ఖుషి: కూర్పుల మధ్య తేడాలు
పంక్తి 84: | పంక్తి 84: | ||
==విశేషాలు== |
==విశేషాలు== |
||
* తమిళ మూలంలో నాయికానాయకుల పాత్రల తీవ్రత, ప్రాముఖ్యాలు సమానంగా ఉంటాయి. కానీ తెలుగు లో నాయకుడి పాత్రే పై చేయి. |
* తమిళ మూలంలో నాయికానాయకుల పాత్రల తీవ్రత, ప్రాముఖ్యాలు సమానంగా ఉంటాయి. కానీ తెలుగు లో నాయకుడి పాత్రే పై చేయి. |
||
* [[ |
* [[కే కే]] తో మణి శర్మ పాడించిన పూర్తి నిడివి హిందీ గీతం ''యే మేరా జహాన్'' తెలుగు చిత్ర రంగం లో నే మొట్టమొదటి ప్రయోగం. |
||
* ద్వితీయార్థంలో జరిగే కార్నివాల్ ఫైట్ కి పవన్ స్వయంగా దర్శకత్వం వహించారు. దీని చిత్రీకరణ కి ఉపయోగించిన కెమేరా పనితనం మరియు[[మార్షల్ ఆర్ట్స్]] అతనిలోని సృజనాత్మకతకి పరాకాష్టలు. |
* ద్వితీయార్థంలో జరిగే కార్నివాల్ ఫైట్ కి పవన్ స్వయంగా దర్శకత్వం వహించారు. దీని చిత్రీకరణ కి ఉపయోగించిన కెమేరా పనితనం మరియు[[మార్షల్ ఆర్ట్స్]] అతనిలోని సృజనాత్మకతకి పరాకాష్టలు. |
||
* [[మిస్సమ్మ]] లోని ''ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే''ని ఈ చిత్రంలో రీ-మిక్స్ చేశారు. |
* [[మిస్సమ్మ]] లోని ''ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే''ని ఈ చిత్రంలో రీ-మిక్స్ చేశారు. |
03:50, 20 ఏప్రిల్ 2009 నాటి కూర్పు
ఖుషి (2001 తెలుగు సినిమా) | |
దస్త్రం:TeluguFilm Khushi.jpg | |
---|---|
దర్శకత్వం | ఎస్.జె.సూర్య |
నిర్మాణం | ఏ.ఎం.రత్నం |
కథ | ఎస్.జె.సూర్య |
చిత్రానువాదం | ఎస్.జె.సూర్య |
తారాగణం | పవన్ కళ్యాణ్, భూమిక, సుధాకర్, విజయకుమార్, ఆలి, శివాజి, ముంతాజ్, నాజర్, సుధ |
సంగీతం | మణి శర్మ |
నేపథ్య గానం | హరిణి, కవితా కృష్ణమూర్తి, మనో, ఉదిత్ నారాయణ్, శ్రీనివాస్ |
సంభాషణలు | రాజేంద్ర కుమార్ |
ఛాయాగ్రహణం | పి.సి.శ్రీరాం |
నిర్మాణ సంస్థ | శ్రీ సూర్య ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఉపోద్ఘాతం
తమిళం లో అత్యంత విజయవంతమైన కుశి చిత్రం మూలం. దీనికి కూడా ఎస్. జే. సూర్యనే దర్శకుడు.
కథ
కలకత్తా లోని ఒక ధనిక కుటుంబానికి చెందిన సిద్ధూ సిద్ధార్థ రాయ్, ఉన్నత విద్య కోసమై కెనడా బయలు దేరుతాడు. ఎయిర్ పోర్ట్ కి వెళ్ళే దారి లో రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. విదేశీ విద్యావకాశం చేజారటం తో హైదరాబాదు లో నే ఒక కళాశాలలో చేరతాడు. కైకలూరు లోని ఉన్నత కుటుంబానికి చెందిన మధుమిత అదే కళాశాలలో అతనికి పరిచయం అవుతుంది. వీరిరువురి స్నేహితులు ప్రేమికులు కావటం తో వారి ప్రేమ కి సాయపడటంలో సిద్ధూ, మధు ఒకరికొకరు దగ్గరవుతారు. మనసులో ఒకరి పై ఒకరికి ప్రేమ ఉన్నా దానిని ఒకరికొకరు వ్యక్తీకరించుకోని గంభీర స్వభావులు వీరిరువురు.
తన దూకుడు స్వభావం వలన సిద్ధూ మధు మనసులో స్థానం కోల్పోతాడు. మొండితనం తో మధు సిద్ధూ కి మరింత దూరం అవుతుంది. కానీ ఇరువురి తోడ్పాటు తో ప్రేమ జంట ఏకం అవుతుంది.
విడదీసిన విధే సిద్ధూ, మధు లను ఎలా కలిపింది? సిద్ధూ, మధులు వారి వారి స్వభావాలని అధిగమించారా, లేదా? వివాహానంతరం సిద్ధూ, మధు లు జీవితాన్ని ఎలా గడపబోతారు?? అన్న ప్రశ్నలకు సమాధానమే చిత్రానికి శుభం కార్డు.
