వికీపీడియా చర్చ:ఏకవచన ప్రయోగం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 52: పంక్తి 52:


== పునః పరిశీలించాలి ==
== పునః పరిశీలించాలి ==

మనం ఈ పాలసీని ఉంచాలా వద్దా అని మళ్లీ ఇంకో సారి పరిశీలించాలి. ముఖ్యంగా తెలుగులోని మొదటి విజ్ఞాన సర్వస్వాన్ని ఆధారంగా అసలే వాడకూడదనుకుంటా. అందుకు ఉదాహరణ: ''అప్పారావు నడవడికను చాలా రసికతకు ఔదార్యమునకు పేరుపడినవాఁడు. సమాజమున తన ప్రతిభచేతను, మంచితనముచేతను, చమత్కారకలిత మగు సంభాషణముచేతను చాలా చిత్తాకర్షణము చేయువాఁడు.'' ఈ వాక్యంలో ఏకవచణ ప్రయోగం ఉన్నా కూడా అగౌరవ పరుస్తున్నట్లు అనిపించదు. ఇప్పుడు ఇదే వాక్యాన్ని ఈ కాలపు తెలుగులో ఏకవచన ప్రయోగం వాడి రాస్తే, ''అప్పారావుకు నడవడిక, రసికతక, ఔదార్యం వలన మంచి పేరుంది. సమాజంలో అతని ప్రతిభకు, మంచితనానికి, చమత్కారభరిత సంభాషణానికి అందరి మన్ననలను పొందాడు.'' రెండింటిలోనూ ఏకవచన ప్రయోగం ఉన్నాకూడా, మొదటిదాంట్లో సంభోధం అగౌరవంగా అనిపించడంలేదు, కానీ రెండో దాంట్లో మటుకు 'డు' అని అంటున్నప్పుడు అగౌరవంగా ద్వనిస్తుంది. కారణం మొదటి విజ్ఞాన సర్వస్వం కొంత గ్రాంధికంలో ఉంది కాబట్టి. గ్రాంధికంలో ఏకవచనం అగౌరవంగా లేదా అసభ్యంగా అనిపించదు.
మనం ఈ పాలసీని ఉంచాలా వద్దా అని మళ్లీ ఇంకో సారి పరిశీలించాలి. ముఖ్యంగా తెలుగులోని మొదటి విజ్ఞాన సర్వస్వాన్ని ఆధారంగా అసలే వాడకూడదనుకుంటా. అందుకు ఉదాహరణ: ''అప్పారావు నడవడికను చాలా రసికతకు ఔదార్యమునకు పేరుపడినవాఁడు. సమాజమున తన ప్రతిభచేతను, మంచితనముచేతను, చమత్కారకలిత మగు సంభాషణముచేతను చాలా చిత్తాకర్షణము చేయువాఁడు.'' ఈ వాక్యంలో ఏకవచణ ప్రయోగం ఉన్నా కూడా అగౌరవ పరుస్తున్నట్లు అనిపించదు. ఇప్పుడు ఇదే వాక్యాన్ని ఈ కాలపు తెలుగులో ఏకవచన ప్రయోగం వాడి రాస్తే, ''అప్పారావుకు నడవడిక, రసికతక, ఔదార్యం వలన మంచి పేరుంది. సమాజంలో అతని ప్రతిభకు, మంచితనానికి, చమత్కారభరిత సంభాషణానికి అందరి మన్ననలను పొందాడు.'' రెండింటిలోనూ ఏకవచన ప్రయోగం ఉన్నాకూడా, మొదటిదాంట్లో సంభోధం అగౌరవంగా అనిపించడంలేదు, కానీ రెండో దాంట్లో మటుకు 'డు' అని అంటున్నప్పుడు అగౌరవంగా ద్వనిస్తుంది. కారణం మొదటి విజ్ఞాన సర్వస్వం కొంత గ్రాంధికంలో ఉంది కాబట్టి. గ్రాంధికంలో ఏకవచనం అగౌరవంగా లేదా అసభ్యంగా అనిపించదు.


