హంపి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చాలా వరుకు అక్షర దోషాలు తొలగించాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5: పంక్తి 5:




13-15వ శతాబ్ధములో [[విజయనగర సామ్రాజ్యం|విజయనగర సామ్రాజ్య]] రాజధాని ఇప్పుడు [[కర్ణాటక]] రాష్ట్రంలోని [[బళ్ళారి]] జిల్లాలోని ఒక చిన్న పట్టణం. [[విద్యారణ్యుడు|విద్యారణ్య స్వామి]] ఆశిస్సులతో స్థాపించడిన విజయనగరసామ్రాజ్యానికి విజయనగరం లేదా హంఫి రాజధాని. దక్షిణ భారతదేశములోని అతి పెద్ద సామ్రాజ్యాలలో విజయంగరసామ్రాజ్యం ఒకటి.
13-15వ శతాబ్ధములో [[విజయనగర సామ్రాజ్యం|విజయనగర సామ్రాజ్య]] రాజధాని ఇప్పుడు [[కర్ణాటక]] రాష్ట్రంలోని [[బళ్ళారి]] జిల్లాలోని ఒక చిన్న పట్టణం. [[విద్యారణ్యుడు|విద్యారణ్య స్వామి]] ఆశిస్సులతో స్థాపించడిన విజయనగరసామ్రాజ్యానికి విజయనగరం లేదా హంపి రాజధాని. దక్షిణ భారతదేశములోని అతి పెద్ద సామ్రాజ్యాలలో విజయంగరసామ్రాజ్యం ఒకటి.
.
.



07:32, 5 ఆగస్టు 2010 నాటి కూర్పు

గమనిక: విజయనగరం (కర్ణాటక) అనే మరొక వ్యాసంలో విషయం విపులంగా ఉన్నది. "విజయనగరం", "హంపి" అనే రండు వ్యాసాలను వేరు వేరుగా చేసి, విషయాన్ని సందుకు అనుగుణంగా విభజించాలి.



13-15వ శతాబ్ధములో విజయనగర సామ్రాజ్య రాజధాని ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలోని ఒక చిన్న పట్టణం. విద్యారణ్య స్వామి ఆశిస్సులతో స్థాపించడిన విజయనగరసామ్రాజ్యానికి విజయనగరం లేదా హంపి రాజధాని. దక్షిణ భారతదేశములోని అతి పెద్ద సామ్రాజ్యాలలో విజయంగరసామ్రాజ్యం ఒకటి. .

దర్శనీయ స్థలాలు

నగర ప్రవేశం

14వ శతాబ్ధం నగర అవశేషాలు 26 చదరపు కి.మి విస్తీర్ణంలో విస్తరించి ఉంటాయి. ఉత్తర వైపు తుంగ భద్ర నది మిగతా మూడు వైపుల పెద్ద పెద్ద గ్రానైటు శిలలతో అప్పటి విజయనగర వీధుల వైభవాన్ని తెలుపుతూ ఉంటుంది. ఈ పట్టణంలోకి ప్రవేశిస్తుంటే కనిపించే విశాలమైన భవంతులు, పెద్ద పెద్ద ప్రాకారాలు అప్పటి నగర నిర్మాణ చాతుర్యాన్ని, సుల్తానుల అవివేక వినాశన వైఖరిని వెల్ల బుచ్చుతాయి.

నగరం యెక్క ప్రధాన అవశేషాలన్ని కమలాపుర్‌ నుండి హంపి వెళ్ళే రహదారిలో కనిపిస్తాయి. కమలాపుర నుండి హంపి వెళ్ళె దారిలో కమలాపురకు మూడు కి.మి. దూరం మల్యంవంత రఘునాధ స్వామి దేవాలయం వస్తుంది. ఈ దేవాలయం దవ్రిడ ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఆ ఆలయంలో వైవిధ్య భరితంగా చెక్క బడిన చేపలు, జలచరాలు పర్యాటకుల కళ్ళలను

విరుపాక్ష దేవాలయం

800 గజాల పొడవు 35 గజాల వెడల్పు ఉన్న హంపి వీదులలో అత్యంత సుందరమైన ఇళ్ళుంన్నాయి.

  • విరుపాక్ష దేవాలయం - హంపి వీధికి పశ్చిమ చివర విరుపాక్ష దేవాలయం ఉన్నది. 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గాలి గోపురం విరుపాక్ష దేవాలయంలోనికి స్వాగతం పలుకుతుంది. దేవాలయంలో ప్రధాన దైవం విరుపాక్షుడు(శివుడు). ప్రధాన దైవానికి అనుసంధానంగా పంపా దేవి గుడి, భువనేశ్వరి దేవి గుడి ఉంటుంది. ఈ దేవాలయానికి 7 వ శతాబ్ధం[1] నుండి నిర్విఘ్నమైన చరిత్ర ఉన్నది. విరుపాక్ష-పంపా ఆలయం విజయనగర సామ్రాజ్యం కంటే ముందు నుండి ఉన్నదని శిలాశాసనాలు చెబుతున్నాయి. 10-12 శతాబ్ధంకు చెందినవి అయి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా [2]

చరిత్ర ఆధారాల ప్రకారం ప్రధాన దేవాలయానికి చాళుక్యుల, హోయస్లల పరిపాలన మార్పులు చేర్పుల జరిగాయని అయితే ప్రధాన ఆలయం మాత్రం విజయనగ రాజులే నిర్మించారు.[3]

విజయనగర రాజుల పతనమయ్యాక దండయాత్రల వల్ల 16 వ శతాబ్ధానికి హంపి నగరంలోని అత్యాద్బుత శిల్ప సౌందర్యం నాశమైపోయింది.[4]

