండ శాసనసభ నియోజకవర్గం
- పాతపట్నం శాసనసభ నియోజకవర్గం
- పలాస శాసనసభ నియోజకవర్గం
- రాజాం శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గం పేరు | మండలాలు | జనాభా | ఎస్సీ | ఎస్టీ |
1.శ్రీకాకుళం శాసనసభ | శ్రీకాకుళం | 187132 | 15136 | 772 |
గార | 75017 | 4302 | 237 | |
మొత్తం | 262149 | 19438 | 1009 | |
2.ఎచ్చెర్ల. | రణస్థలం | 77436 | 9025 | 131 |
లావేరు | 67334 | 8795 | 459 | |
ఎచ్చెర్ల | 82051 | 7529 | 372 | |
గి.సిగడాం | 55087 | 6656 | 450 | |
మొత్తం | 281908 | 32005 | 1412 | |
3.రాజాం. | రాజాం | 81693 | 9497 | 1041 |
సంతకవిటి | 66893 | 7052 | 132 | |
అర్.ఆమదాలవలస | 68422 | 7673 | 578 | |
వంగర | 47879 | 7081 | 1248 | |
మొత్తం | 264867 | 31303 | 2998 | |
4.ఆమదాలవలస | ఆమదాలవలస | 83945 | 6555 | 226 |
సరుబుజ్జిలి | 32630 | 3643 | 801 | |
బూర్జ | 42852 | 5866 | 1288 | |
పొందూరు | 73175 | 6345 | 271 | |
మొత్తం | 231602 | 22509 | 2586 | |
5.నరసన్నపేట | నరసన్నపేట | 74284 | 5029 | 242 |
పోలాకి | 65734 | 293 | 163 | |
జలుమూరు | 60200 | 4455 | 391 | |
సారవకోట | 48793 | 5129 | 6148 | |
మొత్తం | 249011 | 14906 | 6944 | |
6.పాలకొండ | పాలకొండ | 73592 | 10637 | 2997 |
సీతంపేట | 52282 | 1879 | 45741 | |
భామిని | 41058 | 7495 | 8178 | |
వీరఘట్టం | 63882 | 12196 | 4224 | |
మొత్తం | 230814 | 32207 | 61140 | |
7.పాతపట్నం | పాతపట్నం | 58381 | 6604 | 10603 |
మెళియాపుట్టి | 50490 | 3511 | 13435Arasavallitemple14.jpg | |
కొత్తూరు | 60876 | 8809 | 7823 | |
ఎల్.ఎన్.పేట | 27141 | 2672 | 607 | |
మొత్తం | 248092 | 27937 | 36830 | |
8.టెక్కలి | టెక్కలి | 70872 | 7713 | 3596 |
నందిగాం | 53192 | 6050 | 2842 | |
సంతబొమ్మాలి | 64845 | 3821 | 764 | |
కోటబొమ్మాలి | 69906 | 6207 | 6944 | |
మొత్తం | 258815 | 14906 | 6944 | |
9.పలాస | పలాస | 87850 | 6694 | 3208 |
మందస | 76402 | 4747 | 10087 | |
వి.కొత్తూరు | 69398 | 1197 | 154 | |
మొత్తం | 233650 | 12638 | 13469 | |
10.ఇచ్ఛాపురం | ఇచ్చాపురం | 76747 | 2450 | 1304 |
కంచిలి | 59847 | 2697 | 7597 | |
కవిటి | 70947 | 1214 | 6636 | |
సోంపేట | 74138 | 3634 | 1063 | |
మొత్తం | 281679 | 9995 | 16600 |
ఇవి కూడా చూడండి
- శ్రీకాకుళం (అయోమయ నివృత్తి)
- శ్రీకాకుళం (పట్టణం)
- శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం
- శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం
మూలాలు
- ↑ రోటరీ ఇంటర్నేషనల్ వారి 3020 జిల్లా డిస్కషన్ గ్రూపు
- ↑ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్సైటులో శ్రీకాకుళం జిల్లా తాలూకాల వివరాలు Archived 2007-09-27 at the Wayback Machine. జూలై 28, 2007న సేకరించారు.
- ↑ కలెక్టర్ ఆఫీసు శ్రీకాకుళం నుండి సేకరించినది. (సేకరణ:డా.శేషగిరిరావు)
- ↑ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఫుట్ఫాల్స్ సమాచారం (ఆర్కైవ్)
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-02-01. Retrieved 2009-06-25.
- ↑ "వార్త" దినపత్రిక శ్రీకాకుళం ఎడిషన్ -28 మే 2007
బయటి లింకులు
- శ్రీకాకుళంఆన్లైన్.కాం
- శ్రీకాకుళం టుడే
- శ్రీకాకుళం మెడికల్
- Om Art Print - vijayawada, వారి శ్రీకాకుళం జిల్లా సమాచారం