పంక్తి 78: పంక్తి 77:
అస్తు - --[[వాడుకరి:కాసుబాబు|కాసుబాబు]] 18:59, 3 నవంబర్ 2009 (UTC)
అస్తు - --[[వాడుకరి:కాసుబాబు|కాసుబాబు]] 18:59, 3 నవంబర్ 2009 (UTC)
::ఏకవచనం, బహువచనంలలో ఏది వాడిననూ అది గౌరవం లేదా అగౌరవం కిందికి రాదు. అంతమాత్రానికి ప్రస్తుతం అమలులో ఉన్న పద్దతిని మార్చాల్సి ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఎవరో ఒకరు మన తెలుగు వికీపీడియన్లను ఈ విషయంలో దుమ్మెత్తిపోసినంత మాత్రాన మనం అతని వ్యాఖ్యలకు నిరుత్సాహపడనక్కరలేదు. ప్రారంభం నుంచి కొనసాగుతున్న పద్దతిని విస్మరించి మరోమార్గంలోకి పోయేటంతటి అవసరం మరియు సరైన కారణమేమీ నాకు కనిపించుటలేదు. ఈ విషయంలో నేను నా అభిప్రాయాలను చెప్పదలుచుకున్నాను. <br />1) తెవికీలో అందరినీ ప్రస్తుతం ఏకవచనం ఉపయోగిస్తున్నాము. అలా కాకుండా కొందరిని ఏకవచనంలో మరి కొందరిని బహువచనంలో ఉపయోగిస్తే బాగుండదు. పిల్లలను సాధారణంగా బహువచనంలో ప్రయోగించం. ''అతడు పాఠశాలకు పోయాడు'' అంటాం కాని ''పోయారు'' అనము, ''అతనికి పిల్లవాడు పుట్టాడు'' అంటామే కాని ''పిల్లవారు పుట్టారు'' అని అనం. <br />2) భగవంతులనే ఏకవచనంలో ప్రయోగిస్తున్నప్పుడు సాధారణ మానవులను తప్పనిసరిగా బహువచనంలో పిలువాలనే నిబంధన అవసరం లేదు. <br />3) వైజాసత్యగారు చెప్పినట్లు కుటుంబంలో పెద్దవారిని వారి కుటుంబ సభ్యులే బహువచనంలో పిలవడం జరుగదు. అయిననూ అది తప్పు కానప్పుడు తెవికీలో తప్పెలా అవుతుంది. <br />4) ఒక వ్యక్తిని 4 రకాలుగా పిలువవచ్చు. 1.ఎక్స్ వచ్చారు, 2.ఎక్స్ వచ్చాడు, 3.ఎక్స్ గారు వచ్చారు, 4.ఎక్స్ గాడు వచ్చాడు. తటస్థ దృక్కోణం వల్ల గౌరవం ఇవ్వకూడదు మరియు అగౌరవంగా ధ్వనించకూడదు కాబట్టి 3,4 తొలిగిద్దాం, ఇక మిగిలింది 1,2 లే కదా. కాబట్టి రెండూ సమానమే రెండోదీ వాడవచ్చు. నాకు తెలిసిన/ తిరిగిన ప్రాంతాల గురించి చెప్పాలంటే గ్రామీణ ప్రజలే కాకుండా పట్టణవాసులు కూడా ఏకవచనంలో ప్రయోగిస్తారు. సభలు, సమావేశాలలో కూడా వేదికపై ఉన్న పెద్దలను కూడా ఏకవచనంలోనే పేర్కొంటారు. ఇక్కడ ఇది సామాన్యమే.<br />5) కొన్ని వాక్యాలు బహువచనంలో వాడితే ఎబ్బెట్టుగా ఉంటుంది మరియు వాక్యం తప్పు అవుతుంది కూడా. ఉదా: ''పాలవాడు వచ్చాడు'' అనే బదులు ''పాలవాడు వచ్చారు'' అని అనం కదా. అలాగే ''కూరగాయలమ్మే మనిషి వచ్చింది'' అంటాం దీనికీ బహువచనం పనికిరాదు. తెవికీలో ఇలాంటి వాక్యాలు వ్రాసేటప్పుడు బహువచనం ఎలా ప్రయోగిస్తాం! ఇంకోటి ''ఏరా తీసుకొచ్చావా?'' అంటే అతనికే అడుగుతున్నట్లు ప్రశ్న ఉంది. అదే బహువచనం ఉపయోగిస్తే ఆ పని అతనికే అప్పగించామా లేక ఇతరుల పని గురించి అతనికి అడుగుతున్నామా అనేది అర్థం కాదు.<br />6) మరోముఖ్యవిషయం, ప్రస్తుతం మనం ఒకే విమర్శను ఎదుర్కొంటున్నాం, దానికీ సమాధానం ఇస్తున్నాం (ఏకవచనం అనేది తెవికీ నియమం), అది కూడా అలవాటుగా మారితే ఏమీ అనిపించదు, బహువచనంలోకి మారితే సవాలక్ష సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. --[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#4c22e6;color:white;"><b> C.Chandra Kanth Rao</b></font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:red;color:white;"><b>-చర్చ</b></font>]] 20:01, 3 నవంబర్ 2009 (UTC)
::ఏకవచనం, బహువచనంలలో ఏది వాడిననూ అది గౌరవం లేదా అగౌరవం కిందికి రాదు. అంతమాత్రానికి ప్రస్తుతం అమలులో ఉన్న పద్దతిని మార్చాల్సి ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఎవరో ఒకరు మన తెలుగు వికీపీడియన్లను ఈ విషయంలో దుమ్మెత్తిపోసినంత మాత్రాన మనం అతని వ్యాఖ్యలకు నిరుత్సాహపడనక్కరలేదు. ప్రారంభం నుంచి కొనసాగుతున్న పద్దతిని విస్మరించి మరోమార్గంలోకి పోయేటంతటి అవసరం మరియు సరైన కారణమేమీ నాకు కనిపించుటలేదు. ఈ విషయంలో నేను నా అభిప్రాయాలను చెప్పదలుచుకున్నాను. <br />1) తెవికీలో అందరినీ ప్రస్తుతం ఏకవచనం ఉపయోగిస్తున్నాము. అలా కాకుండా కొందరిని ఏకవచనంలో మరి కొందరిని బహువచనంలో ఉపయోగిస్తే బాగుండదు. పిల్లలను సాధారణంగా బహువచనంలో ప్రయోగించం. ''అతడు పాఠశాలకు పోయాడు'' అంటాం కాని ''పోయారు'' అనము, ''అతనికి పిల్లవాడు పుట్టాడు'' అంటామే కాని ''పిల్లవారు పుట్టారు'' అని అనం. <br />2) భగవంతులనే ఏకవచనంలో ప్రయోగిస్తున్నప్పుడు సాధారణ మానవులను తప్పనిసరిగా బహువచనంలో పిలువాలనే నిబంధన అవసరం లేదు. <br />3) వైజాసత్యగారు చెప్పినట్లు కుటుంబంలో పెద్దవారిని వారి కుటుంబ సభ్యులే బహువచనంలో పిలవడం జరుగదు. అయిననూ అది తప్పు కానప్పుడు తెవికీలో తప్పెలా అవుతుంది. <br />4) ఒక వ్యక్తిని 4 రకాలుగా పిలువవచ్చు. 1.ఎక్స్ వచ్చారు, 2.ఎక్స్ వచ్చాడు, 3.ఎక్స్ గారు వచ్చారు, 4.ఎక్స్ గాడు వచ్చాడు. తటస్థ దృక్కోణం వల్ల గౌరవం ఇవ్వకూడదు మరియు అగౌరవంగా ధ్వనించకూడదు కాబట్టి 3,4 తొలిగిద్దాం, ఇక మిగిలింది 1,2 లే కదా. కాబట్టి రెండూ సమానమే రెండోదీ వాడవచ్చు. నాకు తెలిసిన/ తిరిగిన ప్రాంతాల గురించి చెప్పాలంటే గ్రామీణ ప్రజలే కాకుండా పట్టణవాసులు కూడా ఏకవచనంలో ప్రయోగిస్తారు. సభలు, సమావేశాలలో కూడా వేదికపై ఉన్న పెద్దలను కూడా ఏకవచనంలోనే పేర్కొంటారు. ఇక్కడ ఇది సామాన్యమే.<br />5) కొన్ని వాక్యాలు బహువచనంలో వాడితే ఎబ్బెట్టుగా ఉంటుంది మరియు వాక్యం తప్పు అవుతుంది కూడా. ఉదా: ''పాలవాడు వచ్చాడు'' అనే బదులు ''పాలవాడు వచ్చారు'' అని అనం కదా. అలాగే ''కూరగాయలమ్మే మనిషి వచ్చింది'' అంటాం దీనికీ బహువచనం పనికిరాదు. తెవికీలో ఇలాంటి వాక్యాలు వ్రాసేటప్పుడు బహువచనం ఎలా ప్రయోగిస్తాం! ఇంకోటి ''ఏరా తీసుకొచ్చావా?'' అంటే అతనికే అడుగుతున్నట్లు ప్రశ్న ఉంది. అదే బహువచనం ఉపయోగిస్తే ఆ పని అతనికే అప్పగించామా లేక ఇతరుల పని గురించి అతనికి అడుగుతున్నామా అనేది అర్థం కాదు.<br />6) మరోముఖ్యవిషయం, ప్రస్తుతం మనం ఒకే విమర్శను ఎదుర్కొంటున్నాం, దానికీ సమాధానం ఇస్తున్నాం (ఏకవచనం అనేది తెవికీ నియమం), అది కూడా అలవాటుగా మారితే ఏమీ అనిపించదు, బహువచనంలోకి మారితే సవాలక్ష సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. --[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#4c22e6;color:white;"><b> C.Chandra Kanth Rao</b></font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:red;color:white;"><b>-చర్చ</b></font>]] 20:01, 3 నవంబర్ 2009 (UTC)
::: నా తరపున (గౌరవసూచకాల బడి తరపున) ఇంకొంత వాదన :) మొదటగా నేను కూడా ఏకవచనవాదినే, అందుకు నాకున్న ఏకైక కారణం పాత వికీపీడియాలలో ఏకవచనం వాడటం. కానీ ఆలోచిస్తే...
# వ్యవహారికంలో మనకు ఎటువంటి పరిచయంలేని వ్యక్తితో మాట్లాడినప్పుడు తప్పనిసరిగా గౌరవవాచకాలను వాడతాము, అలా వాడకపోతే నేనయితే అగౌరవ పరుస్తున్నట్లే అనుకుంటాను.
# "ఎక్స్ వచ్చారు", "ఎక్స్ వచ్చాడు" రెండూ ఒకటే ఎలా అవుతాయి, మొదటి దానితో సంభోదిస్తున్నప్పుడు గౌరవసూచకంగా ఉంది.
# వేదిక మీద పెద్దలను ఏకవచన ప్రయోగాలతో పిలవడం నేనయితే ఎప్పుడూ చూడలేదు.
# తల్లితండ్రులను ఏకవచనంతో సంభోధిస్తున్నప్పుడు అక్కడ ఆత్మీయత లేదా వారితో ఉన్న దగ్గరితనం వలన అలా సంభోదిస్తాము. ఈ లాజిక్కుని వ్యక్తుల వ్యాసాలకు కూడా ప్రయోగించలేమనుకుంటా. వ్యక్తుల వ్యాసాలు చదువుతున్న వారికి, ఆ వ్యక్తుల మీద అలాంటి ప్రేమను కలిగించనవసరం లేదనుకుంటా, అది కూడా POV కిందకు వస్తుందేమో. అదే వ్యాసాలలో వ్యాసాలలో గౌరవసూచకాలు వాడితే, వ్యాసం ఇంకా formalగా ఉంటుంది అని కూడా నా అభిప్రాయం.
# "పాలవాడు వచ్చాడు", "కూరగాయలమ్మే మనిషి వచ్చింది"; లాంటి ప్రయాగాలు (అంటే ''ఫలానా వృత్తి చేసుకునే వాళ్లలో ఒక వ్యక్తి ఫలా పని చేసాడు'') వికీపీడియాలో వాడే సందర్భం ఏముంటుంది?
# అందరూ నన్నయ గారు, తిక్కన్న గారు, రాములవారు అంటూ సంభోదించే వాళ్లు కూడా ఉంటారు.
__[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చ]] • [[Special:Contributions/Mpradeep|+/-]] • [[User:Mpradeep/సంతకం|మా]])</small> 06:03, 5 నవంబర్ 2009 (UTC)


