వైఎస్ఆర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
చి →భౌగోళికము |
|||
పంక్తి 39: | పంక్తి 39: | ||
* వర్షపాతము: 695 మి.మీ (Seasonal) |
* వర్షపాతము: 695 మి.మీ (Seasonal) |
||
* నదులు: [[పెన్న]], [[చిత్రావతి]], [[కుందేరు]], [[పాపాఘ్ని]], [[సగిలేరు]] మరియు [[చెయ్యేరు]]. |
* నదులు: [[పెన్న]], [[చిత్రావతి]], [[కుందేరు]], [[పాపాఘ్ని]], [[సగిలేరు]] మరియు [[చెయ్యేరు]] జిల్లాలో ప్రవహించే ప్రధాన నదులు. |
||
* కొండలు: [[శేషాచలం కొండలు]] ఈ జిల్లాలో విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. వాటిని పాలకొండలని, నల్లమల కొండలని, వెలికొండలని, ఎర్రమల కొండలని పిలుస్తారు. |
* కొండలు: [[శేషాచలం కొండలు]] ఈ జిల్లాలో విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. వాటిని పాలకొండలని, నల్లమల కొండలని, వెలికొండలని, ఎర్రమల కొండలని పిలుస్తారు. |
||
⚫ | * అటవీ సంపద: జిల్లాలోని అటవీ ప్రాంతము కలప సమకూర్చడమే కాక దేశానికి విదేశీమారకము తెచ్చిపెట్టే ఎర్రచందనము జిల్లాలోనే లభ్యమవుతుంది. ప్రపంచంలో మరెక్కడా కనిపించకుండా ఆంతరించి పోయిందనుకున్న [[కలివికోడి]] ఇక్కడి శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో కనిపించింది. సింహాలు, చిరుతపులులు, మెదలయిన వన్యప్రాణులు ఈ అడవులలో నివసిస్తున్నాయి. |
||
* ముఖ్య పట్టణములు:[[కడప పట్టణం|కడప]], [[ప్రొద్దుటూరు]],[[మైదుకూరు]],[[రాజంపేట]] మరియు [[రాయచోటి]] |
* ముఖ్య పట్టణములు:[[కడప పట్టణం|కడప]], [[ప్రొద్దుటూరు]],[[మైదుకూరు]],[[రాజంపేట]] మరియు [[రాయచోటి]] |
||
* పర్యాటక కేంద్రాలు: కడప, [[సిద్ధవటం]], [[నందలూరు]], మస్జీద్-ఏ-ఆజమ్, [[మైలవరం]], [[గండికోట]], [[వేయి నూతుల కోన]], [[చిన్మయారణ్యం]] మరియు చాంద్ పీరా గుంబద్, |
* పర్యాటక కేంద్రాలు: కడప, [[సిద్ధవటం]], [[నందలూరు]], మస్జీద్-ఏ-ఆజమ్, [[మైలవరం]], [[గండికోట]], [[వేయి నూతుల కోన]], [[చిన్మయారణ్యం]] మరియు చాంద్ పీరా గుంబద్, |
||
* పుణ్య క్షేత్రాలు: [[దేవుని కడప]],[[పుష్పగిరి]], [[నాగేశులకొండ]], [[సిద్దయ్య స్వామి మఠం]], [[దుంపలగట్టు]],[[ఆస్తాన్-ఎ-మగ్దూమ్ ఇలాహి]] (పెద్ద దర్గా), [[ఆస్తాన్-ఎ-షామీరియా]] (షామీరియా దర్గా), [[సెయింట్ మేరీ కేథడ్రాల్]], [[తాళ్ళపాక]], [[పుష్పగిరి]], [[గండి క్షేత్రం]], [[ఒంటిమిట్ట]], [[నందలూరు]] సౌమ్యనాథాలయాలు, [[అత్తిరాల]], [[వెల్లాల]], [[దానవులపాడు]], [[జ్యోతి (సిద్ధవటం మండలం)|జ్యోతి]], [[జమ్మలమడుగు]], [[ప్రొద్దుటూరు]] దేవాలయాలు మరియు కందిమల్లాయపల్లెలోని [[పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి]] మఠము. |
