లతా మంగేష్కర్: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 21: | పంక్తి 21: | ||
== జీవిత సంగ్రహం == |
== జీవిత సంగ్రహం == |
||
లత 1929 సెప్టెంబర్ 28 తేదీన సుప్రసిద్ధ సంగీతకారుడు [[దీనానాథ్ మంగేష్కర్]] కు పెద్ద కుమార్తెగా (అయిదు గురిలో) జన్మించింది. ఆమె తర్వాత వరుసగా ఆషా, హృదయనాథ్, ఉషా మరియు మీనా అనేవారు కలిగారు. ఆమె బాల్యం కష్టాలు కన్నీళ్ళతో గడిచిపోయింది. అయిదవ ఏటనే తండ్రివద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన లతకు సంగీతాన్ని వినడం, పాడడంతప్ప మరోలోకం లేదు. తాను |
లత 1929 సెప్టెంబర్ 28 తేదీన సుప్రసిద్ధ సంగీతకారుడు [[దీనానాథ్ మంగేష్కర్]] కు పెద్ద కుమార్తెగా (అయిదు గురిలో) జన్మించింది. ఆమె తర్వాత వరుసగా ఆషా, హృదయనాథ్, ఉషా మరియు మీనా అనేవారు కలిగారు. ఆమె బాల్యం కష్టాలు కన్నీళ్ళతో గడిచిపోయింది. అయిదవ ఏటనే తండ్రివద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన లతకు సంగీతాన్ని వినడం, పాడడంతప్ప మరోలోకం లేదు. తాను చదువుకోలేకపోయినా తన తర్వాతివారైనా పెద్దచదువులు చదవాలనుకొంది, కానీ వారుకూడా చదువుకన్నా సంగీతంపైనే ఎక్కువ మక్కువ చూపడంతో వారి కుటుంబమంతా సంగీతంలోనే స్థిరపడిపోయింది. లత తనకు నచ్చిన గాయకుడుగా [[కె. ఎల్. సైగల్]] ను పేర్కొంది. |
||
దీనానాథ్ ఆర్ధిక సమస్యలతో ఆరోగ్యం క్షీణించగా 1942లో మరణించాడు. దాంతో పదమూడేళ్ళ వయసుకే కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. అందువలన సినీరంగంలోకి ప్రవేశించి 1942లో మరాఠీ చిత్రం ''పహ్లా మంగళ గౌర్'' లో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడింది. ఆ తర్వాత ''చిముక్లా సుసార్'' (1943), ''గజెభావు'' (1944), ''జీవన్ యాత్ర'' (1946), ''మందిర్'' (1948 మొదలైన చిత్రాలలో నటించింది. ఆ కాలంలో ఖుర్షీద్, [[నూర్జహాన్]], సురైయాలు గాయనిలుగా వెలుగుతున్నారు. |
దీనానాథ్ ఆర్ధిక సమస్యలతో ఆరోగ్యం క్షీణించగా 1942లో మరణించాడు. దాంతో పదమూడేళ్ళ వయసుకే కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. అందువలన సినీరంగంలోకి ప్రవేశించి 1942లో మరాఠీ చిత్రం ''పహ్లా మంగళ గౌర్'' లో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడింది. ఆ తర్వాత ''చిముక్లా సుసార్'' (1943), ''గజెభావు'' (1944), ''జీవన్ యాత్ర'' (1946), ''మందిర్'' (1948 మొదలైన చిత్రాలలో నటించింది. ఆ కాలంలో ఖుర్షీద్, [[నూర్జహాన్]], సురైయాలు గాయనిలుగా వెలుగుతున్నారు. |
11:07, 18 డిసెంబరు 2010 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
లతా మంగేష్కర్ | |
---|---|
| |
వ్యక్తిగత సమాచారం | |
జన్మనామం | లతా మంగేష్కర్ |
జననం | ఇండోర్, మధ్యప్రదేశ్ | 1929 సెప్టెంబరు 28
ప్రాంతము | మహారాష్ట్ర |
సంగీత రీతి | హిందీ సినిమా రంగం హిందీ సినీ సంగీతం (నేపథ్య గాయని), భారతీయ శాస్త్రీయ సంగీతము |
వృత్తి | గాయని |
వాయిద్యం | నేపథ్య గాయిని |
క్రియాశీలక సంవత్సరాలు | 1942 - ప్రస్తుతము |
లతా మంగేష్కర్ (మరాఠీ : लता मंगेशकर ; ఆంగ్లం: Lata Mangeskar), (జననం సెప్టెంబరు 28, 1929) ప్రఖ్యాతిగాంచిన హిందీ సినిమారంగ నేపథ్యగాయని, నటి కూడా. 1942లో తన కళాప్రయాణం ప్రారంభమైంది (మహల్ సినిమాలో ఆయెగా ఆయెగా ఆయెగా ఆనేవాలా పాటతో), అది నేటికీ సచేతనంగా వున్నది. ఈమె 980 సినిమాలను తన గానంతో అలంకరించింది. దాదాపు 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడిన ఘటికురాలు. ఈమె సోదరి ఆషా భోంస్లే. లతాకు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి సత్కరించింది. హిందీ సినీపాటల గాయని అంటే మొదట లతా పేరే స్ఫురణకొస్తుంది. హిందీ పాటలపై, హిందీసినీ జగత్తుపై ఆమె వేసిన ముద్ర అలాంటిది.