==మరికొంత <s>ఆధారం</s>అయోమయం==
==మరికొంత <s>ఆధారం</s>అయోమయం==

06:03, 5 నవంబరు 2009 నాటి కూర్పు

Good work! — వీవెన్ 14:00, 20 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

సత్యా గారు ముందు నాకు అర్థం అయ్యింది కాదు. బొమ్మ ఏమిటి అని అనుకొన్నాను. కాని ఇది చాలా మంచి ఆలోచన, ప్రక్క ప్రక్క ఉండి రాయడానికి చాలా అనువుగా ఉంది. మీ శ్రమ కు అభినందనలు.--మాటలబాబు 14:18, 20 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నేన్నది ఏకవచన ప్రయోగం గురించి మంచి ఆధారం సంపాదించినందుకు.--వీవెన్ 14:24, 20 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఏమిటో నా బుర్ర అసలు పని చేయదు. బొత్తిగ నాకు మెదడు లేదు.--మాటలబాబు 15:51, 20 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

శైలి

రవీ, దీన్ని మన వికీపీడియా:శైలి పేజీలో పెడితే బాగుంటుంది. దీనిలో ఇంకా ఏమైనా మార్పు చేర్పులు చెయ్యదలచారా? __చదువరి (చర్చరచనలు) 16:48, 20 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అవును "శైలి మాన్యువల్"లో పెట్టండి. కాని శైలి విషయంలో నాకు ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.
  • "లక్ష్మణరావు ఇలా అన్నాడు" - అని వ్రాయడానికి అలవాటు పడ్డాను (నేను మొదట్లో వ్రాసిన మహాత్మా గాంధీ వ్యాసం చూస్తే ఈ సమస్య అర్ధమౌతుంది.)
  • "అతను చెప్పాడు" అని వ్రాయటంలేదు. "ఆయన చెప్పాడు" అని వ్రాస్తున్నాను. తెలుగు భాషకు ఇదే అనువనిపిస్తుంది. అంతే కాక ఒకసారి చదువరి ఉదాహరించిన హిందీ వికీ చర్చలో కూడా "ఆయన చెప్పాడు" తరహాలోనే వ్రాయడాన్ని సమర్ధించారు. ఏమయినా ఈ విషయంలో శైలి సూచనలను మరొకసారి పునఃపరిశీలించండి.

--కాసుబాబు 17:05, 20 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నేను శైలిలో పెట్టడానికే ఈ వ్యాసాన్ని తయారు చేస్తున్నాను. సరైన పేరు తోచితే..దీన్ని అక్కడికి తరలించి మీరూ తగిన మార్పులు చేర్పులు చేయండి. దీనిలో కొంత పత్రికలకు, విజ్ఞాన సర్వస్వాలు ఇదే విషయాన్ని ఎలా వేరువేరుగా డీల్ చేస్తాయి అని పోల్చి చూపిద్దామనుకుంటున్నా..ఇంక కొంత వివరణ కూడా ఇవ్వాలి. ఎవరు రాసినా ఓకే
కాసుబాబు గారూ మీరన్న విషయం నాకూ ఈ బొమ్మలు తయారు చేస్తూ ఈరోజే వెలిగింది..నేనూ చాలాసార్లు (చాలాసార్లేంటి..అన్నిసార్లూ) ఆయన..ఆవిడ ప్రయోగించాను. ఒక స్థాయిని చేరిన తర్వాత..తెవికీని సాంప్రదాయ విజ్ఞానసర్వస్వాలతో పోల్చటం ప్రారంభిస్తారు..ఇప్పుడు కొంచెం కష్టమైనా..అప్పుడు శైలి ప్రామాణికంగా ఉంటే బాగుంటుంది..ఏదేమైనా నాకంగీకారమే.
వీవెన్, మాటలబాబు అభినందనలకు కృతజ్ఞతలు..చాలా రోజులనుండి ఇలాంటి ఒక పేజీ చేయాలని ఆలోచన ఉన్నది..కానీ బద్దకించా..ఇక ఈ రోజు నాగార్జున సాగర్ వ్యాసంలో ఒక సభ్యుడు ఈ విషయంలో చేసిన మార్పులు చూసి..ఇక లాభంలేదని ఇలా ప్రారంభించా. --వైజాసత్య 19:22, 20 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఆయన, ఆమె అనడంలో శైలి భంగం లేదేమో!!? అవి వాడడం సబబే ననుకుంటున్నాను! నేననేది తప్పైతే సవరించగలరు. __చదువరి (చర్చరచనలు) 10:32, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నాకు కూడా అలాగే అనిపిస్తుంది; అతడు(అతగాడు), అది, అని బదులుగా ఆయన, ఆమె కొంచెం బాగున్నాయి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 10:43, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఒకే! అయితే ఆమె, ఆయన, ఈయన, ఈమె పదాలను ఇక్కడ వాడటానికి అంగీకరిద్దామా? --వైజాసత్య 10:59, 21 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]


