శ్రీకృష్ణ పాండవీయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 38: పంక్తి 38:
! పాత్ర !! పాత్రధారి
! పాత్ర !! పాత్రధారి
|-
|-
| శ్రీకృష్ణుడు మరియు దుర్యోధనుడు || [[నందమూరి తారక రామారావు]]
| [[శ్రీకృష్ణుడు]] మరియు [[దుర్యోధనుడు]] || [[నందమూరి తారక రామారావు]]
|-
|-
| కుంతీదేవి || [[ఎస్.వరలక్ష్మి]]
| [[కుంతీదేవి]] || [[ఎస్.వరలక్ష్మి]]
|-
|-
| [[రుక్మిణి]] || [[కె.ఆర్. విజయ]]
| [[రుక్మిణి]] || [[కె.ఆర్. విజయ]]
పంక్తి 50: పంక్తి 50:
| [[అభిమన్యుడు]] || [[హరనాథ్]]
| [[అభిమన్యుడు]] || [[హరనాథ్]]
|-
|-
| శకుని || [[ధూళిపాల]]
| [[శకుని]] || [[ధూళిపాల]]
|-
|-
| || [[కాంతారావు]]
| || [[కాంతారావు]]
|-
|-
| జరాసంధుడు || [[ముక్కామల]]
| [[జరాసంధుడు]] || [[ముక్కామల]]
|-
|-
| || [[శోభన్ బాబు]]
| || [[శోభన్ బాబు]]
|-
|-
| శిశుపాలుడు || [[రాజనాల]]
| [[శిశుపాలుడు]] || [[రాజనాల]]
|-
|-
| రుక్మి || [[కైకాల సత్యనారాయణ]]
| [[రుక్మి]] || [[కైకాల సత్యనారాయణ]]
|}
|}



08:11, 4 జూన్ 2011 నాటి కూర్పు

శ్రీకృష్ణ పాండవీయం
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం నందమూరి తారక రామారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
ఎస్.వరలక్ష్మి,
చిత్తూరు నాగయ్య,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
కైకాల సత్యనారాయణ,
హరనాథ్,
శోభన్ బాబు,
కాంతారావు,
రాజనాల,
కె.ఆర్. విజయ
సంగీతం టి.వి.రాజు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.సుశీల
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
ఛాయాగ్రహణం రవికాంత్ నగాయిచ్
నిర్మాణ సంస్థ రామకృష్ణ & ఎన్.ఎ.టి. కంబైన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

భారత, భాగవత ఘట్టాలను కూర్చి శ్రీకృష్ణపాండవీయం చిత్రాన్ని నిర్మించారు. "పరిత్రాణీయా సాధునాం, వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్ధాపనార్ధాయ సంభవామి యుగే యుగే" అని భగవద్గీత లో పలికిన శ్రీకృష్ణుడు ధర్మపథంలో నడిచే పాండవులను కష్టంలో కాపాడి, వారి అభ్యుదయానికి దోహద పడిన విధానం ఈ చిత్రకథ.

