అక్కన్న మాదన్న: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎బాల్య జీవితం: రామదాసుకు లింకు
ట్యాగు: 2017 source edit
→‎మరణం: వాక్యం ఒకటి చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 8: పంక్తి 8:


== మరణం ==
== మరణం ==
ఒక రాత్రి అన్నదమ్ములు తమ భవంతి నుంచి బయటకు వస్తుండగా దారిలో ఉన్న హంతకుల గుంపు వారి తలలను నరికివేశారు. వీరి మరణానికి సరైన కారణాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి. మొఘల్ చరిత్రకారుడు ఖాఫీ ఖాన్ ప్రకారం గోల్కొండ సుల్తాను తమకు పూర్తిగా లొంగకపోవడానికి కారణం వీరేనని మొఘలాయీలు భావించారు.<ref>Khafi Khan, Muntakhab ul-Lubab (Persian text), 308</ref>
ఒక రాత్రి అన్నదమ్ములు తమ భవంతి నుంచి బయటకు వస్తుండగా దారిలో ఉన్న హంతకుల గుంపు వారి తలలను నరికివేశారు. వీరి మరణానికి సరైన కారణాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి. మొఘల్ చరిత్రకారుడు ఖాఫీ ఖాన్ ప్రకారం గోల్కొండ సుల్తాను తమకు పూర్తిగా లొంగకపోవడానికి కారణం వీరేనని మొఘలాయీలు భావించారు.<ref>Khafi Khan, Muntakhab ul-Lubab (Persian text), 308</ref> తెలంగాణాలో వీరిని మంచి పాలకులుగానూ, అమరులుగానూ కీర్తించబడుతున్నారు.<ref>K.V. Bhupala Rao, The Illustrious Prime Minister Madanna. Hyderabad, [1984].</ref>


== మూలాలు ==
== మూలాలు ==

08:49, 26 ఆగస్టు 2020 నాటి కూర్పు

అక్కన్న, మాదన్న లు 1674 నుంచి 1685 మధ్యలో గోల్కొండ సంస్థానంలో తానీషా పరిపాలనలో మంత్రులుగా పనిచేసిన ఇద్దరు అన్నదమ్ములు. 1685 అక్టోబరు నెలలో వారు మరణించే వరకు గోల్కొండ రాజ్యంలోని అన్ని వ్యవహారాలు తమ ఆధీనంలో ఉంచుకోగలిగారు. ముస్లిం అధికారులు అధికంగా ఉన్న రాజ్యంలో హిందువులుగా వీరు అధికారం చలాయించగలిగారు కాబట్టి గోల్కొండ చరిత్రలో వీరి ప్రాముఖ్యత చెప్పుకోదగినది.

బాల్య జీవితం

అక్కన్న మాదన్నలు హనుమకొండలోని నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వీరు నలుగురు అన్నదమ్ములు, మరికొంతమంది సోదరీమణులు.[1] ఒక సమకాలీన డచ్ మూలాల ప్రకారం అక్కన్న తన తల్లికి ఇష్టమైన వాడు. కానీ మాదన్న అందరికైనా తెలివైనవాడు. చారిత్రక సాహిత్యంలో అసలు వీరు తెలుగు వారా లేక మరాఠా జాతికి చెందిన వారా అని కొన్ని వాదనలు జరిగాయి. కానీ వారి బహుశా స్మార్త బ్రాహ్మణులు కావచ్చు. వీరు శివుడు, విష్ణువు, సూర్యుడు మొదలైన దేవతలకు ప్రాధాన్యం ఇచ్చేవారు.[2] వీరు భక్త రామదాసు మామలు. అక్కన్న వారసులు అక్కరాజులుగా, మాదన్న వారసులు మాదరాజులుగా ప్రాచుర్యం పొందారు. వీరి ఇంటి పేరు పింగిళి.

ఉద్యోగం

మాదన్న గోల్కొండ సంస్థానంలో ఒక గుమాస్తాగా జీవితం ప్రారంభించాడు. తర్వాత తన తెలివితేటలతో అంచెలంచెలుగా ఉన్నత స్థాయి చేరుకున్నాడు. ఈ ప్రస్థానంలో వీరు ఇద్దరూ సయ్యద ముజఫర్ అనే పర్షియన్ మూలాలున్న అధికారి దగ్గర పనిచేసేవారు. ముజఫర్ అబుల్ హసన్ ను గద్దె నెక్కించడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ వీరు తెలివిగా ముజఫర్ ను అతని ఇంట్లోనే బంధించి ఖజానాను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.[3]ఖజానా అధికారిగా మరింత బాగా బలపడి గోల్కొండ సామ్రాజ్యంలో అన్ని వ్యవహారాలు తన కనుసన్నల్లో మెలిగేలా చేసుకున్నాడు. అందుకు అతని సోదరులు అక్కన్న, మేనల్లుడు రూస్తంరావులు సహకరించారు. ఆయన చనిపోయేవరకు ఇలాగే కొనసాగింది. అక్కన్న కొంచెం తక్కువ ప్రాధాన్యం కలవాడైనా సైన్యాధ్యక్షుడిగా నియమింపబడ్డాడు. ఆ ఉద్యోగంలో అతను స్వయంగా సేనలను నడిపించకపోయినా యుద్ధ ప్రణాళికలు రూపకల్పన చేసేవాడు.

మరణం

ఒక రాత్రి అన్నదమ్ములు తమ భవంతి నుంచి బయటకు వస్తుండగా దారిలో ఉన్న హంతకుల గుంపు వారి తలలను నరికివేశారు. వీరి మరణానికి సరైన కారణాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి. మొఘల్ చరిత్రకారుడు ఖాఫీ ఖాన్ ప్రకారం గోల్కొండ సుల్తాను తమకు పూర్తిగా లొంగకపోవడానికి కారణం వీరేనని మొఘలాయీలు భావించారు.[4] తెలంగాణాలో వీరిని మంచి పాలకులుగానూ, అమరులుగానూ కీర్తించబడుతున్నారు.[5]

మూలాలు

  1. Wikisource link to అక్కన్న మాదన్నల చరిత్ర. వికీసోర్స్. 
  2. Gijs Kruijtzer, Xenophobia in Seventeenth-Century India (Leiden: Leiden University Press, 2009), 226-30.
  3. S. Krishnaswami Aiyangar, "Abul Hasan Qutub Shah and his Ministers, Madanna and Akkanna." Journal of Indian History (August 1931): 91-142.
  4. Khafi Khan, Muntakhab ul-Lubab (Persian text), 308
  5. K.V. Bhupala Rao, The Illustrious Prime Minister Madanna. Hyderabad, [1984].