Coordinates: 18°18′N 83°54′E / 18.3°N 83.9°E / 18.3; 83.9

శ్రీకాకుళం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, typos fixed: → (10)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 107: పంక్తి 107:
;వన్య సంపద
;వన్య సంపద
జిల్లాలోని అడవుల సాంద్రత, వృక్ష జాతులు ప్రాంతాన్ని బట్టి వైవిధ్యం కలిగి ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడి అడవులను రెండు రకాలుగా చెప్పవచ్చును.
జిల్లాలోని అడవుల సాంద్రత, వృక్ష జాతులు ప్రాంతాన్ని బట్టి వైవిధ్యం కలిగి ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడి అడవులను రెండు రకాలుగా చెప్పవచ్చును.
# దక్షిణ భారత Moist deciduous అడవులు - మిశ్రమ [[అడవులు]], మద్ది అడవులు, పర్వత సవాన్నా భూములు.
# దక్షిణ భారత తేమ ఆకురాల్చే అడవులు - మిశ్రమ [[అడవులు]], మద్ది అడవులు, పర్వత సవాన్నా భూములు.
# దక్షిణ భారత సతత హరిత అడవులు (dry ever-green miscellaneous forests)
# దక్షిణ భారత సతత హరిత అడవులు (dry ever-green miscellaneous forests)


;జంతు సంపద
;జంతు సంపద
శ్రీకాకుళం జిల్లాలో అటవీ మృగాలు అల్పంగా ఉన్నాయి. జనావాసాల విస్తరణ, అడవుల నాశనం ఇందుకు కారణాలు కావచ్చును. మాంసాహార మృగాలలో [[పులి]] దాదాపు అంతరించింది. [[చిరుత పులి]], [[హైనా]] (దుమ్ములగొండి), [[తోడేలు]] వంటి జంతువులు అరుదుగా అడవుల్లో కనిపిస్తుంటాయి. గుంటనక్క, అడవిపిల్లులు, కుక్కలు జిల్లాలో కనిపించే ఇతర మాంసాహార జంతువులు. శాకాహార జంతువులలో - somber, మచ్చల దుప్పి (చితాల్), అడవి గొర్రెలు, [[ఎలుగుబంట్లు]] సాధారణంగా కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో కృష్ణజింక, నీలగాయ్, బైసన్లు అసలు కనిపించకపోవడం గమనార్హం. పక్షి జాతులలో - నెమళ్ళు, కౌజులు, పావురాలు, చిలకలు, మైనా partridges,బాతులు doves వంటివి అధికంగా ఉన్నాయి..
శ్రీకాకుళం జిల్లాలో అటవీ మృగాలు అల్పంగా ఉన్నాయి. జనావాసాల విస్తరణ, అడవుల నాశనం ఇందుకు కారణాలు కావచ్చును. మాంసాహార మృగాలలో [[పులి]] దాదాపు అంతరించింది. [[చిరుత పులి]], [[హైనా]] (దుమ్ములగొండి), [[తోడేలు]] వంటి జంతువులు అరుదుగా అడవుల్లో కనిపిస్తుంటాయి. గుంటనక్క, అడవిపిల్లులు, కుక్కలు జిల్లాలో కనిపించే ఇతర మాంసాహార జంతువులు. శాకాహార జంతువులలో ఎక్కువుగా మచ్చల దుప్పి (చితాల్), అడవి గొర్రెలు, [[ఎలుగుబంట్లు]] సాధారణంగా కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో కృష్ణజింక, నీలగాయ్, బైసన్లు అసలు కనిపించకపోవడం గమనార్హం. పక్షి జాతులలో - నెమళ్ళు, కౌజులు, పావురాలు, చిలకలు, మైనా కౌజుపిట్టలు,బాతులు,పావురాలు వంటివి అధికంగా ఉన్నాయి..


== భౌగోళిక స్వరూపం ==
== భౌగోళిక స్వరూపం ==

03:34, 9 ఏప్రిల్ 2020 నాటి కూర్పు

శ్రీకాకుళం జిల్లా
.
.
Countryభారత దేశం
Stateఆంధ్ర ప్రదేశ్
Regionకోస్తా
Headquarterశ్రీకాకుళం
Area
 • Total5,837 km2 (2,254 sq mi)
Population
 (2011)
 • Total26,99,471
 • Density462/km2 (1,200/sq mi)
Languages
 • Officialతెలుగు
Time zoneUTC+5:30 (IST)
Telephone code+91 0( )
Literacy55.9 (2001)
Literacy Male67.9
Literacy Female44.19
Websitehttps://www.guntur.ap.gov.in/
మందస వాసుదేవ ఆలయం

