బాలి (చిత్రకారుడు): కూర్పుల మధ్య తేడాలు
కొద్దిగా విస్తరణ |
→వ్యక్తిగత జీవితం: అక్షరదోష నివారణ, విస్తరణ |
||
పంక్తి 39: | పంక్తి 39: | ||
==వ్యక్తిగత జీవితం== |
==వ్యక్తిగత జీవితం== |
||
బాలి గారి తండ్రి మిలిటరీలో |
బాలి గారి తండ్రి మిలిటరీలో పని చేశారు. తన చిన్నతనంలోనే బాలి తన తండ్రిని కోల్పొయారు. తల్లి పెంపంలో పెరిగి పెద్దయ్యి, తన తల్లి ముగ్గులు వేస్తుండగా గమనిస్తూ, చిత్రకళమీద ఆసక్తిని పెంచుకున్నారు. చదువు అనకాపల్లిలోనే జరిగింది.చదువుకునే రోజులలో డ్రాయింగ్ క్లాసంటే ఎక్కువ ఇష్టపడేవారు. ఇంటర్మీడియెట్ వరకు చదివారు. చిత్రకళ మీద కలిగిన ఆసక్తితో సాధన చెశారు. వీరి వివాహం ధనలక్ష్మితో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు, కుమార్తె వైశాలి మరియు కుమారుడు గోకుల్. పిల్లలిద్దరూ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. బాలి ప్రస్తుత నివాసం సీతాఫల్మండి, సికిందరాబాదు. దురదృష్టవశాన, వీరి భార్య కాలంచేశారు. |
||
==చిత్రకారునిగా జీవనం== |
==చిత్రకారునిగా జీవనం== |
17:29, 6 మే 2009 నాటి కూర్పు
మేడిశెట్టి శంకర రావు | |
---|---|
జననం | మేడిశెట్టి శంకర రావు సెప్టెంబరు 29, 1945 విశాఖపట్టణం జిల్లా, అనకాపల్లి |
నివాస ప్రాంతం | హైదరాబాదు |
ఇతర పేర్లు | బాలి |
వృత్తి | చిత్రకారుడు,కార్టూనిస్ట్ |
భార్య / భర్త | కీ.శే. ధనలక్ష్మి |
పిల్లలు | కుమార్తె వైశాలి, కుమారుడు గోకుల్ |
తండ్రి | మేడిశేట్టి లక్ష్మణరావు |
తల్లి | మేడిశేట్టి అన్నపూర్ణ |
సంతకం |
బాలి మనకున్న మంచి చిత్రకారులలో ఒకరు. వీరు వేలసంఖ్యలో కథలకు, నవలలకు బొమ్మలు వేశారు. వీరి అసలు పేరు ఎం శంకర రావు. వీరి స్వస్థలం అనకాపల్లి.
వ్యక్తిగత జీవితం
బాలి గారి తండ్రి మిలిటరీలో పని చేశారు. తన చిన్నతనంలోనే బాలి తన తండ్రిని కోల్పొయారు. తల్లి పెంపంలో పెరిగి పెద్దయ్యి, తన తల్లి ముగ్గులు వేస్తుండగా గమనిస్తూ, చిత్రకళమీద ఆసక్తిని పెంచుకున్నారు. చదువు అనకాపల్లిలోనే జరిగింది.చదువుకునే రోజులలో డ్రాయింగ్ క్లాసంటే ఎక్కువ ఇష్టపడేవారు. ఇంటర్మీడియెట్ వరకు చదివారు. చిత్రకళ మీద కలిగిన ఆసక్తితో సాధన చెశారు. వీరి వివాహం ధనలక్ష్మితో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు, కుమార్తె వైశాలి మరియు కుమారుడు గోకుల్. పిల్లలిద్దరూ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. బాలి ప్రస్తుత నివాసం సీతాఫల్మండి, సికిందరాబాదు. దురదృష్టవశాన, వీరి భార్య కాలంచేశారు.
చిత్రకారునిగా జీవనం
వీరు మొదట్లో ఎం.శంకరరావు, అనకాపల్లి అన్న పేరుతో కార్టూన్లు వేశేవారు.ఆ రోజులలో (1970లలో)ఆంధ్ర పత్రిక వారు ఔత్సాహిక కార్టూనిస్టులను ప్రొత్సహించటానికి పోటీలు పెట్టారు . వీరికి మూడువారాలు వరుసగా మొదటి బహుమతి వచ్చిందట. ఈ బహుమతులుతో వచ్చిన ధైర్యంతో, మరింత సాధన చేసి తన నైపుణ్యానికి పదును పెట్టుకునారు. బొమ్మలను మంచి సమతూకంతో వెయ్యటం అలవడింది. కొంతకాలం పి.డబ్ల్యు.డి (Public Works Department PWD)లో గుమాస్తాగా పనిచేసినా, చిత్రకళ మీద ఉన్న మక్కువతో, "అమ్మే కావాలి" అన్న నవల చిన్న పిల్లల కోసం వ్రాసి, తానే బొమ్మలు వేసి, ఆంధ్రజ్యోతి వారపత్రికకు పంపారు. ఈ నవల, ఆంధ్రజ్యోతిలో ధారావాహికగా ప్రచురించబడి పాఠకుల మన్నన పొందినది. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు వీరిని ఎంతగానో ప్రొత్సహించి కథలు వ్రాయించి, బొమ్మలు కూడ వేయించేవారు.
పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు వీరి పేరును బాలి గా మార్చి దీవించారు. అప్పటినుండి, అదే పేరుతో ఎన్నో బొమ్మలు, కార్టూన్లు వేసి మంచి పేరు తెచ్చుకున్నారు.