గడియారం వేంకట శేషశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు
చి Undid edits by 2401:4900:4D01:6ACA:63AD:AAC0:EAF0:C9C6 (talk) to last version by యర్రా రామారావు ట్యాగులు: రద్దుచెయ్యి SWViewer [1.4] |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 41: | పంక్తి 41: | ||
==జీవిత విశేషాలు== |
==జీవిత విశేషాలు== |
||
[[పెద్దముడియం]] మండలం [[నెమళ్లదిన్నె]] గ్రామంలో రామయ్య, నరసమ్మ దంపతులకు [[1894]] [[ఏప్రిల్ 7]]వతేదీన జన్మించారు. విద్యాభ్యాసం కోసం ప్రొద్దుటూరు చేరుకుని స్థిరపడ్డారు. గడియారం వేంకట శేషశాస్త్రి ధర్మపత్రి వెంకటసుబ్బమ్మ. రామశేషయ్య, వెంకటసుబ్రమణ్య వీరి పుత్రులు. |
[[పెద్దముడియం]] మండలం [[నెమళ్లదిన్నె (పెద్దముడియం)|నెమళ్లదిన్నె]] గ్రామంలో రామయ్య, నరసమ్మ దంపతులకు [[1894]] [[ఏప్రిల్ 7]]వతేదీన జన్మించారు. విద్యాభ్యాసం కోసం ప్రొద్దుటూరు చేరుకుని స్థిరపడ్డారు. గడియారం వేంకట శేషశాస్త్రి ధర్మపత్రి వెంకటసుబ్బమ్మ. రామశేషయ్య, వెంకటసుబ్రమణ్య వీరి పుత్రులు. 1932లో అనిబిసెంట్ మున్సిపల్ పురపాలిక పాఠశాలలో [[తెలుగు]] ఉపాధ్యాయుడిగా పనిచేశారు. బ్రహ్మానందిని అనే సాహిత్య సాంస్కృతిక మాసపత్రికకు సంపాదకులుగా సేవలు అందించారు. గడియారం వేంకట శేషశాస్త్రి బహుముఖ ప్రజ్ఞాశాలి. రూపావతారం శేషశాస్త్రి వద్ద తర్క, వ్యాకరణ, సాహిత్య శాస్త్రాలు, వాసుదేవావధాని వద్ద [[యజుర్వేదం]], [[ఉపనిషత్తులు]], దుర్భాక రాజశేఖర శతావధాని వద్ద అవధాన విద్యల్లో ఆరితేరారు. గోవర్ధన సప్తశతి, [[ఉత్తర రామాయణం|ఉత్తర రామాయణ]] గ్రంథాలు, [[సంస్కృతము|సంస్కృతం]] నుంచి [[తెలుగు]]లోకి అనువదించారు. పుష్పబాణ విలాసం, వస్తుజంత్రి, మల్లికామారుతం, శ్రీనాథ కవితాసామ్రాజ్యం, రఘునాధీయం, [[వాల్మీకి]] హృదయావిష్కరణ వంటి గ్రంథాలను రచించారు. నన్నయ్య భారతం, [[పోతన]] [[భాగవతం]] లాగా గడియారం వేంకటశేష శాస్త్రికి చిర కీర్తిని తెచ్చిన పెట్టిన గ్రంథం శివభారతం. |
||
==సత్కారాలు== |
==సత్కారాలు== |
12:09, 22 జూలై 2021 నాటి కూర్పు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
గడియారం వేంకట శేషశాస్త్రి | |
---|---|
జననం | గడియారం వేంకట శేషశాస్త్రి 1894 ఏప్రిల్ 7 పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె |
మరణం | 1980 |
ప్రసిద్ధి | రచయిత, అనువాదకులు |
భార్య / భర్త | వెంకటసుబ్బమ్మ |
పిల్లలు | రామశేషయ్య, వెంకటసుబ్రమణ్య |
తండ్రి | రామయ్య |
తల్లి | నరసమ్మ |
పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్రకాంక్షను అణువణువునా రగుల్చుతూ రచించిన మహాకావ్యమే 'శ్రీశివభారతం'. భరతమాత పరాయి పాలనలో కళావిహీనమైన తరుణంలో అరుణోదయంగా వెల్లివిరిసింది కావ్యమది. మాతృభాష విముక్తికి మార్గదర్శిగా పంచకావ్యాల సరసన 1943లో 8 ఆశ్వాసముల ప్రబంధంగా శివభారతం వెలుగొందింది. ఈ అద్భుత కావ్య సృష్టికర్త గడియారం వేంకట శేషశాస్త్రి. ఆధునికాంధ్ర కవుల్లో ప్రముకులు,శతావధాని డా||గడియారం వేంకటశేషశాస్త్రి.ఈయన దుర్భాక శతావధానితో కలిసి కొన్నికావ్వనాటకాలు రాశాడు.