శ్రీకాకుళం జిల్లా భారత దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈశాన్య సరిహద్దులో ఉంది. జిల్లా ముఖ్యపట్టణమైన శ్రీకాకుళం (అక్షా: 18' ఉ, రేఖా: 54' తూ) నాగావళి నది ఒడ్డున ఉంది. విశాఖపట్నం జిల్లా నుంచి 1950 ఆగష్టు 15 న శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979 జూన్ 1 న విజయనగరం జిల్లా ఏర్పడింది. Map

జిల్లా పేరు వెనుక చరిత్ర

  • బ్రిటిషు వారు శ్రీకాకుళం పేరును పలకలేక "చికాకోల్" అనేవారు. చికాకోల్ కు సంబంధించిన మరో కథనం ఇలాఉంది : ఈ ప్రాంతం నైజాము ఆధిపత్యంలో ఉండే సమయంలో ఈ ఊళ్లోనే ప్రతి సంవత్సరం జమాబందీ నిర్వహిస్తూ రైతుల వద్ద నుండి పన్నులు వసూలు చేసేవారు. రైతులు తాము కట్ట వలసిన పన్ను సొమ్మును విచ్చు రూపాయల రూపంలో చిన్నచిన్న గుడ్డసంచులలో పోసి, మూటకట్టి, ఆమూటను తీసికొనివచ్చి ఖుద్దున సమర్పించేవారు. ఆ మూట లోని సొమ్ము సరిగా ఉందో లేదో చూసుకోవడానికి మూటను విప్పాలి. ఆ మూటలు చాలా ఉంటున్నందువలన, ఆ మూటల మూతికట్టు విప్పమని రైతులతో చెప్పడానికి "శిఖా ఖోల్" అనేవారు. అంటే "మూతికట్టువిప్పు" అని అర్థం. ఈమాట క్రమంగా "చికా కోల్" అయి, శ్రీకాకుళంగా స్థిరపడిందిట.
  • ఆంధ్రప్రదేశ్ పూర్వపు ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు జిల్లాలోని టెక్కలి నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు.

జిల్లా చరిత్ర

శ్రీముఖలింగం ఆలయం

ఒకప్పుడు ఇది బౌద్ధమతానికి ముఖ్యస్థానంగా వర్ధిల్లింది. శాలిహుండం, దంతపురి, జగతిమెట్ వంటి బౌద్ధారామం|బౌద్ధారామాలు ఇక్కడ కనుగొనబడ్డాయి. తరువాత ఇది కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. గాంగేయులు ఈ ప్రాంతాన్ని 6 నుండి 14వ శతాబ్దం వరకు, 800 సంవత్సరాలు పాలించారు. వజ్రహస్తుడు|వజ్రహస్తుని కాలంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ముఖలింగం ఆలయాన్ని నిర్మించారు. మహమ్మదీయుల పాలన కాలంలో షేర్ మహమ్మద్ ఖాన్ శ్రీకాకుళంలో జామియా మసీదు నిర్మించాడు.

విశాఖపట్నం జిల్లాలో భాగంగా ఉండే ఈ జిల్లా 1950 ఆగష్టు 15న ప్రత్యేక జిల్లాగా అవతరించింది. 1969లో ఈ జిల్లానుండి సాలూరు తాలూకాలోని 63 గ్రామాలు, బొబ్బిలి తాలూకాలోని 44 గ్రామాలను విశాఖపట్నం జిల్లాలో కొత్తగా ఏర్పరచిన గజపతి నగరం తాలూకాకు బదలాయించారు. మళ్ళీ మే 1979లో కొత్తగా విజయనగరం జిల్లాను ఏర్పరచినపుడు సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, చీపురుపల్లి తాలూకాలను కొత్తజిల్లాలో విభాగాలుగా చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో నక్సలైటు (మావోయిస్టు పార్టీ) ఉద్యమం ప్రారంభమయింది శ్రీకాకుళం జిల్లాలోనే.

నైసర్గిక స్వరూపం

శ్రీకాకుళం జిల్లా మొత్తం జిల్లా వైశాల్యం 5837 చ.కి.మీ. జిల్లాకు 193 కి.మీ. సముద్ర తీరం ఉంది. తూర్పు కనుమలు ఈశాన్యం నుండి కొంతభాగం విస్తరించి ఉన్నాయి.

నదులు

నాగావళి, వంశధార, మహేంద్ర తనయ, చంపావతి, బహుదా, కుంభికోటగెడ్ ఇవి జిల్లాలలో ముఖ్యమైన నదులు. ఇవి తూర్పు కనుమలలో పుట్టి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.

