సి.కృష్ణవేణి: కూర్పుల మధ్య తేడాలు
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
Mukteshvari (చర్చ | రచనలు) |
||
పంక్తి 47: | పంక్తి 47: | ||
[[వర్గం: 1924 జననాలు]] |
[[వర్గం: 1924 జననాలు]] |
||
[[వర్గం: తెలుగు సినిమా నటీమణులు]] |
[[వర్గం: తెలుగు సినిమా నటీమణులు]] |
||
[[వర్గం:తెలుగు సినిమా గాయకులు]] |
|||
[[వర్గం:తెలుగు సినిమా నేపథ్యగాయకులు]] |
|||
[[వర్గం: రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతలు]] |
[[వర్గం: రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతలు]] |
||
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు]] |
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు]] |
12:07, 7 ఫిబ్రవరి 2011 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఇదే పేరుగల ఇతర వ్యాసాలకోసం అయోమయ నివృత్తి పేజీ కృష్ణవేణి చూడండి.
సి.కృష్ణవేణి లేదా ఎం.కృష్ణవేణీ (జ.1924) అలనాటి తెలుగు సినిమా నటీమణి, గాయని మరియు నిర్మాత
జీవిత చరిత్ర
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రాజమండ్రికి చెందిన కృష్ణవేణి సినిమాలలోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేసినది. 1936లో సతీఅనసూయ /ధ్రవ చిత్రముతో బాలనటిగా సినీ రంగము ప్రవేశం చేసింది. ఆ తరువాత కధానాయకిగా తెలుగులో 15 చిత్రాలలో నటించింది. కొన్ని తమిళ మరియు కన్నడ భాషా చిత్రాలలో కూడా కధానాయకిగా నటించంది.
కృష్ణవేణి తెలుగు సినిమా నిర్మాత అయిన మీర్జాపురం రాజా (జన్మనామం: మేకా రంగయ్య)ను వివాహమాడి ఆ తరువాత ఈమె కూడా స్వయంగా అనేక సినిమాలు నిర్మంచింది. ఈమె తన సినిమాలలో తెలుగు సంప్రాదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి మన దేశం చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు నందమూరి తారక రామారావును, యస్వీ రంగారావును, మరియు నేపథ్యగాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును పరిచయం చేసింది. ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు మరియు సంగీత దర్శకులను పరిచయం చేసింది. 1957 లో తీసిన దాంపత్యం సినిమాతో మరో ప్రముఖ సంగీత దర్శకుడు రమేష్ నాయుడును తెలుగు సినిమాకు పరిచయం చేసింది.
పురస్కారాలు
- తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె చేసిన జీవితకాలపు కృషిగాను 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకొన్నది.
కృష్ణవేణి నటించిన సినిమాలు
- సతీ అనసూయ -ధృవ (1936)
- మోహినీ రుక్మాంగద (1937)
- కచ దేవయాని (1938)
- మళ్లీ పెళ్ళి (1939)
- మహానంద (1939)
- జీవనజ్యోతి (1940)
- దక్షయజ్ఞం (1941)
- భీష్మ (1944)
- బ్రహ్మరథం(1947)
- మదాలస (1948)
- మన దేశం (1949)
- గొల్లభామ
నిర్మాతగా కృష్ణవేణి
కృష్ణవేణి నిర్వహించిన నిర్మాణ సంస్థలు
- భర్త స్థాపించిన సంస్థ - జయా పిక్చర్స్ ఆ తరువాత కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్ గా నామకరణం చేశారు.
- సొంత సంస్థ - తన కుమార్తె మేక రాజ్యలక్షీ అనురాధ పేరు మీదుగా ఎం.ఆర్.ఏ.ప్రొడక్షన్స్
కృష్ణవేణి నిర్మించిన సినిమాలు
- మన దేశం (1949)
- లక్ష్మమ్మ
- దాంపత్యం (1957)
- గొల్లభామ
- భక్త ప్రహ్లాద
గమనిక: ఈ జాబితా అసంపూర్ణమైనది