ముస్లిం లీగ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: gu:ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ; cosmetic changes
చి యంత్రము కలుపుతున్నది: tr:Tüm Hindistan Müslüman Birliği
పంక్తి 73: పంక్తి 73:
[[simple:Muslim League]]
[[simple:Muslim League]]
[[sv:All India Muslim League]]
[[sv:All India Muslim League]]
[[tr:Tüm Hindistan Müslüman Birliği]]
[[ur:آل انڈیا مسلم لیگ]]
[[ur:آل انڈیا مسلم لیگ]]
[[zh:全印穆斯林联盟]]
[[zh:全印穆斯林联盟]]

21:04, 2 సెప్టెంబరు 2010 నాటి కూర్పు

'అఖిల భారత ముస్లిం లీగ్'
Leader నవాబ్ వికారుల్ ముల్క్ (మొదటి గౌరవ అధ్యక్షుడు)
Founded డిసెంబరు 30 1906, ఢాకా
Headquarters లక్నో (ప్రధాన కేంద్రము)
Official ideology/
political position
ముస్లింల కొరకు రాజకీయ హక్కులు

ముస్లిం లీగ్ (బెంగాలీ : অল ইন্ডীয়া মুসলিম লিগ ఉర్దూ: آل انڈیا مسلم لیگ), ఢాకాలో 1906 లో స్థాపించబడినది. బ్రిటిష్ ఇండియా కాలము నాటి రాజకీయ పార్టీ. భారత ఉపఖండంలో ముస్లింల కొరకు ప్రత్యేక దేశం పాకిస్తాన్ ఆవిర్భావానికి పాటుపడింది. [1] భారత్ కు స్వాతంత్రం లభించిన తరువాత, ముస్లిం లీగ్ భారత్ లో భారతీయ సమైక్య ముస్లిం లీగ్ అనే పేరుతో కేరళ మరియు కొన్ని ప్రాంతాలలో ఒక మైనర్ పార్టీగా మిగిలిపోయినది. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ రాజకీయాలను నెట్టుకొస్తున్నది. పాకిస్తాన్ లోని ప్రధమ రాజకీయ పార్టీగా అవతరించినది. బంగ్లాదేశ్ లోనూ ఒక పార్టీగా మనగలుగుతున్నది.

చరిత్ర

ఉత్తర భారతదేశంలో ముస్లింల పరిపాలన 8-14 శతాబ్దాలకాలంలో స్థాపించబడినది. 16వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం స్థాపించబడినది, కానీ 18వ శతాబ్దంలో క్షీణించినది. బ్రిటిష్ రాజ్ కాలంలో భారత్‌లోని ముస్లింల జనాభా 25-30% వరకూ వుండినది. ముస్లింల జనాభా ఎక్కువగా బలూచిస్తాన్, తూర్పు బెంగాల్, కాశ్మీరు లోయ, వాయువ్య సరిహద్దులు, పంజాబ్ ప్రాంతం మరియు సింధ్ ప్రాంతాలు మరియు బాంబే ప్రెసిడెన్సీ లలో వుండేది.

స్థాపన

దీని స్థాపన 1906 డిసెంబరు 30అఖిల భారత ముహమ్మడన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ షాహ్‌బాగ్ సమావేశంలో జరిగినది. ఢాకాలో జరిగిన ఈ సదస్సులో నవాబ్ సర్ ఖ్వాజా సలీముల్లా పాల్గొన్నాడు. ఈ సదస్సులో మూడువేల మంది హాజరయ్యారు, సదస్సుకు నవాబ్ వికారుల్ ముల్క్ అధ్యక్షత వహించాడు. [2]

ఆరంభ సంవత్సరాలు

సర్ ఆగా ఖాన్ ముస్లింలీగ్ గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. దీని ప్రధాన కేంద్రం లక్నో గా ఏర్పడింది. ఇందులో ఆరు ఉపాధ్యక్షులు, ఒక సచివుడు మరియు రెండు ఉప-సచివులు ప్రారంభ మూడు సంవత్సరాలకు ఎన్నుకోబడ్డారు. ఈ ప్రతినిధులు వేరు వేరు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించారు.[3]

పాకిస్తాన్ కొరకు ఉద్యమం

లాహోర్ సమావేశంలోని ముస్లింలీగ్ కార్యాచరణ కమిటీ

1940 లో జరిగిన లాహోర్ సమావేశంలో జిన్నా ఈ విధంగా అన్నాడు: హిందువులు ముస్లింలు రెండు వేర్వేరు మతాలకు చెందినవారు, వీరి తత్వాలు, సామాజిక కట్టుబాట్లు, సాహిత్యాలు వేర్వేరు. దీని ద్వారా విశదమయ్యే విషయమేమంటే, వీరిరువురూ వేర్వేరు చారిత్రక వనరులద్వారా ప్రేరేపితమౌతారు. వీరి గ్రంధాలు వేర్వేరు, వర్ణనలు వేర్వేరు, ఇలాంటి సమయంలో వీరిరువురూ ఒకే రాజ్యంలో (దేశంలో) ఇమడలేకపోతారు, కావున వీరిరువురికీ ప్రత్యేకమైన రాజ్యాలుండడం శ్రేయస్కరం.

మూలాలు

  1. Jalal, Ayesha (1994) The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan. Cambridge University Press. ISBN 978-0-521-45850-4
  2. The Statesman: The All India Muslim League, en:Government of Pakistan website. Retrieved on 11 May 2007
  3. Establishment of All India Muslim League, Story of Pakistan website. Retrieved on 11 May, 2007

ఇవీ చూడండి

బయటి లింకులు