వాతావరణం

సంవత్సరంలో ఎక్కువకాలం వాతావరణం తేమగా ఉంటుంది. నైఋతి ఋతుపవనాలు జూన్ నుండి సెప్టెంబరు వరకు, ఈశాన్య ఋతుపవనాలు అక్టోబరు - నవంబరు మాసాలలోను వర్షాలు కురిపిస్తాయి. డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు పొడిగాను, చల్లగాను ఉంటుంది. సంవత్సరం సగటు వర్షపాతం 1162 మి.మీ. (2004-2005 సం.లో వర్షపాతం 937.6 మి.మీ.)

వన్య సంపద

జిల్లాలోని అడవుల సాంద్రత, వృక్ష జాతులు ప్రాంతాన్ని బట్టి వైవిధ్యం కలిగి ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడి అడవులను రెండు రకాలుగా చెప్పవచ్చును.

  1. దక్షిణ భారత తేమ ఆకురాల్చే అడవులు - మిశ్రమ అడవులు, మద్ది అడవులు, పర్వత సవాన్నా భూములు.
  2. దక్షిణ భారత సతత హరిత అడవులు (dry ever-green miscellaneous forests)
జంతు సంపద

శ్రీకాకుళం జిల్లాలో అటవీ మృగాలు అల్పంగా ఉన్నాయి. జనావాసాల విస్తరణ, అడవుల నాశనం ఇందుకు కారణాలు కావచ్చును. మాంసాహార మృగాలలో పులి దాదాపు అంతరించింది. చిరుత పులి, హైనా (దుమ్ములగొండి), తోడేలు వంటి జంతువులు అరుదుగా అడవుల్లో కనిపిస్తుంటాయి. గుంటనక్క, అడవిపిల్లులు, కుక్కలు జిల్లాలో కనిపించే ఇతర మాంసాహార జంతువులు. శాకాహార జంతువులలో ఎక్కువుగా మచ్చల దుప్పి (చితాల్), అడవి గొర్రెలు, ఎలుగుబంట్లు సాధారణంగా కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో కృష్ణజింక, నీలగాయ్, బైసన్లు అసలు కనిపించకపోవడం గమనార్హం. పక్షి జాతులలో - నెమళ్ళు, కౌజులు, పావురాలు, చిలకలు, మైనా కౌజుపిట్టలు,బాతులు,పావురాలు వంటివి అధికంగా ఉన్నాయి..

భౌగోళిక స్వరూపం

సరిహద్దులు

ఉత్తరాన ఒడిషా రాష్ట్రం, దక్షిణ-పశ్చిమాల్లో విజయనగరం జిల్లా, ఒడిషా గజపతి జిల్లా, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. జిల్లాకు కొంత భాగం హద్దులుగా కందివలస గెడ్, వంశధార, బహుదా నదులు ప్రవహిస్తున్నాయి.

మొత్తం జిల్లా వైశాల్యం 5837 చ.కి.మీ.

ఆర్ధిక స్థితి గతులు

వ్యవసాయం

జిల్లాలో ముఖ్య పంటలు- వరి, రాగులు, పెసలు, మినుములు, ఉలవలు, చెరకు, జనుము, వేరుశనగ, నువ్వులు, మిరప, పసుపు, నీరుల్లి.

నీటివనరులు

శ్రీకాకుళం జిల్లాలో బాహుద, ఉత్తర మహేంద్ర, తనయ, బెంజిగడ్డ, వరహాలు గడ్డ, వంశధార, నాగావళి, పెద్దగడ్డ, కందివలస అనే 9 నదులు ఉన్నాయి. వీటిలో నాగావళి, వంశధార, మహేంద్ర తనయ ముఖ్యమైన నదులు.[1] జిల్లాలో ఈశాన్య ఋతుపవనాల ద్వారా 26.47%, నైఋతి ఋతుపవనాల ద్వారా 62.61% వర్షాలు లభిస్తాయి. మూడు ముఖ్య నదుల ద్వారా జరుగుతున్న నీటి వినియోగం: నాగావళి 371 మి.క్యూ.మీ. (మిలియన్ క్యూబిక్ మీటర్లు) (36%), వంశధార 121 మి.క్యూ.మీ. (12%), మహేంద్ర తనయ 81 మి.క్యూ.మీ. (8%), చిన్న చెరువులు 140 మి.క్యూ.మీ. (14%), భూగర్భ జలాలు 300 మి.క్యూ.మీ. (30%). మొత్తం 1,013 మి.క్యూ.మీ. రాష్ట్రంలో రెండు ప్రధాన జలాశయాలు సుమారు 140 మి.క్యూ.మీ. నీటిని వ్యవసాయ నిమిత్తం సమకూరుస్తున్నాయి. అవకాశం ఉన్న నీటిలో 91% (5,763 మి.క్యూ.మీ.) బంగాళాఖాతంలోకి వృధాగా పోతున్నదని అంచనా. 9% నీరు మాత్రమే భూగర్భంలోకి ఇంకుతున్నది.

