గణపతి దేవుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 23: పంక్తి 23:
==సైనిక పాలన==
==సైనిక పాలన==
==సాంఘిక పరిస్థితులు==
==సాంఘిక పరిస్థితులు==
==వర్తకము==
రాజ్యములో వ్యవసాయము ముఖ్య వృత్తి ఐననూ దేశవిదేశములతో వాణిజ్యము ఎన్నోవిధముల అబివృద్ధి చెందింది. మోటుపల్లి, మసులీపట్టణం ముఖ్యమైన ఓడ రేవులు. ఛైనా నుండి పట్టు వస్త్రములు దిగుమతి అయ్యేవి. మోటుపల్లి నుంది వజ్రాలు, దంతము, ముత్యాలు రోం నగరము వరకు ఎగుమతి చేయబడేవి. కాకతీయ సామ్రాజ్యములో వజ్రాలు సేకరించు విధి విధానాలు మార్కో పోలో చాలా వివరముగా వ్రాశాడు<></>. మసులీపట్టణమునుండి విలువైన మస్లిన్ వస్త్రాలు, అద్దకము చేయబడిన వస్త్రాలు, ఓరుగల్లులో నేయబడిన తివాచీలు, ఉన్నిదుస్తులు ఎగుమతి అయ్యేవి. కూనసముద్రము దగ్గరలోని నిర్మల నుండి ఇనుప ఖనిజము, సముద్ర తీర ప్రాంతములో చేయబడిన ఉప్పు కూడ ఎగుమతి అయ్యేవి.


==గణపతిదేవుని శాసనాలు==
==గణపతిదేవుని శాసనాలు==

10:08, 8 జనవరి 2010 నాటి కూర్పు

కాకతీయ రాజులలో గొప్ప చక్రవర్తి గణపతి దేవుడు. 6 దశాబ్దాల పాటు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. తెలుగు నాటిని ఏకము చేసి తెలుగు వారందరినీ ఒక గొడుగు క్రిందకి తెచ్చిన మహనీయులలొ కాకతీయ గణపతిదేవుడు ఒకడు (మిగిలిన వారు గౌతమీపుత్ర శాతకర్ణి, ముసునూరి కాపానీడు, శ్రీకృష్ణదేవరాయలు).

కాకతీయ సామ్రాజ్యం
ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక భాగం
కాకతీయ పాలకులు
కాకతి వెన్నయ 750-768
మొదటి గుండయ 769-824
రెండవ గుండయ 825-870
మూడవ గుండయ 870-895
ఎఱ్ఱయ 896-925
మొదటి బేతరాజు 946-955
నాల్గవ గుండయ 956-995
గరుడ బేతరాజు 996-1051
మొదటి ప్రోలరాజు 1052-1076
రెండవ బేతరాజు 1076-1108
దుర్గరాజు 1108-1115
రెండవ ప్రోలరాజు 1116-1157
గణపతి దేవుడు 1199-1262
రుద్రమ దేవి 1262-1289
ప్రతాపరుద్రుడు 1289-1323

‡ రాణి

ఇతరులు
మాలిక్ మక్బూల్
నిర్మాణాలు
*వరంగల్ ఖిల్లా
*వేయి స్తంభాల గుడి
*రామప్ప దేవాలయం
మార్చు

దేవగిరి ఏలుతున్న యాదవ రాజు జైత్రపాలుడు 1195 లో కాకతీయ రుద్రదేవుని వధించి గణపతిదేవుని బంధిస్తాడు. రుద్రదేవుని తమ్ముడు మహాదేవుడు ఓరుగల్లు సింహాసనమెక్కి మూడు వర్షములు (1196-1198 CE) పాలిస్తాడు. 1198లో గణపతిని విడిపించుటకు దేవగిరిపై దండెత్తి విజయము సాధిస్తాడు కాని తన ప్రాణాలు కోల్పోతాడు. మహాదేవుని మరణానంతరము రాజ్యములో అరాచకము చెలరేగుతుంది. మహాదేవుని కుమారుడైన గణపతిదేవుడు 1198లో రాజ్యానికి వస్తాడు.[1]సేనాధిపతి రేచెర్ల రుద్రుడు తన శక్త్తియుక్తులు ధారపోసి రాజ్యము చక్కదిద్దుతాడు. గణపతిదేవుడు పాలించిన 62 సంవత్సరములు తెలుగు దేశ చరిత్రలో కొనియాడదగినవి. ఇతని పాలనలో రాజ్యవిస్తరణకు, వర్తకానికి ప్రాముఖ్యతనిచ్చాడు.[2]