* పుణ్య క్షేత్రాలు: [[దేవుని కడప]],[[పుష్పగిరి]], [[నాగేశులకొండ]], [[సిద్దయ్య స్వామి మఠం]], [[దుంపలగట్టు]],[[ఆస్తాన్-ఎ-మగ్దూమ్ ఇలాహి]] (పెద్ద దర్గా), [[ఆస్తాన్-ఎ-షామీరియా]] (షామీరియా దర్గా), [[సెయింట్ మేరీ కేథడ్రాల్]], [[తాళ్ళపాక]], [[పుష్పగిరి]], [[గండి క్షేత్రం]], [[ఒంటిమిట్ట]], [[నందలూరు]] సౌమ్యనాథాలయాలు, [[అత్తిరాల]], [[వెల్లాల]], [[దానవులపాడు]], [[జ్యోతి (సిద్ధవటం మండలం)|జ్యోతి]], [[జమ్మలమడుగు]], [[ప్రొద్దుటూరు]] దేవాలయాలు మరియు కందిమల్లాయపల్లెలోని [[పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి]] మఠము. |
||
⚫ | * అటవీ సంపద: జిల్లాలోని అటవీ ప్రాంతము కలప సమకూర్చడమే కాక దేశానికి విదేశీమారకము తెచ్చిపెట్టే ఎర్రచందనము జిల్లాలోనే లభ్యమవుతుంది. ప్రపంచంలో మరెక్కడా కనిపించకుండా ఆంతరించి పోయిందనుకున్న [[కలివికోడి]] ఇక్కడి శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో కనిపించింది. సింహాలు, చిరుతపులులు, మెదలయిన వన్యప్రాణులు ఈ అడవులలో నివసిస్తున్నాయి. |
||
* నీటి పారుదల: [[తుంగభద్ర]] నది మీద [[సుంకేశుల డ్యామ్]] వద్ద మొదలై [[కె.సి.కెనాల్|కడప-కర్నూలు(కె.సి)కెనాల్]] కడప మరియు [[కర్నూలు]] జిల్లాల ద్వారా ప్రవహిస్తూ 4000 నాలుగు వేలు హెక్టేర్ల సాగుభూమికి నీటిని సమకూరుస్తున్నది. సాగునీటి పారుదల కొరకు [[హంద్రీ-నీవా సుజల స్రవంతి]] ప్రాజెక్టు మరియు [[పులివెందల కాలువ]] నిర్మాణములో ఉన్నవి. బుగ్గవంక నది మీద ఇప్పపెంట గ్రామము వద్ద పుల్లల మడుగు జలాశ్రయము నిర్మించబడినది. [[గాలేరు-నగరి సుజల స్రవంతి]] కాలువ, జిల్లాలో త్రాగునీటికి ముఖ్య ఆధారము. [[మాధవరం]] చేనేత పరిశ్రమ జిల్లాకు ఆదాయము తెచ్చిపెట్టే ఒక ముఖ్య ఆధారము. |
* నీటి పారుదల: [[తుంగభద్ర]] నది మీద [[సుంకేశుల డ్యామ్]] వద్ద మొదలై [[కె.సి.కెనాల్|కడప-కర్నూలు(కె.సి)కెనాల్]] కడప మరియు [[కర్నూలు]] జిల్లాల ద్వారా ప్రవహిస్తూ 4000 నాలుగు వేలు హెక్టేర్ల సాగుభూమికి నీటిని సమకూరుస్తున్నది. సాగునీటి పారుదల కొరకు [[హంద్రీ-నీవా సుజల స్రవంతి]] ప్రాజెక్టు మరియు [[పులివెందల కాలువ]] నిర్మాణములో ఉన్నవి. బుగ్గవంక నది మీద ఇప్పపెంట గ్రామము వద్ద పుల్లల మడుగు జలాశ్రయము నిర్మించబడినది. [[గాలేరు-నగరి సుజల స్రవంతి]] కాలువ, జిల్లాలో త్రాగునీటికి ముఖ్య ఆధారము. [[మాధవరం]] చేనేత పరిశ్రమ జిల్లాకు ఆదాయము తెచ్చిపెట్టే ఒక ముఖ్య ఆధారము. |
||
* వ్యవసాయం: [[వరి]], [[సజ్జ]], [[జొన్న]], [[రాగి]] వంటి ఆహార ధాన్యాలు, [[మామిడి]], [[చీనీ]], [[బొప్పాయి]] వంటి పండ్ల తోటలు, [[చెరకు|చెఱకు]], [[పసుపు]] వంటి వాణిజ్య పంటలు పండుతున్నాయి. [[చెన్నూరు]] [[తమలపాకులు]] ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. |
* వ్యవసాయం: [[వరి]], [[సజ్జ]], [[జొన్న]], [[రాగి]] వంటి ఆహార ధాన్యాలు, [[మామిడి]], [[చీనీ]], [[బొప్పాయి]] వంటి పండ్ల తోటలు, [[చెరకు|చెఱకు]], [[పసుపు]] వంటి వాణిజ్య పంటలు పండుతున్నాయి. [[చెన్నూరు]] [[తమలపాకులు]] ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మైదుకూరు ప్రాంతంలో పండే కె.పి.ఉల్లి విదేశాలకు ఎగుమతి అవుతుంది. కృష్ణాపురం గ్రామం పేరు మీదుగా ఆ వంగడానికి ఆ పేరు వచ్చింది. |