ఎలా వ్రాస్తె బాగుంటుంది

( వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడం నుండి ఇక్కడికి ఈ వ్యాఖ్య కాపీ చేశాను - --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:53, 28 మార్చి 2008 (UTC) )[ప్రత్యుత్తరం]

ఎవరి గురించి అయినా వ్రాసెటప్పుడు, ఆయన వచ్చాడు అని వ్రాయటం బాగుండదు. ఆయన వచ్చారు ఒని వ్రాస్తె బాగుంటుంది."అతను" అనివ్రాయటం బాగుండదు."ఆయన" అని వ్రాస్తెనె బాగుంటుంది. అలాగె, స్తీ గురించి వ్రాసెటప్పుడు, ఆవిడ "వచ్చింది" బదులు ఆవిడ "వచ్చారు" అని వ్రాస్తె బాగుంటుంది."ఆమె" బదులుగా "ఆవిడ" అని రాస్తెనే మర్యాదపూర్వకంగ ఉంటుంది.--SIVA 14:45, 9 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఏక వచన ప్రయోగం

ఈ విషయం గురించి తప్పకుండా మరికొంత చర్చ కొనసాగాలి. మనకున్న మహా నాయకులు, రచయితలు, నటుల గురించి వ్రాసేటప్పుడు, "అతను" వచ్చాడు" అని వ్రాయటం ఎబ్బెట్టుగా ఉన్నది. దిన పత్రికలలో కూడా చూస్తుంటాము, ఏ విశ్వనాధ సత్యనారయణగారి గురించో వ్రాసేటప్పుడు "అతను" అని, ఏ నక్సలైటు నాయకుడి గురించి వ్రాసేటప్పుడు "ఆయన" అని వ్రాస్తుంటారు. ఇలా వ్ర్రాయటం ఆ పత్రికల సంపాదకీయ విధానమో లేక ఆ వ్రాసిన విలేఖరి యెక్క సొంత ఇష్టాఇష్టాలమీద ఆధారపడి ఉంటుందో తెలెయదు. ఆంగ్ల భాషలో వ్యక్తుల గురించి, ఏకవచన ప్రయోగం మానేసి శతాబ్దాలవుతోంది( thou art లాంటివి). దీని వల్ల ఇప్పుడు ఆంగ్ల భాషలో అసలు ఏక వచన ప్రయోగం లేదనుకొంటున్నారు. మన తెలుగులో అలా వ్యక్తుల గురించి వ్రాసేటప్పుడు ఏకవచన ప్రయోగం కాకుండా (రాముడు వచ్చాడు అంటామా లేక రాముడు వచ్చారు అంటామా అనే వితండవాదనకు దిగకుండా{ఎందుకంటే రాములవారు వచ్చారు అనేవారు కూడా ఇప్పటికీ చాలామంది ఉన్నారు})బహువచనంలో వ్రాస్తే (వారు జీవించి ఉన్నాలేక స్వర్గస్తులయినాకూడా)మన సొమ్ము ఏమి పోయింది??? మనం ఇతరులను గౌరవిస్తున్నాము కదా అంతకన్నా ఇంకా ఏమీ చేయటంలేదుకదా!! తక్కువలో తక్కువ, బహువచనంలో ఎవరయినా వ్రాస్తే పట్టుబట్టి అదే పనిగా అన్నీ మార్చకుండా ఉంటే చాలు.--SIVA 18:53, 28 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటిగా, వికీపీడియా ఒక ఇంటర్నెట్టు పత్రిక కాదు. రెండోది ఏకవచన ప్రయోగాన్ని అగౌరవానికి సూచకంగా చూడరాదు. ఎవరయినా ప్రముఖుని గురించి రాసేటప్పుడు, మనకు ఆ వ్యక్తిపై ఉన్న గౌరవాన్ని ప్రదర్శించుకోవడానికే బహువచనాన్ని ప్రయోగిస్తాము. వికీపీడియాలో వ్యక్తుల గురించి రాసేటప్పుడు బహువచనంలో రాస్తుంటే, అది ఒక రకంగా మన సొంత అభిప్రాయాన్ని ఇతరులపై రుద్దుతున్నట్లవుతుంది. వికీపీడియాలో ఉన్న వ్యాసాలు, అభిప్రాయాలను పంచుకునే వేధిక కాదు. __మాకినేని ప్రదీపు (+/-మా) 03:38, 19 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఏకవచన ప్రయోగం అగౌరవం

ఏక వచనం ఉపయోగిస్త్తే అగౌరవమే. ఉదాహరణ: జయగోపాల్ ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఇక్కడ మీటింగ్ పెట్టాడు, అక్కడ మీటింగ్ పెట్టాడు అని వ్రాసామనుకుందాం. నిజంగా డా.జయగోపాల్ గారే ఆ పేజి చదివితే ఎలా ఉంటుంది? నన్ను ఏక వచనంతో సంభోదించే వాళ్ళు కూడా ఉంటారా అని అనుకుంటారు.

