పాలమూరు గోస: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 35: పంక్తి 35:




కరువు వ్యతిరేక పోరాట కమిటి, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు జి. హరగోపాల్ కవిత్వంలో పాలమూరు గోస, రాజకీయ ఆర్థిక నేపథ్యం అంటూ సంపాదకీయం రాయగా,కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌కు చెందిన ప్రొ. డి. నరసింహరెడ్డి కరువు రాజకీయనాయకుల పుణ్యమే అంటూ ముందు మాట రాశారు. పాలమూరు లేబర్ (రూం) పేరిటి [[పెండ్యాల వరవరరావు]] సుదిర్ఘ వ్యాసం రాశాడు. పాలమూరు గోసలో ప్రతిధ్వనించిన కరువు అంటూ [[ఆంధ్రజ్యోతి]] రాయగా, ఇది పాలమూరు గొస, ఇక చూపిస్తారా ధ్యాస? అంటూ [[ఈనాడు]] సంపాదకీయంతో పాటు, జిల్లా సాహిత్య చరిత్రలో ఇది అపూర్వమంటూ ఈనాడు జిల్లా అనుబంధంలోనూ ప్రచురించిన వార్తను ఈ పుస్తకంలో పొందుపరిచారు. పాలమూరు గెలుస్తంది అని పత్రికా సంపాదకులు కె. శ్రీనివాస్ రాశాడు.
కరువు వ్యతిరేక పోరాట కమిటి, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు జి. హరగోపాల్ కవిత్వంలో పాలమూరు గోస, రాజకీయ ఆర్థిక నేపథ్యం అంటూ సంపాదకీయం రాయగా,కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌కు చెందిన ప్రొ. డి. నరసింహరెడ్డి కరువు రాజకీయనాయకుల పుణ్యమే అంటూ ముందు మాట రాశారు. పాలమూరు లేబర్ (రూం) పేరిటి [[పెండ్యాల వరవరరావు]] సుదిర్ఘ వ్యాసం రాశాడు. పాలమూరు గోసలో ప్రతిధ్వనించిన కరువు అంటూ [[ఆంధ్రజ్యోతి]] రాయగా<ref>ఆంధ్రజ్యోతి, దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా అనుబంధం, తేది:03.03.2003</ref>, ఇది పాలమూరు గొస, ఇక చూపిస్తారా ధ్యాస? అంటూ [[ఈనాడు]] సంపాదకీయంతో పాటు, జిల్లా సాహిత్య చరిత్రలో ఇది అపూర్వమంటూ ఈనాడు జిల్లా అనుబంధంలోనూ ప్రచురించిన వార్తను ఈ పుస్తకంలో పొందుపరిచారు. పాలమూరు గెలుస్తంది అని పత్రికా సంపాదకులు కె. శ్రీనివాస్ రాశాడు.






07:37, 16 మే 2020 నాటి కూర్పు

పాలమూరు గోస
Palamur gosa.book cover.jpeg2
కృతికర్త: సం. ప్రొ. జి. హరగోపాల్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: కవిత్వం (పాటలు, వచన కవితలు)
ప్రచురణ: కరువు వ్యతిరేక పోరాట కమిటి, మహబూబ్ నగర్ జిల్లా
విడుదల: జూలై, 2004
పేజీలు: 260



పాలమూరు గోస మహబూబ్ నగర్ జిల్లా కరువు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జూలై, 2004 లో వెలువడిన పుస్తకం. పాలమూరు జిల్లాలోని కరువు అంశంపై జిల్లా కవులు తెలుగు, ఉర్దూ భాషలలోరాసిన పాటలు, వచన కవితలు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు జిల్లాకు చెందిన చిత్రకారులు కరువు అంశంపై గీసిన చిత్రాలు కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు.

