కాశీయాత్ర చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 13: పంక్తి 13:
*ఈ గ్రంధం [[1869]]లో ద్వితీయ ముద్రణ పొందింది.
*ఈ గ్రంధం [[1869]]లో ద్వితీయ ముద్రణ పొందింది.
*ఈ గ్రంధం [[1941]]లో [[దిగవల్లి వేంకట శివరావు]] గారు అనేక వివరణలతో ప్రచురించారు. ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు బెజవాడలో తిరిగి ముద్రించారు.
*ఈ గ్రంధం [[1941]]లో [[దిగవల్లి వేంకట శివరావు]] గారు అనేక వివరణలతో ప్రచురించారు. ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు బెజవాడలో తిరిగి ముద్రించారు.

==మూలాలు==
*[[తెలుగు సంగతులు]], [[బూదరాజు రాధాకృష్ణ]], మీడియా హౌస్ పబ్లికేషన్స్, హైదరాబాదు, 2003.


==బయటి లింకులు==
==బయటి లింకులు==

13:30, 30 ఆగస్టు 2008 నాటి కూర్పు

కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్వానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి 3 సెప్టెంబరు, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.

పుస్తక విశేషాలు

  • అప్పటికి (1831-1832) బ్రిటిష్ వారు ఇంకా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకోలేదు. కాబట్టి కొంత భాగం సంస్థానాలలో రాజుల క్రింద ఉండేది.
  • ఆనాటి వాడుకభాషలో సమకలీన జీవిత దౌర్భాగ్యాలను, తన పోషకుల వంచనాశిల్పాన్ని, తన బలహీనతలనూ నిర్వికారంగా రాయగలిగాడు.
  • అప్పటి సంస్థానాలలో, ఇంగ్లీషు రాజ్యభాగాలలో, పౌరోహిత్యంలో ఎన్ని విధాల మోసం, లంచగొండితనం, అవినీతి ఉన్నాయో దాపరికం లేకుండా రాశాడు.
  • విలియం బెంటింగ్ రాజప్రతినిధులు ఎన్ని విధాల, ఎన్ని కుమార్గాలలో స్వదేశీ సంస్థానాలను క్రమంగా ఆక్రమించుకొంటున్నారో, దేశంలో జమిందారుల, దోపిడీ దొంగల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో, సామాన్య ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురౌతున్నారో మొహమాటం లేకుండా రాశాడు.
  • కొన్ని ప్రదేశాలలో కుల, మత, ప్రాంత భేదాలు ఎన్ని అనర్ధాలు తెచ్చిపెడుతున్నాయో, బిన్న ప్రాంతాలలో ఆర్ధిక పరిస్థితులెలా ఉన్నాయో చిత్రీకరించాడు.
  • పుప్పాడలోని బెస్తలు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎలా అప్పులపాలైనారో వివరించాడు.

ముద్రణలు

  • చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సలహాలు ఉత్తరాల ద్వారా పొందిన వీరాస్వామి గారి యాత్రా చరిత్రను ఆయన మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై గారు మొదటిసారిగా 1838లో ముద్రించారు.
  • ఈ గ్రంధం 1869లో ద్వితీయ ముద్రణ పొందింది.
  • ఈ గ్రంధం 1941లో దిగవల్లి వేంకట శివరావు గారు అనేక వివరణలతో ప్రచురించారు. ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు బెజవాడలో తిరిగి ముద్రించారు.

మూలాలు

బయటి లింకులు