జిల్లాలో 3.3 లక్షల (0.33 మిలియన్) హెక్టేరులు భూమి సాగులో ఉంది. అందులో 1.9 లక్షల హెక్టేరులకు సాగునీటి వసతి ఉంది. కాలువల ద్వారా 91,946 హెక్టేరులు, చెరువుల ద్వారా 80,123 హెక్టేరులు, బోరు బావుల ద్వారా 6,923 హెక్టేరులు, ఇతర బావుల ద్వారా 8,866 హెక్టేరులు, ఇతర వనరుల ద్వారా 5,316 హెక్టేరులు భూమికి సాగునీరు లభిస్తుంది.

అనిశ్చితమైన వర్షపాతం జిల్లాలో ప్రధాన సమస్య. చాలా సంవత్సరాలు అనావృష్టి సంవత్సరాలుగా పరిగణింపబడుతున్నాయి. అలాగే త్రాగు నీటి సమస్య కూడా తీవ్రంగానే ఉంది. ఫ్లోరోసిస్ సమస్య కూడా కొన్నిచోట్ల ఉంది. నీటి వనరులను పరిరక్షించే విధానాలు లేకపోవడం, ఏజెన్సీ ప్రాంతంలోని "పోడు" వ్యవసాయం ఇందుకు ముఖ్యమైన కారణాలు. జిల్లాలో ఎక్కువ భాగం నేల ఉపరితలం గట్టిగా ఉన్నందున నీరు ఇంకే అవకాశం తక్కువ. అందుకు తోడు అధిక భూభాగం వాలుగా ఉన్నది గనుక నీరు నిలవదు. వరి, చెరకు పంటలకు ఎక్కువ నీటిని వాడుతారు.

జిల్లాలో ముఖ్యమైన ప్రాజెక్టులు: నారాయణపురం డామ్ (మద్దివలస రిజర్వాయిర్, నాగావళి), గొట్టా బారేజి (వంశధార), కళింగాంధ్ర ప్రాజెక్టు (మహేంద్ర తనయ)

మచిలేశం, కళింగపట్నం, నువ్వలరేవు, భావనపాడు, బారువలు ముఖ్యమైన మత్స్య పరిశ్రమ కేంద్రాలు.

పరిశ్రమలు

జిల్లాలో మాంగనీసు, గ్రాఫైటు, సున్నపు రాయి, మైకా, గ్రానైట్, జిల్లా తీరప్రాంతంలోని ఇసుకలో మోనజైట్, ఇతర ఖనిజాలు సమృద్ధిగా దొరుకుతాయి.

జిల్లాలో ముఖ్యపరిశ్రమలు: చక్కెర, నూనె, జీడిపప్పు, జనపనార, పేపర మిల్లు కర్మాగారములు కలవు

పైడిభీమవరం, రాజాం, మడపాం, ఆమదాలవలస, సంకిలి పట్టణాలలో పరిశ్రమలు విస్తరిస్తున్నాయి.

డివిజన్లు, మండలాలు, నియోజక వర్గాలు

దస్త్రం:Srikakulam.jpg
శ్రీ కాకుళం జిల్లా మండలాలు వివరాలు తెలుపు పటం

రెవెన్యూ డివిజన్లు

జిల్లా మూడు రెవిన్యూ డివిజన్లుగా విభజింపబడింది: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ

మండలాలు

శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ డివిజన్లు వివరాలు తెలుపు పటం

జిల్లా మొత్తం 38 మండలాలుగా విభజింపబడింది .[2]