మీకు డా.జయగోపాల్ గారంటే గౌరముండచ్చు కానీ అందరినీ గౌరవించమని రుద్దటం అనవసరం. దాన్నే పాక్షికత అంటారు. ఇది వరకు తెవికీ నిష్పక్షపాత తటస్థ వైఖరిని అలవంబిస్తుందని చెప్పుకున్నాం కదా అది ఇక్కడ కూడా వర్తిస్తుంది. నేను చర్చాపేజీలలో ఎక్కడా మీమ్మల్ని ఏకవచనంతో సంబోధించలేదని గమనించండి. తెవికీ సభ్యులకు గౌరవం మర్యాద లేదని కాదు. --వైజాసత్య 15:38, 12 డిసెంబర్ 2008 (UTC)
డా.జయగోపాల్ గారితో వ్యక్తిగతంగా చనువుగా మాట్లాడిన నేనే అతన్ని ఏకవచనంతో సంభోదించలేదు. వేరే వాళ్ళు అతని పై ఏక వచన ప్రయోగం చెయ్యడం ఎలా ఉంటుంది?
జయగోపాల్ గారు ఆ పేజీ చదివితే చెడుగా భావించరనే నేను అనుకొంటాను. వ్యక్తిగత సంభాషణ వేరు. విజ్ఞానసర్వస్వం వ్యాసం వేరు. నేను పైన వ్రాసిన చర్చ కూడా ఒకమారు చూడగలరు. ఏకవచనం మొదట్లో నాకు ఇబ్బంది అనిపించింది కాని అలవాటయినాక ఏకవచనమే సరైనది అనిపిస్తుంది. ఇది తేలికగా తేలే విషయం కాదు. ఇందుకు ప్రమాణాలు లేవు. ఈ విషయంలో సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేదు గనుక ఇతరులు వ్రాసినవాటిని మార్చడంలేదు. కాని నేను పరిశీలించిందేమంటే "గారు" తొ మొదలై "శ్రీ .. గారు" నుండి "మాన్యశ్రీ శ్రీ శ్రీ .. జీ .. గారు" వరకూ ఈ గౌరవార్ధాలు సాగుతాయి. "మేడమ్ శ్రీ సోనియాజీ" అని కాంగ్రెసు నాయకులు సంబోధించడం ఎన్నిసార్లు చూడడంలేదు? ఏకవచనం పుట్టినప్పుడు పెట్టిన పేరు. గౌరవార్ధ తోకలు తరువాత తగిలించినవి. విజ్ఞాన సర్వస్వంలో వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండడమే మెరుగు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:13, 13 డిసెంబర్ 2008 (UTC)
నా దగ్గర పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ని నేను మీరు అని పిలుస్తుంటాను. ఆమె నా కంటే వయసులో చిన్నదో పెద్దదో నాకు తెలియదు. వయసు, హోదా లాంటి వాటితో పని లేకుండా అందరితో మంచిగా మాట్లాడుతుంటాను. చివరికి ఆటో డ్రైవర్ ని కూడా మీరు అని అంటుంటాను. నా వయసు 26 ఏళ్ళు. జయగోపాల్ గారి వయసు 70 ఏళ్ళకి పైనే. ఇంటర్నెట్ తెలిసిన వాడు మినిమమ్ టెంత్ క్లాస్ కుర్రాడైనా అయ్యుంటాడు. ఆ వయసులో ఉన్నవాళ్ళు 70 ఏళ్ళ వయసు వాళ్ళ పైన ఏకవచనం ప్రయోగించే పరిస్థితి ఉండకూడదు.
పొట్టకూటి కోసం ఆటో నడిపే ఆటో డ్రైవర్ ని నువ్వు అని పిలిచినప్పుడు అతనికి నచ్చకపోయినా బేరం వదులుకోలేక వస్తాడు. అయినా నేను ఆటో డ్రైవర్ ని మీరు అనే పిలుస్తాను. ఉద్యమాలలో పని చేసే వాళ్ళు అలా మనసు చంపుకోరు. పైగా నాస్తిక ఉద్యమం అనేది రాజకీయ పార్టీ లాంటిది కాదు. దీని వల్ల డబ్బేమీ రాదు, వ్యక్తిగత కీర్తి ప్రతిష్టలు కూడా రావు. అయినా ఓర్పుతో జయగోపాల్ గారు నాస్తిక ఉద్యమం నడుపుతున్నారు. ఏకవచనం ఉపయోగించి అతన్ని ఇన్సల్ట్ చెయ్యడం సరైనది కాదు.
విజ్ఞానసర్వస్వానికి వయసుండదు. దానికి రాజు, పేద, చిన్నా, పెద్దతో సంబంధంలేదు. మనుషులు వస్తుంటారు, పోతుంటారు. --వైజాసత్య 04:30, 14 డిసెంబర్ 2008 (UTC)

తెలుగు వ్యాకరణం

డు ము వు లు ప్రధమా విభక్తి.నామవాచకాలన్నీడు ము వు ల తోటే ముగుస్తాయి.రాముడు భీముడు లాగా.కానీ కాలక్రమేణా ఈ పిలుపులను ప్రజలు అగౌరవసంబోధకాలుగా పరిగణిస్తున్నారు కాబట్టి తెలుగు వ్యాకరణసుత్రాలను నేటికాలానికి తగ్గట్లు రు,ను,ము, వు, లుగా మార్చాలని కొందరు వాదిస్తుంటే,దాడి వీరబధ్రరావు లాంటికొందరు అసలు తెలుగు వ్యాకరణాన్నే తీసెయ్యండి భాషా సూత్రాలు ప్రజల వాడుకవల్ల వాటికవే ఏర్పడుతుంటాయి అంటున్నారు. --Nrahamthulla 07:28, 13 డిసెంబర్ 2008 (UTC)

పునః పరిశీలించాలి

మనం ఈ పాలసీని ఉంచాలా వద్దా అని మళ్లీ ఇంకో సారి పరిశీలించాలి. ముఖ్యంగా తెలుగులోని మొదటి విజ్ఞాన సర్వస్వాన్ని ఆధారంగా అసలే వాడకూడదనుకుంటా. అందుకు ఉదాహరణ: అప్పారావు నడవడికను చాలా రసికతకు ఔదార్యమునకు పేరుపడినవాఁడు. సమాజమున తన ప్రతిభచేతను, మంచితనముచేతను, చమత్కారకలిత మగు సంభాషణముచేతను చాలా చిత్తాకర్షణము చేయువాఁడు. ఈ వాక్యంలో ఏకవచణ ప్రయోగం ఉన్నా కూడా అగౌరవ పరుస్తున్నట్లు అనిపించదు. ఇప్పుడు ఇదే వాక్యాన్ని ఈ కాలపు తెలుగులో ఏకవచన ప్రయోగం వాడి రాస్తే, అప్పారావుకు నడవడిక, రసికతక, ఔదార్యం వలన మంచి పేరుంది. సమాజంలో అతని ప్రతిభకు, మంచితనానికి, చమత్కారభరిత సంభాషణానికి అందరి మన్ననలను పొందాడు. రెండింటిలోనూ ఏకవచన ప్రయోగం ఉన్నాకూడా, మొదటిదాంట్లో సంభోధం అగౌరవంగా అనిపించడంలేదు, కానీ రెండో దాంట్లో మటుకు 'డు' అని అంటున్నప్పుడు అగౌరవంగా ద్వనిస్తుంది. కారణం మొదటి విజ్ఞాన సర్వస్వం కొంత గ్రాంధికంలో ఉంది కాబట్టి. గ్రాంధికంలో ఏకవచనం అగౌరవంగా లేదా అసభ్యంగా అనిపించదు.

