గోండు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎నాగోబా జాతర: సర్పం,గోండు స్త్రీ బొమ్మల తొలగింపు-
చి →‎మూలాలు: వర్గీకరణ
పంక్తి 56: పంక్తి 56:
*[http://www.suryaa.com/showNews.asp?category=4&subCategory=1&ContentId=15089]నాగోబా జాతర-సూర్య దినపత్రికలో
*[http://www.suryaa.com/showNews.asp?category=4&subCategory=1&ContentId=15089]నాగోబా జాతర-సూర్య దినపత్రికలో
*ఆంగ్ల మూలం : Tribes of India : The Struggle for Survival, Christoph Von Furer-Haimendorf. (అనువాదం : మనుగడ కోసం పోరాటం, ఆంధ్రప్రదేశ్ ఆదివాసులు, అనంత్)
*ఆంగ్ల మూలం : Tribes of India : The Struggle for Survival, Christoph Von Furer-Haimendorf. (అనువాదం : మనుగడ కోసం పోరాటం, ఆంధ్రప్రదేశ్ ఆదివాసులు, అనంత్)
[[వర్గం:గిరిజనులు]]

[[వర్గం:తెగలు]]
[[వర్గం:తెగలు]]



02:37, 17 మే 2009 నాటి కూర్పు

గోండు
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
భాషలు
హిందీతెలుగుమరాఠీ
మతం
హిందు
సంబంధిత జాతి సమూహాలు
Indo-Aryan, Dravidian

గోండు : ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితా లో 6వ కులం.

గోండు మహిళ
గోండు పురుషుడు

భారతదేశంలోని ఆదివాసుల్లో గోండులకు ప్రత్యేక స్థానమూ, ప్రాధాన్యతా వున్నాయి. గోండులలో ప్రధానంగా మూడు రకాలున్నాయి. (1) మరియా గోండ్లు (Marias) (2) కొండ మరియలు ( Hill Marias) (3) భిషోహార్ మరియలు (Bisonhorn Marias) ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని బస్తర్ ప్రాంతమే ఈ మూడు రకాల గోండ్లకు పుట్టినిల్లు. గోండులు మహారాష్ట్ర , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కూడా గణనీయంగా వున్నారు. వీళ్ళను ప్రధానంగా రాజగోండు (koitur) అంటారు. మహారాష్ట్రలోని చందాను పరిపాలించిన శక్తివంతమైన గోండురాజుల ఆస్థానం ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్ జిల్లా వరకు వ్యాపించి ఉండేది. చత్తీస్‌ఘఢ్ లోని చాలా ఆస్థానాల్లో, 1947 వరకు కూడా గోండురాజుల పాలన వుండేది. బ్రిటిషువాళ్ళు భారతదేశాన్ని వదలి వెళ్ళిన తర్వాత గోండు సంస్థానాలన్నీ, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విలీనమైపోయాయి.


గోండుల ప్రాచీన చరిత్ర గురించిన చారిత్రిక ఆధారాలు చాలా తక్కువ. కొంతకాలం క్రితం వరకూ కూడా, ఆదిలాబాద్ జిల్లాలో రాచరికపు ఛాయలు కనిపించాయి. గోండు వీరులు, రాజులు, ఏ ప్రభువూ, బయటి రాజుకూ, జవాబుదారీ కానీ, సామంతుడు కానీ, కాదని అక్కడి గోండులు చెబుతారు. గోండులు ఆ కాలంలోనే నాగలి, ఎద్దులతో వ్యవసాయం చేసేవారు. గోండుల సామాజిక వ్యవస్థకు మూలం వారి నాలుగు గోత్రాలు (phratries). ఇందులో మళ్ళీ ఉపగణాలు (clans) కూడా వుంటాయి. ముఖ్యంగా రాజగోండులలో వున్న నాలుగు phratries కు నాలుగు పేర్లున్నాయి.

  1. ఎర్వెన్ సాగా (Yerwen saga : Seven brother phratry)
  2. సెర్వెన్ సాగా (Serwen saga : Six brother phratry)
  3. సివెన్ సాగా (Sewen saga  : Five brother phratry)
  4. నల్వెన్ సాగా ( Nalven saga : Four brother phratry)

హిందువులు ఎలాగైతే సగోత్రీకులను వివాహం చేసుకోరో, అలాగే గోండులు కూడా ఒక phratryకి చెందినవారు మరొక phratryకి చెందిన వారిని వివాహం చేసుకోరు. ఈ వ్యవస్థకు మూలపురుషుడిగా గోండులు వొక వీరుడిని కొలుస్తారు. అతడే పెర్సపేన్ (Persapen = Great God).