ఈ చిత్రంలోని గీతాలు
ఈ చిత్రంలోని అన్ని గీతాలు విశేష జనాదరణ పొందాయి.
పాట | రచయిత | సంగీతం | గాయకులు | విశేషాలు |
---|---|---|---|---|
యే మేరా జహాన్ | మణి శర్మ | కే కే | దేశభక్తిని చాటే పూర్తి నిడివి హిందీ గీతం. కలకత్తా లో చిత్రీకరించబడినది. | |
ఆడువారి మాటలకు | మణి శర్మ | మురళీధర్ | మిస్సమ్మ చిత్రంలోని పాట రీ-మిక్స్ చేయబడినది. | |
ప్రేమంటే సుళువు కాదు రా | మణి శర్మ | దేవన్, కల్పన | ||
గజ్జ ఘల్లుమన్నాది రో | మణి శర్మ | మనో, స్వర్ణలత | ముంతాజ్ తో పవన్ జానపద చిందులు | |
అమ్మాయే సన్నగా | మణి శర్మ | కవితా కృష్ణమూర్తి, ఉదిత్ నారాయణ్ | ||
చెలియ చెలియా | మణి శర్మ | హరిణి, శ్రీనివాస్ |
విశేషాలు
- తమిళ మూలంలో నాయికానాయకుల పాత్రల తీవ్రత, ప్రాముఖ్యాలు సమానంగా ఉంటాయి. కానీ తెలుగు లో నాయకుడి పాత్రే పై చేయి.
- కే కే తో మణి శర్మ పాడించిన పూర్తి నిడివి హిందీ గీతం యే మేరా జహాన్ తెలుగు చిత్ర రంగం లో నే మొట్టమొదటి ప్రయోగం.
- ద్వితీయార్థంలో జరిగే కార్నివాల్ ఫైట్ కి పవన్ స్వయంగా దర్శకత్వం వహించారు. దీని చిత్రీకరణ కి ఉపయోగించిన కెమేరా పనితనం మరియుమార్షల్ ఆర్ట్స్ అతనిలోని సృజనాత్మకతకి పరాకాష్టలు.
- మిస్సమ్మ లోని ఆడువారి మాటలకు అర్ధాలే వేరులేని ఈ చిత్రంలో రీ-మిక్స్ చేశారు.
- సిద్ధూ, మధులు పసిపాపలు గా ఉన్నప్పుడు వారిని వెంటేసుకుని వారి తల్లిదండ్రులు హైదరాబాదు లో ఒకే చీరల దుకాణానికి వస్తారు. ప్రక్కప్రక్కనే కూర్చున్న ఆ తల్లుల ఒళ్ళలో ఉన్న ఆ పసిపాపలు ఒకరినొకరు చేతులతో స్పృశించుకొని పరవశంతో కేరింతలు కొడతారు. ఆ దృశ్యం, అప్పుడు వినిపించే నేపథ్య సంగీతం అత్యంత రమణీయంగా ఉంటాయి.
- బై బై యే బంగారు రమణమ్మ, రంగబోతి ఓ రంగబోతి వంటి జానపద గీతాలను ఈ చిత్రంలో పవన్ స్వయంగా ఆలపించటం విశేషం. రంగబోతి ఓ రంగబోతి గీతం ఉదయ్ కిరణ్ నటించిన శ్రీ రాం చిత్రం లో ఒక ముఖ్య గీతం.
- ఎయిర్ పోర్టు కి వెళ్ళే దారిలో కథానాయకుడు ఎదుర్కొనే దుర్ఘటన కి కారకుడు అయిన అయోమయ చక్రవర్తి పాత్ర రెండు భాషల్లోనూ ఎస్. జే. సూర్య నే పోషించటం విశేషం.
- ఈ చిత్రం రూ. 20 కోట్లను వసూలు చేసి బాక్స్ ఆఫీసు రికార్డుని సృష్టించినది.
- ఈ చిత్రానికి కాస్ట్యూం లను రేణు దేశాయ్ రూపొందించింది.
చెప్పుడు కబుర్లు
తెలుగులో చిత్రానికి దర్శకత్వం పవన్ కళ్యాణ్ అని, పేరుకు మాత్రం ఎస్. జే. సూర్య అనీ వినికిడి. పవన్ పూర్వపు చిత్రాలలో నటనతో పోలిస్తే ఈ చిత్రం లో తను చాలా స్వతంత్ర్యం గా పరిపక్వతతో నటించటం చూస్తే అది నిజమే కాబోలు అనిపిస్తుంది.
కొసమెరుపు
విడుదలకు ముందు చాలాకాలం ఈ చిత్రం పేరు చెప్పాలని ఉంది. మొదట అమీషా పటేల్ ను నాయికగా అనుకున్నారు.