  1. ఆమదాలవలస మండలం
  2. ఇచ్ఛాపురం మండలం
  3. ఎచ్చెర్ల మండలం
  4. కంచిలి మండలం
  5. కవిటి మండలం
  6. కొత్తూరు మండలం
  7. కోటబొమ్మాళి మండలం
  8. గంగువారి సింగడాం మండలం
  9. గార మండలం
  10. జలుమూరు మండలం
  11. టెక్కలి మండలం
  12. నందిగం మండలం
  13. నరసన్నపేట మండలం
  14. పలాస మండలం
  15. పాతపట్నం మండలం
  16. పాలకొండ మండలం
  17. పొందూరు మండలం
  18. పోలాకి మండలం
  19. బూర్జ మండలం
  20. భామిని మండలం
  21. మందస మండలం
  22. మెళియాపుట్టి మండలం
  23. రణస్థలం మండలం
  24. రాజాం మండలం
  25. రేగిడి ఆమదాలవలస మండలం
  26. లక్ష్మీనరసుపేట మండలం
  27. లావేరు మండలం
  28. వంగర మండలం
  29. వజ్రపుకొత్తూరు మండలం
  30. వీరఘట్టం మండలం
  31. శ్రీకాకుళం మండలం
  32. సంతకవిటి మండలం
  33. సంతబొమ్మాళి మండలం
  34. సరుబుజ్జిలి మండలం
  35. సారవకోట మండలం
  36. సీతంపేట మండలం
  37. సోంపేట మండలం
  38. హీరమండలం మండలం

రవాణా వ్వవస్థ

రోడ్డు మార్గాల ద్వారా వివిధ ప్రాంతాలకు చక్కగా కలపబడి ఉంది. విశాఖపట్నం, దగ్గరలోని విమానాశ్రయము.ఇది రెవెన్యూ డివిజన్ కేంద్రస్థానమైనా రైలుస్టేషను లేదు.10 కి.మీ.లోని శ్రీకాకుళం రోడ్ స్టేషనుకు వెళ్ళాలి.ఎ.పి.ఎస్.ఆర్.టి.సి ప్రభుత్వ సంస్ధ ద్వారా జిల్లా కేంద్రం నుండి ఇతర మండల.జిల్లా.రాష్ట్రాలకు వివిధ సర్వీస్ లు నడుస్తున్నాయి.

జనాభా లెక్కలు

2011 జన గణన ప్రకారం ప్రధాన వివరాలిలా ఉన్నాయి

  • 2001-2011 దశకంలో జనాభా వృద్ధి రేటు: 6.52% (మొత్తం రాష్ట్రం వృద్ధి రేటు 14.44%)
  • జనసాంద్రత: చ.కి.మీ.కు 463 మంది (రాష్ట్రం జనసాంద్రత 308)
  • అక్షరాస్యులు మగవారిలో 8,57,824 (71.61%), ఆడువారిలో 6,37,557 (52.08%)
  • పట్టణ ప్రాంతాల జనాభా 4,36,703 లేదా 16.16% (రాష్ట్రం మొత్తంలో పట్టణ జనాభా 27.35%)
  • శ్రామికులు: 48.6% (ఇందులో 78% వ్యవసాయం, 15% సేవల రంగం).

(2011 జనాభా లెక్కల సాయంతో)

శ్రీకాకుళం జిల్లా జనాభా [3]
శ్రీకాకుళం జిల్లా జనాభా - 2011 సెన్సెస్ ప్రకారం
కేటగిరీ మగ ఆడ మొత్తము %మగ %ఆడ
అందరు 13,41,738 13,61,376 27,03,114 49.64% 50.36%
ఎస్సీ 113730 115879 229609 9.02% 9.07%
ఎస్టీ 75284 75965 151249 5.97% 5.94%
మైనారిటీస్ 21706 23641 44223 1.73% 1.88%

సంస్కృతి

ప్రధాన భాష తెలుగు. అయితే, ఒడిషా రాష్ట్రానికి సరిహద్దు కావడంచేత ఒరియా భాషను కొంతమంది అర్థం చేసుకోగలరు, మాట్లాడగలరు కూడా. శ్రీకాకుళం జిల్లా ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతం. ఇటీవలి కాలంలో జరుగుతున్న పారిశ్రామిక, విద్యా రంగాల్లో అభివృద్ధి కారణంగా శ్రీకాకుళం పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. కానీ మౌలిక సదుపాయాల విషయంలో ఆటంకాలను ఎదుర్కొంటోంది. ఈ ఊరిని పేదవాని స్వర్గం (poor man's paradise) అని చమత్కరిస్తారు (వేసవికాలంలో చల్లగాఉండే ప్రదేశం కావడం వలన).