బస్తర్ ప్రాంతంలో నివసించే గోండులంతా ఒకలా ఉండరు. అబుఝమర్ కొండల్లో (Abujhamar Hills) పోడు వ్యవసాయం చేసుకొని జీవిస్తున్న కొండ మరియలు వ్యవసాయ పద్ధతుల రీత్యా, కొండ రెడ్లు లాగా, కొలాములులాగా కనిపిస్తారు. వీరు ఎక్కువగాచంద్రాపూర్ జిల్లాలోని భామ్రగఢ్ ప్రాంతంలో విస్తరించి వున్నారు. ఈ మధ్య కాలంలో వస్తున్న మార్పుల వల్ల, వీళ్ళు కొండప్రాంతం నుండి మైదాన ప్రాంతాల్లోకి తరలి వచ్చి, అక్కడి వ్యవసాయ పద్ధతులను నేర్చుకొని, బియ్యం పండిస్తున్నారు. భిషోహార్ మరియాలు ,వ్యవసాయ పద్ధతుల్లోనే కాక, యితర ఆచార వ్యవహారాల్లో, సాంప్రదాయాల్లో కూడ ఆదిలాబాద్‌లోని రాజగోండులను పోలి వుంటారు. వీరి వివాహాల్లో , ప్రత్యేకంగా ఎద్దుకొమ్ములతో తయారుచేసిన వొక రకమైన టోపీని పెట్టుకొని నృత్యం చేసే సాంప్రదాయం వుండటం వల్లే, వీళ్ళకు (Bisonhorn Mariyas) ఆ పేరు వచ్చి వుంటుందని , మానవ పరిణామ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. గోండులు చేసే నృత్యాన్ని గుసాడి అంటారు.


నాగలి, ఎద్దులతో దున్నుకొని వ్యవసాయం చేసిన గోండులు , క్రమంగా భూమినంతా కోల్పోయి, ప్రస్తుతం కౌలుదారులుగానో, వ్యవసాయ కూలీలుగానో బతుకుతున్నారు. ఆదివాసీ అస్థిత్వాన్ని కోల్పోయే క్రమం (Detribalization Process) గోండులలో వేగంగా జరుగుతోంది

నాగోబా జాతర

సర్పజాతిని పూజిచండమే ఈ పండగ ప్రత్యేకత. ఆదిమ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్యదైవం నాగోబా గోండుల దేవత. నాగోబా దేవాలయం ఆదిలాబాద్‌ కు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూర్‌ దగ్గర కెస్లాపూర్‌ గ్రామంలో ఉంది. కెస్లాపూర్‌లో జరిగే ఈజాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. కెస్లాపూర్‌ జనాభా 400కు మించదు. కాని పండగనాడు లక్షలాది మందితో అది జనారణ్యంగా మారుతుంది. జనవరి 25 నుంచి 29 వరకు నాలుగు రోజులపాటు గిరిజనులు ఈ పండుగ జరుపుకుంటారు. యేటా పుష్యమాసము అమావాస్య రోజున జాతర ప్రారంభ మవుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు మటు మాయమ వుతాయని గిరిజనుల నమ్మకం. నాగోబా చరిత్రను గోండు గిరిజనులు రకరకాలుగా చెప్పుకుంటారు. పూర్వం మేస్రం కుటుంబానికి చెందిన నాగాయిమోతి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పం రూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడని, ఆ కల నిజమైందని గోండుల నమ్మకం. సర్పరూపంలోని నాగేంద్రునికి తల్లి అంటే రాణి తన తమ్ముడి కూతురు గౌరీతో వివాహం జరిపించింది. అత్త ఆజ్ఞ మేరకు గౌరీ భర్తను బుట్టలో పెట్టుకొని గోదావరికి ప్రయాణం కాగా, ఒకచోట పాము ఉడుం రూపంలో కనిపించగా ఆ ఊరు ఉడుంపూరైంది. ఆ తరువాత గౌరి ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడని, అయితే పేరు ప్రతిష్టలు కావాలో.. సంప్రదాయం కావాలో.. తేల్చుకోమనగా గౌరి సంప్రదాయాలను లెక్కచేయక పోవడంతో తిరిగి పాముగా మారాడని కథ. ఆ తరువాత ఉడుంపూర్‌ నుంచి గరిమెల వరకు అతనికోసం వెతికిన గౌరి గోదావరిలోనే సత్యవసి గుండంలో కలిసిపోయిందని, నాగేంద్రుడు ఆమె వెంట ఉంచిన ఎద్దు రాయిగా మారిందని భక్తుల విశ్వాసం. ఆ తరువాత పెళ్లి అయిన ప్రతి జంటకు నాగేంద్రుడి సన్నిధిలో పరిచయం చేయాలని (పేథికొరి యాక్‌) చెప్పి నాగేంద్రుడు కెస్లాపూర్‌ గుట్టల్లోకి వెళ్లిపోయాడని చెప్తుంటారు. అదే కెస్లాపూర్‌ గ్రామంగా మారి పోయింది. నాగేంద్రుడు వెళ్లిన గుట్ట వద్ద నాగో బా దేవాలయాన్ని నిర్మిం చారు. ప్రతిఏటా పుష్ట మాసం అమావాస్య రోజున నాగేంద్రుడు ప్రత్యక్షమవుతాడని గిరిజనుల నమ్మకం. నాగోబా దేవతకు పూజలు మేస్రం వంశీయులే నిర్వహిస్తారు. మేస్రం వంశం కింద 22 తెగలు వస్తాయి. ఏడుగురు దేవతలను కొలిచే వారంతా మేస్రం వంశీయుల కిందికి వస్తారు. మడావి, మర్సకోల, పుర్క, మేస్రం, వెడ్మ, పంద్రా, పుర్వెత ఇంటి పేర్లు గలవారంతా మేస్రం వంశంలో వస్తారు.


