పైలెట్ రోహిత్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:1984 జననాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:జీవిస్తున్న ప్రజలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 31: పంక్తి 31:
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు]]
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు]]
[[వర్గం:1984 జననాలు]]
[[వర్గం:1984 జననాలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]

13:42, 11 మే 2021 నాటి కూర్పు

పంజుగుల రోహిత్ రెడ్డి

ఎమ్మెల్యే
నియోజకవర్గం తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2018

వ్యక్తిగత వివరాలు

జననం (1984-06-07) 1984 జూన్ 7 (వయసు 39)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి ఆర్తి రెడ్డి
పూర్వ విద్యార్థి బ్లేకింగ్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, స్వీడన్ .


పంజుగుల రోహిత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాయకీయ నాయకుడు. ఆయన 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం ​నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. [1]

జననం

పంజుగుల రోహిత్‌రెడ్డి స్వస్థలం వికారాబాదు జిల్లా, బషీరాబాద్‌ మండలం, ఇందర్‌చెడ్‌ గ్రామం. ఆయన 1984 జూన్ 7లో పంజుగుల విఠల్‌రెడ్డి, ప్రమోదినిదేవి దంపతులకు జన్మించాడు.

విద్యాభాస్యం

రోహిత్‌రెడ్డి హైదరాబాద్ లోని సెయింట్ పాల్స్ హై స్కూల్లో 2001లో పదవ తరగతి పూర్తి చేశాడు. నారాయణగూడ లోని టెట్రాహెడ్రోన్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. స్వీడన్‌లోని బీటీహెచ్‌ యూనివర్సిటీలో మాస్టర్‌ ఇన్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. స్వీడన్‌కు ఇతర దేశాల నుంచి చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులకు ఆయన కొన్నాళ్ళు కోఆర్డినేటర్‌గా పనిచేశాడు. పైలెట్‌ కావాలన్నా చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక మేరకు రోహిత్ రెడ్డి అమెరికాలోని కాలిఫోర్నియాలో పైలెట్‌ కోర్సులో చేరాడు. ఆయన అక్కడ ఏడు నెలల పాటు పైలెట్‌ శిక్షణ పొందాడు. శిక్షణ పూర్తికాగానే ఆరు నెలల పాటు అక్కడే పైలెట్‌గా పనిచేశాడు. అనంతరం స్వదేశానికి తిరిగివచ్చాడు.[2]

రాజకీయ జీవితం

పంజుగుల రోహిత్‌రెడ్డి 2009లో ప్రజా రాజ్యం పార్టీ ద్వారా రాజకీయాలోకి అడుగు పెట్టాడు. ఆయనను ప్రజా రాజ్యం పార్టీ తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం ​ఇంచార్జ్ గా నియమించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నాడు. 2009లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాడు. 2013లో పీఆర్పీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ఆయన 2014లో యంగ్ లీడర్స్ సంస్థను స్థాపించాడు. 2018లో పైలెట్ రోహిత్ రెడ్డిని టీఆర్‌ఎస్ పార్టీ నుండి బహిష్కరించారు. అనంతరం అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుండి పోటీ చేసి మాజీ మంత్రి పి.మహేందర్ రెడ్డిని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచాడు.ఆయన 2014 ఎన్నికల్లో తాండూరు నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశించారు. 2014 ఎన్నికలు జరిగే నెల ముందు తెదేపా ఎమ్మెల్యేగా ఉన్న పి.మహేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాడు. తాండూరు ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం పట్నం మహేందర్ రెడ్డి అనుచరులు రోహిత్ రెడ్డి పై టీఆర్‌ఎస్‌ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడంతో ఆయనను పార్టీ నుండి బహిష్కరించారు. అనంతరం ఆయన తాండూరు నియోజకవర్గంలో యంగ్ లీడర్స్ సంస్థ ద్వారా వివిధ సేవ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కణకు గురైన రోహిత్ రెడ్డి తరువాత 2018లో కాంగ్రెస్ లో చేరి, 2018 లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పై దాదాపు పది వేల ఓట్ల మోజారిటీతో గెలిచాడు. పైలట్‌ రోహిత్‌రెడ్డి 2019 జూన్లో కాంగ్రెస్‌ పార్టీని వీడి టీఆర్‌ఎస్ పార్టీలో చేరాడు.

మూలాలు

  1. "Telangana Assembly Elections Constituencies List 2018, Telangana Vidhan Sabha Election Seats List 2018, Candidates Names, Map, Results". The Indian Express (in Indian English). Retrieved 2019-07-01.
  2. Sakshi, హోం » పాలిటిక్స్ (12 May 2019). "అప్పటి నుంచి ఎమ్మెల్యే కావాలని కోరిక." Archived from the original on 12 మే 2019. Retrieved 15 April 2021.