రాముడు భీముడు (1964 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Deepasikha (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Deepasikha (చర్చ | రచనలు) |
||
పంక్తి 44: | పంక్తి 44: | ||
| [[ఘంటసాల]], [[పి.సుశీల]] |
| [[ఘంటసాల]], [[పి.సుశీల]] |
||
|} |
|} |
||
==విశేషాలు= |
==విశేషాలు== |
||
*ఎన్.టి.ఆర్ ద్విపాత్రాభినయం చేసిన తొలిచిత్రం. |
*ఎన్.టి.ఆర్ ద్విపాత్రాభినయం చేసిన తొలిచిత్రం. |
||
*నాగార్జున సాగర్ నిర్మాణకాలంలో తీసిన ఈ చిత్రంలో ఒక పాట లో సాగర్ డామ్ నిర్మాణం నేపధ్యం గా చూపారు. |
*నాగార్జున సాగర్ నిర్మాణకాలంలో తీసిన ఈ చిత్రంలో ఒక పాట లో సాగర్ డామ్ నిర్మాణం నేపధ్యం గా చూపారు. |
08:47, 18 ఏప్రిల్ 2008 నాటి కూర్పు
రాముడు భీముడు (1964 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తాపీ చాణక్య |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, జమున |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఇది 1964లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు, సురేష్ ప్రొడుక్షన్స్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం. చిత్రం విజయవంతమై అనేక చిత్రాలకు మాతృక అయ్యింది.
సంక్షిప్త చిత్రకథ
చిన్నతనంలోనే దూరమైన ఇద్దరు అన్నదమ్ముల కథ. రాముడు శాంతకుమారి కొడుకు. తండ్రి లేడు. మేనమామ(రాజనాల) ఆస్తి అజమాయిషీ చేస్తూ రాముడ్ని చాలా హీనంగా చూస్తుంటాడు. అమాయకుడైన రాముడు మేనమామ చే కొరడా దెబ్బలు తింటుంటాడు. భీముడు పల్లెటూర్లో నాటకాలరాయుడిలా తిరుగుతూ పెంపుడుతల్లి మాట వినకుండా అల్లరి పనులు చేస్తుంటాడు. మేనమామ ఏర్పాటు చేసిన పెళ్ళి చూపుల్లో రాముడు అవమాన పడతాడు. మేనమామ మీద భయంతో ఇంటినుండి వెళ్ళిపోతాడు. అదే సమయానికి భీముడు పల్లెటూరినుండి పారిపోయి పట్నం వస్తాడు. కొన్ని పరిస్తితుల్లో ఒకరి స్థానం లో ఒకరు ప్రవేశిస్తారు. మేనమామ కి రాముడి స్థానంలో ఉన్న భీముడు బుద్ధి చెబుతాడు. రాముడు భీముడు అన్నదమ్ములని తెలుస్తుంది. రాముడు పల్లె పడుచు ఎల్.విజయలక్ష్మి ని భీముడు పట్నం పిల్ల జమున ను పెళ్ళాడతారు.
ట్రెండ్ సెట్టింగ్
రాజు పేద నవలలో ఒకే పోలికతో ఉన్న యువరాజు, పేద బాలుడు స్థానాలు మారుతారు. అదే విషయం మీద ఆధారపడి రాముడు భీముడు కథ తయారయ్యింది. తెలుగు లో విజయవంతమయ్యాక తమిళ హిందీ భాషల్లో నిర్మించబడింది. హిందీ లో రామ్ ఔర్ శ్యామ్ గా దిలీప్ కుమార్ నటించారు. అక్కడ కూడా విజయవంతమయ్యింది. అదేకథను జెండరు మార్పు తో హేమమాలిని ద్విపాత్రాభినయం తో 'సిప్పీ' లు సీత ఔర్ గీత తీశారు. అదే కథ ను మళ్ళీ తెలుగులో గంగ మంగ (వాణిశ్రీ) గా తీశారు. చిరంజీవి నటించిన యముడుకి మొగుడు చిత్రంలో కూడా రాముడు భీముడు చిత్ర ఛాయ లు కనిపిస్తాయి. బాలకృష్ణ హీరో గా రాముడు భీముడు వచ్చింది. అందులోనూ అవే ఛాయలున్నాయి. హిందీ లో శ్రీదేవి చిత్రం చాల్ బాజ్ , సీతా ఔర్ గీతా ను పోలి ఉంటుంది.
పాటలు
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఉందిలే మంచికాలం ముందుముందునా | సి.నారాయణరెడ్డి | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల, పి.సుశీల |
దేశమ్ము మారిందోయ్ కాలమ్ము మారిందోయ్ | సి.నారాయణరెడ్డి | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల, పి.సుశీల |
అదే నాకు అంతు తెలియకున్నది : ఏదో లాగు మనసు లాగుతున్నది | సి.నారాయణరెడ్డి | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల, పి.సుశీల |
తెలిసిందిలే తెలిసిందిలే, నెలరాజ నీ రూపు తెలిసిందిలే | సి.నారాయణరెడ్డి | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల, పి.సుశీల |
విశేషాలు
- ఎన్.టి.ఆర్ ద్విపాత్రాభినయం చేసిన తొలిచిత్రం.
- నాగార్జున సాగర్ నిర్మాణకాలంలో తీసిన ఈ చిత్రంలో ఒక పాట లో సాగర్ డామ్ నిర్మాణం నేపధ్యం గా చూపారు.
- అప్పటి సంకేతిక పరిమితుల దౄష్ట్యా కావచ్చుఎన్.టి.ఆర్ రెండుపాత్రలు తెరపై కలిసి కనిపించే సన్నివేశాలు రెండు/మూడు మాత్రమే ఉన్నాయి.
- ఎన్.టి.ఆర్ డూప్ గా సత్యనారాయణ ఒక సన్నివేశంలో స్పష్టం గా కనిపిస్తారు.
మూలాలు
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.