పుష్యమాసంలో వచ్చే పౌర్ణమినాడు మేస్రం వంశీయులు 20 మంది గిరిజనులు వెంటరాగా కొత్త కుండలతో కడెం మండలంలోని గొడిసిర్యాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని తీసుకువచ్చేందుకు బయలుదేరుతారు. దీంతో జాతర ప్రారంభమైనట్టే. ఆ జలాన్ని తీసుకురావడానికి కెస్లాపూర్‌ నుంచి గోదావరి దాకా కాలినడకన 80 కిలోమీటర్లు వెళ్తారు. కెస్లాపూర్‌ చేరుకొని జాతర ప్రాంగణంలోని గిరిజనులు చెప్పుకునే ప్రాశస్త్యం గల మర్రి చెట్టు కింద విడిదిచేసి అమావాస్యరోజు రాత్రి నాగోబాకు కొత్త కుండల్లో గోదావరి నుంచి తెచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తారు. తరువాతే క్షీరాభిషేకం చేసి గిరిజన ఆచారాల మేరకు పూజలు నిర్వహిస్తారు. 3 సంవత్స రాలకొకసారి పూజారిని మార్చడం ఆనవాయితీ. జాతరకు వచ్చే మేస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు ఎక్కడపడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల, గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు (దుగుడు) ఉన్నాయి. ఆ దీపాల కాంతుల వెలుగులో 22 పొయ్యిల్లో మేస్రం వంశీయుల వంతుల వారిగా వంటలు చేసుకుంటారు. మిగితా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు. జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్‌కు ఒక ప్రత్యేకత, చరిత్ర ఉన్నాయి. 63 ఏడేళ్ల క్రితం మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులంటేనే ఆదివాసులు పరుగెత్తేవారు. గిరిజనుల వద్దకు అధికారులెవరు వెళ్లేవారు కాదు. అప్పుడే భుమి కోసం.. విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమురం భీం మరణించిన సంఘటన జరిగింది. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ నిజాం ప్రభువులు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్ ను ఆదిలాబాద్‌ జిల్లాకు పంపారు. ఆయన దృష్టి జాతరపై పడింది. కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్‌ ఏర్పాటు చేయాలని అనుకున్నాడాయన. దీన్ని ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్ 1946లో మొదట నిర్వహించారు. స్వాతంత్రం వచ్చిన తరువాత జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్‌కు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతూ ఉంటారు. నాగోబా పూజల అనంతరం నాగోబా ఆలయ ఆవరణలో ఉన్న పుట్టను మట్టితో మెత్తడంలో మేస్రం వంశీయుల అల్లుళ్లకు పెద్దపీట వేస్తారు. అల్లుళ్లు మట్టిని కాళ్లతో తొక్కి మెత్తగా చేస్తే కూతుళ్లు ఆ మట్టితో పుట్టను మెత్తి (అలికి) మొక్కులు తీర్చుకుంటారు. అల్లుళ్లు మట్టిని తొక్కినందుకు వారికి ప్రత్యేక నజరానా అందజేయడం సంప్రదాయం. ఈ జాతరకు మన రాష్ట్రం నుంచే కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు.

ఇవీ చూడండి

అటు నక్సలైట్లకు, ఇటు పోలీసులకు, మధ్యనలిగే ఆదిలాబాద్‌ గోండు గిరిజనుల జీవితాన్నిఊరు అనే నవలలో వసంతరావు దేశ్‌పాండే చిత్రీకరించారు. గోండుల నృత్యాన్ని గూసాడి నృత్యం అంటారు.


మూలాలు

  • [1]నాగోబా జాతర-సూర్య దినపత్రికలో
  • ఆంగ్ల మూలం : Tribes of India : The Struggle for Survival, Christoph Von Furer-Haimendorf. (అనువాదం  : మనుగడ కోసం పోరాటం, ఆంధ్రప్రదేశ్ ఆదివాసులు, అనంత్)
"https://te.wikipedia.org/w/index.php?title=గోండు&oldid=411044" నుండి వెలికితీశారు