మహామంత్రి తిమ్మరుసు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8: పంక్తి 8:
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[గుమ్మడి]]|,<br>[[ఎస్.వరలక్ష్మి ]],<br>[[ముక్కామల ]],<br>[[ముదిగొండ లింగమూర్తి ]]
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[గుమ్మడి]]|,<br>[[ఎస్.వరలక్ష్మి ]],<br>[[ముక్కామల ]],<br>[[ముదిగొండ లింగమూర్తి ]]
}}
}}
'''మహామంత్రి తిమ్మరుసు''' 1962లో విడుదలైన తెలుగు చరిత్రాత్మక చిత్రం. దీనిలో [[తిమ్మరుసు]]గా గుమ్మడి, కృష్ణదేవరాయలుగా [[ఎన్.టి.రామారావు]] పోటీపడి అద్భుతంగా నటించారు.


==సంక్షిప్త చిత్రకథ==
==సంక్షిప్త చిత్రకథ==

15:05, 19 సెప్టెంబరు 2009 నాటి కూర్పు

మహామంత్రి తిమ్మరుసు
(1962 తెలుగు సినిమా)
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
గుమ్మడి
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ గౌతమీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

మహామంత్రి తిమ్మరుసు 1962లో విడుదలైన తెలుగు చరిత్రాత్మక చిత్రం. దీనిలో తిమ్మరుసుగా గుమ్మడి, కృష్ణదేవరాయలుగా ఎన్.టి.రామారావు పోటీపడి అద్భుతంగా నటించారు.

సంక్షిప్త చిత్రకథ

కృష్ణదేవరాయలు అదృశ్యంపై ప్రజలు చింతాక్రాంతులు కావడం మారువేషంలో రాయలు గమనించాడు. తిమ్మరుసు రాయల్ని రక్షించి పట్టాభిషిక్తుని చేస్తాడు. సంగీత విద్వాంసునిగా నటించి నాట్యకత్తె చిన్నమ ను ఆకర్షిస్తాడు. తిమ్మరుసు అనుమతి లేకుండా ఆమె ను వివాహమాడతాడు. తిమ్మరుసు రాజనీతి కారణంగా పొరుగుదేశపు రాకుమారిని పెళ్ళాడతాడు. ఇరువురి రాణులతో ఉన్నపుడు తమను దాసీపుత్రులని హేళన చేశిన గజపతుల ప్రస్తావన వచ్చి ఆవేశపరుడై తిమ్మరుసును సంప్రదించకుండా గజపతులపైకి దండయాత్రకు కటకానికి బయలు దేరతాడు. మధ్యలో కొండవీడు, కొండపల్లి ని జయిస్తాడు. గజపతి కుమారుడు రాయలను ముట్టడించగా సేనతో వచ్చి తిమ్మరుసు రక్షిస్తాడు. గజపతి రాకుమార్తె మారువేషంలో రాయలను గమనిస్తుంది. వేగుల ద్వారా రాకుమార్తె తనను ప్రేమిస్తుందని తెలుసుకున్న రాయలు మారువేషంలో కటకానికి వెళతాడు. రాకుమార్తెను కలిసి ఆమె మనోగతాన్ని తెలుసుకుంటాడు. తన ఆచూకీ గమనించిన గజపతి సోదరుని నుండి యుక్తిగా తప్పించుకుంటాడు. రాయల్ని అష్టదిగ్బంధం చేయటానికి పదహారు మంది పాత్రుల సహకారం కోరతాడు గజపతి. ఆ వ్యూహం ఫలిస్తే గజపతి ది పైచేయి ఔతుందని తెలిసి తిమ్మరుసు ప్రతివ్యూహంతో గజపతికి పాత్రులపట్ల అనుమానం కలిగించి వారిని గజపతి చేతిలో మట్టుపెట్టిస్తాడు. తప్పనిసరై గజపతి రాయల్ని అల్లుడుగా అంగీకరిస్తాడు. రాయల్ని హత్యచేయమని కుమార్తెను ప్రేరేపిస్తాడు.ఆత్మహత్య చేసుకోబోతున్న అన్నపూర్ణను తిమ్మరుసు కాపాడుతాడు.రాయలతో రాజధానికి వచ్చిన రాణి దగ్గరకు ఆమె చిన్నాన్న కుటిల మనసుతో చేరతాడు. రాయలకు తిమ్మరుసు కు మధ్య అగాధంసృష్టించే అనేక ప్రయత్నాలు చేస్తాడు. కొన్ని సార్లు సఫలీకృతుడౌతాడు. రాయలకు అన్నపూర్ణకు పుత్తీన కుమారుడు తిమ్మరుసుకు మాలిమి ఔతాడు. అతడి పట్టాభిషేకానికి ముహూర్తం కుదరనందున రాయల ప్రతిపాదనను తిమ్మరుసు అన్యమనస్కంగా అంగీకరిస్తాడు. రాయలు నగరంలోలేని సమయం లో రాకుమారుడు విషప్రయోగం వల్ల మరణిస్తాడు. ఆనేరం తిమ్మరుసు మీద మోపబడుతుంది.రాయలు తిమ్మరుసు ను విచారించి కనుగుడ్లు కాల్పించే శిక్ష విధిస్తాడు. తిమ్మరుసు కనుచూపు పోయాక రాయలకు నిజంతెలుస్తుంది.

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
తిరుమల తిరుపతి వేంకటేశ్వరా కూరిమి వరముల కురియుమయా పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు పి.సుశీల, యస్.వరలక్ష్మి
మోహన రాగమహా మూర్తిమంతమాయే పింగళి నాగేంద్రరావు పెండ్యాల నాగేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల

మూలాలు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.