విద్యాసంస్థలు

  • అంబేద్కర్ విశ్వవిద్యాలయం - ఎచ్చెర్ల
  • రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ శ్రీకాకుళం (RIMS)
  • ఐఐటి ఎచ్చెర్ల వద్ద ఉంది. జి.యు.ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ (రాజాం)
  • RGUKT - Srikakulam
  • GEMS Medical college - Ragolu village

పర్యాటకం

కళింగపట్నం బీచ్ వద్ద దీపస్తంభం
శాలిహుండం బౌద్ధారామ అవశేషాలు
అరసవిల్లి ఆలయం
శ్రీకూర్మం ఆలయం

శ్రీకాకుళం పట్నం, జిల్లాలోని పలు ప్రాంతాలు పచ్చికబయల్లు, అడవులు,సశ్యస్యామలమైన పంట పొలాలతో ఎప్పుడూ చల్లగా ఉంటుంది.వేసవి కాలములో ఊటీని పోలి ఉంటుంది. ఈ జిల్లాలో వర్షపాతము ఎక్కువగా ఉంటుంది. కాస్టాఫ్ లివింగ్ చాలా తక్కువ. అందుకే దీనిని పేదవాని స్వర్గమని పిలుస్తారు. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలన్నీ కలిపి 2017లో రెండు కోట్లమంది పైచిలుకు, 2016లో కోటీ అరవైలక్షల పైచిలుకు పర్యాటకులు సందర్శించారని ప్రభుత్వ అంచనా.[4] పర్యాటకుల సంఖ్య విషయంలో 2017లో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో చిత్తూరు జిల్లా తర్వాత రెండవ స్థానం పొందింది.

వాతావరణం

సంవత్సరంలో ఎక్కువకాలం వాతావరణం తేమగా ఉంటుంది. నైఋతి ఋతుపవనాలు జూన్ నుండి సెప్టెంబరు వరకు, ఈశాన్య ఋతుపవనాలు అక్టోబరు - నవంబరు మాసాలలోను వర్షాలు కురిపిస్తాయి. డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు పొడిగాను, చల్లగాను ఉంటుంది. సంవత్సరం సగటు వర్షపాతం 1162 మి.మీ. (2004-2005 సంవత్సరంలో వర్షపాతం 937.6 మి.మీ.) జిల్లాలోని అడవుల సాంద్రత, వృక్ష జాతులు ప్రాంతాన్ని బట్టి వైవిధ్యం కలిగి ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడి అడవులను రెండు రకాలుగా చెప్పవచ్చును.

సస్య సంపద

దక్షిణ భారత Moist deciduous అడవులు - మిశ్రమ అడవులు, మద్ది అడవులు, పర్వత సవాన్నా భూములు. దక్షిణ భారత సతత హరిత అడవులు (dry ever-green miscellaneous forests) అందుకే దీనిని పేదవాని స్వర్గం అని పిలుస్తారు.[5]

శ్రీకాకుళం పట్టణానికి చేరువలో అనేక ధార్మిక, విహార యాత్రా స్థలాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయు.

శ్రీకాకుళం

జిల్లా కేంద్రమైన ఈ పట్టణం నాగావళి నది ఒడ్డున ఉంది. 13 కిలోమీటర్ల దూరంలో ఆమదాలవలస రైల్వేస్టేషను ఉంది. కోటేశ్వరస్వామి ఆలయము (గుడివీధి), సంతోషిమాత ఆలయం (పాతశ్రీకాకుళం), వెంకటేశ్వరఆలయం (గుజరాతీపేట), కోదండ రామస్వామి ఆలయం, జమియా మసీదు ముఖ్యమైన ప్రార్థనా స్థలాలు.

అరసవిల్లి

సూర్య దేవాలయానికి ప్రసిద్ధి చెందిన అరసవిల్లి శ్రీకాకుళం పట్టణానికి 2 కి.మీ.లోనే ఉంది. దేశంలో ఉన్న కొద్ది సూర్య మందిరాలలో ఇది ఒకటి. ఇక్కడ ఆదిత్య, అంబిక, విష్ణు, గణేష, మహేశ్వర మూర్తులు ఉన్నాయి.

శ్రీకూర్మం

శ్రీకాకుళం పట్టణానికి 15 కి.మీ. దూరంలో ఉన్న శ్రీకూర్మం దేశంలో బహుశా ఒకే ఒక కూర్మావతార మందిరం. విశిష్టమైన శిల్పకళ కలిగిన ఈ మందిరంలో లభించిన శాసనాలు చారిత్రికంగా కూడా ఎంతో ముఖ్యమైనవి. ఇక్కడ డోలోత్సవం ప్రధాన ఉత్సవం.

శాలిహుండం

ఇది శ్రీకాకుళం పట్టణానికి 18 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ పురావస్తుశాఖ త్రవ్వకాలలో పురాతన బౌద్ధారామాల శిథిలాలు బయటపడ్డాయి.