||
* ఖనిజాలు-పరిశ్రమలు: కడప జిల్లాలో ప్రపంచంలో మరెక్కడా లభించనంత [[ముగ్గురాయి]] ([[బెరైటీస్]]) [[మంగంపేట]] గనుల్లో లభిస్తోంది. [[పులివెందుల]] ప్రాంతంలో [[రాతినార]] తీస్తున్నారు. [[నాప రాళ్ళు|నాప రాళ్ళ]]కు కడప పెట్టింది పేరు. [[యర్రగుంట్ల]] ప్రాంతంలో [[సిమెంటు పరిశ్రమ]] విస్తరిస్తోంది. [[ముద్దనూరు]] దగ్గర ఏర్పాటైన [[ఆర్.టి.పి.పి.|రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు]] మెగాపవర్ ప్రాజెక్టు అయ్యే దిశగా పురోగమిస్తోంది. |
* ఖనిజాలు-పరిశ్రమలు: కడప జిల్లాలో ప్రపంచంలో మరెక్కడా లభించనంత [[ముగ్గురాయి]] ([[బెరైటీస్]]) [[మంగంపేట]] గనుల్లో లభిస్తోంది. [[పులివెందుల]] ప్రాంతంలో [[రాతినార]] తీస్తున్నారు. [[నాప రాళ్ళు|నాప రాళ్ళ]]కు కడప పెట్టింది పేరు. పులివెందల నియోజకవర్గంలో యురేనియం నిక్షేపాలను కనుగొన్నారు. వేముల మండలంలోని తుమ్మలపల్లె గ్రామంలో యురేనియం శుద్ధి కర్మాగారం నిర్మాణంలో ఉంది. [[యర్రగుంట్ల]] ప్రాంతంలో [[సిమెంటు పరిశ్రమ]], విస్తరిస్తోంది. జమ్మలమడుగులో ఉక్కు కర్మాగారం నిర్మాణంలో ఉంది. [[ముద్దనూరు]] దగ్గర ఏర్పాటైన [[ఆర్.టి.పి.పి.|రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు]] మెగాపవర్ ప్రాజెక్టు అయ్యే దిశగా పురోగమిస్తోంది. |
||
* రవాణా సౌకర్యాలు: బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన కడప విమానాశ్రయం 1990 దశకంలో మూతపడింది. దాన్ని తిరిగి తెరిపించడానికి పనులు చురుగ్గా సాగుతున్నాయి. దేశంలోని అతి ప్రధానమైన రైలు మార్గాల్లో ఒకటిగా 1854-1866 మధ్య కాలంలో వేయబడిన ముంబై-చెన్నై రైలు మార్గం ఈ జిల్లాలో ఉన్న ఏకైక రైలు మార్గం. రైల్వే కొండాపురం, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, రైల్వే కోడూరు ఈ జిల్లాలో ఈ రైలు మార్గం కలిపే ముఖ్య పట్టణాలు. ముఖ్య వాణిజ్యపట్టణమైన ప్రొద్దటూరు మీదుగా ఎర్రగుంట్ల-నంద్యాల రైలు మార్గం నిర్మాణదశలో ఉంది. కడప-నెల్లూరు, కడప-బెంగుళూరు రైలు మార్గాలు వెయ్యాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. కర్నూలు-కడప-చిత్తూరు పట్టణాలను కలిపే 18వ నంబరు జాతీయ రహదారి, కడప-చెన్నై, కడప-బెంగుళూరు స్టేట్ హైవేలు. నెల్లూరు-బళ్ళారి లను కలిపే మరో ముఖ్యమైన రహదారి మైదుకూరు మీదుగా వెళ్తుంది. |
* రవాణా సౌకర్యాలు: బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన కడప విమానాశ్రయం 1990 దశకంలో మూతపడింది. దాన్ని తిరిగి తెరిపించడానికి పనులు చురుగ్గా సాగుతున్నాయి. దేశంలోని అతి ప్రధానమైన రైలు మార్గాల్లో ఒకటిగా 1854-1866 మధ్య కాలంలో వేయబడిన ముంబై-చెన్నై రైలు మార్గం ఈ జిల్లాలో ఉన్న ఏకైక రైలు మార్గం. రైల్వే కొండాపురం, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, రైల్వే కోడూరు ఈ జిల్లాలో ఈ రైలు మార్గం కలిపే ముఖ్య