నేపథ్యం

మార్చి 2, 2003 రోజు మహబూబ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాలులో పాలమూరు కరువుపై జిల్లాకు చెందిన కరువు వ్యతిరేక పోరాట కమిటి ఒక సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు జిల్లా నలుమూల నుండి సుమారు 160 మంది కవులు, రచయితలు, చిత్రకారులు, కళాకారులు హజరయ్యారు[1]. కరువుపై నాటి సభలో వారు పాటలు, కవితలు గానం చేశారు. కళారూపాలు ప్రదర్శించారు. చిత్రాలను గీసి ప్రదర్శించారు. సభ జరిగిన సంవత్సరం తర్వాత వాటన్నిటికి పుస్తక రూపమిస్తూ, కరువు వ్యతిరేక పోరాట కమిటీ, మహబూబ్ నగర్ జిల్లా వారు జూలై, 2004 లో ఈ పుస్తకాన్ని తీసుకవచ్చారు[2].

సంపాదక వర్గం

నాటి కరువు వ్యతిరేక పోరాట కమిటీలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఏడు మంది సభ్యులు ఈ పుస్తకానికి సంపాదకులుగా వ్యవహరించారు. వారు ప్రొ. జి. హరగోపాల్, ఎం. రాఘవాచారి, ఎన్. యాదగిరి, కె.సి. వెంకటేశ్వర్లు, ఎం.డి. ఎక్బాల్ పాష, బి. వెంకటయ్య, ఎండి. ఖైసర్.

విషయసూచిక

  1. కృతజ్ఞత
  2. కవిత్వంలో పాలమూరు గోస, రాజకీయ ఆర్థిక నేపథ్యం
  3. కరువు రాజకీయనాయకుల పుణ్యమే.
  4. పాలమూరి లేబర్ (రూం)
  5. ఇది పాలమూరు గొస, ఇక చూపిస్తారా ధ్యాస?
  6. జిల్లా సాహితీ చరిత్రలో ఇది అపూర్వం.
  7. పాలమూరు గోసలో ప్రతిధ్వనించిన కరువు.
  8. పాలమూరు గెలుస్తుంది.
  9. మా మాట
  10. అంకితం.


  1. పాటలు
  2. కవితలు
  3. పద్యాలు
  4. కరువు జన్మభూమి (స్కిట్)
  5. ఉర్దూ కవితలు
  6. కరువు ప్రదర్శన చిత్రాలు
  7. చిరునామాలు.


కరువు వ్యతిరేక పోరాట కమిటి, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు జి. హరగోపాల్ కవిత్వంలో పాలమూరు గోస, రాజకీయ ఆర్థిక నేపథ్యం అంటూ సంపాదకీయం రాయగా,కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌కు చెందిన ప్రొ. డి. నరసింహరెడ్డి కరువు రాజకీయనాయకుల పుణ్యమే అంటూ ముందు మాట రాశారు. పాలమూరు లేబర్ (రూం) పేరిటి పెండ్యాల వరవరరావు సుదిర్ఘ వ్యాసం రాశాడు. పాలమూరు గోసలో ప్రతిధ్వనించిన కరువు అంటూ ఆంధ్రజ్యోతి రాయగా[3], ఇది పాలమూరు గొస, ఇక చూపిస్తారా ధ్యాస? అంటూ ఈనాడు సంపాదకీయంతో పాటు, జిల్లా సాహిత్య చరిత్రలో ఇది అపూర్వమంటూ ఈనాడు జిల్లా అనుబంధంలోనూ ప్రచురించిన వార్తను ఈ పుస్తకంలో పొందుపరిచారు. పాలమూరు గెలుస్తంది అని పత్రికా సంపాదకులు కె. శ్రీనివాస్ రాశాడు.


అంకితం

పాటలు - కవులు

కవితలు - కవులు

పద్యాలు - కవులు

కరువు జన్మభూమి (స్కిట్)

ఉర్దూ కవితలు - కవులు

కరువు చిత్రాలు - చిత్రకారులు

మూలాలు

  1. ఇది పాలమూరు గోస, ఇక చూపిస్తారా ధ్యాస?,ఈనాడు, దినపత్రిక, తేది.03.03.2003
  2. పాలమూరు గోస, సం: కరువు వ్యతిరేక పోరాట కమిటీ, మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్, 2004.
  3. ఆంధ్రజ్యోతి, దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా అనుబంధం, తేది:03.03.2003