చిత్రకథ

శ్రీకృష్ణుడి మేనత్తకు కుమారుడు వికృత రూపం లో జన్నిస్తాడు. ఎవరు ఎత్తుకుంటే ఆ వికృత రూపం పోతుందో అతని చేతిలో అ పిల్లవాడు మరణిస్తాడని ఆకాశ వాణి పలుకుతుంది. శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే ఆ పసివాడు సహజ రూపం పొందుతాడు. మేనత్త తన కుమారుని కాపాడమని కోరుతుంది. నూరు తప్పులు దాకా మేనత్త కుమారుని మన్నిస్తానని, నూరు తప్పులు కాగానే అతనిని సంహరిస్తానని శ్రీకృష్ణుడు అత్తకు అభయమిస్తాడు. శ్రీ కృష్ణుని ఆ మేనత్త కుమారుడు శిశుపాలుడు.
దాయ ద్వేషంతో దుర్యోధనుడు, పాండవులను రండా పుత్రలుగా కించబరుస్తూ సంబోదిస్తాడు. బదులుగా భీముడు కౌరవులను ముండా పుత్రుడిగా సంభోదిస్తాడు. ఖిన్నుడైన దుర్యోధనుడు తల్లి గాంధారి దగ్గరకు వెళ్లి నిజం చెప్పమని నిలదీస్తాడు. గాంధారికి వైధవ్య యోగం ఉందని జోస్యుల ద్వారా తెలుసుకున్న గాంధారరాజు ఒక గొఱ్ఱెతో ఆమెకు వివాహం జరిపించి దాన్ని చంపించి వేస్తాడు. పిమ్మట గాంధారి వివాహం దృతరాష్ట్రుడితో జరుగుతుంది. ఇది విని అభిమాన ధనుడైన దుర్యోధనుడు గాంధార రాజును, అతని నూర్గురి కుమారులను పాతాళ గృహంలో బంధించి రోజుకు ఒకొక్కరికి ఒక్కొక మెతుకు, ఒక్క చుక్క నీటిని అందించే ఏర్పాటు చేస్తాడు. ఈ ఆహారం ఎవ్వరికీ సరిపోనిది, ఆహార లోపం తో అందరిని మృత్యువాత పడవేసేది అని ఆలోచించి, కనిష్టుడైన శకుని అందరిలో పట్టుదల ఉన్న వాడు, కుటిలుడు కాబట్టి అతనికి అందరి వంతు ఆహారం, నీరు ఇచ్చి అతనిని బ్రతికించు కొని నిరాహారంగా అందరూ మరణించడానికి సిధ్దపడతారు. ఆ విధంగా క్రమక్రమంగా అందరూ మరణిస్తారు. చివరిగా మిగిలిన గాంధారరాజు మరణిస్తూ తన వెన్నెముకతో పాచికలు తయారు చేయమని, అవి శకుని కోరినట్లు పందెం పడుతుందని, వాటి ఆధారంతో కురువంశాన్ని నాశనం చేయమని ఉద్బోదిస్తాడు. మిగిలిన ఒక్కని మీద సానుభూతి కలిగి, పైగా అతడు తమనేమి చేయలేడని తలచి దుర్యోధనుడు శకునిని విడుదల చేస్తాడు. శకుని దుర్యోధనునికి ఆప్తుడిగా ఉంటూ దుర్బోధలతో అతని వినాశనానికి ఎత్తులు వేస్తూ ఉంటాడు. పాండవులను కుంతీ సమేతంగా వారణావ్రతంలో లాక్షా గృహానికి తరలించి, దానిని దహించి పాండవులను మట్టుపెట్టమని దుర్యోధనునికి దుర్బోధ చేస్తాడు శకుని. దీనిని ఆచరణలో పెడతాడు దర్యోధనుడు. ముంచుకువచ్చే ప్రమాదాన్ని గ్రహించిన శ్రీ కృష్ణుడు, వారణావ్రతం చేరిన పాండవులకు వచ్చి భీమునితో సొరంగ మార్గం త్రవ్వమని ఉద్భోదించడమే కాక, నిద్రమత్తులో ఆదమరచి ఉన్న భీముని ఉత్తేజ పరుస్తాడు. గృహ దహనమయ్యే సమయానికి సోదరులను, తల్లిని సురక్షితం గా కాపాడి అడవికి చేరుస్తాడు. ఆ ప్రాంతంలో నివసించే