పట్టణాలు. ముఖ్య వాణిజ్యపట్టణమైన ప్రొద్దటూరు మీదుగా ఎర్రగుంట్ల-నంద్యాల రైలు మార్గం నిర్మాణదశలో ఉంది. కడప-నెల్లూరు, కడప-బెంగుళూరు రైలు మార్గాలు వెయ్యాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. కర్నూలు-కడప-చిత్తూరు పట్టణాలను కలిపే 18వ నంబరు జాతీయ రహదారి, కడప-చెన్నై, కడప-బెంగుళూరు స్టేట్ హైవేలు. నెల్లూరు-బళ్ళారి లను కలిపే మరో ముఖ్యమైన రహదారి మైదుకూరు మీదుగా వెళ్తుంది. |
||
* ప్రసార సాధనాలు: 1963 జూన్ 16న కడపలో [[ఆకాశవాణి]] కేంద్రం ఏర్పాటైంది. ఇక్కడి నుంచి ప్రసారాలు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, మహబూబ్ నగర్ జిల్లాలు, పొరుగు రాష్ట్రాల్లోని రాయచూరు, బళ్ళారి, బెంగుళూరు, కోలారు, చెన్నై తదితర ప్రాంతాల్లోనే కాక 900 కి.మీ. పరిధిలోని తెలుగు ప్రజలకు అందుతున్నాయి. ఇది కాక కడపలో [[దూరదర్శన్]] రిలే కేంద్రం ఉంది. |
|||
* విద్యా సంస్థలు - గ్రంథాలయాలు: కడపలో [[యోగి వేమన విశ్వవిద్యాలయం]], [[రిమ్స్]] (రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) వైద్య కళాశాల ముఖ్యమైనవి. ఇవి కాక పులివెందలలో [[జే.ఎన్.టీ.యూ.]] (జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం) ఇంజినీరింగ్ కళాశాల ఉంది. ఇక కడపలో [[సి.పి.బ్రౌన్]] నివసించిన బంగళాలో ఆయన పేరిట నెలకొల్పిన బ్రౌన్ గ్రంథాలయం ప్రస్తుతం యోగి వేమన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా భాషా సాహిత్య పరిశోధనా కేంద్రంగా పనిచేస్తోంది. |
|||
* రాయలసీమలోని నాలుగు జిల్లాలు మరియు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నడిబొడ్డైన కడపలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక ప్రాంతీయ, కేంద్ర కార్యాలయాలు ఉన్నాయి. |
|||
ధార్మిక వ్యవస్థకు పునాదులైన ఎన్నో దేవాలయాలు, క్షేత్రాలు, తీర్థాలు ఈ జిల్లాలో ఉన్నాయి. రాజులు, రాజ్యాలు అంతరించినా ఆనాటి చరిత్రకు గుర్తులుగా గండికోట, సిద్ధవటం కోటలు మిగిలి ఉన్నాయి. ప్రకృతి రమణీయాలైన కొండలు, కోనలు, [[ఎర్రచందనం|చందన వృక్షాలు]], వన్యమృగాలు ఈ జిల్లాలో ఉన్నాయి. |
ధార్మిక వ్యవస్థకు పునాదులైన ఎన్నో దేవాలయాలు, క్షేత్రాలు, తీర్థాలు ఈ జిల్లాలో ఉన్నాయి. రాజులు, రాజ్యాలు అంతరించినా ఆనాటి చరిత్రకు గుర్తులుగా గండికోట, సిద్ధవటం కోటలు మిగిలి ఉన్నాయి. ప్రకృతి రమణీయాలైన కొండలు, కోనలు, [[ఎర్రచందనం|చందన వృక్షాలు]], వన్యమృగాలు ఈ జిల్లాలో ఉన్నాయి. |
11:35, 28 మే 2009 నాటి కూర్పు
?కడప ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 14°29′N 78°49′E / 14.48°N 78.81°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 15,359 కి.మీ² (5,930 చ.మై) |
ముఖ్య పట్టణం | కడప |
ప్రాంతం | రాయలసీమ |
జనాభా • జనసాంద్రత • పట్టణ • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
25,73,000 (2001 నాటికి) • 168/కి.మీ² (435/చ.మై) • 600000 • 1303000 • 1270000 • 64.02 • 76.98 • 50.76 |
