మౌలానా అబుల్ కలామ్ ఆజాద్: కూర్పుల మధ్య తేడాలు
Saleemahamed (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ |
Nagarani Bethi (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 10: | పంక్తి 10: | ||
|organizations=[[భారత జాతీయ కాంగ్రెస్]] |
|organizations=[[భారత జాతీయ కాంగ్రెస్]] |
||
}} |
}} |
||
'''మౌలానా అబుల్ కలాం ఆజాద్''' ([[నవంబర్ 11]], [[1888]] — [[ఫిబ్రవరి 22]], [[1958]]) ({{lang-bn|আবুল কালাম মুহিয়ুদ্দিন আহমেদ আজাদ}}, [[ఉర్దూ]]: ابو الکلام آزاد ) |
'''మౌలానా అబుల్ కలాం ఆజాద్''' ([[నవంబర్ 11]], [[1888]] — [[ఫిబ్రవరి 22]], [[1958]]) ({{lang-bn|আবুল কালাম মুহিয়ুদ্দিন আহমেদ আজাদ}}, [[ఉర్దూ]]: ابو الکلام آزاد ) [[స్వాతంత్ర్య సమరయోధులు|స్వాతంత్ర్య సమర యోధుడు]], [[భారత్|భారత]] ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, '''మౌలానా అబుల్ కలాం ఆజాద్'''. ఆయన అసలుపేరు 'మొహియుద్దీన్ అహ్మద్', 'అబుల్ కలాం' అనేది బిరుదు, 'ఆజాద్' కలంపేరు. ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ లకు [[1888]] [[నవంబరు 11]] న [[మక్కా]]లో జన్మించాడు.మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య సమర ముఖ్య నాయకులలో ఒకరు. అతను ప్రఖ్యాత పండితుడు, కవి. |
||
మౌలానా అబుల్ కలాం ఆజాద్ *[[అరబిక్]], [[ఆంగ్ల భాష|ఇంగ్లీష్]], ఉర్దూ, హిందీ, పెర్షియన్, [[బంగ్లా భాష|బెంగాలీ]] మొదలగు అనేక భాషలలో ప్రావిణ్యుడు. |
మౌలానా అబుల్ కలాం ఆజాద్ *[[అరబిక్]], [[ఆంగ్ల భాష|ఇంగ్లీష్]], ఉర్దూ, హిందీ, పెర్షియన్, [[బంగ్లా భాష|బెంగాలీ]] మొదలగు అనేక భాషలలో ప్రావిణ్యుడు. |
01:53, 20 సెప్టెంబరు 2020 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
అబుల్ కలాం ఆజాద్ ابو الکلام آزاد | |
---|---|
నవంబర్ 11, 1888 — ఫిబ్రవరి 22, 1958 | |
జన్మస్థలం: | మక్కా, ఉస్మానియా సామ్రాజ్యము (ప్రస్తుత సౌదీ అరేబియా) |
నిర్యాణ స్థలం: | ఢిల్లీ, భారతదేశం |
ఉద్యమం: | భారత స్వాతంత్ర్య ఉద్యమము |
ప్రధాన సంస్థలు: | భారత జాతీయ కాంగ్రెస్ |
మౌలానా అబుల్ కలాం ఆజాద్ (నవంబర్ 11, 1888 — ఫిబ్రవరి 22, 1958) (Bengali: আবুল কালাম মুহিয়ুদ্দিন আহমেদ আজাদ, ఉర్దూ: ابو الکلام آزاد ) స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన అసలుపేరు 'మొహియుద్దీన్ అహ్మద్', 'అబుల్ కలాం' అనేది బిరుదు, 'ఆజాద్' కలంపేరు. ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ లకు 1888 నవంబరు 11 న మక్కాలో జన్మించాడు.మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య సమర ముఖ్య నాయకులలో ఒకరు. అతను ప్రఖ్యాత పండితుడు, కవి.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ *అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పెర్షియన్, బెంగాలీ మొదలగు అనేక భాషలలో ప్రావిణ్యుడు. అతని పేరు సూచించినట్లు అతను *వాదనలో రారాజు, వాదనా పటిమలో మేటి. అతను తన కలం పేరు ఆజాద్ గా స్వీకరించాడు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ మక్కానగరంలో 1888 నవంబర్ 11 న జన్మించారు. అతని వంశస్తులు బాబర్ రోజుల్లో హేరాత్ (ఆఫ్ఘనిస్తాన్ లో ఒక నగరం) కు చెందిన వారు. ఆజాద్ ముస్లిం పండితులు, లేదా మౌలానా ల వంశం నుండి వచ్చాడు. అతని తల్లి ఒక అరబ్, షేక్ మహ్మద్ జహీర్ వత్రి, అతని తండ్రి మౌలానా ఖైరుద్దీన్ ఆఫ్ఘన్ మూలాలు ఒక బెంగాలీ ముస్లిం. ఖైరుద్దీన్ సిపాయి తిరుగుబాటు సమయంలో భారతదేశం నుండి మక్కా వచ్చి అక్కడే స్థిరపడ్డారు.
