మంథాన భైరవుడు: కూర్పుల మధ్య తేడాలు
Nagarani Bethi (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
చిదిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 58: | పంక్తి 58: | ||
{{జోగులాంబ గద్వాల జిల్లా కవులు}} |
{{జోగులాంబ గద్వాల జిల్లా కవులు}} |
||
{{ |
{{జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించిన విషయాలు|state=collapsed}} |
||
{{Authority control}} |
{{Authority control}} |
02:35, 8 జూన్ 2020 నాటి కూర్పు
మంథాన భైరవుడు | |
---|---|
జననం | మంథాన భైరవుడు క్రీ.శ. 10 వ శతాబ్ది అలంపూర్, మహబూబ్ నగర్ జిల్లా, |
ప్రసిద్ధి | సంస్కృత కవి |
మతం | జైన మతము |
మంథాన భైరవుడు మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ ప్రాంతానికి చెందిన కవి. పాలమూరు జిల్లా సాహిత్య చరిత్రలో తొలి సంస్కృత కవి[1]... క్రీ.శ. 10 వ శతాబ్దికి చెందిన వాడు. జైన మతావలంభికుడు. ఈ కవి తంత్ర గ్రంథాలు రచించాడు. భైరవతంత్రం పేరుతో ఇతను రచించిన గ్రంథం పలువురు పరిశోధకులచే ప్రశంసలందుకుంది. ఇది సంస్కృత గ్రంథం. 22 పత్రాలతో కూడిన తాళపత్ర గ్రంథమిది. సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ కవుల సంచికలో ఈ కవి గురించిన ప్రస్తావన ఉంది. కవి పండితులు, పరిశోధకులు మావవల్లి రామకృష్ణ కవి కుమార సంభవానికి రాసిన పీఠికలో వీరిని, వీరి గ్రంథాన్ని ప్రశంసించారు. భైరవుడు ఆనందకందకం అను మరో గ్రంథాన్ని రచించినట్లు శేషాద్రి రమణ కవులు పేర్కొన్నారు. ఆదిరాజు వీరభద్రరావు కూడా ఈ కవిని గురించి తమ రచనల్లో పేర్కొన్నాడు.
రచనలు
- భైరవ తంత్రం
- ఆనందకందకం[2].
భైరవతంత్రంలోని శ్లోకాలు
గ్రంథం ప్రారంభంలో... శ్రీహర మహాశాంతం భైరవం భీమనిగ్రహం
సమస్కృత్వా ప్రవక్ష్యామి భూతంత్రం సుపాస(వ)నం
గ్రంథాంతంలో....
ఏతత్తంత్రం మాయా ప్రోక్తం గపనీయం ప్రయత్నతః
ప్రియశిష్యాయ ధాతవ్యం పుత్రాయచ విశేషితః
ఇతి భైరవాగమే భూత తంతే సప్తవింశతి పటలః