హిడింబాసారుడు నర సంచారాన్ని కనిపెట్టి,అతని సోదరి హిడింబిను నరుల ఆచూకి తెలుసుకొని రమ్మని పంపిస్తాడు. హిడింబి భీముని వరిస్తుంది. ఎంతకూ హిడింబి తిరిగి రాకపోవడంతో అక్కడకు చేరుకున్న హిడింబాసురుని భీముడు వధిస్తాడు. తల్లి, అన్న గారి అంగీకారంతో హిడింబిని చేపడతాడు భీముడు. అక్కడ నుండి పాండవులు,కుంతి ఏకచ్రపురానికి చేరుకుంటారు. అక్కడ పురజనులను పీడిస్తున బకాసురుని భీముడు వధిస్తాడు.
పాంచాలరాజు ద్రుపదుడు , అర్జునుడిని వివాహమాడు కుమార్తె, ద్రోణుని చంపు కుమారునికోసం యజ్ఞం చేసి ద్రౌపదిని, దృష్టద్యముని సంతానంగా పొందుతాడు. లాక్ష్యగృహంలో పాండవులు దగ్ధమైనారని తెలిసి హతాశుడవుతాడు. విజ్ఞుల సలహాపై ద్రౌపది స్వయం వరం ప్రకటిస్తాడు. స్వయంవరానికి పాండువులు చేరుకొని అర్జునుడు మత్స్యయంత్రాన్ని చేధిస్తాడు. కుంతి మాట మీద, శ్రీకృష్ణుని ఉద్బోధ ననుసరించి పాండపులైదుగురూ ద్రౌపదిని వివాహమాడతారు.
కుండినను పాలిస్తున్న భీష్మక మహారాజు కుమార్తె రుక్మిణి శ్రీ కృష్ణుని కథలు విని అతనిని వరిస్తుంది. ఆమె అన్న రుక్మి శ్రీకృష్ణుని పై అకారణ ద్వేషం పెంచుకుంటాడు. శ్రీకృష్ణునికి జన్మతాః విరోధి యైన జరాసంధుని ప్రాపకం లో ఉన్న శిశుపాలునితో రుక్మణి వివాహం చేద్దామనుకుంటాడు రుక్మి.అగ్నిజ్యోతనుడనే బ్రాహ్మణుడి ద్వారా శ్రీకృష్ణునికి రాయబారం పంపుతుంది రుక్మిణి. వివాహం ముందు దేవీ దర్శనానికి వెళ్లిన రుక్ముణిని తన రధం పై ఎక్కించుకొని తీసుకొని పోతాడు శ్రీ కృష్ణుడు. జరాసంధుని, శిశుపాలుని ఓడించి రుక్మికి సగం మీసం, సగం గుండు గొరికి శృంగ భంగం చేస్తాడు శ్రీ కృష్ణుడు.
పాండవులు జీవించి ఉన్నారని తెలుసుకున్న దృతరాష్ట్రుడు వారిని పిలిచి సగ రాజ్యభాగం ఇస్తాడు. ఇంద్రప్రస్ధ నగరాన్ని రాజధాని గా చేసుకొని ధర్మరాజు రాజ్యపాలన మొదలు పెడతాడు. ధర్మరాజు చేత రాజసూయం చేయించ సంకల్పిస్తాడు. శ్రీకృష్ణుడు మగధ రాజైన జరాసంధుని, భీమునిచేత చంపించి రాజసూయానికి మార్గం సుగమం చేస్తాడు. దేవశిల్పి మయుడు ధర్మరాజుకు సభా మండపాన్ని నిర్మించి ఇస్తాడు. రాజసూయానికి విచ్చేసిన దుర్యోధనునికి మయసభ విడిది. పాండవుల వైభవానికి అసూయ పడతాడు దుర్యోధనుడు. మయసభను వీక్షిస్తున్న దుర్యోధనుడు భంగపడతాడు. రాజసూయ సభలో అగ్రతాంబూలానికి శ్రీకృష్ణుడే అర్హుడని భీష్ముడు ధర్మరాజుకు ఉద్బోదిస్తాడు. దానిని తప్పుపట్టి శిశుపాలుడు శ్రీకృష్ణుని అనేక విధాలుగా నిందిస్తాడు. నూరు తప్పులు పూర్తి కాగానే శిశుపాలుని శిరస్సును శ్రీకృష్ణుడు చక్రాయుధం తో ఖండిస్తాడు. శ్రీకృష్ణుని విశ్వరూప ప్రదర్శనతో చిత్రం ముగుస్తుంది.