తటస్థదృక్కోణం వలన అక్కరలేని గౌరవం ఇవ్వకూడదు, అలాగే అగౌరవంగా కూడా ద్వనించకూడదు కదా... అలాగే చనిపోయిన వారిని ఏకవచనంలో ప్రయోగిస్తాము అనే దాంట్లో కూడా అంత తార్కికత లేదు అనుకుంటా. మనం పక్కనున్న వ్యక్తితో పీవీ.నరసింహారావుగారు చనిపోయారు అని అంటాను కానీ చనిపోయాడు అని మాత్రం అనను. ఇంకో ఉదాహరణ: నాకు ఇష్టంలేని వ్యక్తులు చనిపోయినప్పుడే నేను చనిపోయాడు (ఏకవచణం అని గమనించండి) అని అంటూ ఉంటాను, కానీ నాకు ఇష్టం అయిన వారి గురించి, ఎటువంటి అభిప్రాయం లేని వారి గురించి కూడా వారు, వీరు అనే సంభోదిస్తాను. మీ అభిప్రాయాలు తెలుపగలరు. __మాకినేని ప్రదీపు (+/-మా) 08:17, 1 నవంబర్ 2009 (UTC)

మీ అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తాను. —రవిచంద్ర (చర్చ) 15:01, 1 నవంబర్ 2009 (UTC)
మనకు వ్యవహారికంలో (వార్తాపత్రికల్లో) భాషలో సామాజిక స్థాయిని బట్టి కూడా ఏకవచన, బహువచన ప్రయోగాలు కనిపిస్తాయి. ఉదాహరణ మీరన్నట్టు పి.వీ.నరసింహారావు గారు అని ప్రయోగిస్తారు. అంతెందుకు, మామూలు చిన్నచితకా అధికారులకు కూడా గారు అని ప్రయోగిస్తారు. కానీ ఏ కూలీ"వాడి" (చూశారా అప్పుడే ఎంతతేడా ధ్వనిస్తుందో) గురించో, కార్మికుని గురించో అయితే ఏకవచనం చక్కా ప్రయోగించేస్తాం. అంటే వ్రాసేవారి దృష్టిలో ఆ ఏదుటి వ్యక్తి ఎంతస్థాయో దాన్నిబట్టి ఏకవచన, బహువచన ప్రయోగాలు సంభవిస్తాయి. కాబట్టి బహువచన ప్రయోగం చాలా కష్టం. --వైజాసత్య 02:35, 2 నవంబర్ 2009 (UTC)
కొంతమందిని వాడు, వీడు అని మనం వ్యవహారికంగా అంటూవుంటాము కాబట్టి, అందరినీ ఏకవచన ప్రయోగంతోనే సంభోదిస్తున్నాం. ఈ వాదనను ఇంకో విధంగా చూద్దాం... కొంతమందిని గౌరవ సూచకాలతో పిలుస్తున్నాం కాబట్టి, అందరికీ అదే వర్తింపజేసి గౌరవ సూచకాలతో పిలుద్దాం. కూలీ అనేది ఒక వృత్తిపేరు. ఆ వృత్తి చేస్తున్న వ్యక్తి గురించి వ్యాసం రాస్తున్నప్పుడు గౌరవ సూచకాలు వాడొచ్చనుకుంటా. __మాకినేని ప్రదీపు (+/-మా) 05:08, 2 నవంబర్ 2009 (UTC)
ప్రదీప్ గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇంగ్లీషు వికీతో కొన్ని విషయాలలో మనం విభేధిస్తే తప్పుకాదు తప్పులేదు. తెలుగు సంస్కృతిలో పెద్దవారిని, స్త్రీలను, విద్యావేత్తలను, గురువులను ఇంకా విస్తృతంగా చెప్పాలంటే ఇతరులను అందరినీ ఏకవచనంతో సంబోధించడం నా ఉద్దేశంలో, మరియు విజ్ఞానుల అభిప్రాయంలో అగౌరవ పరచడమే అని భావిస్తారు. వీరందరినీ బహువచనంలో సంబోధించడం సమంజసం అని, అంతకు ముందు జరిగిన చర్చను పునఃపరిశీలించి అభిప్రాయాన్ని మార్చితే బాగుంటుందని నా గాఢ విశ్వాసంRajasekhar1961 04:20, 2 నవంబర్ 2009 (UTC)
ఈ విషయంపై మరింత లోతుగా చర్చించేముందు ఈ విషయంపై నాకెలాంటి శాసనాధికారాలు కానీ, ఈ విషయంపై పాండిత్య స్థాయి అవగాహాన కానీ లేవని, ఏ పద్ధతి సరైనదో ఖచ్చితంగా నాకూ తెలియదని చెప్పదలచుకొన్నాను.
  1. ప్రదీపు గారూ, ఏకవచన ప్రయోగం గ్రాంధికం కనుమరుగైన ఆధునిక కాలంలో (80,90వ దశకాల్లో) కూడా విజ్ఞానసర్వస్వాల్లో ఏకప్రయోగించారని చెప్పటానికే అక్కడ రెండవ ఉదహారణ (టోనీ మారిసన్ గురించినవ్యాసం) ఇవ్వబడింది.
  2. మీరు గ్రాంథికాన్ని వ్యవహారికంలో వ్రాసి అసభ్యంగా ధ్వనించింది అన్న వాక్యాన్ని రెండు, మూడు సార్లు చదివినా అది నాకు అసభ్యంగా అనిపించలేదు. నిజానికి గ్రాంథికంలోని వాక్యమే నాకు ఇంకా ఎబ్బెట్టుగా తోచింది (దానికి కారణం ఆ వాక్యంలో డు అనే విభక్తితో కాకుండా ఏకంగా వాఁడు అంటు స్పష్టంగా పలికించడం అనుకుంటా). ఇలా ఒక్కో వాక్యాన్ని ఎండగట్టినా ఆ వాక్యంలో అసభ్యత ధ్వనిస్తుందాలేదా అన్నది వ్యక్తిగత అభిరుచి అని మాత్రం చెప్పగలను. (ఈ వ్యక్తిగత అభిరుచులను సామాజిక, ప్రాంతీయతలు కొంత ప్రభావితం చేస్తాయనుకోండి)
  3. ఇష్టంలేని వ్యక్తులు చనిపోయినప్పుడు ఏకవచనం ప్రయోగించడం కూడా వ్యక్తిగత/ప్రాంతీయ అభిప్రాయమేమో. మళ్లీ నా ఉదాహరణే తీసుకుంటే నేను పెరిగిన ప్రాంతంలో ఆత్మీయులని బహువచనంతో ప్రయోగించే అలవాటులేదు. బహువచనం ప్రయోగించారంటే గౌరవమిస్తూనే మీకు, మాకు మధ్య కొంత దూరముందని చెప్పినట్టవుతుంది. అందుకే ఈ జీవితంలోనూ, పైజీవితంలోనూ ఎప్పుడూ నాన్నని బహువచనంలో పిలవరు. "నాన్నగారు చనిపోయారు" అని అనకపోయినా, "నాన్నగాడు చనిపోయాడు" అనిమాత్రం అనరు. మా ప్రాంతంలో సాధారణ వాడుకేంటంటే "నాన్న చనిపోయాడు" (ఇది వికీపీడీయాలో నియమానికి కాదండి..కేవలం ప్రాంతీయ బేధాలను చెప్పటానికే) - ఇప్పుడు గురజాడ గ్రాంథికవాక్యం నాకు ఎబ్బెట్టుగా ఎందుకు తోచిందో మీకు అర్ధం అయ్యుంటుంది.
  4. రాజశేఖర్ గారూ, ఇంగ్లీషు వికీపీడీయాకి ఇలాంటి చిక్కేలేదండి. వాళ్ళకి మనలాగా బహువచన, ఏకవచన వ్యవహారాలే లేవు కదా. అందర్నీ హి, షి అని పిలిచెయ్యటమే! అవును మన సంస్కృతిలో పెద్దవారిని గౌరవించాలి కానీ అప్పుడు ఎందుకు పెద్దవారు, ఎవరికంటే పెద్దవారు అన్న సవాలక్ష చిక్కులొస్తాయి. వీటిని ప్రదీపుగారు పైనే ఏకరువుపెట్టారు.
  5. అయితే దొంగల్ని, దొరల్ని ఒకేగాటిన కట్టి ఏకవచనం ప్రయోగించడం కంటే అందరికీ బహువచనం ఎందుకు ప్రయోగించకూడదు అని ప్రదీపు గారు అడుగుతున్నారు. నాకు సమాధానం తెలీదు. --వైజాసత్య 09:30, 3 నవంబర్ 2009 (UTC)
ఇది ఈ రోజు ఈనాడు పత్రికలోని అనంతపురం జిల్లా సంచిక అధికారుల గురించి వ్రాయటానికి ఎలా బహుప్రయోగమున్నూ, సాధారణ వ్యక్తుల గురించి వ్రాసేటప్పుడు ఎలా ఏకవచనానికి మారారో గమనించండి --వైజాసత్య 09:55, 3 నవంబర్ 2009 (UTC)