పాలనా విధానం

కాకతీయ గణపతిదేవుడు రాజ్యానికి రాకముందు 12 సంవత్సరాలు దేవగిరి యాదవుల వద్ద బందీగా ఉన్నాడు. ఈ కాలంలో సామతరాజులు ఎన్నో తిరుగుబాట్లు చేశారు. ఈ తిరుగుబాట్లను సేనాని రేచర్ల రుద్రుడు అణచివేశాడు. విడుదలైన పిదప రేచర్ల రుద్రుడు కాకతీయ రాజ్యాన్ని గణపతిదేవుడికి అప్పగించాడు. గణపతిదేవుని పాలనలో వ్యవసాయము మరియు వర్తకాలు బాగా వృద్ధిచెందాయి. గణపతిదేవుడు వర్తకులకు ప్రాత్సహించాడు. మోటుపల్లిలో వేయించిన అభయశాసనం దీనికి నిదర్శనం. గణపతిదేవుడు కాకతీయ రాజధానిని హన్మకొండ నుండి ఓరుగల్లుకు మార్చినాడు. వ్యవసాయము వృద్ధిచెందడానికి నీటిపారుదల కల్పించుటకు ఇతని సేనాని పాకాల చెరువును కట్టించాడు. మరో సేనాని గౌండ సముద్రాన్ని నిర్మించాడు.

రాజ్యవిస్తరణ

తీరాంధ్రవిజయము

గణపతిదేవుడు రాజ్యవిస్తరణకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఇందుకోసం సైనిక బలంపైనే కాకుండా సరిహద్దు రాజ్యాల రాజకుటుంబాలతో సంబంధాలుపెట్టుకున్నాడు. 1212లో తూర్పు తీరంపై దండయాత్ర చేసి కృష్ణా, గోదావరి గుంటూరులను స్వాధీనం చేసుకున్నాడు.నిడదవోలును పాలిస్తున్న వేంగీచాళుక్య రాజు వీరభద్రుడికి తన కూతురు రుద్రమదేవినిచ్చి వివాహం చేశాడు. మరో కూతురు గణపాంబను ధరణికోట రాజు బేతరాజుకు ఇచ్చి వివాహం జరిపించాడు. కమ్మనాడును పాలిస్తున్న జాయప్పసేనాని ఇద్దరు చెల్లెళ్ళను వివాహమాడి జాయపను ఓరుగల్లుకు రప్పించి గజసేనానిగా నియమించుకుంటాడు. నెల్లూరును జయించి మనుమసిద్ధికి ఇచ్చాడు. దాదాపు రాయలసీమ మొత్తం గణపతిదేవుని పాలనలోకి వచ్చింది. శాతవాహనుల అనంతరం తెలుగు ప్రాంతాన్నంతటినీ ఏకఛత్రాధిపత్యంలోకి తెచ్చినాడు.[3] గణపతి దేవునికి కుమారులు లేనందున ఇతని అనంతరం కూతురు రుద్రమదేవి అధికారంలోకి వచ్చింది.[4]

దక్షిణదేశ దండయాత్ర

కొలను విజయము

పశ్చిమాంధ్ర యుద్ధము

పాండ్య రాజ్య విజయము

సామంతరాజులు

రేచెర్ల నాయకులు

మల్యాల నాయకులు

అయ్య వంశస్థులు

తెలుగు చోళులు

పొత్తాపి నాయకులు

అద్దంకి నాయకులు

నిడదవోలు చాళుక్యులు

రాజ్య పాలన

సైనిక పాలన

సాంఘిక పరిస్థితులు

వర్తకము

రాజ్యములో వ్యవసాయము ముఖ్య వృత్తి ఐననూ దేశవిదేశములతో వాణిజ్యము ఎన్నోవిధముల అబివృద్ధి చెందింది. మోటుపల్లి, మసులీపట్టణం ముఖ్యమైన ఓడ రేవులు. ఛైనా నుండి పట్టు వస్త్రములు దిగుమతి అయ్యేవి. మోటుపల్లి నుంది వజ్రాలు, దంతము, ముత్యాలు రోం నగరము వరకు ఎగుమతి చేయబడేవి. కాకతీయ సామ్రాజ్యములో వజ్రాలు సేకరించు విధి విధానాలు మార్కో పోలో చాలా వివరముగా వ్రాశాడు<></>. మసులీపట్టణమునుండి విలువైన మస్లిన్ వస్త్రాలు, అద్దకము చేయబడిన వస్త్రాలు, ఓరుగల్లులో నేయబడిన తివాచీలు, ఉన్నిదుస్తులు ఎగుమతి అయ్యేవి. కూనసముద్రము దగ్గరలోని నిర్మల నుండి ఇనుప ఖనిజము, సముద్ర తీర ప్రాంతములో చేయబడిన ఉప్పు కూడ ఎగుమతి అయ్యేవి.

గణపతిదేవుని శాసనాలు

  • మోటూపల్లి అభయ శాసనం

మూలాలు

  1. ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర, ఏటుకూరి బలరామమూర్తి రచన, 10వ ముద్రణ (1990) పేజీ 113
  2. www.gloriousindia.com/history/kakatiya dynasty
  3. <www.aponline.gov.in/history medieval
  4. www.telangana.com/History/kakatiyas