వెబ్సైటు: www.కడప.com |
కడప - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రాయలసీమ ప్రాంతమునకు చెందిన జిల్లా. సుప్రసిద్ధ వాగ్గేయకారుడు మరియు సంకీర్తనాచార్యుడయిన అన్నమయ్య, ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన, తెలుగు జాతీయ కవి వేమన, తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క, మరో ప్రసిద్ధ కవయిత్రి మొల్ల, మహోన్నతమైన యోగి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, అయ్యలరాజు రామభద్రుడు ఈ జిల్లాకు చెందినవారే. ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజం ప్రస్థానం 1885లో కడప జిల్లా సురభి గ్రామంలో 'కీచక వధ'నాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు. కడప జిల్లా బెరైటీస్(ముగ్గురాయి) గనులు మరియు కడప బండలకు ప్రసిద్ధి చెందినది. కడప జిల్లాకు తూర్పున నెల్లూరు, పశ్చిమాన అనంతపురం మరియు దక్షిణాన చిత్తూరు జిల్లాలు కలవు. కర్నూలు మరియు ప్రకాశం జిల్లాలు ఉత్తరాన సరిహద్దులు. పూర్వము ఈ జిల్లాకు హిరణ్యదేశమని పేరు కలదు. ఈ ప్రదేశము పల్లవులు, తెలుగు చోళులు, కాకతీయులు, విజయనగర రాజులు,గండికోట పెమ్మసాని నాయకులు, నిజాము నవాబులు,సిద్ధవటం నుంచి పరిపాలించిన మట్లి రాజులు, మరియు కడప నవాబుల చే పరిపాలించబడినది. అసలు తెలుగు ఇక్కడే పుట్టినది అని చెప్పటానికి చాలా అధారాలు వున్నాయి[ఆధారం చూపాలి].
ప్రస్తుతం ఈ జిల్లాకి చెందిన శ్రీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
జిల్లా గణాంకాలు
- రెవెన్యూ డివిజన్లు (3): కడప, రాజంపేట, జమ్మలమడుగు
- లోక్సభ స్థానాలు (2): కడప, రాజంపేట
- శాసనసభ స్థానాలు (11): కోడూరు, రాజంపేట, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె (పునర్విభజనలో ఈ నియోజకవర్గము రద్దు చేయబడినది.), కడప, బద్వేల్, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం, పులివెందుల.
భౌగోళికము
Climate: Tropical
- ఉష్ణోగ్రత శ్రేణి:
- వేసవికాలము: 30°C. - 44°C. (దాదాపు 81.56F - 119.6F)
- శీతాకాలము: 21°C. - 30°C. (దాదాపు 57F - 81.56F)
- వర్షపాతము: 695 మి.మీ (Seasonal)
- నదులు: పెన్న, చిత్రావతి, కుందేరు, పాపాఘ్ని, సగిలేరు మరియు చెయ్యేరు జిల్లాలో ప్రవహించే ప్రధాన నదులు.
- కొండలు: శేషాచలం కొండలు ఈ జిల్లాలో విస్తారంగా వ్యాపించి ఉన్నాయి. వాటిని పాలకొండలని, నల్లమల కొండలని, వెలికొండలని, ఎర్రమల కొండలని పిలుస్తారు.
- అటవీ సంపద: జిల్లాలోని అటవీ ప్రాంతము కలప సమకూర్చడమే కాక దేశానికి విదేశీమారకము తెచ్చిపెట్టే ఎర్రచందనము జిల్లాలోనే లభ్యమవుతుంది. ప్రపంచంలో మరెక్కడా కనిపించకుండా ఆంతరించి పోయిందనుకున్న కలివికోడి ఇక్కడి శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో కనిపించింది. సింహాలు, చిరుతపులులు, మెదలయిన వన్యప్రాణులు ఈ అడవులలో నివసిస్తున్నాయి.