ఈ చర్చ అంత తేలికగా ఒక కొలిక్కిరాదు. రానక్కరలేదుకూడాను. నాకు తోచిన విషయాలు మరికొన్ని

  1. వైజాసత్య అన్నట్లుగానే నేను చాలా టి.వి. ఛానళ్ళలో చూశాను. సామాన్య వ్యక్తులతో మాట్లాడేటపుడు రిపోర్టర్లు ఏకవచన ప్రయోగం వాడుతున్నారు. నేను కూడా బస్ కండక్టరును మీరు అని, రిక్షా"వాడి"ని నువ్వు అని పిలుస్తుంటాను.
  2. తెలుగులో ఈ వచన వ్యత్యాసం తెలుగు భాషకున్న ఒక అదనపు అందం అని, సందర్భోచితంగా దానిని వాడవచ్చునని, అందువలన మన జర్నలిజమ్‌లో క్రొత్త సొంపులు వస్తాయని విద్వాన్ విశ్వం (లేదా నార్ల) వ్రాసిన ఒక వ్యాసం నేను చాలా కాలం క్రితం చదివాను. కాని జర్నలిజమ్ శైలి విజ్ఙానసర్వస్వం శైలి ఒకటి కాదు. మరియు ప్రస్తుత మన పత్రికారంగంలోను, టెలివిజన్ రంగంలోను తెలుగు చాలా అధోగతిలో ఉంది. అది మనకు మార్గదర్శకంగా తీసుకోనక్కరలేదు.
  3. మొదట్లో ఏకవచన ప్రయోగం నాకు చాలా కష్టమనిపించింది. కాని తరువాత అలవాటయింది.
  4. వికీలో ఏకవచన ప్రయోగాన్ని కొందరు సభ్యులు, సందర్శకులు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు.
  5. ఈ విషయంలో ప్రమాణాలు మనకు అందుబాటులో లేవు. ఉన్నరెండు ప్రమాణాలు ఏకవచన విధానాన్ని సమర్ధిస్తున్నాయి. మరియు "తటస్థత" విషయంలో కూడా ఏకవచన విధానానికే మొగ్గు కనిపిస్తుంది అని నేను అనుకొంటున్నాను.
  6. నన్నయ, తిక్కనలకు (చారిత్రిక వ్యక్తులకు) ఏకవచనం అలవాటులో ఉంది. కనుక జీవించి ఉన్నవారికి కూడా అదే వర్తింపజేయడం లాజికల్ అనిపిస్తుంది. ఎందుకంటే విజ్ఞాన సర్వస్వం పది కాలాలపాటు (ఇప్పుడు జీవించి ఉన్నవారి జీవితకాలంకంటే ఎక్కువ) ఉండాలని మన ప్రయత్నం కదా!

అస్తు - --కాసుబాబు 18:59, 3 నవంబర్ 2009 (UTC)

