నలుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 35: పంక్తి 35:
12వ శతాబ్దపు వ్యాఖ్యల ప్రకారం, సంస్కృత సాహిత్యం ఐదు మహాకావ్యాలలో [[శ్రీహర్షుడు]] రాసిన [[నిషాధ చరిత]] ఒకటి. నలుడు నిషాధ రాజ్యానికి రాజు. స్వయంవరంలో దమయంతి నలుడుని వరించింది.
12వ శతాబ్దపు వ్యాఖ్యల ప్రకారం, సంస్కృత సాహిత్యం ఐదు మహాకావ్యాలలో [[శ్రీహర్షుడు]] రాసిన [[నిషాధ చరిత]] ఒకటి. నలుడు నిషాధ రాజ్యానికి రాజు. స్వయంవరంలో దమయంతి నలుడుని వరించింది.


దేవతలందరూ నలుడి లక్షణాలను ప్రశంసిస్తూ, దంపతులను ఆశీర్వదించి స్వయంవరం నుండి బయలుదేరారు. స్వయంవరం నుండి తిరిగివచ్చిన దేవతల ద్వారా స్వయంవరం విశేషాలు విన్న కలి పురుషుడు, దమయంతి ఒక మర్త్యుడిని వివాహం చేసుకుందన్న కోపంతో ఆమె జీవితాన్ని నాశనం చేస్తానని, వాలిద్దరిని వేరు చేస్తానని శపథం చేసాడు. నలుడిలో ఒక చిన్న తప్పును కనిపెట్టి అతని మనసు మళ్ళించడానికి కలికి పన్నెండు సంవత్సరాలు పట్టింది.
దేవతలందరూ నలుడి లక్షణాలను ప్రశంసిస్తూ, దంపతులను ఆశీర్వదించి స్వయంవరం నుండి బయలుదేరారు. స్వయంవరం నుండి తిరిగివచ్చిన దేవతల ద్వారా స్వయంవరం విశేషాలు విన్న కలి పురుషుడు, దమయంతి ఒక మర్త్యుడిని వివాహం చేసుకుందన్న కోపంతో ఆమె జీవితాన్ని నాశనం చేస్తానని, వాలిద్దరిని వేరు చేస్తానని శపథం చేసాడు. నలుడిలో ఒక చిన్న తప్పును కనిపెట్టి అతని మనసు మళ్ళించడానికి కలికి పన్నెండు సంవత్సరాలు పట్టింది. చెడు ప్రభావానికి గురైన తరువాత, నలుడు తన సోదరుడు పుష్కరతో పాచికల ఆట ఆడి తన సంపదను, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు.


== ఇతర వివరాలు ==
== ఇతర వివరాలు ==

14:51, 5 జూలై 2020 నాటి కూర్పు

నలుడు
నులుడ దమయంతిని అడవిలో వదిలిపెట్టడం
సమాచారం
గుర్తింపుమహాభారతంలోని పాత్ర
దాంపత్యభాగస్వామిదమయంతి

నలుడు మహాభారతంలోని పాత్ర. నిషాధ రాజ్యానికి రాజు, వీరసేనుడి కుమారుడు. గుర్రపు స్వారీలో నైపుణ్యం కలవాడు. విదర్భ రాజ్యానికి చెందిన యువరాణి దమయంతిని వివాహం చేసుకున్నాడు. వీరి కొడుకు ఇంద్రసేనుడు, కూతురు ఇంద్రసేన. మహాభారతంలో వీరి గురించిన కథ చెప్పబడింది. అతని బలహీనత జూదం. ఇతనితో కలి పురుషుడు అనే రాక్షసుడు ఉండేవాడు. నలుడు గొప్ప వంటకాడు. వంటలపై మొట్టమొదటి పుస్తకం పాకదర్పనమ్ రాశాడు. దమయంతి తండ్రి భీముడు.

కథ

12వ శతాబ్దపు వ్యాఖ్యల ప్రకారం, సంస్కృత సాహిత్యం ఐదు మహాకావ్యాలలో శ్రీహర్షుడు రాసిన నిషాధ చరిత ఒకటి. నలుడు నిషాధ రాజ్యానికి రాజు. స్వయంవరంలో దమయంతి నలుడుని వరించింది.

దేవతలందరూ నలుడి లక్షణాలను ప్రశంసిస్తూ, దంపతులను ఆశీర్వదించి స్వయంవరం నుండి బయలుదేరారు. స్వయంవరం నుండి తిరిగివచ్చిన దేవతల ద్వారా స్వయంవరం విశేషాలు విన్న కలి పురుషుడు, దమయంతి ఒక మర్త్యుడిని వివాహం చేసుకుందన్న కోపంతో ఆమె జీవితాన్ని నాశనం చేస్తానని, వాలిద్దరిని వేరు చేస్తానని శపథం చేసాడు. నలుడిలో ఒక చిన్న తప్పును కనిపెట్టి అతని మనసు మళ్ళించడానికి కలికి పన్నెండు సంవత్సరాలు పట్టింది. చెడు ప్రభావానికి గురైన తరువాత, నలుడు తన సోదరుడు పుష్కరతో పాచికల ఆట ఆడి తన సంపదను, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు.

ఇతర వివరాలు

  1. యదువు మూడవ కొడుకు.
  2. యయాతి పౌత్రుడు. అణువు రెండవ కొడుకు.
  3. నిషధదేశమునకు రాజు. వీర సేనుని కొడుకు. భార్య దమయంతి. ఇతని భార్య అగు దమయంతికి స్వయంవరము చాటింపగా ఆవర్తమానము విని కలిపురుషుడు వరింపదలచి వచ్చి తాను వచ్చునంతలో దమయంతి నలుని పెండ్లాడెను అని మాత్సర్యముపట్టి ఇతనికి పెక్కు ఇడుములు కలుగ చేసెను.
  4. విశ్వకర్మ వలన పుట్టిన ఒక వానరుడు. ఇతడు వానరసేన లంకకు పోవుటకై సముద్రమునకు సేతువును కట్టినవాఁడు.

మూలాలు

ఇతర లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=నలుడు&oldid=2976761" నుండి వెలికితీశారు