శ్రీముఖలింగం
కళింగపట్నం

జిల్లా కేంద్రానికి 25 కి.మీ. దూరంలో ఉన్న ఓడరేవు. చారిత్రకంగా సముద్ర వాణిజ్య కేంద్రం. వంశధార నది ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ దర్గా షరీఫ్, షేక్ మదీనా అక్విలిన్ ఉన్నాయి. 23 కిలోమీటర్లవరకు కనుపించే ఒక దీప స్తంభం ఉఉంది.

కవిటి

సోంపేట, ఇచ్ఛాపురాల మధ్య ఉన్న కవిటిని 'ఉద్దానం' (ఉద్యానవనం) అని కూడా అంటారు. కొబ్బరి, జీడిమామిడి, పనస వంటి తోటలతో ఇది రమణీయంగా ఉండే ప్రదేశం. శ్రీకాకుళానికి 130 కి.మీ. దూరం. ఇక్కడ చింతామణి అమ్మవారి, శ్రీ సీతారామ స్వామి ఆలయం ఉన్నాయి.

బారువ

ఇది శ్రీకాకుళం పట్టణానికి 109 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ మహేంద్ర తనయ నది సముద్రంలో కలుస్తుంది, ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి ఆలయం, జనార్దన స్వామి ఆలయం ఉన్నాయి. ఒకప్పుడు ఇది ముఖ్యమైన ఓడరేవు. ఇది కొబ్బరి తోటలకు, కొబ్బరి పీచు పరిశ్రమకు కేంద్రం.

తేలినీలాపురం

ఇది శ్రీకాకుళం పట్టణానికి 60 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ ఒక సంరక్షిత పక్షి ఆవాస కేంద్రం. సైబీరియా నుండి శీతకాలంలో పెలికన్ పక్షులు ఇక్కడికి వలస వస్తాయి.

దంతపురి

ఇది శ్రీకాకుళం పట్టణానికి 22 కి.మీ. దూరంలో ఉంది. దీనిని బౌద్ధ జ్ఞానదంతపురి అని కూడా అంటారు. క్రీ.పూ.261లో అశోకుని కళింగ యుద్ధం తరువాత ఇది కళింగరాజులకు ప్రాంతీయ రాజధానిగా ఉంది. ఇక్కడ పురావస్తు శాఖవారి త్రవ్వకాలలో అనేక పురాతన వస్తువులు లభించాయి.

సంగం

శ్రీకాకుళానికి 56 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ నాగావళి, వంశధార, సువర్ణముఖి నదులు కలుస్తున్నాయి. ఇక్కడ సంగమేశ్వర మందిరం ఐదు లింగక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధం. మహాశివరాత్రికి ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది.

పొందూరు

ప్రఖ్యాతి గాంచిన పొందూరు ఖద్దరు తయారయ్యేది జిల్లాలోని పొందూరు లోనే. ఇది జిల్లా కేంద్రానికి 21 కి.మీ. దూరంలో ఉంది.

కొరసవాడ

ప్రఖ్యాతి గాంచిన మంచు తాతాయ్య చెనెత వస్త్రములు తయారయ్యేది జిల్లాలోని కొరసవాడ లోనే. ఇది శ్రీకాకుళానికి 55 కి.మీ. దూరంలో ఉంది.

రాజాం

శ్రీకాకుళానికి 40 కి.మీ. దూరంలో ఉన్న రాజాం బొబ్బిలి సర్దార్ తాండ్ర పాపారాయుడు కథ ద్వారా చారిత్రికమైనది.

మందస

సోంపేటకు 26 కి.మీ. దూరంలో ఉంది. మహేంద్రగిరి కొండ దుగువున ఉన్న ఈ వూరిలో 700 సంవత్సరాల పురాతన వాసుదేవ ఆలయం ఉంది. ఇక్కడి కోట దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనదిగా చెప్పబడుతున్నది.

క్రీడలు

ఈ జిల్లాకు చెందిన ఎందరో మహానుభావులు ఆంధ్ర దేశం, తెలుగు భాష వికాసానికి అసమానమైన సేవ చేశారు. జిల్లాకు చెందిన కొందరు ప్రముఖులు

గిడుగు రామమూర్తి పంతులు
కోడి రామ్మూర్తి నాయుడు
సాహితీవేత్తలు
కళాకారులు
క్రీడాకారులు
నాయకులు

సంస్థానాలు

పాలనా విభాగాలు

పట్టణ ప్రాంతాలు

జిల్లాలో ఆరు పట్టణ ప్రాంతాలు -నాలుగు మునిసిపాలిటీలు, రెండు నోటిఫైడ్ పంచాయితీ టౌనులు - ఉన్నాయి.