నటవర్గం

పాత్ర పాత్రధారి
శ్రీకృష్ణుడు మరియు దుర్యోధనుడు నందమూరి తారక రామారావు
కుంతీదేవి ఎస్.వరలక్ష్మి
రుక్మిణి కె.ఆర్. విజయ
గుమ్మడి వెంకటేశ్వరరావు
చిత్తూరు నాగయ్య
అభిమన్యుడు హరనాథ్
శకుని ధూళిపాల
కాంతారావు
జరాసంధుడు ముక్కామల
శోభన్ బాబు
శిశుపాలుడు రాజనాల
రుక్మి కైకాల సత్యనారాయణ

విశేషాలు

ఈ చిత్రంతో ఎన్.టి. రామారావు పేరు దర్శకునిగా మొదిటి సారి వెండితెర మీద కనిపించింది. గతంలో సీతారామ కల్యాణం, గులేబకావలి కథ సినిమాలకు దర్శకత్వం వహించినా, దర్శకుని పేరు క్రెడిట్స్ లో వేయలేదు.
ఎన్.టి.రామారావు శ్రీకృష్ణ, దుర్యోధన పాత్రలను అపూర్వంగా పోషించారు. కాదు ఆ పాత్రలలో ఇమిడి పోయారు.
కె.ఆర్.విజయ రుక్మిణి పాత్రలో ముగ్ధమనోహరంగా ఉంటుంది.
గతంలో సి.ఎస్.ఆర్., లింగమూర్తి శకుని పాత్రను పోషించారు. వారి పాత్రధారణకు భిన్నంగా ధూళిపాల ఈ చిత్రంలో శకుని పాత్రను పోషించారు. శకుని పాత్ర ధారణకు ధూళిపాల కొత్త ఒరవడిని సృష్టించారు.
జరాసంధునిగా ముక్కామల, శిశుపాలునిగా రాజనాల, రుక్మిగా కైకాల సత్యనారయణ పాత్రలలో జీవించారు. మిగిలిన నటీనటులు పాత్రల పరిధి మేరకు నటించారు.
భారత కథలో భాగవత కథ రుక్మిణీ కల్యాణాన్ని జోడించారు. ఐతే అది అతికినట్టు కాకుండా సహజంగా ఇమిడి పోయింది. కంటిన్యూటి ఎక్కడా చెడలేదు.
మయసభ సెట్టింగ్ చాలా భాగుంటుంది. భారీ సెట్టింగ్.ఆ సెట్టింగ్ గురించి ఆ రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునే వారట. ఆ సెట్ విజయ వాహిని స్టూడియో లో వేసేరట. ఆ ఫ్లోర్ లో ఎవ్వరినీ అనుమతించే వారట కాదట నిర్మాతలు. దానిని గురించి విన్న స్టూడియో అధినేత బి.నాగిరెడ్డి గారు ఆ సెట్ ను చూద్దామనంటే ఫ్లోర్ లోకి ప్రవేశానికి అనుమతి లభించ లేదట. విషయం తెలిసిన ఎన్.టి.ఆర్, తివిక్రమరావు సోదరులు నాగిరెడ్డి గారిని సగౌరవంగా తీసుకువెళ్లి సెట్ చూపించారట.
పౌరాణిక పాత్ర పోషణలోనే కాదు దర్శకత్వం లో కూడా తన పట్టును నిరూపించుకున్నారు ఎన్.టి. రామారావు.
పండిత పామరుల మెప్పును పొంది, సంస్ధకు కీర్తిని, కనకాన్ని సంపాదించిన చిత్రం.