1890 లో అయన తన కుటుంబంతో కలకత్తా వచ్చారు. ఆజాద్ సంప్రదాయ ఇస్లామిక్ విద్య అబ్యసించి నాడు. అతని విద్య ఇంట్లో సాగింది మొదట తండ్రి పిదప ఉపాధ్యాయులు ఇంట్లోనే బోధించారు. ఆజాద్ మొదట *అరబిక్, పెర్షియన్ నేర్చుకున్నాడు తరువాత *తత్వశాస్త్రం, రేఖాగణితం, గణితం, బీజగణితం అబ్యసించి నాడు. స్వీయ అధ్యయనం ద్వారా ఇంగ్లీష్, ప్రపంచ చరిత్ర, రాజకీయాలు నేర్చుకున్నాడు.
ఆజాద్ మౌలానా అగుటకు కావలసిన మత శిక్షణ పొందినాడు.అతను దివ్య ఖురాన్ పై భాష్యం వ్రాసినాడు..
అతను జమాలుద్దిన్ ఆఫ్ఘానీ యొక్క పాన్-ఇస్లామిక్ సిద్ధాంతాలనులో, అలిగర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ యొక్క ఆలోచనలో ఆసక్తి చూపినారు. పాన్-ఇస్లామిక్ భావాలతో అతను ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఈజిప్ట్, సిరియా, టర్కీ సందర్శించారు.
ఇరాక్ లో అతను ఇరాన్ రాజ్యాంగ ప్రభుత్వ స్థాపనకు పోరాటం సల్పుతున్న నిర్వాసిత విప్లవ కారులను కలుసుకున్నారు. ఈజిప్ట్ లో అతను షేక్ ముహమ్మద్ అబ్దుహ్, సయీద్ పాషా వంటి అరబ్ ప్రపంచంలోని ఇతర విప్లవకారులను కలుసుకున్నారు. అతను కాన్స్టాంటినోపుల్లో యంగ్ టర్క్స్ భావాలతో పరిచయం పెంచుకొన్నారు. ఈ పరిచయాలు అన్ని అతనిని ఒక జాతీయవాద విప్లవవాదిగా రూపాంతరం చెందించాయి.
విదేశాల నుంచి తిరిగొచ్చిన అనంతరం ఆజాద్, బెంగాల్ కు చెందిన *అరవింద ఘోష్, శ్రీ శ్యాం సుందర్ చక్రవర్తి వంటి ప్రముఖ విప్లవకారులను కలుసుకున్నారు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఉద్యమాన్ని చేపట్టారు. విప్లవాత్మక చర్యలు బెంగాల్, బీహార్ లకు పరిమితం అగుట ఆజాద్ కు తెలిసి రెండు సంవత్సరాల లోపల, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉత్తర భారతదేశం, బాంబే లాంటి ప్రాంతాలలో రహస్య విప్లవ కేంద్రాలు ఏర్పాటుచేసారు. ఆసమయంలో విప్లవ వాదులు ముస్లింల విప్లవ వ్యతిరేకులుగా భావించసాగారు ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం యొక్క స్వాతంత్ర్య పోరాటానికి వ్యతిరేకంగా ముస్లిం కమ్యూనిటీని ఉపయోగిస్తున్నాదని భావించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ తన సహచరులను ముస్లింల పట్ల వారి పగను పోగొట్టటానికి ప్రయత్నించారు.