జీవిత విశేషాలు
పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె గ్రామంలో రామయ్య, నరసమ్మ దంపతులకు 1894 ఏప్రిల్ 7వతేదీన జన్మించారు. విద్యాభ్యాసం కోసం ప్రొద్దుటూరు చేరుకుని స్థిరపడ్డారు. గడియారం వేంకట శేషశాస్త్రి ధర్మపత్రి వెంకటసుబ్బమ్మ. రామశేషయ్య, వెంకటసుబ్రమణ్య వీరి పుత్రులు. 1932లో అనిబిసెంట్ మున్సిపల్ పురపాలిక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. బ్రహ్మానందిని అనే సాహిత్య సాంస్కృతిక మాసపత్రికకు సంపాదకులుగా సేవలు అందించారు. గడియారం వేంకట శేషశాస్త్రి బహుముఖ ప్రజ్ఞాశాలి. రూపావతారం శేషశాస్త్రి వద్ద తర్క, వ్యాకరణ, సాహిత్య శాస్త్రాలు, వాసుదేవావధాని వద్ద యజుర్వేదం, ఉపనిషత్తులు, దుర్భాక రాజశేఖర శతావధాని వద్ద అవధాన విద్యల్లో ఆరితేరారు. గోవర్ధన సప్తశతి, ఉత్తర రామాయణ గ్రంథాలు, సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు. పుష్పబాణ విలాసం, వస్తుజంత్రి, మల్లికామారుతం, శ్రీనాథ కవితాసామ్రాజ్యం, రఘునాధీయం, వాల్మీకి హృదయావిష్కరణ వంటి గ్రంథాలను రచించారు. నన్నయ్య భారతం, పోతన భాగవతం లాగా గడియారం వేంకటశేష శాస్త్రికి చిర కీర్తిని తెచ్చిన పెట్టిన గ్రంథం శివభారతం.
సత్కారాలు
- ప్రొద్దుటూరు రాయల సాహిత్య పరిషత్తు ఆధ్వర్యంలో ఎన్నో సాహిత్య ప్రసంగాలు చేశారు గోదావరి తీరంలోని రాజమహేంద్రవరంలో శ్రీపాద తల్లావర్ఘుల వారిఎదుట గజారోహణ సత్కారం అందుకున్నారు.
- 1945లో అనంతపురంలోని హిందూపురం లలిత కళాపరిషత్తు సభ్యులు స్వర్ణ గండపెండేరం, సువర్ణ కంకణ బహుకరించారు.
- 1948లో మద్రాసు ప్రభుత్వం దశాబ్ద కాలపు ఉత్తమ సాహితీ గ్రంథంగా శివభారతాన్ని గౌరవించి ప్రథమ బహుమతితో సత్కరించారు.
- 1967లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహిత్య అకాడమి అవార్డు అందజేసింది.
- 1968లో ప్రొద్దుటూరులో కనకాభిషేకం,
- 1974లో మరాఠా మందిర్ వారు శివాజి త్రిశత జయంతి ఉత్సవాల్లో భాగంగా బంగారు పతకాన్ని బహుకరించారు.
- 1976లో వెంకటేశ్వర విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్ను అందించారు.
- 1959 నుంచి 1968 వరకు శాసనమండలి సభ్యునిగానూ,
- 1969 నుంచి 1973 వరకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు
బిరుదులు
- కవితావతంస
- కవిసింహ
- అవధానిపంచానన