రుద్రదేవుడు: కూర్పుల మధ్య తేడాలు
కార్తీక రాజు (చర్చ | రచనలు) |
కార్తీక రాజు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
కాకతీయ వంశ పాలకుల్లో రుద్రదేవుడు ఒకడు. |
కాకతీయ వంశ పాలకుల్లో రుద్రదేవుడు ఒకడు. ఇతడినే మొదటి ప్రతాపరుద్రుడుగా కూడా భావిస్తున్నారు. |
||
== రాజ్య విస్తరణ == |
== రాజ్య విస్తరణ == |
05:23, 14 జూలై 2021 నాటి కూర్పు
కాకతీయ వంశ పాలకుల్లో రుద్రదేవుడు ఒకడు. ఇతడినే మొదటి ప్రతాపరుద్రుడుగా కూడా భావిస్తున్నారు.
రాజ్య విస్తరణ
రుద్రదేవుడు 1158-62 వరకు సామంత రాజుగా, 1163-95 వరకు స్వతంత్ర రాజుగా పరిపాలన చేశాడు. రుద్రదేవుడు 1163లో సంపూర్ణ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుని తెలంగాణలో మొదటి విశాల రాజ్యాన్ని స్థాపించాడు. నగునూర్(కరీంనగర్) పాలకుడైన దొమ్మరాజును, పొలవాస (జగిత్యాల) పాలకుడైన రెండో మేడరాజును, మైలిగ దేవుడు, చోడోదయుడు మొదలైన వారిని యుద్ధంలో ఓడించి తన ఆధిపత్యాన్ని తెలంగాణలో నెలకొల్పాడు. కలచురి రాజ్యాన్ని ఆక్రమించి, కందూరి రాజ్యాన్ని జయించి తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. ఇతడి రాజ్యం ఉత్తరాన గోదావరి వరకు, పశ్చిమాన బీదర్ వరకు, దక్షిణాన శ్రీశైలం వరకు వ్యాపించింది. 1182లో జరిగిన పల్నాడు యుద్ధంలో నలగమరాజుకు తన మద్దతు తెలిపాడు. ఇతడి మంత్రి ఇనంగాల బ్రహ్మారెడ్డి వేయించిన ద్రాక్షారామ శాసనం (1158) ప్రకారం ఇతడు పరాక్రమశాలి.
వివాహం =
రాజనీతి దురంధరుడైన రుద్రదేవుడు కందూరి ఉదయచోడుని కుమార్తె పద్మావతిని వివాహమాడి ఆ రాజ్యానికి అతడిని సామంతుడిగా నియమించాడు. ఈ వివాహం సందర్భంగా రుద్రదేవుడు 'రుద్రసముద్ర తటాకం' అనే చెరువును తవ్వించాడు.
నిర్మించిన కట్టడాలు, వేయించిన శాసనాలు
రుద్రదేవుడు తన విజయాలకు సూచకంగా ఒక విజయ శాసనాన్ని అనుమకొండలో వేయించి రుద్రేశ్వర, వాసుదేవ, సూర్యదేవుల విగ్రహాలను ప్రతిష్టించి గొప్ప త్రికూట ఆలయాన్ని నిర్మించాడు( వేయిస్తంభాల గుడి ). రుద్రదేవుడు ఓరగల్లు కోట నిర్మాణాన్ని పూర్తిచేశాడు. ఇతడి మంత్రి వెల్లంకి గంగాధరుడు కరీంనగర్ లో శాసనం (1170) వేయించాడు. అంతేకాక అనుమకొండలో ఒక చెరువును తవ్వించాడు, ప్రసన్నకేశవస్వామి ఆలయాన్ని కట్టించాడు.
చేసిన రచనలు, పొందిన బిరుదులు
రుద్రదేవుడు సంస్కృతంలో 'నీతిసారం' అనే గ్రంథాన్ని రాశాడు. ‘విద్యాభూషణ’ బిరుదు కలవాడు.
మరణం
1195లో యాదవ రాజైన జైతుగి చేతిలో రుద్రదేవుడు ఓడిపోయి ప్రాణాలు కోల్పోయాడు.
మరణాంతరం
రుద్రదేవుడికి పుత్రులు లేనందువల్ల అతడి సోదరుడు మహాదేవుడు కాకతీయ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఈ విషయాన్ని‘ఖండవల్లి తామ్రదాన పత్రం’ ధృవపరుస్తుంది.
మూలాలు
• నమస్తే తెలంగాణ బతుకమ్మ సంచికలో ప్రచురితమైన వ్యాసం [1]