1912 లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూలో ‘ అల్ హిలాల్’ వార పత్రిక ముస్లింల మధ్య విప్లవాత్మక భావాలను పెంచడానికి ప్రారంభించారు. అల్ హిలాల్ మోర్లే-మింటో సంస్కరణల ఫలితంగా రెండు వర్గాల మధ్య చెలరేగిన సంఘర్షణల తర్వాత హిందూ మతం-ముస్లిం వర్గాల మద్య ఐక్యత కుదుర్చటంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ‘అల్ హిలాల్’ అతివాద భావనల ఒక విప్లవాత్మక ధ్వనిగా మారింది. ప్రభుత్వం వేర్పాటువాద భావనల ప్రచారకునిగా “అల్- హిలాల్”ను భావిస్తింది. ప్రభుత్వం దానిని 1914 లో నిషేధించింది.
ఆజాద్ భారతీయ జాతీయ వాదం, హిందూ -ముస్లిం ఐక్యత ఆధారంగా విప్లవాత్మక ఆలోచనలతో మరో పత్రికను “అల్ బలఘ్” ప్రారంభించారు.1916 లో ప్రభుత్వం ఈ పత్రికను కూడా నిషేధించారు, రాంచిలో ఆజాద్ ను నిర్భందించారు. ఆతరువాత మొదటి ప్రపంచ యుద్ధం 1920 తర్వాత విడుదల చేసారు. విడుదల తరువాత ఆజాద్ *ఖిలాఫత్ ఉద్యమం ద్వారా ముస్లిం కమ్యూనిటీలో బ్రిటిష్ వ్యతిరేక భావాలు పెంచారు. ఖలీఫా ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఖలీఫాను తిరిగి టర్కీ రాజుగా ప్రకటించడం.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ గాంధీజీ ప్రారంభించిన "సహాయ నిరాకరణ"ఉద్యమం ను సమర్ధించి 1920 లో భారత జాతీయ కాంగ్రెస్ లో ప్రవేశించినాడు. ఇతడు ఢిల్లీ కాంగ్రెస్ ప్రత్యేక సెషన్ అధ్యక్షుడు గా (1923) ఎన్నికయ్యారు.
మౌలానా ఆజాద్ గాంధీజీ *ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 1930 లో అరెస్టు అయినారు. అతనిని ఒక సంవత్సరంన్నర పాటు మీరట్ జైల్లో ఉంచారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1940 (రాంగడ్) లో కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు , 1946 వరకు ఆ పదవి లో ఉన్నారు.
అతను *విభజన కు వ్యతిరేకి . విభజన అతని కలలను నాశనం చేసింది. హిందువులు , ముస్లింలు కలసి సహజీవనం చేస్తున్న ఒక ఏకీకృత దేశం బద్దలు అగుట అతని కల ను నాశనం చేసి అతనిని విపరీతంగా బాధించింది.
ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించాడు. భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు. 1958 ఫిబ్రవరి 22 న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మరణించాడు.
గౌరవాలు, బిరుదులు
- గాంధీజీ ఇతడిని భారత ప్లాటో అని, గాంధీ , నెహ్రూ ఇతడిని మౌలానా, మీర్-ఎ-కారవాన్ అని పిలిచేవాడు.
- 1992లో భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించింది.
- ఇతడి జన్మదినమైన నవంబరు 11 ను జాతీయ విద్యా దినోత్సవం గా జరుపుకుంటారు.
సాహిత్యం
- తర్జుమానుల్ ఖురాన్ (ఖురాన్ అనువాదం)
- "అల్-హిలాల్" , "అల్-బలాగ్" అనే పత్రికలు స్థాపించాడు.
- గుబార్-ఎ-ఖాతిర్
- ఇండియా విన్స్ ఫ్రీడమ్
- విస్తరించవలసిన వ్యాసాలు
- Articles containing Bengali-language text
- భారతరత్న గ్రహీతలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with NLA identifiers
- 1888 జననాలు
- 1958 మరణాలు
- ఖురాన్ అనువాదకులు
- ఉర్దూ సాహితీకారులు
- ఉర్దూ రచయితలు
- భారతీయులు
- 1వ లోక్సభ సభ్యులు
- 2వ లోక్సభ సభ్యులు
- ఢిల్లీ స్వాతంత్ర్య సమర యోధులు