జీవిత సంగ్రహం
లత 1929 సెప్టెంబర్ 28 తేదీన సుప్రసిద్ధ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్ కు పెద్ద కుమార్తెగా (అయిదు గురిలో) జన్మించింది. ఆమె తర్వాత వరుసగా ఆషా, హృదయనాథ్, ఉషా మరియు మీనా అనేవారు కలిగారు. ఆమె బాల్యం కష్టాలు కన్నీళ్ళతో గడిచిపోయింది. అయిదవ ఏటనే తండ్రివద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన లతకు సంగీతాన్ని వినడం, పాడడంతప్ప మరోలోకం లేదు. తాను చదువుకోలేకపోయినా తన తర్వాతివారైనా పెద్దచదువులు చదవాలనుకొంది, కానీ వారుకూడా చదువుకన్నా సంగీతంపైనే ఎక్కువ మక్కువ చూపడంతో వారి కుటుంబమంతా సంగీతంలోనే స్థిరపడిపోయింది. లత తనకు నచ్చిన గాయకుడుగా కె. ఎల్. సైగల్ ను పేర్కొంది.
దీనానాథ్ ఆర్ధిక సమస్యలతో ఆరోగ్యం క్షీణించగా 1942లో మరణించాడు. దాంతో పదమూడేళ్ళ వయసుకే కుటుంబ పోషణ బాధ్యత లతపై పడింది. అందువలన సినీరంగంలోకి ప్రవేశించి 1942లో మరాఠీ చిత్రం పహ్లా మంగళ గౌర్ లో కథానాయిక చెల్లెలుగా నటించి రెండు పాటలు పాడింది. ఆ తర్వాత చిముక్లా సుసార్ (1943), గజెభావు (1944), జీవన్ యాత్ర (1946), మందిర్ (1948 మొదలైన చిత్రాలలో నటించింది. ఆ కాలంలో ఖుర్షీద్, నూర్జహాన్, సురైయాలు గాయనిలుగా వెలుగుతున్నారు.
లత గాయనిగా 1947లో మజ్ బూర్ చిత్రంతో మొదలుపెట్టింది. దేశ విభజనకాలంలో ఖుర్షీద్, నూర్జహాన్ లు పాకిస్థాన్ వెళ్లడం, నేపథ్య సంగీత విధానానికి ప్రాధాన్యత పెరగడం వలన ఆమె గాయనిగా ఉన్నత శిఖరాల్ని చేరడానికి దోహదం చేశాయి. లతకు సంగీత దర్శకుడు గులాం హైదర్ గాయనిగా ప్రోత్సాహమిచ్చారు. సి.రామచంద్ర లత పాటను హిమాలయ శిఖరాలంత పైకి చేర్చారు. అల్బేలా, ఛత్రపతి శివాజీ, అనార్కలీలోని పాటలు అద్భుత విజయాలు చవిచూశాయి. తర్వాత అందాజ్, బడీ బహన్, బర్సాత్, ఆవారా, శ్రీ 420, దులారీ చిత్రాల్లోని పాటలు ఆమెను 1966 నాటికి హిందీ నేపథ్యగాన సామ్రాజ్ఞిని చేశాయి.
హిందీ చిత్రసీమలో ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్-ప్యారేలాల్, కళ్యాణ్ జీ-అనంద్ జీ, తర్వాత బప్పీలహరి, రాంలక్ష్మణ్, అనంతరం ఇప్పటి ఏ.ఆర్. రెహమాన్ వరకు చాలామంది సంగీతకారులు లత గానంతో తమ సంగీత ప్రతిభను చాటుకున్నారు. అయితే ఓ.పి.నయ్యర్ మాత్రం లతపాట నాసంగీతానికి పనికిరాదని ఆషాను దాదాపు లతకు దగ్గరగా తీసుకెళ్ళాడు.
