వి. బి. రాజేంద్రప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38: పంక్తి 38:
== మాలాలు ==
== మాలాలు ==
29.10.2009 నాటి ఆంధ్రప్రభ దినపత్రికలో వ్యాసం
29.10.2009 నాటి ఆంధ్రప్రభ దినపత్రికలో వ్యాసం

[[వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు]]
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]

17:01, 13 జూన్ 2011 నాటి కూర్పు

వి.బి.రాజేంద్రప్రసాద్
జననంనవంబర్ 4, 1932
డోకిపర్రు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియాIndia
మతంహిందూమతం
పిల్లలుజగపతి బాబు

నటుడవ్వాలని వచ్చి నిర్మాత గా స్ధిరపడ్డ వి.బి.రాజేంద్రప్రసాద్ జగపతి పిక్చర్స్ మరియు జగపతి ఆర్ట్ ప్రొడక్సన్ అధినేత. అరవై, డభ్భయి దశకాలలో విజయవంతమైన చిత్రాలు నిర్మించి ఆ నాటి మేటి చిత్రనిర్మాతలలో ఒకరిగా నిలిచారు. ఆయన నిర్మాత, దర్శకుడు కూడా. తెలుగు, తమిళ హిందీ భాషలలో 32 సినిమాలు నిర్మించి 19 సినిమాలకు దర్శకత్వం వహించారు.

బాల్యం విద్యాబ్యాసం

వి.బి.రాజేంద్రప్రసాద్ 1932 నవంబర్ 4 వ తేది, న కృష్ణా జిల్లా డోకిపర్రు గ్రామంలో, వ్యవవసాయ కుటుంబానికి చెందిన జగపతి చోదరి, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించారు. ఆయన పాఠశాల విద్యాబ్యాసం డోకిపర్రు గ్రామంలోనూ, కళాశాల విద్యాబ్యాసం కాకినాడ లోనూ జరిగింది. అక్కడ వారికి ఏడిద నాగేశ్వరరావు తో పరిచయమైంది.' రాఘవ కళాసమితి' అనే సాంస్కృతిక సంస్థను ప్రారంభించి పలు నాటకాలు ప్రదర్శించడమే కాకుండా లేడీ ఆర్టిస్టుగా నటించి ఉత్తమ కథానాయిక బహుమతినీ గెలుచుకున్నారు. కొన్నాళ్ళు విజయవాడలో, కొంతకాలం బందరులో వ్యాపారాలు నిర్వహించారు.

సినీ జీవితం

నటుడవ్వాలని మద్రాస్ కి వచ్చారు వి.బి.రాజేంద్రప్రసాద్. అక్కడ ఆయనకు అక్కినేని నాగేశ్వరరావు తో పరిచయం కలిగింది. అది రాజేంద్రప్రసాద్ జీవితంలో ఒక మలుపు. అక్కినేని నాగేశ్వరరావు, వి.బి. రాజేంద్రప్రాద్ ను చాలా ప్రోత్సహించారు. వి.బి.రాజేంద్రప్రసాద్ ను అక్కినేని, ప్రముఖ నిర్మాత ధుక్కిపాటి మధుసూధనరావుకు పరిచయం చేసారు. కానీ నటుడిగా అవకాశాలు దొరకలేదు. దానితో నాగేశ్వరరావు ప్రోత్సాహంతో తండ్రీగారి పేరిట జగపతి సంస్ద స్దాపించి అన్నపూర్ణ చిత్రంతో చిత్ర నిర్మాణం ప్రారంభించారు. దసరా బుల్లోడు చిత్రంతో దర్శకుడిగా మారేరు. వారి సంస్ధలలో నిర్నించిన చిత్రాలకే కాక అందరూ దొంగలే సినిమాకు దర్శకత్వం వహించారు. ఎనభై దశకం నుండి చిత్ర విజయాలు తగ్గాయి. క్రమంగా చిత్రనిర్మాణాన్ని తగ్గించారు.

పురస్కారాలు

చిత్రరంగానికి నిర్మాతగా, దర్శకునిగా వి.బి.రాజేంద్రప్రసాద్ అందించిన సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2003వ సంవత్సరానికి రఘుపతి వెంకయ్య ప్రతిష్టాత్మక పురస్కారంతో సత్కరించింది.

ప్రస్తుతం

ఫిల్మ్ నగర్ లో దేవాలయ నిర్మాణానికి నడుంకట్టి, దైవసన్నిధానాన్ని ఏర్పాటు చేసి ఆముష్మిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

మాలాలు

29.10.2009 నాటి ఆంధ్రప్రభ దినపత్రికలో వ్యాసం