కొత్త రఘురామయ్య: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11: పంక్తి 11:




రఘురామయ్య జూన్ 6, 1979లో పరమపదించాడు. ఆయన పేరు మీద [[నరసరావు పేట]], [[దుగ్గిరాల]]లో రెండు కళాశాలలు నెలకున్నాయి.
రఘురామయ్య జూన్ 6, 1979లో పరమపదించాడు. ఆయన పేరు మీద [[నరసరావుపేట]], [[దుగ్గిరాల]]లో రెండు కళాశాలలు నెలకున్నాయి.
==మూలాలు==
==మూలాలు==

07:48, 24 మే 2009 నాటి కూర్పు

కొత్త రఘురామయ్య 1912, ఆగష్టు 6న ఆంధ్ర దేశములోని గుంటూరు మండలమునకు చెందిన సంగం జాగర్లమూడి గ్రామములో జగన్నాధం, కోటమ్మ అను దంపతులకు జన్మించాడు. జగన్నాధం చుట్టుపక్క గ్రామాలలో పేరుగాంచిన భూస్వామి, మహాదాత.


స్వగ్రామములో మరియు గుంటూరులో తొలి విద్యాభ్యాసము చేసిన తదుపరి రఘురామయ్య ఇంగ్లాండు వెళ్ళి 'బార్-ఎట్-లా' చదివాడు. స్వదేశము తిరిగి వచ్చి 1937 నుండి 1941 వరకు మద్రాసు హైకోర్టులు వకీలుగా పనిచేశాడు. ఆ తరువా బ్రిటీషు ప్రభుత్వములోని న్యాయశాఖలో ఉద్యోగమునకు కుదురుకున్నాడు.


1949లో ప్రభుత్వ ఉద్యోగము వదలి రాజకీయరంగ ప్రవేశము చేశాడు. తెనాలి మరియు గుంటూరు లోకసభ స్థానములకు పలుమార్లు నాయకత్వము వహించి పలుసేవలందించాడు[1].


రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియూ లోకసభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా సేవలందించి పేరు సంపాదించాడు[2].


రఘురామయ్య జూన్ 6, 1979లో పరమపదించాడు. ఆయన పేరు మీద నరసరావుపేట, దుగ్గిరాలలో రెండు కళాశాలలు నెలకున్నాయి.

మూలాలు

  1. లోకసభ సభ్యత్వము: http://164.100.24.209/newls/lokprev.aspx
  2. మంత్రిత్వ శాఖలు: http://www.kolumbus.fi/taglarsson/dokumentit/gandhi2.htm