లత సినీనిర్మాతగా మరాఠీలో వాదల్ (1953), కాంచన్ గంగా (1954), హిందీలో ఝూంఝుర్ (1954), లేకిన్ (1990) చిత్రాలు నిర్మించింది. ఆమె సంగీత దర్శకురాలిగా రాంరాంపహునా (1950), మొహిత్యాంచి మంజుల (1963), మరాఠా టిటుకమేల్ వాలా (1964), స్వాథూ మాన్ సే (1965) మొదలైన కొన్ని చిత్రాలకు పనిచేసింది.
విశేషాలు
- ఈమె 1948 నుండి 1978 వరకు 30,000 పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించింది.
- ఈమె గానకోకిల అనే బిరుదును సొంతం చేసుకొంది.
- ఈమె తెలుగులో సంతానం (నిదురపోరా తమ్ముడా, సుసర్ల దక్షిణామూర్తి), ఆఖరి పోరాటం (తెల్లచీరకు, ఇళయ రాజా) మొదలైన పాటలు పాడింది.
- 1959లో టైం మేగజైన్ కవర్ పేజీ స్టోరీగా లతామంగేష్కర్ గురించి వ్యాసాన్ని ప్రచురించి ఆమెను "భారతీయ నేపథ్యగాయకుల రాణి" (Queen of Indian Playback Singers) గా పేర్కొన్నది.
పాటలు
ఈమె పాడిన కొన్ని మధురమైన హిందీ పాటలు:
- అయ్ మేరె వతన్ కే లోగో, జరా ఆంఖ్ మేఁ భర్ లో పానీ, జో షహీద్ హువే హైఁ ఉన్కీ, జరా యాద్ కరో ఖుర్బానీ
- ఛోడ్ దే సారీ దునియా కిసీ కే లియే, యే మునాసిబ్ నహీఁ ఆద్మీ కే లియే
- నా కొఈ ఉమంగ్ హై, నా కొఈ తరంగ్ హై, మెరీ జిందగీ హై క్యా, ఏ కటీ పతంగ్ హై
- జబ్ భీ జీ చాహే నయీ దునియా, బసాలేతే హైఁ లోగ్, ఏక్ చెహ్రే పే కయీ చెహ్రే లగాలేతె హైఁ లోగ్
వీడియోలు
పురస్కారాలు
భారత ప్రభుత్వం నుండి అన్ని అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలు. ప్రముఖ శాస్రీయ గాయకురాలు ఎం.ఎస్. సుబ్బలక్ష్మి తరువాత ఇటువంటి ఘనత సాధించిన విశిష్ట వ్యక్తి ఈమె ఒక్కరే కావటం గమానార్హం.
సంవత్సరం | పురస్కారం చిత్రం | పురస్కారం పేరు | బహూకరించింది | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2001 | భారతరత్న[1] | భారత ప్రభుత్వం | బిస్మిల్లా ఖాన్ తోకలిపి అప్పటి రాష్ట్రపతి కే.ఆర్.నారాయణన్ చేతులమీదుగా స్వీకారం. | |
1999 | పద్మవిభూషణ్[2] | భారత ప్రభుత్వం | ||
1969 | పద్మభూషణ్[3] | భారత ప్రభుత్వం | ||
2006 | ది లీజియన్ అఫ్ హానర్[4] | ఫ్రాన్స్ ప్రభుత్వం | ||
- ఎన్.టి.ఆర్. జాతీయ అవార్డు (1999)
- శాంతినికేతన్, విశ్వభారతి మరియు శివాజీ విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్
- రాజాలక్ష్మీ అవార్డు (1990),
- అప్సరా అవార్డు
- కాళిదాస్ సమ్మాన్ అవార్డు
- తాన్ సేన్ అవార్డు
- నేపాల్ అకాడమీ అవార్డు
- సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు
బయటి లింకులు
ఇవికూడా చూడండి
మూలాలు
- ↑ భారతరత్న పురస్కారం గ్రహీతల శీర్షిక క్రింద లతామంగేష్కర్ జులై 25,2008 న సేకరించబడినది.
- ↑ పద్మవిభూషణ్ పురస్కారం గ్రహీతల శీర్షిక క్రింద లతా మంగేష్కర్ జులై 25,2008 న సేకరించబడినది.
- ↑ పద్మభూషణ్ పురస్కారం గ్రహీతల శీర్షిక క్రింద లతా మంగేష్కర్ జులై 25,2008 న సేకరించబడినది.
- ↑ France to honour Lata Mangeshkarశీర్షిక క్రింద జులై 25,2008 న సేకరించబడినది.
- ప్రపంచ సినీసీమకే "భారతరత్న" గానకోకిల లతామంగేష్కర్, ఫాల్కే అవార్డు విజేతలు, హెచ్. రమేష్ బాబు, చిన్నీ పబ్లికేషన్స్, 2003, పేజీలు: 87-94.