- ముఖ్య పట్టణములు:కడప, ప్రొద్దుటూరు,మైదుకూరు,రాజంపేట మరియు రాయచోటి
- పర్యాటక కేంద్రాలు: కడప, సిద్ధవటం, నందలూరు, మస్జీద్-ఏ-ఆజమ్, మైలవరం, గండికోట, వేయి నూతుల కోన, చిన్మయారణ్యం మరియు చాంద్ పీరా గుంబద్,
- పుణ్య క్షేత్రాలు: దేవుని కడప,పుష్పగిరి, నాగేశులకొండ, సిద్దయ్య స్వామి మఠం, దుంపలగట్టు,ఆస్తాన్-ఎ-మగ్దూమ్ ఇలాహి (పెద్ద దర్గా), ఆస్తాన్-ఎ-షామీరియా (షామీరియా దర్గా), సెయింట్ మేరీ కేథడ్రాల్, తాళ్ళపాక, పుష్పగిరి, గండి క్షేత్రం, ఒంటిమిట్ట, నందలూరు సౌమ్యనాథాలయాలు, అత్తిరాల, వెల్లాల, దానవులపాడు, జ్యోతి, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు దేవాలయాలు మరియు కందిమల్లాయపల్లెలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠము.
- నీటి పారుదల: తుంగభద్ర నది మీద సుంకేశుల డ్యామ్ వద్ద మొదలై కడప-కర్నూలు(కె.సి)కెనాల్ కడప మరియు కర్నూలు జిల్లాల ద్వారా ప్రవహిస్తూ 4000 నాలుగు వేలు హెక్టేర్ల సాగుభూమికి నీటిని సమకూరుస్తున్నది. సాగునీటి పారుదల కొరకు హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు మరియు పులివెందల కాలువ నిర్మాణములో ఉన్నవి. బుగ్గవంక నది మీద ఇప్పపెంట గ్రామము వద్ద పుల్లల మడుగు జలాశ్రయము నిర్మించబడినది. గాలేరు-నగరి సుజల స్రవంతి కాలువ, జిల్లాలో త్రాగునీటికి ముఖ్య ఆధారము. మాధవరం చేనేత పరిశ్రమ జిల్లాకు ఆదాయము తెచ్చిపెట్టే ఒక ముఖ్య ఆధారము.
- వ్యవసాయం: వరి, సజ్జ, జొన్న, రాగి వంటి ఆహార ధాన్యాలు, మామిడి, చీనీ, బొప్పాయి వంటి పండ్ల తోటలు, చెఱకు, పసుపు వంటి వాణిజ్య పంటలు పండుతున్నాయి. చెన్నూరు తమలపాకులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మైదుకూరు ప్రాంతంలో పండే కె.పి.ఉల్లి విదేశాలకు ఎగుమతి అవుతుంది. కృష్ణాపురం గ్రామం పేరు మీదుగా ఆ వంగడానికి ఆ పేరు వచ్చింది.
- ఖనిజాలు-పరిశ్రమలు: కడప జిల్లాలో ప్రపంచంలో మరెక్కడా లభించనంత ముగ్గురాయి (బెరైటీస్) మంగంపేట గనుల్లో లభిస్తోంది. పులివెందుల ప్రాంతంలో రాతినార తీస్తున్నారు. నాప రాళ్ళకు కడప పెట్టింది పేరు. పులివెందల నియోజకవర్గంలో యురేనియం నిక్షేపాలను కనుగొన్నారు. వేముల మండలంలోని తుమ్మలపల్లె గ్రామంలో యురేనియం శుద్ధి కర్మాగారం నిర్మాణంలో ఉంది. యర్రగుంట్ల ప్రాంతంలో సిమెంటు పరిశ్రమ, విస్తరిస్తోంది. జమ్మలమడుగులో ఉక్కు కర్మాగారం నిర్మాణంలో ఉంది. ముద్దనూరు దగ్గర ఏర్పాటైన రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు మెగాపవర్ ప్రాజెక్టు అయ్యే దిశగా పురోగమిస్తోంది.