పాటలు

  1. ఏమిటయా నీలీల కృష్ణా ఎందులకీ గోల - పి.బి. శ్రీనివాస్
  2. కనియేన్ రుక్మిణి చంద్రమండలంతున్ కం¬ఠీరవ (భాగవతంలోని పద్యం) - ఘంటసాల
  3. కృష్ణా యదుభుషణా గోవిందా .. నమ్మితి నా మనమ్నున ( పద్యాలు) - పి.బి. శ్రీనివాస్,సుశీల
  4. కన్నుమరుగైన వెన్న మీగడహరించి మాయలెరుగని (పద్యం) - పిఠాపురం
  5. ఛాంగ్‌రే బంగారు రాజా ఛాంగ్ ఛాంగ్‌రె బంగారు రాజా మజ్జారే - జిక్కి
  6. తలమనక భీష్మనందను అవ్వ తలయును మూతియున్ (పద్యం) - పి.బి. శ్రీనివాస్
  7. తగునీ చక్రి విధర్భరాజ సుతకున్ తధ్యంబు (పద్యం) - పి.బి. శ్రీనివాస్
  8. ధుర్మాధాంధుడు భాంధవద్రోహి కపటి పరమనీచుడు (పద్యం) - మాధవపెద్ది
  9. నల్లనివాడు పద్మనయనంబుల వాడు కృపారసంబు (పద్యం) - పి.బి. శ్రీనివాస్
  10. నల్లనివాడేనా ఓ చెలి చల్లని వాడేలే - జిక్కి, ఎ.పి. కోమల బృందం
  11. ప్రణేశా నీ మంజుభాషలు వినలేని కర్ణరంధ్రముల (పద్యం) - సుశీల
  12. పిట్టనొకదాని పడమొట్టి గుట్టనెత్తి బురదపామును (పద్యం) - పిఠాపురం
  13. పరమాత్ముడవై కృష్ణా .. ఏమిటయా నీలీల కృష్ణా ఎందులకీ గోల - పి.బి. శ్రీనివాస్
  14. పాలుదాపగా వచ్చిన పడతిఉసురు చూరగొన్నావు (పద్యం) - పిఠాపురం
  15. ప్రియురాల సిగ్గేలనే, నీ మనసేలు మగవాని జేరీ : నాలోన ఊహించిన కలలీనాడు ఫలియించె - ఘంటసాల,సుశీల - రచన: సముద్రాల
  16. ప్రీతినర్ధుల నాదరించు ధర్మసుతుండు పరుల ఆదరంబున - ఘంటసాల - రచన: సముద్రాల
  17. భళా భళా నా బండి పరుగుతీసే బండి బండిలో తిండి చూడ - మాధవపెద్ది
  18. బ్రతుక వచ్చునొడలు ప్రాణంబులుండిన బ్రతుకు కలిగినేని (పద్యం) - మాధవపెద్ది
  19. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా : ఆ మత్తులోన బడితే గమ్మత్తుగ చిత్తవుదురా- ఘంటసాల - రచన: కొసరాజు
  20. మా సరివాడవా మాపాప గొనిపోవ ఏపాటిగలవాడ ఏదివంశం (పద్యం) - మాధవపెద్ద
  21. సాటి రాజందునా శాపోపహతమైన యదు వంశమున (పద్యం) - మాధవపెద్ది
  22. స్వాగతం సుస్వాగతం స్వాగతం కురుసార్వభౌమా స్వాగతం - పి.లీల,సుశీల
  23. వచ్చెద విధర్భభూమికి జొచ్చెద భీష్మకుని పురము (భాగవతంలోని పద్యం) - ఘంటసాల
  24. వేదపఠనం ( రాజసూయ యాగాంతరం ) - వేద పండితులు
  25. వేదం - వేద పండితులు
  26. వికృతరూపుని నిన్ను చూపించిన నాడు అత్తకొసగిన మాట (పద్యం) - ఘంటసాల


మూలాలు

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు సంకలనం చేసిన ఘంటసాల 'పాట'శాల, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.