అంట్యాకుల పైడిరాజు: కూర్పుల మధ్య తేడాలు
Kalasagary (చర్చ | రచనలు) అక్షర దోషాలను సరిచేశాను |
Kalasagary (చర్చ | రచనలు) #WPWPTE,#WPWP |
||
పంక్తి 35: | పంక్తి 35: | ||
| weight = |
| weight = |
||
}} |
}} |
||
[[దస్త్రం:Antyakula paidiraju artist.png|thumb|అంట్యాకుల పైడిరాజు చిత్రకారుడు, శిల్పి |
[[దస్త్రం:Antyakula paidiraju artist.png|thumb|అంట్యాకుల పైడిరాజు చిత్రకారుడు, శిల్పి ]] |
||
'''అంట్యాకుల పైడిరాజు''' [[విజయనగరం]] జిల్లాకు చెందిన ప్రముఖ [[చిత్రకారుడు]], శిల్పి. |
'''అంట్యాకుల పైడిరాజు''' [[విజయనగరం]] జిల్లాకు చెందిన ప్రముఖ [[చిత్రకారుడు]], శిల్పి. |
||
08:16, 10 జూలై 2021 నాటి కూర్పు
అంట్యాకుల పైడిరాజు | |
---|---|
జననం | నవంబర్ 1, 1919 |
మరణం | 1986 డిసెంబరు 26 విశాఖపట్నం |
నివాస ప్రాంతం | విజయనగరం జిల్లా |
ప్రసిద్ధి | చిత్రకారుడు , శిల్పి. |
తండ్రి | రాజయ్య, |
తల్లి | నరసమ్మ |
అంట్యాకుల పైడిరాజు విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, శిల్పి.
జీవిత చరిత్ర
ఇతడు నవంబర్ 1, 1919న బొబ్బిలిలో రాజయ్య, నరసమ్మ దంపతులకు జన్మించాడు. అన్నయ్య అప్పారావు చిత్రకారుడు కావడం వల్ల పైడిరాజు అతడిని అనుకరించి చిన్నప్పటి నుండే సుద్దముక్కతో చూసిన ప్రతి బొమ్మనీ నేలమీద చిత్రించడం అలవాటయింది.
విజయనగరం మహారాజా కళాశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. అక్కడి నాటక లలిత సంగీత పోటీలలో వివిధ బహుమతులు గెలుచుకున్నాడు. 1940-1944లో మద్ర్రాసు ప్రభుత్వ చిత్రకళాశాలలో డిప్లమా పొందాడు. ప్రముఖ బెంగాలీ చిత్రకారుడు, శిల్పి, దేవీప్రసాద్ రాయ్ చౌదరి పైడిరాజు గురువు.
పైడిరాజు 1949లో విజయనగరములో చిత్రకళాశాలను నెలకొల్పాడు. పైడిరాజు చిత్రాలు లండన్, పోలెండ్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, అమెరికా, సింగపూర్ లకు చెందిన ప్రభుత్వ, ప్రయివేటు ఆర్ట్ గ్యాలరీలలో వెలుగులీనుతున్నాయి.[1] విజయనగరంలో బొడ్డు పైడన్న, పి.ఎల్.ఎన్. రాజు విగ్రహాలు, వైజాగ్ బస్ స్టాండు దగ్గర వున్న గురజాడ అప్పారావు విగ్రహం పైడిరాజు చేసినవే.
అనాటమీ స్కెచెస్ వేయడంలో పైడిరాజు అందెవేసిన చేయి. తైలవర్ణ చిత్రరచనలో ఇతనిది ఒక ప్రత్యేకశైలి. ఇతడు చిత్రించిన 'పేరంటం', 'అలంకరణ', 'బొట్టు' మున్నగు అద్భుత కళాఖండాలు కేంద్ర లలితకళా అకాడమీ బహుమతులు గెల్చుకున్నాయి. భారతీయత, ఆంధ్రత్వం, అధివాస్తవికత, క్యూబిజం ఇతని చిత్రాలలో జీవకళగా ఉట్టిపడుతూ ఉంటాయి.
1977లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఆహ్వానాన్ని మన్నించి లలితకళా విభాగ ఆచార్యులయ్యారు. చిత్రకళా శిరోవిభూషణ, కళా ప్రపూర్ణ గౌరవాలందుకున్నారు. బోగి జగన్నాధరాజు, అబ్బూరి గోపాలకృష్ణ, కేతినీడి, వేదుల రాజ్యలక్ష్మి, శ్యామా కౌండిన్య, ద్వివేదుల సోమనాథశాస్త్రి మొదలగు వారెందరో పైడిరాజు శిష్యులు.
కవిత్వంలో కూడా చక్కని అభినివేశం గల పైడిరాజు 1986 సంవత్సరంలో డిసెంబరు 26న విశాఖపట్నంలో మరణించాడు.
పైడిరాజు చిత్రపటాలు
- పేరంటం,
- అలంకరణ,
- బొట్టు,
- స్నానానంతరం,
- తిలకం,
- అలంకరణ,
- సంతకు
పైడిరాజు చెక్కిన శిల్పాలు
- గురజాడ అప్పారావు, విశాఖపట్నం
- అల్లూరి సీతారామరాజు
ఇతర విశేషాలు
- "ఆకాశ శిల్పాలు" - అనేది పైడిరాజు రచించిన పుస్తకం.
- "పిపాస - అంట్యాకుల పైడిరాజుగారి జీవిత చరిత్ర" - అనే పుస్తకాన్ని ద్వివేదుల సోమనాథశాస్త్రి రచించాడు.
- పైడిరాజు జీవితము, చిత్రాల గురించి సంజీవ్దేవ్ "A. Paidiraju" అనే ఆంగ్ల రచన చేశాడు.
- పైడిరాజు కొడుకు అంట్యాకుల రాజేశ్వరరావు కూడా ఒక ప్రసిద్ధ చిత్రకారుడు [2]
మూలాలు
- ↑ "పైడిరాజుపై ఈనాడులో చీకోలు సుందరయ్య వ్యాసం". Archived from the original on 2010-06-12. Retrieved 2009-03-16.
- ↑ [1]