- రవాణా సౌకర్యాలు: బ్రిటిష్ కాలంలో ఏర్పాటైన కడప విమానాశ్రయం 1990 దశకంలో మూతపడింది. దాన్ని తిరిగి తెరిపించడానికి పనులు చురుగ్గా సాగుతున్నాయి. దేశంలోని అతి ప్రధానమైన రైలు మార్గాల్లో ఒకటిగా 1854-1866 మధ్య కాలంలో వేయబడిన ముంబై-చెన్నై రైలు మార్గం ఈ జిల్లాలో ఉన్న ఏకైక రైలు మార్గం. రైల్వే కొండాపురం, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, రైల్వే కోడూరు ఈ జిల్లాలో ఈ రైలు మార్గం కలిపే ముఖ్య పట్టణాలు. ముఖ్య వాణిజ్యపట్టణమైన ప్రొద్దటూరు మీదుగా ఎర్రగుంట్ల-నంద్యాల రైలు మార్గం నిర్మాణదశలో ఉంది. కడప-నెల్లూరు, కడప-బెంగుళూరు రైలు మార్గాలు వెయ్యాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. కర్నూలు-కడప-చిత్తూరు పట్టణాలను కలిపే 18వ నంబరు జాతీయ రహదారి, కడప-చెన్నై, కడప-బెంగుళూరు స్టేట్ హైవేలు. నెల్లూరు-బళ్ళారి లను కలిపే మరో ముఖ్యమైన రహదారి మైదుకూరు మీదుగా వెళ్తుంది.
- ప్రసార సాధనాలు: 1963 జూన్ 16న కడపలో ఆకాశవాణి కేంద్రం ఏర్పాటైంది. ఇక్కడి నుంచి ప్రసారాలు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, మహబూబ్ నగర్ జిల్లాలు, పొరుగు రాష్ట్రాల్లోని రాయచూరు, బళ్ళారి, బెంగుళూరు, కోలారు, చెన్నై తదితర ప్రాంతాల్లోనే కాక 900 కి.మీ. పరిధిలోని తెలుగు ప్రజలకు అందుతున్నాయి. ఇది కాక కడపలో దూరదర్శన్ రిలే కేంద్రం ఉంది.
- విద్యా సంస్థలు - గ్రంథాలయాలు: కడపలో యోగి వేమన విశ్వవిద్యాలయం, రిమ్స్ (రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) వైద్య కళాశాల ముఖ్యమైనవి. ఇవి కాక పులివెందలలో జే.ఎన్.టీ.యూ. (జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం) ఇంజినీరింగ్ కళాశాల ఉంది. ఇక కడపలో సి.పి.బ్రౌన్ నివసించిన బంగళాలో ఆయన పేరిట నెలకొల్పిన బ్రౌన్ గ్రంథాలయం ప్రస్తుతం యోగి వేమన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా భాషా సాహిత్య పరిశోధనా కేంద్రంగా పనిచేస్తోంది.
- రాయలసీమలోని నాలుగు జిల్లాలు మరియు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు నడిబొడ్డైన కడపలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక ప్రాంతీయ, కేంద్ర కార్యాలయాలు ఉన్నాయి.
ధార్మిక వ్యవస్థకు పునాదులైన ఎన్నో దేవాలయాలు, క్షేత్రాలు, తీర్థాలు ఈ జిల్లాలో ఉన్నాయి. రాజులు, రాజ్యాలు అంతరించినా ఆనాటి చరిత్రకు గుర్తులుగా గండికోట, సిద్ధవటం కోటలు మిగిలి ఉన్నాయి. ప్రకృతి రమణీయాలైన కొండలు, కోనలు, చందన వృక్షాలు, వన్యమృగాలు ఈ జిల్లాలో ఉన్నాయి.
చరిత్ర
కడప జిల్లా చరిత్ర చాలా ప్రాచీనమైనది. కడప జిల్లాను గతంలో హిర్యణ రాజ్యం అని వ్యవహరించేవారు. క్రీ.పూ. 274-236 ప్రాంతంలో అశోక చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించాడు.ఆ తరువాత శాతవాహనులు పాలించారు. శాతవాహనుల నాణేలు పెద్దముడియం, దానవులపాడు గ్రామాల్లో దొరికాయి. క్రీ.శ. 250-450 ప్రాంతంలో పల్లవరాజులు పాలించారు. ఇంకా రాష్ట్రకూటులు, చోళులు, కళ్యాణి చాళుక్యులు, వైదుంబులు, కాకతీయులు మొదలైన రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి. క్రీ.శ. 1336-1565 కాలంలో విలసిల్లిన విజయనగర సామ్రాజ్యంలో కడప జిల్లా ఒక భాగం. గండికోట ను పాలించిన పెమ్మసాని నాయకులు విజయనగర రాజులకు సామంతులుగా విధేయులై పేరుప్రఖ్యాతులుపొందారు. నంద్యాల రాజులు, మట్లి రాజులు కూడ ఈ ప్రాంతం మీద పెత్తనం సాగించారు. విజయనగర పతనం తర్వాత గోల్కొండ నవాబులు, బీజాపూరు సుల్తానులు, ఔరంగజేబు మొదలైన మహమ్మదీయ రాజులు పాలించారు. క్రీ.శ. 1710 ప్రాంతంలో అబ్దుల్ నబీ ఖాన్ కడపలో కోటను నిర్మించాడు. నవాబుల తర్వాత పాళెగాళ్ళు విజృంభించారు.