ఏకవచనం, బహువచనంలలో ఏది వాడిననూ అది గౌరవం లేదా అగౌరవం కిందికి రాదు. అంతమాత్రానికి ప్రస్తుతం అమలులో ఉన్న పద్దతిని మార్చాల్సి ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఎవరో ఒకరు మన తెలుగు వికీపీడియన్లను ఈ విషయంలో దుమ్మెత్తిపోసినంత మాత్రాన మనం అతని వ్యాఖ్యలకు నిరుత్సాహపడనక్కరలేదు. ప్రారంభం నుంచి కొనసాగుతున్న పద్దతిని విస్మరించి మరోమార్గంలోకి పోయేటంతటి అవసరం మరియు సరైన కారణమేమీ నాకు కనిపించుటలేదు. ఈ విషయంలో నేను నా అభిప్రాయాలను చెప్పదలుచుకున్నాను.
1) తెవికీలో అందరినీ ప్రస్తుతం ఏకవచనం ఉపయోగిస్తున్నాము. అలా కాకుండా కొందరిని ఏకవచనంలో మరి కొందరిని బహువచనంలో ఉపయోగిస్తే బాగుండదు. పిల్లలను సాధారణంగా బహువచనంలో ప్రయోగించం. అతడు పాఠశాలకు పోయాడు అంటాం కాని పోయారు అనము, అతనికి పిల్లవాడు పుట్టాడు అంటామే కాని పిల్లవారు పుట్టారు అని అనం.
2) భగవంతులనే ఏకవచనంలో ప్రయోగిస్తున్నప్పుడు సాధారణ మానవులను తప్పనిసరిగా బహువచనంలో పిలువాలనే నిబంధన అవసరం లేదు.
3) వైజాసత్యగారు చెప్పినట్లు కుటుంబంలో పెద్దవారిని వారి కుటుంబ సభ్యులే బహువచనంలో పిలవడం జరుగదు. అయిననూ అది తప్పు కానప్పుడు తెవికీలో తప్పెలా అవుతుంది.
4) ఒక వ్యక్తిని 4 రకాలుగా పిలువవచ్చు. 1.ఎక్స్ వచ్చారు, 2.ఎక్స్ వచ్చాడు, 3.ఎక్స్ గారు వచ్చారు, 4.ఎక్స్ గాడు వచ్చాడు. తటస్థ దృక్కోణం వల్ల గౌరవం ఇవ్వకూడదు మరియు అగౌరవంగా ధ్వనించకూడదు కాబట్టి 3,4 తొలిగిద్దాం, ఇక మిగిలింది 1,2 లే కదా. కాబట్టి రెండూ సమానమే రెండోదీ వాడవచ్చు. నాకు తెలిసిన/ తిరిగిన ప్రాంతాల గురించి చెప్పాలంటే గ్రామీణ ప్రజలే కాకుండా పట్టణవాసులు కూడా ఏకవచనంలో ప్రయోగిస్తారు. సభలు, సమావేశాలలో కూడా వేదికపై ఉన్న పెద్దలను కూడా ఏకవచనంలోనే పేర్కొంటారు. ఇక్కడ ఇది సామాన్యమే.
5) కొన్ని వాక్యాలు బహువచనంలో వాడితే ఎబ్బెట్టుగా ఉంటుంది మరియు వాక్యం తప్పు అవుతుంది కూడా. ఉదా: పాలవాడు వచ్చాడు అనే బదులు పాలవాడు వచ్చారు అని అనం కదా. అలాగే కూరగాయలమ్మే మనిషి వచ్చింది అంటాం దీనికీ బహువచనం పనికిరాదు. తెవికీలో ఇలాంటి వాక్యాలు వ్రాసేటప్పుడు బహువచనం ఎలా ప్రయోగిస్తాం! ఇంకోటి ఏరా తీసుకొచ్చావా? అంటే అతనికే అడుగుతున్నట్లు ప్రశ్న ఉంది. అదే బహువచనం ఉపయోగిస్తే ఆ పని అతనికే అప్పగించామా లేక ఇతరుల పని గురించి అతనికి అడుగుతున్నామా అనేది అర్థం కాదు.
6) మరోముఖ్యవిషయం, ప్రస్తుతం మనం ఒకే విమర్శను ఎదుర్కొంటున్నాం, దానికీ సమాధానం ఇస్తున్నాం (ఏకవచనం అనేది తెవికీ నియమం), అది కూడా అలవాటుగా మారితే ఏమీ అనిపించదు, బహువచనంలోకి మారితే సవాలక్ష సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. -- C.Chandra Kanth Rao-చర్చ 20:01, 3 నవంబర్ 2009 (UTC)
నా తరపున (గౌరవసూచకాల బడి తరపున) ఇంకొంత వాదన :) మొదటగా నేను కూడా ఏకవచనవాదినే, అందుకు నాకున్న ఏకైక కారణం పాత వికీపీడియాలలో ఏకవచనం వాడటం. కానీ ఆలోచిస్తే...
  1. వ్యవహారికంలో మనకు ఎటువంటి పరిచయంలేని వ్యక్తితో మాట్లాడినప్పుడు తప్పనిసరిగా గౌరవవాచకాలను వాడతాము, అలా వాడకపోతే నేనయితే అగౌరవ పరుస్తున్నట్లే అనుకుంటాను.
  2. "ఎక్స్ వచ్చారు", "ఎక్స్ వచ్చాడు" రెండూ ఒకటే ఎలా అవుతాయి, మొదటి దానితో సంభోదిస్తున్నప్పుడు గౌరవసూచకంగా ఉంది.
  3. వేదిక మీద పెద్దలను ఏకవచన ప్రయోగాలతో పిలవడం నేనయితే ఎప్పుడూ చూడలేదు.
  4. తల్లితండ్రులను ఏకవచనంతో సంభోధిస్తున్నప్పుడు అక్కడ ఆత్మీయత లేదా వారితో ఉన్న దగ్గరితనం వలన అలా సంభోదిస్తాము. ఈ లాజిక్కుని వ్యక్తుల వ్యాసాలకు కూడా ప్రయోగించలేమనుకుంటా. వ్యక్తుల వ్యాసాలు చదువుతున్న వారికి, ఆ వ్యక్తుల మీద అలాంటి ప్రేమను కలిగించనవసరం లేదనుకుంటా, అది కూడా POV కిందకు వస్తుందేమో. అదే వ్యాసాలలో వ్యాసాలలో గౌరవసూచకాలు వాడితే, వ్యాసం ఇంకా formalగా ఉంటుంది అని కూడా నా అభిప్రాయం.
  5. "పాలవాడు వచ్చాడు", "కూరగాయలమ్మే మనిషి వచ్చింది"; లాంటి ప్రయాగాలు (అంటే ఫలానా వృత్తి చేసుకునే వాళ్లలో ఒక వ్యక్తి ఫలా పని చేసాడు) వికీపీడియాలో వాడే సందర్భం ఏముంటుంది?
  6. అందరూ నన్నయ గారు, తిక్కన్న గారు, రాములవారు అంటూ సంభోదించే వాళ్లు కూడా ఉంటారు.

__మాకినేని ప్రదీపు (+/-మా) 06:03, 5 నవంబర్ 2009 (UTC)

మరికొంత ఆధారంఅయోమయం

ఏది సరైన పద్ధతి అని వెతికే ప్రయత్నంలో నాకిది కనిపించింది. 1994లో ముద్రితమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నాలుగవ తరగతి తెలుగు వాచకంలో వివేకానందుడి పాఠం. ఈ పుస్తకం సంపూర్ణంగా ఇక్కడ లభ్యమౌతుంది. ఈ పుస్తకంలో వివేకానందుడికి ఏకవచనమూ, వీరేశలింగం పంతులు పాఠంలో బహువచనమూ, మరలా రుద్రమదేవి పాఠంలో ఏకవచనమూ ప్రయోగించారు. :-( --వైజాసత్య 05:30, 4 నవంబర్ 2009 (UTC)