విరుపాక్ష-పంపా ప్రాకారం మాత్రం 1565 దండయాత్రల బారి పడలేదు. విరుపాక్ష దేవాలయంలో దేవునికి దూపనైవేద్యాలు నిర్విఘ్నంగా కొనసాగాయి. 19 వ శతాబ్ధం మెదలులో ఈ ఆలయం పైకప్పు పై చిత్రాలకి, తూర్పు, ఉత్తర గోపురాలకి జీర్ణోద్ధరణ జరిగింది.[5]

  • ఈ దేవాలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 9 ఖానాలతో 50 మీటర్ల ఎత్తు ఉన్న తూర్పు గోపురములోని రెండు ఖానాలు రాతితో నిర్మించబడ్డాయి మిగతా 7 ఖానాలు ఇటుకలతో నిర్మించబడ్డాయి. ఈ తూర్పు గోపురం నుండి లోపలికి ప్రవేశిస్తే బయటి నుండి ఆలయంలోకి వెళ్ళే మొదటి ప్రాకారం స్థంబాలు లేకుండా ఆకాశం కనిపించేటట్లు ఉంటుంది. ఈ ప్రాకారాన్ని దాటి లోపలికి వెళ్తే స్థంబాలతో కూడి కప్ప బడిన వసరా ఉంటుంది. స్థంభాలతో కూడి ఉన్న వసరాలో చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి. దీని కూడా దాటి లోపలి ప్రాకారంలోకి వెళ్ళితే గర్భగుడి వస్తుంది.[6]

తుంగభద్రా నది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి గుడి వంట గదికి నీరు అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెళ్తుంది. [7]

ఈ ఆలయ అభివృద్ధిలో శ్రీ కృష్ణదేవరాయల పాత్ర ఎంతొ ఉన్నదని లోపలి ప్రాకారం ఉన్న స్థంబాల వసరాలోని శిలాశాసనాలు చెబుతున్నాయి. ఈ లోపలి ప్రాకారంలోని స్థంభాల వసరాని 1510 సంవత్సరములో కృష్ణదేవరాయలు కట్టించాడని కుడా శిలాశాసనాలు చెబుతున్నాయి. [8] విరుపాక్ష దేవాలయంలోని బయటి ప్రాకారంలో ఏకశిలలో చెక్క బడిన నంది ఒక కి.మి. దూరం వరకు కనిపిస్తుంది. [9]



విఠల దేవాలయ సముదాయం

హంపికి ఈశాన్య భాగంలో అనెగండ గ్రామానికి ఎదురుగా ఉన్న విఠల దేవాలయ సముదాయం అప్పటి శిల్ప కళా సంపత్తికి ఒక నిదర్శనం. ఈ దేవాలయం మరాఠీలు విష్ణుమూర్తిగా ప్రార్థించే విఠలుడిది. ఈ ఆలయం 16 వ శతాబ్ధానికి చెందినది. విఠలేశ్వర దేవాలయం ఆకర్షణీయమైన విశేషం సప్త స్వరాలు పలికే ఏడు సంగీత స్థంభాలు.ఈ దేవాలయంలోనే పురందరదాస ఆరాధనోత్సవాలు జరుతాయి.

శిలా రథం

ఈ ఏక శిలా రథం విఠల దేవాలయ సముదాయానికి తూర్పు భాగంలో ఉన్నది. ఇంకో విశేషం ఏమంటె ఈ రథానికి కదిలే చక్రాలు ఉంటాయి.

గజ శాల

పట్టపు ఏనుగులు నివాసం కొరకు వాటి దైనందిన కార్యకలాపాల కొరకు రాజ ప్రసాదానికి దగ్గరలోనే గజశాల ఉన్నది. ఏనుగులు కవాతు చేయడానికి వీలుగా ఈ గజశాలకు ఎదురుగా ఖాళీ ప్రదేశం ఉన్నది. ఈ గజశాల గుమ్మాలు కొప్పు ఆకారంలో ఉండి ముస్లిం కట్టడ శైలి చూపుతున్నాయి. మావటి వారు సైనికులు ఉండడానికి గజశాలకు ప్రక్కన సైనిక స్థావరాలు ఉన్నాయి.[10]


ఇతర విశేషాలు

చేరుకొనే విధానం

మూలాలు

బయటి లింకులు

శిధిలావస్థలో ఉన్న దేవాలయలతో ఉన్నది. తుంగబధ్ర నది ఒడ్డున 25 చదరపు కి.మి. విస్తిర్ణంలో విస్తరించి ఉన్నది./

  1. "విరుపాక్ష పరిశోధన ప్రాజెక్టు". Retrieved 2006-09-13.
  2. "శ్రీ విరుపాక్ష దేవాలయం". Retrieved 2006-09-13.
  3. "విరుపాక్ష". Retrieved 2006-09-13.
  4. "విరుపాక్ష దేవాలయం, హంపి". Retrieved 2006-09-13.
  5. "విరుపాక్ష దేవాలయ పరిశోధన ప్రాజెక్టు". Retrieved 2006-09-13.
  6. "శ్రీ విరుపాక్ష". Retrieved 2006-09-13.
  7. "విరుపాక్ష". Retrieved 2006-09-13.
  8. "Details of Virupaksha Temple". హంపి.ఇన్‌. Retrieved 2007-03-08.
  9. "Details of Virupaksha Temple". ఆంగ్ల వికి. Retrieved 2007-05-08.
  10. "గజశాలలు". Retrieved 2006-09-09.
"https://te.wikipedia.org/w/index.php?title=హంపి&oldid=531672" నుండి వెలికితీశారు