  1. శ్రీకాకుళం మున్సిపాలిటీ (టౌను) - 1,17,320
  2. ఆముదాలవలస - 37,931
  3. ఇచ్చాపురం - 32,662
  4. పలాస (పలాస-కాశిబుగ్గ) - 49,899
  5. సోంపేట - 17,423 (నోటిఫైడ్ పంచాయితీ టౌను)
  6. రాజం -23,424 (నోటిఫైడ్ పంచాయితీ టౌను) #పాలకోండ-75,000 నగరపంచాయతీ

లోక్‌సభ స్థానాలు

శ్రీకాకుళం జిల్లాపరిధిలో 3 లోక్‌సభ స్థానాలున్నవి.

శాసనసభస్థానాలు

  • ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనసభస్థానాలు

2009 మే 29 నాటికి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 శాసనసభ స్థానాలు ఉన్నాయి.పునర్విభజన ప్రకారం 2007 మే 31 న వెలువడిన నోటిఫికేషన్ ప్రకారం వాటిని 10 స్థానాలకు కుదించడం జరిగింది. వాటి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.[6]

పునర్విభజన ప్రకారం శ్రీకాకుళం జిల్లా శాసనసభ స్థానాలు.
నియోజకవర్గం పేరు మండలాలు జనాభా ఎస్సీ ఎస్టీ
1.శ్రీకాకుళం శాసనసభ శ్రీకాకుళం 187132 15136 772
గార 75017 4302 237
మొత్తం 262149 19438 1009
2.ఎచ్చెర్ల. రణస్థలం 77436 9025 131
లావేరు 67334 8795 459
ఎచ్చెర్ల 82051 7529 372
గి.సిగడాం 55087 6656 450
మొత్తం 281908 32005 1412
3.రాజాం. రాజాం 81693 9497 1041
సంతకవిటి 66893 7052 132
అర్.ఆమదాలవలస 68422 7673 578
వంగర 47879 7081 1248
మొత్తం 264867 31303 2998
4.ఆమదాలవలస ఆమదాలవలస 83945 6555 226
సరుబుజ్జిలి 32630 3643 801
బూర్జ 42852 5866 1288
పొందూరు 73175 6345 271
మొత్తం 231602 22509 2586
5.నరసన్నపేట నరసన్నపేట 74284 5029 242
పోలాకి 65734 293 163
జలుమూరు 60200 4455 391
సారవకోట 48793 5129 6148
మొత్తం 249011 14906 6944
6.పాలకొండ పాలకొండ 73592 10637 2997
సీతంపేట 52282 1879 45741
భామిని 41058 7495 8178
వీరఘట్టం 63882 12196 4224
మొత్తం 230814 32207 61140
7.పాతపట్నం పాతపట్నం 58381 6604 10603
మెళియాపుట్టి 50490 3511 13435Arasavallitemple14.jpg
కొత్తూరు 60876 8809 7823
ఎల్.ఎన్.పేట 27141 2672 607
మొత్తం 248092 27937 36830
8.టెక్కలి టెక్కలి 70872 7713 3596
నందిగాం 53192 6050 2842
సంతబొమ్మాలి 64845 3821 764
కోటబొమ్మాలి 69906 6207 6944
మొత్తం 258815 14906 6944
9.పలాస పలాస 87850 6694 3208
మందస 76402 4747 10087
వి.కొత్తూరు 69398 1197 154
మొత్తం 233650 12638 13469
10.ఇచ్ఛాపురం ఇచ్చాపురం 76747 2450 1304
కంచిలి 59847 2697 7597
కవిటి 70947 1214 6636
సోంపేట 74138 3634 1063
మొత్తం 281679 9995 16600

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. రోటరీ ఇంటర్నేషనల్ వారి 3020 జిల్లా డిస్కషన్ గ్రూపు
  2. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో శ్రీకాకుళం జిల్లా తాలూకాల వివరాలు Archived 2007-09-27 at the Wayback Machine. జూలై 28, 2007న సేకరించారు.
  3. కలెక్టర్ ఆఫీసు శ్రీకాకుళం నుండి సేకరించినది. (సేకరణ:డా.శేషగిరిరావు)
  4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఫుట్‌ఫాల్స్ సమాచారం (ఆర్కైవ్)
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-02-01. Retrieved 2009-06-25.
  6. "వార్త" దినపత్రిక శ్రీకాకుళం ఎడిషన్ -28 మే 2007

బయటి లింకులు