ఆ తరువాత ఈస్టిండియా కంపెనీ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం వహించింది. సర్ థామస్ మన్రో కడప జిల్లా కలెక్టరు గా పని చేశాడు. పాలెగాళ్ళను అణచాడు. రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ ప్రాంతపు అభివృద్ధికి తెల్లదొరలు కొంతవరకు కృషి చేశారు. మన్రో ఈ ప్రాంతపు దేవాలయాల అభివృద్ధికి మడిమాన్యాలిచ్చాడు. సి.పి.బ్రౌన్ తెలుగుభాషను సముద్ధరించాడు. మనుచరిత్ర, వసుచరిత్ర వంటి తెలుగు కావ్యాలను ముద్రించాడు. మూడు వేలకు పైగా వేమన పద్యాలను సేకరించాడు. వాటిని ఇంగ్లీషులోకి అనువదించి అచ్చు వేయించాడు. ఇక కల్నల్ మెకంజీ గ్రామాల చరిత్రను సేకరించి కైఫీయతుల పేరుతో భద్రపరిచాడు.
పర్యాటక ఆకర్షణలు
సంగ్రహాలయం
- భగవాన్ మహావీర్ ప్రభుత్వ సంగ్రహాలయం, కడప
చారిత్రక కట్టడాలు
పుణ్య క్షేత్రాలు
- దేవుని కడప, కడప
- బ్రహ్మంగారిమఠం
- మస్జీద్-ఏ-ఆజమ్, కడప
- పుష్పగిరి దేవాలయాలు
- శ్రీ కోదండ రామస్వామి దేవాలయము, ఒంటిమిట్ట
- తాళ్ళపాక దేవాలయాలు
- అత్తిరాల, రాజంపేట
- గండి ఆంజనేయస్వామి దేవాలయము, వేంపల్లె
- సౌమ్యనాథాలయం, నందలూరు
- నామాలగుండు, కనంపల్లె
వన్యప్రాణులు
- శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి సంరక్షణాలయము, లంకమల్లేశ్వరము
- శ్రీ వేంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణాలయము, రాజంపేట
చేరుకొను విధము : కడప, రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు 405 కి.మీ దూరమున ఉన్నది.
మండలాలు
భౌగోళికంగా కడప జిల్లాను 51 రెవిన్యూ మండలాలుగా విభజించినారు[1].
2 మైలవరం 5 దువ్వూరు 6 మైదుకూరు 9 కలసపాడు 10 పోరుమామిళ్ల 11 బద్వేలు 12 గోపవరం 13 ఖాజీపేట 14 చాపాడు 15 ప్రొద్దుటూరు 16 జమ్మలమడుగు 17 ముద్దనూరు |
19 లింగాల 20 పులివెందల 21 వేముల 22 తొండూరు 24 యర్రగుంట్ల 25 కమలాపురం 26 వల్లూరు 27 చెన్నూరు 28 అట్లూరు 29 ఒంటిమిట్ట 30 సిద్ధవటం 31 కడప 33 పెండ్లిమర్రి 34 వేంపల్లె |
35 చక్రాయపేట 37 రామాపురం 38 వీరబల్లె 39 రాజంపేట 40 నందలూరు 41 పెనగలూరు 42 చిట్వేలు 43 కోడూరు 45 పుల్లంపేట 47 సంబేపల్లి 48 చిన్నమండెం 49 రాయచోటి 50 గాలివీడు 51 కాశి నాయన |
మూలాలు
- ↑ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్సైటులో కడప జిల్లా తాలూకాల వివరాలు. జూలై 26, 2007న సేకరించారు.